రచన రంగవల్లులు RACHANA RANGAVALLULU
JANASRI
Sunday, April 5, 2026
Saturday, April 4, 2026
జయహో అమరావతి
జయహో అమరావతి
గీత రచన
బెన్ జాన్సన్
బాలసాహితీ రచయిత
ఆంధ్రుడా అదిగదిగో
చూడవోయి
మన ఆంధ్రుల రాజధాని అమరావతీ
జయహో
జయ జయహో
అమరావతి
ఆంధ్రుల రాజధానీ
మా అమరావతి
జయహో జయ జయహో
జయహో జయజయహో
అమరావతీ
ఆంధ్రుల పురోగతి నీవే
ఓ పూర్ణకుంభం ధారి
మా అమరావతి
నీ పేరు నిలవాలి
ఆ చంద్రతారార్కం
నీ కీర్తి అజరామరం
నీ కీర్తి ఇక అజరామరం
తరతరాల నీ పాలన
ఆంధ్రులకు నవజీవనం
జయహో
జయ జయహో అమరావతి
ఆంధ్రుల విజయశిఖరం
మా అమరావతి
జయహో
జయ జయహో
అమరావతి
ఆంధ్రుల రాజధాని
మా అమరావతి
ఆంధ్రుల పురోగతి
మా అమరావతి
అభిమాన ధని
మా అమరావతి
నీ పేరు నిలవాలి
ఆ చంద్రతారార్కం
నీ కీర్తి అజరామరం
నీ కీర్తి ఇక అజరామరం
తరతరాల నీ పాలన
ఆంధ్రులకు నవజీవనం
జయహో జయ జయహో
జయహో జయ జయహో
నాగార్జునగిరి సిగన
మా మల్లె పూదండ
మా అమరావతి
నాగార్జునగిరి సిగన
మా మల్లె పూదండ
మా అమరావతి
కృష్ణవేణి పాదాల
విరిబోణి మా అమరావతి
కృష్ణవేణి పాదాల
విరిబోణి మా అమరావతి
ఆంధ్రుల రాజధాని
మా అమరావతి
మా రాజధాని
అమరావతి
జయహో జయజయహో
అమరావతి
జయహో జయహో అమరావతి
వర్దిల్లు వర్దిల్లు అమరావతి
ఆంధ్రుల అన్నపూర్ణ అమరావతీ
తెలుగుజాతి అక్షరమై
చిరకాలం వర్దిల్లు వర్దిల్లు
బుద్దుని శాంతి పలుకులతల్లి
మా అమరావతి
రండి ఆంధ్రులారా
మన అమారావతి కీర్తిని పాడుదాం
రండి ఆంధ్రులారా
మన అమరావతి కీర్తిని పాడుదాం
జయహో జయ జయహో
అమరావతి
ఆంధ్రుల రాజధాని మా అమరావతి
Thursday, March 19, 2026
కొండేపూడి
ఈదిమూడి లో మొదలైన ఈదురుగాలి ఉమ్మడి రాష్ట్రమంతా ముసురుగ మారి మాదిగ జాతి మనస్సును జయిస్తుందని ఎవరికి అంచనాలులేవు.