Wednesday, September 16, 2026

బైబిల్ ప్రకారం ఆడమ్ నుండి మహాజలప్రళయం వరకు 1656 సంవత్సరాలు 
జలప్రళయం నుండి అబ్రహాం పుట్టుకవరకూ 292 ఏళ్ళు 
అబ్రహాం నుండి జాకబ్ ( యాకోబు) మిగతా ఇజ్రాయేలు ప్రజలతో ఈజిప్ట్ బానిసత్వానికి వెళ్ళేవరకు 290 ఏళ్ళు 
ఈజిప్టులో మొత్తం బానిసత్వపు దినాలు 430 ఏళ్ళు. 
అనగా ఆడమ్ నుండి మహాప్రయాణం ( ఎక్సోడస్) - బానిసత్వ విడుదల వరకు 2666 ఏళ్ళు. 
మహాప్రయాణాన్ని నడిపించిన నాయకుడు మోజెస్ 
మహాప్రయాణం మొదలయ్యేనాటికి మోజెస్ వయసు 80 ఏళ్ళు 
మోజెస్ 80 ఏళ్ళవాడిగా ఉండగా యెహోవా మొట్టమొదటిసారి మోజెస్ కు క్యాలెండర్ ఒకటి ఇచ్చాడు ( నిర్గమకాండం 12:2 ) . ఇకనుండి ఈ నెల సంవత్సరానికి మొదటినెల అవుతుంది అని క్యాలెండర్ ప్రస్తావన జరిగింది 
అంటే ఆడమ్ సృష్టించబడిన 2600 ఏళ్ళ తరవాత మొదటి క్యాలెండర్ యూదులకు లభించింది . 
మరి అలాంటప్పుడు ఆడమ్ 930 ఏళ్ళు బ్రతికాడని ఎలా లెక్కకట్టారు ? 

ఆడమ్ సృష్టి జరిగే సమయానికి ( 4000 BCE) ఇండస్ వ్యాలీ చుట్టుపక్కల వ్యవసాయ సమూహాలు ఏర్పడటం ప్రారంభం అయ్యింది . ఆడం మరణించే సమయానికి ( ఇంచుమించు 1000 ఏళ్ళు) ఇండవ్ వ్యాలీ నాగరికత ఆల్మోస్ట్ మొదలయ్యింది ( 3300- 1900 BCE ) . 

అప్పటికే ఈజిప్షియన్ నాగరికతకు అంకురాలు పడ్డాయి. ఆడమ్ చనిపోయేనాటికి ఫారో సామ్రాజ్యం మొలకెత్తుతూ ఉంది. 

ఇన్ని నాగరికతలు, ప్రజలు ఎక్కడికక్కడ అభివృద్ధి చెందుతూ ఉండగా ఈ భూమిని, మనుషుల్ని సృష్టించింది యెహోవానే అని వాదించడానికి కాస్త బిడియం ఉండాలా వద్దా

Wednesday, June 24, 2026

సన్మాన పత్రం సుగుణక్క

 ఓ  ముగ్ద సుఖుమార సుగుణ సుసంపన్నరాశి

మృదు మధుర సంభాషిణీ నిర్మలహృదయ

గురుకులమణి దీప్తి , మా మనో  స్పూర్తి నేత్రి ,ఆదర్శమార్తీమణి మన అందరి ప్రేమామయి శ్రీమతి కొమ్ము మేరి సుగుణ మణి గారు అసిస్టెంట్ ఫ్రొఫెసర్ గా గవర్నమెంటు నర్శింగ్ కాలేజి కాకినాడ  నందు సుదీర్ఘకాలం పనిచేసి పదవీవిరమణ చేస్తున్న సందర్బంగా మీపై జల్లుతున్న   పరిమళభరిత అక్షర గులాబి రేకులు , అభినందన స్వర్ణ మల్లెల అక్షింతలు ,గంభీర స్వర ధ్వని పొగడ్త రాగ రంజితాలు

ఓ, నిరాడంబర సేవా రూపమా ! 

