Sunday, April 18, 2021

సర్దార్ గౌతు లచ్చన్న జీవిత చరిత్ర

 



🙏 *జోహార్ సర్ధార్ గౌతు లచ్చన్న*🙏                                             🔥 *ముల్కీ నిబంధనల రద్దు ముఖ్యమా? ముఖ్యమంత్రి పదవి ముఖ్యమా? అని అడిగితే ముల్కీ నిబంధనల రద్దే ముఖ్యమన్న!  తెలుజాతి ముద్దు బిడ్డ...💪                                                                                                 🔥 జై ఆంధ్ర ఉద్యమం చేపట్టిన యోధుడు💪                                                                              🔥 1938 లోనే రైతుల కష్టాల పై సిక్కోలు నుండి చెన్నపట్నం(చెన్నై) వరకు 2400 కిలోమీటర్ల సుదీర్ఘ రైతు రక్షణ మహా పాదయాత్ర  చేసిన రైతు బాంధవుడు💪*                                                   🔥 *భారత దేశంలో సర్దార్ బిరుదాంకితులలో ప్రముఖుడు💐*                                        🔥 *ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు స్వర్గీయ సర్ధార్ గౌతు లచ్చన్న గారి వర్దంతి..(19/04/2006)సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ...*.                                         👏👏👏👏👏👏👏👏👏👏👏         ---------------------------------------------                          ♦️ *సర్దార్ గౌతు లచ్చన్న గారి జీవితం పై ఒక విశ్లేషణాత్మక సమచారం*                ---------------------------------------------                 👉జననం: *ఆగస్ట్-16,1909*   ---------------------------------------           👉స్థలం: *నాటి గంజాం జిల్లా&నేటి శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం,బారువ అనే గ్రామంలో*  -----------------------------------------------                         👉తల్లిదండ్రులు: *చిట్టయ్య, రాజమ్మ*                                       👉భార్య: *యశోదా దేవి*                    👉  పిల్లలు: *శ్యాం సుందర్ శి  వాజీ,ఝాన్సీ లక్ష్మీ,సుశీలా దేవి*  ---------------------------------------                                         👉చదువు: *మెట్రిక్యలేషన్*    ---------------------------------------------                            ♦️ *స్వాతంత్రోద్యమంలో       సర్దార్  గౌతు లచ్చన్న గారి   ప్రస్థానం*  ---------------------------------------------          🔥 *1930- ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం* ------------------------------------------               *21 సంవత్సరాల వయసులో* గాంధీజీ గారి పిలుపును అందుకొని ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం నడిపారు.                    *ఫలితంగా అరెస్ట్ అయ్యి టెక్కలి,నరసన్నపేట, బరంపురం లలో 70 రోజులు పాటు జైలు జీవితం గడిపారు*  ----------------------------------------------                         🔥 *1932-శాసనోల్లంఘన ఉద్యమం*              ---------------------------------------------          *23 సంవత్సరాల వయసులో* ఈ ఉద్యమాన్ని ఉధృతస్థాయిలో నడుపుచున్న *సర్దార్  గౌతు లచ్చన్న ను  అరెస్ట్ చేసి 6 నెలలు పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో నిర్బంధించారు*                        -------------------------------------------         🔥 *1938-రైతు రక్షణ మాహా పాదయాత్ర*  -------- ----------------------------------   *జమీందారి, ఇనాం వ్యస్థల రద్దు కోరుతూ  ----------------------------------------------                                సర్దార్  గౌతు లచ్చన్న గారు 29 సంవత్సరాల వయసులో*        ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో             బారువ(ఇచ్ఛాపురం) నుండి మద్రాస్ వరకు  *2,400 కిలోమీటర్ల  సుధీర్ఘ పాదయాత్ర* నిర్వహించి పెను సంచలనం సృష్టించారు       *ఫలితం:జమీందారి,ఇనాం వ్యస్థల రద్దు*       ---------------------------------------------     🔥 *1940*-సర్దార్ గౌతు లచ్చన్న గారి ఆధ్వర్యంలో పలాస లో *ఆల్ ఇండియా కిసాన్ సభ ను నిర్వహించారు*                         -----------------------------------------------   🔥 *అంటరానితనం పై కత్తి ఝుళిపించిన  సర్దార్ గౌతు లచ్చన్న*                            --------------------------------------------- సర్దార్  గౌతు లచ్చన్న నడిపిన *హరిజన సేవా సంఘాలు,హరిజన రక్షణ యాత్రలు* ప్రజలను బాగా ప్రభావితం చేశాయి.                     *రాత్రి పాఠశాలలు* నిర్వహించి బహుజనులు విద్యాభివృద్ధికి కృషి చేసారు.           *హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించుటలో* విశేష పోరాటం చేశారు.  -----------------------------------------------  🔥 *1942-క్విట్ ఇండియా ఉద్యమం* ----------------------------------------------   ఈ ఉద్యమ సమయంలో నాటి మద్రాస్ ప్రభుత్వం *33 సంవత్సరాల వయసున్న సర్దార్ గౌతు లచ్చన్న గారిని అతి ప్రమాదకరమైన వ్యక్తి గా ప్రకటించింది*                  వారి ఆచూకీ తెలిపిన వారికి *10,000/- బహుమానం ప్రకటించింది*                                 అతనిని పట్టుకోవడం సాధ్యం కాకపోతే కనిపిస్తే కాల్చి వేయండి అని *SHOOT AT SIGHT ఆర్డర్స్ ఇచ్చినది*                చివరికి ప్రభుత్వమే 1942 లో లచ్చన్న గారిని బంధించి *1945 అక్టోబర్ వరకు జైలులో(దాదాపు 3 సంవత్సరాలు)* ఉంచి తదుపరి విడుదల చేసినది.  --------------------------------------------- 🔥 *1948 లో *BACKWARD CLASSES CONFERENCE*   -----------------------------------------                                👉మొట్టమొదటిసారిగా  *గుంటూరు లో సర్దార్ గౌతు లచ్చన్న గారి ఆధ్వర్యంలో *BACKWARD CLASSES CONFERENCE* ను నిర్వహించారు.                                      తదుపరి అన్ని జిల్లాలు పర్యటించి ఆయా *జిల్లాల్లో BACKWARD CLASSES ASSOCIATIONS ను నిర్మించారు*      ---------------------------------------------   🔥 *1948-1983- సర్దార్ గౌతు లచ్చన్న గారు 5 సార్లు M.L.A గా ఒకసారి M.L.C గా సుదీర్ఘ కాలం చట్టసభలలో ప్రజా గొంతుకై  ప్రాతినిధ్యం వహించారు*   ----------------------------------------------    ♦️ *1953* టంగుటూరి ప్రకాశం పంతులు&బెజవాడ గోపాలరెడ్డి  గారి *మంత్రివర్గాలలో సర్దార్ గౌతు లచ్చన్న గారు రాష్ట్ర వ్యవసాయ,కార్మిక శాఖా మంత్రి గా పనిచేశారు*        ---------------------------------------------   🔥 *సర్దార్ లచ్చన్న గారు 1967 లో ఒకేసారి శ్రీకాకుళం జిల్లా నుంచి M.P గా,M.L.A గెలిచారు* ------------------------------------------                                              👉 తన రాజకీయ గురువు గారైన *ఆచార్య N.G.రంగా గారు* ఆ ఎన్నికలలో చిత్తూర్ నుండి MP గా పోటీ చేసి ఒడిపోవడంతో , *సర్దార్ లచ్చన్న గారు తన M.P పదవికి రాజీనామా చేసి రంగా గారిని  శ్రీకాకుళం నుండి MP గా గెలిపించుకొన్నారు*                      -----------------------------------------------   🔥 *1972-జై ఆంధ్ర ఉద్యమం-ముల్కీ నిబంధనలను వ్యతిరేకిస్తూ సర్దార్ గౌతు లచ్చన్న గారు పోరాటం చేశారు.     -------------------------------------------                 🔥  *1975- ఇండిరాగాంధీ గారు విధించిన ఎమర్జెన్సీని లచ్చన్న గారి నాయకత్వంలోవ్యతిరేకిస్తూ ఆందోళనలు*                  ఫలితగా సర్దార్ గౌతు లచ్చన్న గారిని *1975 అరెస్ట్ చేసి 1977 లో ఎమర్జెన్సీ ఉపసంహరణ అనంతరం విడుదల చేశారు*        ----------------------------------------------   ♦️ *1978- సర్దార్ గౌతు లచ్చన్న గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ లో ప్రతిపక్ష నేత గా వ్యవహరించారు&పబ్లిక్ ఆకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు*     ---------------------------------------------   ♦️ *1997-ఆంధ్రా విశ్వవిద్యాలయం వారు సర్దార్ గౌతు లచ్చన్న గారికి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు*                           *1999-ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు సర్దార్ గౌతు లచ్చన్న గారికి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు*        --------------------------------------------  ♦️ *2001*- *సర్దార్ గౌతు లచ్చన్న గారి *ఆటోబయోగ్రఫీ*                    🙏 *నా జీవితం* పేరుతో ఆవిష్కరించారు.   ----------------------------------------------   ♦️ *2006,ఏప్రిల్-19  న సర్దార్ గౌతు లచ్చన్న గారు 97 సంవత్సరాల వయసులో మరణించారు*       -------------------------------------------  🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Wednesday, April 14, 2021