అంబేద్కరుడు ప్రసాధించిన రిజర్వేషను ఫలాలు ఏభై ఏళ్ళుగ 56 ఉపకులాలు కలిగిన షెడ్యూల్డ్ కులంలో ఒక వర్గమే ఎక్కువభాగం పొందుతుంటే రిజర్వేషను ఫలాలను పెరియార్ మహాశయుని స్పూర్తితో వెనుకబడిన కులాలు( బి సి ) వర్గీకరించుకున్న రీతిగానే మాకు వర్గీకరించండని మాదిగ జాతిలో కొందరు అరవైయవ దశకంలో గొంతు సవరించుకున్నప్పుడు అప్పుడే అడవుల్లో ప్రతిధ్వనించే ఓ కేక మందకృష్ణ రూపంలో శంఖారావం పూరిస్తుంటే యువ నాయకత్వం హృదయచెవులకు బలంగా వినపడింది. తూర్పుగోదావరి జిల్లా రాష్ట్ర జిల్లాలన్నిటిలో సువిశాలమైనది.అమలాపురం నుండి కోటనందూరు వరకునూ,రాజమండ్రి నుండి రంపచోడవరం వరకు రాజకీయ చైతన్యం కలిగిన ప్రసిద్దజిల్లా.ఈ జిల్లా నుండి ఎందరో దోశోద్దారకులు జన్మించారు.కాని వారితొ పాటు ఓ జాతోద్దారుకుడు జన్మిస్తాడని కాలం కలగనలేదు.సాతంత్ర్య సముపార్జనలో భగత్ సింగ్ బాంబులు వేసినందుకు.అల్లూరి బ్రిటీష్ వారిని ఎదురించినందుకు.నెహ్రు జైలు జీవితం గడిపినందుకు వారు చేసిన ఒక్కొక్క త్యాగానికి వారిని స్మరిస్తుఉన్నాం మరి ఒక జాతోద్దరణకు జీవితం అర్పించి ముప్పై ఏళ్ళు కుటుంబాన్ని వదిలి లక్షలాది కీలోమీటర్లు పయనించి మిలెటెంటుగ మారి బస్సు దహనాలలో పాల్గొని జైలు జీవితం గడిపి అన్నీ అనుభవించిన మహోన్నతమూర్తిని ఆ జాతి ఎంత హృదయంలో పెట్టుకుంటుంది.మాదిగ జాతోద్దారకుడు కొండేపూడి శ్యాంబాబును యావత్తు మాదిగజాతి దిగ్గజనేతగ తమ గుండెల్లో నిలుపుకున్న చరిత్రను చదవడం ప్రతీ మాదిగ బిడ్డల కర్తవ్యం. కీ॥శే కొండేపూడి శ్యాంబాబు ( శ్యామన్న)చరిత చిరస్మరణీయం
కుటుంబ చరిత్ర
స్వతంత్ర వ్యక్తిత్వం గల నాయకుడు
దృశ్యాల దొంతర
ఉత్తణ్ణ
మాన్య కృష్ఞ రారా
ఎలుగెత్తి పాడి పొగడెదరా
మందకృష్ణ రారా
మా మాదిగ తనయ రారా
మాన్య కృష్ఞ రారా
ఎలుగెత్తి పాడి పొగడెదరా
మందకృష్ణ రారా
మా మాదిగ తనయ రారా
నీ మెడలో నల్లని వస్త్రం
అది ఉరుములు ఉరిమే కంఠం
నీ మెడలో నల్లని వస్త్రం
అది ఉరుములు ఉరిమే కంఠం
మందకృష్ణ రారా
మా మాదిగ విజయం రారా
మందకృష్ణ రారా
మా మాదిగ తనయ రారా
మా ప్రేమను మాలలు కట్టి
నీ మెడలో వేసెద రారా.
మా ప్రేమను మాలలు కట్టి
నీ మెడలో వేసెద రారా.