శ్రీకరంబు, శుభకరంబు, అభిషక్తుని సన్నిది' నందు  తొలకరి జల్లుల ఆషాడ మాసమందు మీ  పదవీ విరమణ ఆనందదాయకం శోభాయమానం

గోదావరి తరగల   చీరకుచ్చిళ్ళలో ఓ పాయ చింతపల్లి లాకుల గ్రామం. ఓ గురు తరుణీ ! మీరు  ఉత్తమ  ఉపాధ్యాయులుగా పేరెన్నికగన్న శ్రీ కొమ్ము జోసఫ్ మరియు శ్రీమతి దయామణి గార్ల  గర్భఫలశుక్తిగ తొమ్మిది మంది సంతానంలో నాల్గవ సంతానమైన మీరు కొమ్మువంశ  గారాలపుత్రికగా  పెరిగారు మీరు. లాకుల గలగల సవ్వడులు వింటునే ప్రాధమిక విద్యను పూర్తి చేసుకొన్నారు ., ఫ్లొరెన్సు నైటింగేలును స్పూర్తిగ నిలుపుకొని, కింగ్ జార్జ్, స్విమ్స్ తిరుపతి నందు "నర్సింగ్ " విద్యను పూర్తి చేసుకొని వైద్య సేవలపై మీ గల  మక్కువను చాటుకున్నారు మీరు..  

1985 లో కృష్ణాజిల్లా నందిగామలో ప్రభుత్వ స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ తల్లిలా అనారోగ్య ,,అభాగ్యులకు   మీరందించిన సేవలు మరువలేనివి. చిన్ననాటి నుండి చదువుల్లో మేటిగా వుండే మీకు పదవులు వరించడం  పెద్ద విశేషం కాదు,  పదవులే వాటిని అవి గౌరవించుకున్నాయంటే అతిశయోక్తి కాదు

 ఓ అభినవ నైటింగేల్ సుగుణవతీ !

వృత్తి పట్ల ప్రేమ నిబద్దత,అంకితభావం ఉపాధ్యాయులైన తల్లితండ్రుల స్పూర్తి ,భోధన పట్లగల ఆసక్తి మిమ్మును నర్సింగ్ విభాగంలో  లెక్చరర్ను చేసాయి.రోగులకు సేవలు అందించే అతి పవిత్రమైన వృత్తిని చేపట్టడమే భాగ్యమనుకుంటే వేల మంది ఫ్లొరెన్సు నైటింగేలులను తయారుచేసే వృత్తిని ఎంచుకోవడం వృత్తి పట్ల మీ అచంచల అనురక్తికి నిదర్శనం. నర్సింగ్ లెక్చరర్ గా సేవలు అందిస్తూనే కాకినాడ నర్సింగ్ కళాశాల  ఏర్పడాలని కలలుకని ఓ తపస్వీ లా కృషిచేసి  అనుకున్నది సాధించడం  సామాన్యంకాదు . అందుకు అభినందనీయురాలు మీరు! కాలేజీ ఏర్పాటులో అవంతరాలెన్నో దాటుకుని  కాకినాడ జి జి హెచ్ నందు నర్సింగ్  కాలేజి ఏర్పడినప్పుడు కాలేజికి తొలి ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా వ్యవహరించి రికార్డు సృష్టించినమీకు నర్సింగ్ లోకం జెజేలు పలుకుతుంది. అసిస్టెంట్ ఫ్రొఫెసర్ గా పదోన్నతి పొంది అత్యుత్తమ అధ్యాపకురాలిగా మీరందించిన సేవలు వైధ్యశాఖకు వన్నెతెచ్చాయి.

సహృదయం, సద్భావం, సచ్చీలత, సౌశీల్యం స్వయం కృషి, సమన్యయ తత్వం, జీవిత నడవడికలో నిబద్ధత, , సేవాస్పూర్తి, సేవా భావం రంగరించిన మెరిసే 'జువ్వలా"  మిమ్మును ఆస్దానంలో  నిలబెట్టాయంటే అతిశయోక్తి కాదు.