ARTOZ DRINK

 శతవసంతాల 'ఆర్టోస్‌'





ఎన్నేళ్లయినా ఈ శీతల పానీయానికి అదే క్రేజ్‌

ఉగాది పర్వదినాన ప్రారంభమైన రెండో యూనిట్‌

ఆర్టోస్‌.. ఇది పక్కా లోకల్‌.. ఈ సాఫ్ట్‌ డ్రింకు ఒక్కసారి తాగితే చాలు.. జిహ్వ 'వహ్వా' అనక మానదు. ఆ రుచి మళ్లీ మళ్లీ కావాలని కోరకా మానదు. 'రామచంద్రపురం రాజుగారి డ్రింకు'గా పేరొందిన ఈ శీతల పానీయం గురించి తెలియనివారే ఈ ప్రాంతంలో ఉండరంటే అతిశయోక్తి కానేకాదు. కార్పొరేట్‌ కూల్‌డ్రింక్‌ కంపెనీలు ఎన్ని వచ్చినా.. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం 'ఆర్టోస్‌' వందేళ్లకు పైగా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఈ ఉగాది సందర్భంగా విస్తరణ బాట పట్టిన ఈ సంస్థ..

మరిన్ని రుచులతో సరికొత్త డ్రింకులు తయారు చేసేందుకు శ్రీకారం చుట్టింది.మూడు తరాల కృషి

ఆర్టోస్‌ పరిశ్రమ ఈ స్థాయికి రావడం వెనుక మూడు తరాల కృషి ఉంది. రామచంద్రపురం పట్టణానికి చెందిన అడ్డూరి రామచంద్రరాజు కాకినాడ కలెక్టర్‌ కార్యాలయంలో వృథాగా పడి ఉన్న గోలిషోడా మెషీన్‌ను 1912లో కొనుగోలు చేశారు. దానిని ఇక్కడికి తెచ్చి, విశాఖపట్నం పోర్టు ద్వారా ఇంగ్లండ్‌ నుంచి స్పేర్‌ పార్టులు తెప్పించి, మరమ్మతులు చేయించారు. ఆ మెషీన్‌తో పట్టణంలో గోలీసోడా తయారీకి శ్రీకారం చుట్టారు. అప్పట్లో గోలీసోడా ద్వారా వస్తున్న గ్యాస్‌ను చూసి ప్రజలు దానిలో భూతం ఉందని, ఎవ్వరూ తాగకూడదని చెప్పుకొనేవారు. దీంతో అప్పట్లో అంతంత మాత్రంగానే సోడాలు అమ్ముడు పోయేవి. అప్పట్లో రాజుగారు ఒక్కరే వెల్ల ప్రాంతం నుంచి తాగునీరు తెచ్చుకుంటూ సోడాలు తయారు చేసేవారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పట్టణంలో సేద తీరేందుకు వచ్చిన బ్రిటిష్‌ మిలిటరీ సైనికులకు ఈ గోలీసోడాను అందించేవారు. దీంతో ఇది మరింత ప్రాచుర్యం పొందింది.