మా గుండెల నిండా విజయం
ఉప్పొంగెను చూతువు రారా
మందకృష్ణ రారా
మా మాదిగ విజయం రారా
మందకృష్ణ రారా
మా మాదిగ తనయ రారా
మా మాదిగ పల్లెలు లేచి
నిను దీవిస్తున్నవి రారా
మా మాదిగ పల్లెలు లేచి
నిను దీవిస్తున్నవి రారా
మందకృష్ణ రారా
మా మాదిగ తనయ రారా
మాన్యకృష్ణ రారా
ఎలుగెత్తి పాడి పొగడెదరా
నుదుటిన తిలకం దిద్ది
నీ చేతికి గంధం పూసి
వీధి వీదుల హారతి పట్టి
నీ పల్లకి మోస్తాం రారా
నీ పల్లకి మోస్తాం రారా
మా నవ్వులు దండగ గుచ్చి
నీ మెడలో వేసేద రారా
మాన్య కృష్ఞ రారా
ఎలుగెత్తి పొగడి పాడెదరా
మా మాదిగ పల్లెలు లేచి
నిను దీవిస్తున్నవి రారా
మాన్య కృష్ఞ రారా
ఎలుగెత్తి పొగడి పాడెదరా
కేరింతల గజ్జెలు కట్టి
మా నవ్వును దరువుగ చరిచి
కేరింతల గజ్జెలు కట్టి
మా నవ్వును దరువుగ చరిచి
నిను దీవిస్తున్నాం రారా
మా నవ్వులు పూలుగ జల్లి
నిను దీవిస్తున్నాం రారా
వీధి వీధిన హారతి పట్టి
నీ పాదం మా నెత్తిన పెట్టి
వీధి వీధిన హారతి పట్టి
నీ పాదం నెత్తిన పెట్టి
డప్పుల దరువులు వేసి
నిను దీవిస్తున్నం రారా
వీరబాహు చిందులు తొక్కి
నిను దీవిస్తున్నాం రారా
మందకృష్ణ రారా
మా మాదిగ తనయ రారా
మాన్యకృష్ణ రారా
ఎలుగెత్తి పాడి పొగడెదరా
మందకృష్ణ రారా
మా మాదిగ తనయ రారా
మా మాదిగ విజయం రారా
మా మాదిగ విజయం నీవేరా
మా మాదిగ విజయం నీవే నీవే నీవేరా
1874 ప్రాంతంలో మిషనరీలు వచ్చే వరకు విద్య సామాన్య జనానికి చేరువకాలేదని తెలిసిందే .అనేక అసమానతలు మబ్బుపట్టినట్లు కమ్ముకున్న సమయం. వీధి బడులు నిర్వహిస్తున్న చదువు ఎందుకు అవసరమేంటి అనే ఆలోచన బలంగా ఉన్న రోజుల్లో చదువుకి ప్రాధాన్యత లేని కాలంలో మిషనరీలు ఉవ్వెత్తున భారతావనిపై దండెత్తినట్టు నలుదిశలా తెలుగు నేలపై అడగిడడం ఓ నూతన శకారంభంగానే భావించాలి.మిషనరీలైన జాన్ మెక్లారిన్ మరియు స్మిత్ లు తూర్పుగోదావరిలో సామర్లకోట,పెద్దాపురం,పిఠాపురం,కాకినాడ,రామచంద్రాపురంలలో పాఠశాలలు చర్చిలు స్దాపించారు.1925 లో కొత్తపల్లి మండలంలో అమినాబాదలో పాఠశాల ను హానోకు మాస్టారుచే ప్రారంబించారు.
మెకంజీ సేకరించిన కఫియత్తుల్లో తొండంగి మండలం మనకు స్పష్టంగ కనబడుతుంది.11 వ శతాబ్దం నుండి అక్కడ గ్రామాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది.శైవ వైష్ఞవ గొడవల్లో తమిళనాడు నుండి బ్రాహ్మణులు రావడం వారికి పెరూమాళ్ళపురంలో ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తుంది.సర్పవరం లో గల ఆలయంలో అర్చకత్వం వహించడానికి వారికి అనుమతి వచ్చినట్లు తెలుస్తుంది.ఇక పిఠాపురం సంస్దానం ఆధీనంలో ఉన్న రోజుల్లో అద్దరిపేట మొదలు మూలపేట వరకు గల ప్రాంతాన్ని కోనఫారెస్టుగ నమోదైయినట్లు కైఫియత్తుల్లో కగొనవచ్చు. కోనఫారెస్టును ఏనుగుల పుంత అని కూడా పిలిచేవారు.పిఠాపురం సంస్దానం వారి సైనిక పఠాలం ఇక్కడే ఉండేది
సమరయ స్త్రీ
స్ర్తీ ఏకపాత్ర*
(వేదిక మధ్యలో స్ర్తీ కూర్చుని ఉంటుంది తన ముందర ఉన్న మంచినీటి కూజా ఇంచుమించు ఒడిలో పొదివికున్నట్టు ఉంటుంది.కూజా మూతిపై చేతులు చాపి ఆ చేతులులో తలను వాల్చి ఉంటుంది.)