నిరంతర విధ్యార్దినిలా, ప్రజ్ఞాశీలురై, దార్మిక చింతనతో, మంచి భోధకురాలిగా, జ్ఞాన సాగరంలో, ఎందరో నర్శింగు విద్యార్ధులను  తీర్చి దిద్దిన 'స్వర్ణ శిల్పి" లా దైర్యాన్ని చెప్పే సంజీవిని లా" "జ్ఞాన దాతలా " విధ్యార్దుల ముందు నిలిచి విధ్యార్దుల హృదయాలలో చిరస్దాయిగా నిలిచిపోయిన మీరు మీకు మీరే సాటి. అందుకే అందుకోండి మా ఆత్నీయ  అభినందన మందార మాలల దండలూ దండాలు .

ఓ అగ్ర గురు నారీశిరోమణీ !

ఉత్తమ స్టాఫ్ నర్సుగా బెస్ట్ సర్వీసెస్ అవార్డులు ఎన్నో పొందారు. బెస్ట్ ఫెర్మార్మెన్స్ అవార్డులే కాదు ,అత్యుత్తమ నర్సింగ్ టీచింగ్ అవార్డులూ వరించాయంటే అవి మీ అంకితభావానికి అందిన అందలాలు  అభినందన నీరాజనాలు.

ఓ ఉత్తమ గృహిణీ

వైధ్యశాఖలో పనిచేయడమంటే ఆషామాషీకాదు ఇల్లాలుగా ఇంటిని చక్కదిద్దుకుని సమయంతో పనిలేని నర్సింగ్   వృత్తిని చేపట్టి ,ఓ ప్రక్క భర్తకు తగిన భార్యగ,తల్లిగ మీ కుమారుడిని లండన్ నగరంలో ఎం బి ఎ చదివేలా తీర్చిదిద్దడం మీరు ఉత్తమ గృహిణిగాను నర్సింగ్ విభాగంలో పనిచేసే ప్రతీ గృహిణికీ ఆదర్శం మీరు.వేలాదిమందిని తీర్చిదిద్దే టీచింగ్ భాధ్యతలు చేపట్టి విజయవంతంగా పదవీ విరమణ చేయడం వృత్తి పట్ల గల మీ ప్రేమానురాగాలకు అంకితభావానికి నారీలోకం వైధ్యశాఖ చేతులెత్తి నమస్కరిస్తుంది

.పదవీ విరమణ మనసుకు భారమైనా  తప్పని క్షణాలను భరిస్తూ మీ భావి శేషజీవితకాలం ఆ దేవాదిదేవుని సన్నిధిలో గడవాలని మీకు మీ కుటుంబానికి ఆ ప్రేమామయుని కృపాకటాక్షములు దీవెనలు కలగాలని మీ భావి జీవితకాలం నిండూ నూరేళ్ళు సుఖసంతోషాలతో గడవాలని కోరుకుంటూ