1919లో రామచంద్రరాజు తమ్ముడు జగన్నాథరాజు తన చదువు ముగించుకున్న అనంతరం అప్పట్లో మద్రాసులో ప్రాచుర్యం పొందిన స్పెన్సెన్స్‌ డ్రింక్‌ తాగి, అటువంటి సాఫ్ట్‌ డ్రింక్‌ తయారు చేయాలని భావించారు. ఈ నేపథ్యంలో దానిని తయారు చేసే విధానాన్ని, ముడి సరకును లండన్, జర్మనీ ప్రాంతాల నుంచి రప్పించారు. అదే ఏడాది ఏఆర్‌ రాజు డ్రింక్స్‌ పేరుతో సాఫ్ట్‌ డ్రింక్‌ తయారీ ప్రారంభమైంది. ఒక్క నీరు తప్ప మిగిలిన ముడి సరకులన్నీ విదేశాల నుంచే దిగుమతి చేసుకునే వారు. ఈ డ్రింకులను అప్పట్లో తోపుడు బండ్లు, ఎడ్ల బండ్ల ద్వారా రాజమహేంద్రవరం వరకూ అర్ధణా నుంచి మూడు పైసలకు అమ్మేవారు. 1930లో సెమీ ఆటోమెటిక్‌ మెషీన్‌ అమర్చి మరింతగా డ్రింకులను మార్కెట్‌లోకి తీసుకువచ్చారు.

1955లో ఇంగ్లండ్‌ నుంచి పూర్తి స్థాయి ఆటోమెటిక్‌ మెషీన్‌ రప్పించారు. డ్రింక్స్‌కు 'ఆర్టోస్‌'గా పేరు మార్చారు. అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే అదే ఏడాది పేటెంట్‌ హక్కులు కూడా పొందారు. తరువాత ఆయన కుమారులు పద్మనాభరాజు, సత్యనారాయణరాజులు ఆర్టోస్‌ డ్రింక్‌ను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువచ్చారు. 1912 నుంచి ఇప్పటి వరకూ సుమారు ఆరుసార్లు డ్రింక్‌ రూపాంతరం చెందుతూ వచ్చింది. 1955లో 30 మంది సిబ్బంది ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య సుమారు 150కి పెరిగింది. అప్పటి నుంచీ మన జిల్లాతో పాటు విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా ఆర్టోస్‌ డ్రింక్‌ను పంపిణీ చేస్తున్నారు. ఈ కంపెనీకి మూడు జిల్లాల్లోనూ 100 మందికి పైగా డీలర్లు ఉన్నారు. ఇప్పటికే రామచంద్రపురం పరిసర గ్రామాలకు ఆర్టోస్‌ వాటర్‌ బాటిళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.


వందేళ్ల తరువాత రెండో యూనిట్‌
ఆర్టోస్‌ ఫ్యాక్టరీ వందేళ్లు పూర్తి చేసుకున్న తరువాత మూడో తరం వారైన ఆర్టోస్‌ బ్రదర్స్‌ అడ్డూరి జగన్నాథవర్మ, వీరభద్రరాజు, రవీంద్రలు పరిశ్రమలో అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో రెండో యూనిట్‌ను మంగళవారం ప్రారంభించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ చెలికాని స్టాలిన్, మంత్రి వేణు తనయుడు నరేన్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాధంశెట్టి శ్రీదేవి చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఇక నుంచి 1.25, 250, 200 మిల్లీలీటర్ల ప్లాస్టిక్‌ బాటిళ్లతో ఇప్పటి వరకూ అందిస్తున్న ద్రాక్షతో పాటు మ్యాంగో, లెమన్, ఆరెంజ్‌ ఫ్లేవర్లలో కూడా డ్రింకులు తయారు చేయనున్నారు. అలాగే సోడాలు కూడా తయారు చేస్తున్నారు.

రామచంద్రపురం: 'ఏంటీ గోలీ సోడానా? అయ్యబాబోయ్‌! ఎవ్వరూ తాగకండి. అందులో భూతం ఉంది' అంటూ ఒకప్పుడు అందులో నుంచి వచ్చే గాలికి జనం హడలిపోయే స్థాయి నుంచి.. 'ఆర్టోసా! ఏదీ మరోటి ఇవ్వండి తాగుతాం' అనే స్థాయిలో ఆర్టోస్‌ సాఫ్ట్‌ డ్రింక్‌ ప్రాచుర్యం పొందింది. దేశంలో ఎక్కడ ఏ డ్రింకులు తాగినా.. గోదావరి సీమకు వచ్చేసరికి మాత్రం ఆర్టోస్‌ తాగి వెళ్లాల్సిందే. అచ్చం ద్రాక్ష పండ్ల మాదిరిగానే ఉండే దాని రుచి చూడాల్సిందే.


 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...