తెర తీయబడగానే ......మెల్లగా తలను పైకి ఎత్తి నిద్ర మత్తు కళ్ళను ప్రదర్శిస్తూ ఆవలించి ,వళ్ళు విరిచుకుంటూ నిద్రలో తన ప్రియునితొ సరసాలాడిన రీతిని ఊహించుకుంటూ పగలబడి నవ్వుతూ నవ్వుతూ లేచి వేదిక కుడి మూలన వరకు ఎవరో తనను కౌగిలించుకుని వదిలి పెట్టిన భావన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు అనిపించి వదలమన్నట్టు నటిస్తు నవ్వి ఆగి.....ఒక్కసారిగా కొంటే చూపులు చూస్తూ వయ్యారపు నడకతో కుడి నుండి ఎడమ మూలవరకు నడచి నడుస్తున్నప్పుడు నా అంత అందెగత్తె లేదు అన్నట్టు భావించుకుంటూ వెను తిరిగి మధ్యలో వరకు వచ్చి మరో సారి కొంటే నవ్వు విసిరి కనులు ఎగరేసి తలను వాల్చి కురులు ముందుకులాగి మరలా కనులు ఎగరేసి
ఓ రెండు నాట్యభంగిమలు ప్రదర్శించి)
**సమరయ స్ర్తీ ఏకపాత్ర*
(వేదిక మధ్యలో సమరయస్ర్తీ కూర్చుని ఉంటుంది తన ముందర ఉన్న మంచినీటి కూజా ఇంచుమించు ఒడిలో పొదివికున్నట్టు ఉంటుంది.కూజా మూతిపై చేతులు చాపి ఆ చేతులులో తలను వాల్చి ఉంటుంది.)
తెర తీయబడగానే ......మెల్లగా తలను పైకి ఎత్తి నిద్ర మత్తు కళ్ళను ప్రదర్శిస్తూ ఆవలించి ,వళ్ళు విరిచుకుంటూ నిద్రలో తన ప్రియునితొ సరసాలాడిన రీతిని ఊహించుకుంటూ పగలబడి నవ్వుతూ నవ్వుతూ లేచి వేదిక కుడి మూలన వరకు ఎవరో తనను కౌగిలించుకుని వదిలి పెట్టిన భావన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు అనిపించి వదలమన్నట్టు నటిస్తు నవ్వి ఆగి.....ఒక్కసారిగా కొంటే చూపులు చూస్తూ వయ్యారపు నడకతో కుడి నుండి ఎడమ మూలవరకు నడచి నడుస్తున్నప్పుడు నా అంత అందెగత్తె లేదు అన్నట్టు భావించుకుంటూ వెను తిరిగి మధ్యలో వరకు వచ్చి మరో సారి కొంటే నవ్వు విసిరి కనులు ఎగరేసి తలను వాల్చి కురులు ముందుకులాగి మరలా కనులు ఎగరేసి
ఓ రెండు నాట్యభంగిమలు ప్రదర్శించి)
*
* పట్టి కాలి బొటన వ్రేలు నేలను రాస్తూ) సుఖారు గ్రామ కుర్రాళ్ళు ఇది విన్నారా ! ఆహ విన్నారాంట ( విసుగు ప్రదర్శించి ) విని ఉండరులే మీకు నన్ను ఎలా పొందాలనే ఆశే కాని ఈ సమరయ ప్రాంతంలో ఇంత అందగత్తే ( క్రిందనుండి పైకి తన చేతిని చూపిస్తు) లేనే లేదట తెలుసాంట ... ( అరచేతిని నోటి పై ఉంచి ఒకింత వగలపు నవ్వు నవ్వుతూ ) ఇప్పటికే నా వంపుసొంపులకు సమరయ ప్రాంతంలో పేరు మోసిన వాళ్ళు కాళ్ళా వేళ్ళా పడి దాహం తీర్చుకుని ..... తీర్చుకుని ( కళ్ళు పెద్దవి చేసి ఎవరో అడిగినట్టు ) ఊ .... ఎలాగో చెప్పనా..