Saturday, April 4, 2026

జయహో అమరావతి

 జయహో అమరావతి

గీత రచన

బెన్ జాన్సన్ 

బాలసాహితీ రచయిత


ఆంధ్రుడా అదిగదిగో

చూడవోయి

 మన  ఆంధ్రుల రాజధాని అమరావతీ

జయహో 

జయ జయహో

అమరావతి

ఆంధ్రుల రాజధానీ

మా అమరావతి

జయహో జయ జయహో

జయహో జయజయహో

అమరావతీ

ఆంధ్రుల పురోగతి నీవే

ఓ పూర్ణకుంభం ధారి

మా అమరావతి

 నీ పేరు నిలవాలి

 ఆ చంద్రతారార్కం

నీ కీర్తి  అజరామరం

నీ కీర్తి ఇక అజరామరం

తరతరాల నీ పాలన

ఆంధ్రులకు  నవజీవనం

జయహో

జయ జయహో అమరావతి

ఆంధ్రుల విజయశిఖరం

మా అమరావతి


జయహో

 జయ జయహో

అమరావతి

ఆంధ్రుల రాజధాని

మా అమరావతి

ఆంధ్రుల పురోగతి

మా అమరావతి

అభిమాన ధని

మా అమరావతి

నీ పేరు నిలవాలి

ఆ చంద్రతారార్కం

నీ కీర్తి అజరామరం

నీ కీర్తి  ఇక అజరామరం

తరతరాల నీ పాలన

ఆంధ్రులకు నవజీవనం

జయహో జయ జయహో

జయహో జయ జయహో



నాగార్జునగిరి సిగన 

మా మల్లె పూదండ

మా అమరావతి

నాగార్జునగిరి సిగన 

మా మల్లె పూదండ

మా అమరావతి


కృష్ణవేణి పాదాల

విరిబోణి మా అమరావతి

కృష్ణవేణి పాదాల

విరిబోణి మా అమరావతి

ఆంధ్రుల రాజధాని

మా అమరావతి

మా రాజధాని

అమరావతి

జయహో జయజయహో

అమరావతి

జయహో జయహో అమరావతి


వర్దిల్లు వర్దిల్లు అమరావతి

ఆంధ్రుల అన్నపూర్ణ అమరావతీ

తెలుగుజాతి అక్షరమై

చిరకాలం వర్దిల్లు వర్దిల్లు

బుద్దుని శాంతి పలుకులతల్లి

మా అమరావతి

రండి ఆంధ్రులారా

మన అమారావతి కీర్తిని పాడుదాం

రండి ఆంధ్రులారా

 మన అమరావతి  కీర్తిని పాడుదాం

జయహో జయ జయహో

అమరావతి

ఆంధ్రుల రాజధాని మా అమరావతి











Thursday, March 19, 2026

కొండేపూడి

 ఈదిమూడి లో మొదలైన ఈదురుగాలి  ఉమ్మడి రాష్ట్రమంతా ముసురుగ మారి మాదిగ జాతి మనస్సును జయిస్తుందని ఎవరికి అంచనాలులేవు.అంబేద్కరుడు ప్రసాధించిన రిజర్వేషను ఫలాలు ఏభై ఏళ్ళుగ  56 ఉపకులాలు కలిగిన షెడ్యూల్డ్ కులంలో ఒక వర్గమే ఎక్కువభాగం పొందుతుంటే రిజర్వేషను ఫలాలను పెరియార్ మహాశయుని స్పూర్తితో వెనుకబడిన కులాలు( బి సి )  వర్గీకరించుకున్న రీతిగానే మాకు వర్గీకరించండని మాదిగ జాతిలో కొందరు అరవైయవ దశకంలో గొంతు సవరించుకున్నప్పుడు అప్పుడే అడవుల్లో ప్రతిధ్వనించే ఓ కేక  మందకృష్ణ రూపంలో శంఖారావం పూరిస్తుంటే యువ నాయకత్వం హృదయచెవులకు బలంగా వినపడింది. తూర్పుగోదావరి జిల్లా రాష్ట్ర జిల్లాలన్నిటిలో సువిశాలమైనది.అమలాపురం నుండి కోటనందూరు వరకునూ,రాజమండ్రి నుండి రంపచోడవరం వరకు రాజకీయ చైతన్యం కలిగిన ప్రసిద్దజిల్లా.ఈ జిల్లా నుండి ఎందరో దోశోద్దారకులు జన్మించారు.కాని వారితొ పాటు  ఓ జాతోద్దారుకుడు జన్మిస్తాడని కాలం కలగనలేదు.సాతంత్ర్య సముపార్జనలో భగత్ సింగ్ బాంబులు వేసినందుకు.అల్లూరి బ్రిటీష్ వారిని ఎదురించినందుకు.నెహ్రు జైలు జీవితం గడిపినందుకు వారు చేసిన ఒక్కొక్క త్యాగానికి వారిని స్మరిస్తుఉన్నాం మరి ఒక   జాతోద్దరణకు జీవితం అర్పించి ముప్పై ఏళ్ళు కుటుంబాన్ని వదిలి లక్షలాది కీలోమీటర్లు పయనించి మిలెటెంటుగ మారి బస్సు దహనాలలో పాల్గొని జైలు జీవితం గడిపి అన్నీ అనుభవించిన మహోన్నతమూర్తిని ఆ జాతి ఎంత హృదయంలో పెట్టుకుంటుంది.మాదిగ జాతోద్దారకుడు కొండేపూడి శ్యాంబాబును యావత్తు మాదిగజాతి దిగ్గజనేతగ తమ గుండెల్లో నిలుపుకున్న చరిత్రను చదవడం ప్రతీ మాదిగ బిడ్డల కర్తవ్యం. కీ॥శే కొండేపూడి శ్యాంబాబు ( శ్యామన్న)చరిత చిరస్మరణీయం