ఊ.... ఎవరిదని చెప్పనూ ( కళ్ళుత్రిప్పి గట్టిగా నవ్వి భర్తలాగ మగవానిగా నటిస్తూ గొంతు గంభీరంగా పెట్టి ) ఓ సుమరమణీ ...నీ నవ్వు నా హృదయాన్ని గాయం చేసింది చూడు నీ ఒడిలో నా తలను వాల్చనివ్వవూ...( పగలబడి గర్వం తొణికిసలాడే నవ్వు గట్టిగా ) మరోకడిదా ఏయ్ పిల్లా ఏం నడకే బాబు నీది ....నీవు అనుమతిస్తే నీ అడుగుల్లో అడుగు వేసి పువ్వుల్లో పెట్టి చూస్తాను ( నవ్వి నవ్వి నవ్వుతూనే ఏడుస్తూ మోకాళ్ళపై కూలబడి మోసపోయిన దానిని గుర్తుచేసుకుంటుంది
... ఏడ్చి ఏడ్చి .... ఇంతలో ఏదో గుర్తుకు వచ్చినట్టు ....కన్నీళ్ళు తుడుచుకుని )
అయ్యో అప్పుడే పన్నెండుగంటలయ్యింది . ఎండ చుర్రుమంటుంది .ఇదే సమయం యాకోబు బావి నుండి నీళ్ళు తేవడానికి. నా తలరాత ఇలా తగలడింది .బయటకు వెళితే చాలు హేళన మాటలు వినలేక చావాలనిపిస్తుంది ,సూటిపోటిమాటలలతో ప్రాణం తీస్తారు ఈ పాడు జనం. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నానే. వీరి సంపదేమైనా ఎత్తుకు పోయానా ఏంటి.నా బడి ఏడుస్తూ ఉంటారు...సరేలే.... ఈ సమయమైతేనే జనం తక్కువ ఉంటారు నీళ్ళు తేవడానికి ( అంటూ కూజాను సంకన ఉంచి బయలు దేరుతుంది .)
(రెండడుగులు వేసిందో లేదో . వీధిలో ఓ సైనికుడు సమరయ స్ర్తీని చులకనగా చూస్తూ చేయిని పట్టుకున్నట్టు తన చేతిని సైనికుడి నుండి గుంజుకున్నట్టు నటిస్తూ )
దారి తప్పుకో సైనికుడా.... అడ్డులే నన్ను వెళ్ళనివ్వు..నేను సమరయ స్ర్తీని నేనేం నిన్న మొన్నటి నుండి ఇక్కడ ఉంటున్న దానినేం కాదు .సమరయ స్ర్రీని ఒమ్రీ రాజు కట్టించిన పట్నంలో అస్సూరు రాజు ఆజ్ఞతో నివశిస్తున్న సమరయ జాతి స్త్రీని. ఏం అంటున్నావు సంకరజాతి దాన్ననా ,అంటరాని దాన్ననా. మా తాతలు దొంగలా అయితే అయి ఉండవచ్చు ముందు అడ్డు తొలగు...... వదులు చేయి . ఆ చెట్ల క్రింద దేశదిమ్మరుంటారు వెళ్ళి దాని చెయిపట్టుకో వదలమన్నాన.....ఛీ...... చేయి వదులు ( చేయిని సైనికుడి నుండి గుంజుకున్నట్టు నటిస్తూ ముఖం పై ఉమ్మి వేసినట్లు నటించి ముందుకు వెళుతూ దారి ప్రక్కనున్న గ్రామదేవత విగ్రహం ముందు ఆగి కూజాను ప్రక్కన పెట్టి మోకాళ్ళపైబడి పూజిస్తున్నట్టు నటించి మరలా కూజాను చంకనబెట్టుకుని బయలుదేరుతుంది )
వచ్చేసాను ....హమ్మయ్య... అదిగో యాకోబు బావి యాకోబు యేసేపుకు కట్టించిన బావి . ఆ నుయ్యి లో నీళ్ళు ఎంత తీయగా ఉంటాయి . ఎంత మధురంగా ఉంటాయి. ఎంత చల్లగా ఉంటాయి ( అని అనుకుంటూ ఒక్కసారిగా ఆశ్చర్యం నటిస్తూ .....ముఖం చిట్లించి... బావి దగ్గర ఎవరో కూర్చున్నట్టు గమనించి) .........ఎవరు .... ఎవరైయుంటారు.......ఎవరో తెల్లని అంగీ ధరించిన తేజస్సు కలిగిన వ్యక్తి ..బావి గట్టున కూర్చుని ఉన్నాడు...నేను చూస్తుంది నిజమేనా అతను యూదుడు కాదుగదా ..నేను దగ్గరకు వెళ్ళవచ్చో లేదో . అంటరానివాళ్ళు , దోపిడీ దొంగలు "విచ్చలవిడిగా బ్రతికే వ్యభిచారులు నివశించే ఈ సమరయ ప్రాంతానికి యూదులు ఏనాడో రావటం మాని గలలియ వైపు పోతున్నారు.మరి ఇతనెవరు చూస్తే యూదుడులాగే ఉన్నాడు. ఏదైతే అదే జరిగింది దగ్గరగా వెళతాను.........
( దగ్గరగా వెళ్ళినట్లు నాలుగు అడుగులు వేసి )
అయ్యా ........ఎవరు మీరు ఈ మిట్టమధ్యహాన్నం ఇంత ఎండలో అంత ప్రశాంతంగా కూర్చున్నారు .చూస్తుంటే యూదుజాతివానిగా కనబడుతున్నారు . నేను చూస్తుంది నిజమేనా .....( అవతలి నుండి నిజమే నువు చూస్తుంది అనే జవాబు విని దూరంగా వెనకకు పరిగెత్తి భయం నటిస్తూ )
అయ్యా మన్నించండి ! మీరు చూస్తుంటే యూదులులా ఉన్నారు. నేను సమరయ స్త్రీని అంటరాని జాతిలో పుట్టిన దానిని మీరు ఈ యాకోబు బావి దగ్గరకు ఎందుకు వచ్చారు ? నేను పుట్టి ఉండగా ఓ యూదుడు ఇలా సమరయ ప్రాంతం రావటం ఇదే .మీకు నన్ను చూస్తుంటే అసహ్యం కలగడంలేదా?
(ఆశ్చర్యం నటిస్తూ చంకన ఉన్న కూజా క్రింద ఉంచి )
అయ్యా ఏమిటి మీరంటున్నది దాహానికి నీరు ఇమ్మంటున్నారా ? నేను చేదతో తోడి మీకు నీరు పోస్తే త్రాగుతారా ? సమరయ స్ర్రీ తాకిన నీటిని మీరు త్రాగుతారా ? మీరు ఈ పాపుల మార్గానికి రావటమే వింతగా ఉంది. మీరు దాహం తీర్చమంటున్నారు .నేను ఎవరో మీకు తెలిసే మాట్లాడుతున్నారా !
(సంబ్రమాశ్చర్యాలకు లోనై )
అయ్యా ! ఏమిటి మీరంటున్నది ( మోకాళ్ళ పై కూలబడి ) నాకు ఐదుగురు భర్తలని ఆరవ భర్తతో ఉంటున్నానని నాకు తప్ప మరెవరికీ తెలియదు .నా అంతరంగ రహస్యాలు మీకెలా తెలిసాయి. అంతరంగ రహస్యాలు తెలిసేది దేవునికే కదా ! నేను నమ్మలేకుండా ఉన్నాను.మీరు సామాన్యులుగా కనబటంలేదు .సాక్షాత్తు దైవస్వరూపులుగా ఉన్నారు.