కుటుంబ చరిత్ర

స్వతంత్ర వ్యక్తిత్వం గల నాయకుడు

దృశ్యాల దొంతర

ఉత్తణ్ణ



ఈదిమూడిలో మాన్య మందకృష్ణ రూపంలో రగిలిన నిప్పురవ్వ 
ఉమ్మడి రాష్ట్రాలలో sc వర్గీకరణపై దావానలమై రగిలిపోతుంటే  
దిమ్మెరపోయిన భారత జనం విస్తుపోయి వీక్షిస్తున్న క్షణాలను ఓ వీరుడూ వీక్షించాడు.
  మాదిగ జాతిమహసముద్రం ఓ సునామిగా మారబోతుందని అది sc  ఉప కులాల దోపిడీని సమూలంగా పెకిలించివేస్తుందని
 రానున్నకాలం మాదిగజనసమూహానిదే విజయమని 
ముందే గ్రహించిన వీరుడు కొండేపూడి శ్యాంబాబు 
అన్న   పద్మశ్రీ మందకృష్ణ  1994 లో స్దాపించిన MRPS  దండోరా ఉద్యమంలో మరో ఆలోచన లేకుండా   చేరిపోయాడు
అణగారిన sc  కులాలు దోపిడీకి గురవుతున్న
తీరును ప్రశ్నిస్తూ పరుగెడుతున్న ఉద్యమకారుడికి
తన వంతుగ  స్పూర్తిగా పూర్తి జీవితాన్ని అర్పించాడు శ్యాంబాబు . 
కొండేపూడి శ్యాంబాబు మాదిగగా ప్రకటించుకున్నాడు. 
మందకృష్ణ ఆశీస్సులతో  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు MRPS  అధ్యక్షునిగ ఎంపికైనది మొదలు తనదైన శైలిలో ఉద్యమించి 
అగ్నికి వాయువు తోడైన  తీరుగ   ఉద్యమాన్ని ఉరుకులెత్తించిన తీరు   ఏ మాదిగ బిడ్డ మరువలేడు.  ప్రతీ దండోరా  కార్యకర్త నోరార శ్యామన్నా అంటూ పిలుచుని  సొంత ఇంటిలో సోదరుని వలె సంబరపడిపోయేవారు. వృద్దులు శ్యామన్నా అని పిలుచుకుంటూ మురిసిపోయేవారు.

ఉద్యమాల కాగడా కాకినాడలో కొండెపూడి రాఘవులు ణా మరియమ్మల ఇంటి  జన్మించిన   పంచపాండవులులా ఐదుగురు అన్నతమ్ములలో రెండవవాడుగా   1961 సంవత్సరంలో జన్మించాడు మన శ్యాంబాబు .చిన్నతనాంలోనే ధీరత్వలక్షణాలు కలిగిన శ్యాంబాబు కాకినాడలోనే చదువులు ముగించి  ఆర్ &bకాంట్రాక్టరు బిల్డరుగ  ప నిచేస్తూ   ప్రజా ఉద్యమాలలో పాల్గొనేవాడు. మోయ్యేటివారి అమ్మాయి ఉమాకుమారిని అర్దింగిగా స్వీకరించాడు. ఉమాకుమారి భర్తకు తగిన భార్యగ భర్త పోరాటాలలో నిమగ్నమయితే యింటి భాధ్యతను తన భుజాలపై మోసిన ఉత్తమ గృహిణి ఉమాకుమారి.భుజం తట్టి పోరాటలకు పంపిన వీరనారి మన ఉమాకుమారి   ముచ్చటగ ఇద్దరు మగబిడ్డలు రాజాజీ రాయ్ ,రాహుల్ రాయ్  లకు జన్మనిచ్చి ఒకరు ప్రభుత్వ డాక్టరుగ మరోకరు ప్రభుత్వ ఇంజనీరుగ స్దిరపరచి
ఉత్తమ కుటుంబస్తునిగ కూడా నిరూపించి  మనందరికీ ఆదర్శవంతంగా నిలిచాడు మన కొండేపూడి శ్యాంబాబు .