అయ్యా ! మనం అందరం యాకోబు దేవుని బిడ్డలమే కదా ! సమరయులను ఎందుకు అంటరానివారిగా చూస్తున్నారు . మనుషులందరూ ఒకటే కదా !ఎందుకు ఈ తారతమ్యాలు. మిమ్మలను చూస్తుంటే మీరు సమరయుల పట్ల ప్రేమ కలిగిఉన్నట్లు ఉన్నారు . యూదులు గొప్పవారు కదా ఈ సమరయస్ర్రీ ఇచ్చే నీరు నిజంగా త్రాగుతారా!
(ఏదో ఆశ్చర్యంగా అర్దంకానట్లు ముఖం పెట్టి )
జీవజలము ఇస్తారా ? ఏమిటి మీరనేది .తోడుకో డానికి చేదలేదు కదా మరి నాకు జీవజలం ఎలా ఇస్తారు?
మీ మాటలు వింటుంటే హృదయం ఉప్పొంగి పోతుంది. మీరు ఎవరు ? మీ పేరేంటి ? నా పాపాలు తెలిసేది దేవునికే కదా నా హృదయమెందుకు భారంగా ఉంది.మిమ్ములను చూస్తున్నా , మీ మాటలు వింటున్నా నిత్యజీవం, నిత్యరక్షణ,నిత్యరాజ్యం లోకి పిలుస్తున్నట్టు ఉంది.మన తండ్రి అయిన యాకోబు కంటే మీరు గొప్పగా ఉన్నారే . పాపుల రక్షకుడు మెస్సయ్య వస్తాడని లేఖనాలలో తెలుసుకున్నాను.
అయ్యా ! ఏమిటి మీరంటున్నది.మనం అందరం దేవుని వారసులమా .ఆయన ఇచ్చు రక్షణ అందరికీ సమానమేనా ,యూదులని ,సమరయులని,పాపులని ,నీతిమంతులని భేదాలేలేవా అందరికీ ఆయన రక్షణ ఇస్తాడా !
అయ్యా ! నేను ఎన్నో పాపాలు చేసాను,విగ్రహారాధన చేసాను, నన్ను క్షమిస్తాడా! ఈ పాపిని క్షమిస్తాడా ( గుక్కపట్టి ఏడుస్తుంది )
(కొంతసేపటికి తేరుకుని )
అయ్యా మీ పేరు ఏమిటి ?
ఏమిటి మెస్సయ్య ! మేం ఎదురు చూసే మెస్సయ్య మీరేనా !అయ్యా నన్ను మన్నించండి!ఈ పాపిని క్షమించండి! అయ్యా మీరు నన్ను అమ్మా అని పిలుస్తున్నారా !నేను ధన్యురాలని అయ్యా ధన్యురాలిని !మెస్సయ్య వచ్చాడని మా సమరయులందరికీ చెప్పాలి . ( కంగారుగా ముందుకు పరిగెడుతూ వెనక్కి వస్తూ ) ఊరి వారందరికీ ఈ శుభవార్త చెప్పాలి .అయ్యా ఇక్కడే ఉండండి . మీరు అస్సలు కదలోద్దు . నేను పోయి మా ఊరి వారందరినీ తీసుకుని వస్తాను. ఇక్కడే ఉండండి ....ఇక్కడే ఉండండి