మాదిగ హృదయ స్పందన
మాదిగ జాతి ఇంటి చిరునామ
ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో 
 ఇంటింటికి ధన ధనా మ్రోగిన దండోరా శబ్దం
ఆకుపచ్చని జీపుపై దండోరా జెండా
రెప రెప లాడుతూ దూసుకువస్తుంటే
జీపు దిగిన మాదిగ గంభీర ధీరత్వం 
 నిలువెత్తు మానవత్వంతో
 పల్లెలోకి
 నడచివస్తుంటే 
రెప్పవాల్చకుండా తన్మయత్వంతో
ఉక్కిరిబిక్కిరైన మాదిగ ఆనందం
అన్న మందకృష్ణను గుండెనిండా నింపుకుని
అదే ధైర్యంతో అదే తెగువతో ఎదుటవారి గుండెలు దడదడలాడేలా చేసిన డప్పుల నిప్పుల మోత  
 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మందకృష్ణన్న పేరు మారుమ్రోగేలా చేసిన ఉద్యమనినాదం
 మాదిగ బిడ్డలకు sc వర్గీకరణ ఫలాలు అందించిన వెను వెంటనే  
ఏ లోకాలలో ఉద్యమించడానికో ఇక్కడ అస్తమించి 
 ఏ శిఖరాలల ఉదయించడానికో వెళ్ళి పోయిన 
ఉద్యమ సూరీడు మన ప్రియతమ దండోరా MRPS  నాయకుడు దివంగత  ఉద్యమకారుడు కొండేపూడి శ్యాంబాబు మాదిగకు ప్రతీ మాదిగ పల్లె  హృదయ భారంతో ఘన నివాళి అర్పిస్తుంది





ఉద్యమాలే ఊపిరిగ sc వర్గీకరణే అంతిమ లక్ష్యంగాని నదించి
అన్న మందకృష్ణ ఆదేశాలను 
నూటికి నూరుపాళ్ళు అ







oo



oo...మలుచేస్తూ ఉద్యమాన్ని ఇంటింటికి చేరవేసి 

లక్షలాది మందితో ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో విశ్వరూపసభలే కాదు 
అమలాపురం మొదలు జిల్లానలుమూలలా లక్షలాది మందితొ నభూతో నభవిష్యతి గా సభలు నిర్వహించి జాతిని మేల్కొల్పిన ఘనత మన శ్యామన్నదే
 మాన్యశ్రీ మందకృష్ణ అన్నగారు అమాలాపురం నుండి ప్రారంభించిన పాదయాత్ర ప్రత్యర్దుల శిబిరాలలో కలవరం పుట్టించినప్పుడు 
అన్నను కంటికి రెప్పలా కాస్తూ పాదయాత్రను దిగ్వోజయం చేసిన క్షణాలు ఏ మాదిగ నాయకుడు మరులేడు.

 సోదరుడు కొండేపూడి ఉదయ్ తన అన్న శ్యామన్న వెన్నంటే ఉంటూ కార్యక్రమాల రూపకర్తగ అనేక కార్యక్రమాల విజయాలలో 
పాల్గొన్న తీరు రాముడికి లక్ష్ముడిలెక్కన అండదండలు అందించిన సంగతి మరువరానిది.
మిలిటెంటు ఉద్యమాలు చేసినప్పుడు జైలు జీవితాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉన్న జైలు జీవితానికి
 వెరువక ఎదురునిలిచి 86 రోజులు రిజర్వేషను సాధనలో జైలు జీవితం గడిపి  28 కేసులు ఎదుర్కొన్న సమరయోదుడు  మన శ్యామన్న. 


తన శ్రమ వృధాపోకుండా తొలిదశ ఉద్యమంలో రిజర్వెషను సాధనా ఫలాలను అందించడంలో 
అన్నగారితొ కలసి విజయం సాధించిన క్షణాలను శ్యామన్న ఎప్పుడూ నెమరువేసుకునేవారు తన MRPS  దండోరా కార్యకర్తలతో .

ప్రధాని మోడి సభ అనంతరం జాతి మరోసారి విజయతీరాలను చేరుతున్న క్షణాలలో పాలు పొందాలని ,మందకృష్ఞ అడుగుజాడలలోనే ఇక తన శేషజీవితం గడపాలని నిర్ణయించుకున్నాడు మన శ్యామన్న.
 అన్న మందకృష్ణను కలవాలని పరితపించిన తీరు హృదయాలను కదిలించకమానదు.
అన్నను  పలు మార్లు కలసి తన మనసులో కోరికను బలంగా తెలిపిన క్షణాలు ఉద్వేగం కలిగిస్తాయి
.యావత్ మాదిగ జాతికి మంద కృష్ణన్న ఒక్కడే మహత్ముడు అని  తెలుపుతూ
కార్యకర్తలతొ లక్షడప్పుల కార్యక్రమాలకు కార్యకర్తలను సన్నద్దపరిచిన క్షణాలను కార్యకర్తలు మరచిపోలేకపోతున్నారు కార్యకర్తలు

తునిలో వేలాది మందిలాది మందితో కృష్ణన్నకు జేజేలు పలుకుతూ నిర్వహించిన కార్యక్రమం కార్యకర్తలకు కలగానే మిగిలిపోయింది.

ఏఫ్రియల్  18 యావత్ మాదిగ జాతి ఓ వీరుడిని కోల్పోతుందని ఎవరికీ తెలియదు .
అన్నమంద కృష్ణగారిని మరోసారి కలిసి
రావాలని  కార్యకర్తలతో మాటమంతి నిర్వహించి చేయి ఊపి సాగనంపుతూ వెనుతిరిగి  జారిపడి మరోలోకంలో పడిపోయాడు శ్యామన్న ..నెలరోజులు కోమాలో ఉండి చివరకు తిరిగిరాని  లోకాలకు తరలిపోయాడు వర్గీకరణ సమరయోదుడు కొండెపూడి శ్యాంబాబు మాదిగ మన శ్యామన్న


  మాన్య కృష్ఞ రారా

ఎలుగెత్తి పాడి పొగడెదరా

మందకృష్ణ రారా 

మా మాదిగ తనయ రారా 



మాన్య కృష్ఞ రారా

ఎలుగెత్తి పాడి పొగడెదరా

మందకృష్ణ రారా 

మా మాదిగ తనయ రారా 


నీ మెడలో నల్లని  వస్త్రం

 అది ఉరుములు ఉరిమే కంఠం

నీ మెడలో నల్లని  వస్త్రం

 అది ఉరుములు ఉరిమే కంఠం

మందకృష్ణ రారా 

మా మాదిగ విజయం రారా

మందకృష్ణ రారా 

మా మాదిగ తనయ రారా


మా ప్రేమను మాలలు కట్టి 

నీ మెడలో వేసెద రారా. 

మా ప్రేమను మాలలు కట్టి 

నీ మెడలో వేసెద రారా. 

మా గుండెల నిండా విజయం

ఉప్పొంగెను చూతువు రారా 

మందకృష్ణ రారా

మా మాదిగ విజయం రారా

మందకృష్ణ రారా 

మా మాదిగ తనయ రారా


మా మాదిగ పల్లెలు లేచి

నిను దీవిస్తున్నవి రారా

మా మాదిగ పల్లెలు లేచి

నిను దీవిస్తున్నవి రారా

మందకృష్ణ రారా 

మా మాదిగ తనయ రారా

మాన్యకృష్ణ రారా

ఎలుగెత్తి పాడి పొగడెదరా



నుదుటిన తిలకం దిద్ది

 నీ చేతికి గంధం పూసి

వీధి వీదుల హారతి పట్టి

నీ పల్లకి మోస్తాం రారా

నీ పల్లకి మోస్తాం రారా

మా నవ్వులు దండగ గుచ్చి

నీ మెడలో వేసేద రారా 

మాన్య కృష్ఞ రారా

 ఎలుగెత్తి పొగడి పాడెదరా


మా మాదిగ పల్లెలు లేచి

నిను దీవిస్తున్నవి రారా

మాన్య కృష్ఞ రారా

 ఎలుగెత్తి పొగడి పాడెదరా


కేరింతల గజ్జెలు కట్టి

మా నవ్వును దరువుగ చరిచి

కేరింతల గజ్జెలు కట్టి

మా నవ్వును దరువుగ చరిచి

నిను దీవిస్తున్నాం రారా

మా నవ్వులు పూలుగ జల్లి

నిను దీవిస్తున్నాం రారా


వీధి వీధిన హారతి పట్టి

నీ పాదం మా నెత్తిన పెట్టి

వీధి వీధిన హారతి పట్టి

నీ పాదం నెత్తిన పెట్టి

డప్పుల దరువులు వేసి

నిను దీవిస్తున్నం రారా

వీరబాహు చిందులు తొక్కి

నిను దీవిస్తున్నాం రారా


మందకృష్ణ రారా

మా మాదిగ తనయ రారా

మాన్యకృష్ణ రారా

ఎలుగెత్తి పాడి పొగడెదరా

మందకృష్ణ రారా

మా మాదిగ తనయ రారా

మా మాదిగ విజయం రారా

మా మాదిగ విజయం నీవేరా

మా మాదిగ విజయం నీవే నీవే నీవేరా








 1874  ప్రాంతంలో మిషనరీలు వచ్చే వరకు విద్య సామాన్య జనానికి చేరువకాలేదని తెలిసిందే .అనేక అసమానతలు మబ్బుపట్టినట్లు కమ్ముకున్న సమయం. వీధి బడులు నిర్వహిస్తున్న చదువు ఎందుకు అవసరమేంటి అనే ఆలోచన బలంగా ఉన్న రోజుల్లో చదువుకి ప్రాధాన్యత లేని కాలంలో మిషనరీలు ఉవ్వెత్తున భారతావనిపై దండెత్తినట్టు నలుదిశలా తెలుగు నేలపై అడగిడడం ఓ నూతన శకారంభంగానే భావించాలి.మిషనరీలైన జాన్ మెక్లారిన్ మరియు స్మిత్ లు తూర్పుగోదావరిలో సామర్లకోట,పెద్దాపురం,పిఠాపురం,కాకినాడ,రామచంద్రాపురంలలో పాఠశాలలు  చర్చిలు స్దాపించారు.1925 లో కొత్తపల్లి మండలంలో అమినాబాదలో పాఠశాల ను హానోకు మాస్టారుచే ప్రారంబించారు.

మెకంజీ సేకరించిన కఫియత్తుల్లో తొండంగి మండలం మనకు స్పష్టంగ కనబడుతుంది.11 వ శతాబ్దం నుండి అక్కడ గ్రామాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది.శైవ వైష్ఞవ గొడవల్లో తమిళనాడు నుండి బ్రాహ్మణులు రావడం వారికి పెరూమాళ్ళపురంలో ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తుంది.సర్పవరం లో గల ఆలయంలో అర్చకత్వం వహించడానికి వారికి అనుమతి వచ్చినట్లు తెలుస్తుంది.ఇక పిఠాపురం సంస్దానం ఆధీనంలో ఉన్న రోజుల్లో అద్దరిపేట మొదలు మూలపేట వరకు గల ప్రాంతాన్ని కోనఫారెస్టుగ నమోదైయినట్లు కైఫియత్తుల్లో కగొనవచ్చు. కోనఫారెస్టును ఏనుగుల పుంత అని కూడా పిలిచేవారు.పిఠాపురం సంస్దానం వారి సైనిక పఠాలం ఇక్కడే ఉండేది



 


బైబిల్ ప్రకారం ఆడమ్ నుండి మహాజలప్రళయం వరకు 1656 సంవత్సరాలు  జలప్రళయం నుండి అబ్రహాం పుట్టుకవరకూ 292 ఏళ్ళు  అబ్రహాం నుండి జాకబ్ ( యాకోబు) మిగత...