ఓయ్ .. ఓయ్ మిమ్మల్నె వింటున్నారా...(తన ముసుగు చెంగును నోటిలో సుతి మెత్తగా పంటి బిగిన పట్టి కాలి బొటన వ్రేలు నేలను రాస్తూ) సుఖారు గ్రామ రసికాగ్రేసులారా ఇది విన్నారా ! ఆహ విన్నారాంట ( విసుగు ప్రదర్శించి ) విని ఉండరులే..... నా యవ్వన సిరులు దోచుకోవలనే ఆశే కాని ఈ సమరయ ప్రాంతంలో ఇంత రూపవతి శృంగారదేవత ( క్రిందనుండి పైకి తన చేతిని చూపిస్తు) లేనే లేదనే విషయం మీకు తెలుసాంట ... ( అరచేతిని నోటి పై ఉంచి ఒకింత వగలపు నవ్వు నవ్వుతూ ) ఇప్పటికే నా లావణ్య రేఖావిలాసాలు సమరయ ప్రాంతంలో పేరు మోసిన దిగ్జజాలదగ్గర ఉన్నాయని వాళ్ళు కాళ్ళా వేళ్ళా పడి సేదతీరి.....అవసరం తీరాక ముఖం చాటేస్తారని ,వారి రహస్యజీవితాలు నా గుప్పెటలో బందీ అని అందుకే నన్ను వేనొళ్ళ పొగుడుతారని తెలుసా ( కళ్ళు పెద్దవి చేసి ఎవరో అడిగినట్టు ) ఊ .... ఎలాగో చెప్పనా.(గట్టిగా ఎగతాళి నవ్వు ).ఊ.... ఎవరిదని చెప్పనూ ( కళ్ళుత్రిప్పి గట్టిగా నవ్వి భర్తలాగ మగవానిగా నటిస్తూ గొంతు గంభీరంగా పెట్టి ) ఓ సుమరమణీ ...నీ నవ్వు నా హృదయారవిందాన్ని ఎంత గాయం చేసిందో చూడు నీ ఒడిలో ఒక్కసారి నా తలను వాల్చనివ్వవూ... ( పగలబడి వేళాకోళం కలగలిపిన తొణికిసలాడే నవ్వు గట్టిగా నవ్వుతూ ) మరోకప్రియునిదా ఏయ్ సౌందర్యరాశి ఏం లావణ్యమే నీది ....నీవు అనుమతిస్తే నీ అడుగుల్లో అడుగులు వేస్తాను .పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను వదలనంటే వదలను నిన్ను ( నవ్వి నవ్వి నవ్వుతూనే ఏడుస్తూ మోకాళ్ళపై కూలబడి మోసపోయిన దానిని గుర్తుచేసుకుంటుంది.. ఏడ్చి ఏడ్చి .... ఇంతలో ఏదో గుర్తుకు వచ్చినట్టు ....కన్నీళ్ళు తుడుచుకుని )
అయ్యో అప్పుడే మిట్ట మధ్యహాన్నం అయ్యింది . ఎండ చుర్రుమంటుంది .ఇదే సమయం యాకోబు బావి నుండి నీళ్ళు తేవడానికి. నా తలరాత ఇలా తగలడింది మరి .బయటకు వెళితే చాలు హేళన మాటలు వినలేక చావాలనిపిస్తు ఉంటుంది . సూటిపోటి మాటలలతో ప్రాణం తీస్తారు ఈ పాడు జనం. నా బ్రతుకు నేను బ్రతుకుతున్నానే. వీరి సంపదేమైనా ఎత్తుకు పోయానా ఏంటి. నా బడి ఏడుస్తూ ఉంటారు...సరేలే.... ఎప్పుడూ ఉండే సొదే.... ఈ సమయమైతేనే జనం తక్కువ ఉంటారు బావి దగ్గర .( అంటూ కూజాను సంకన ఉంచి బయలు దేరుతుంది .)
(రెండడుగులు వేసిందో లేదో . వీధిలో ఓ సైనికుడు సమరయ స్ర్తీని చులకనగా చూస్తూ చేయిని పట్టుకున్నట్టు తన చేతిని సైనికుడి నుండి గుంజుకున్నట్టు నటిస్తూ ) ఎయ్ చేయి వదులు ...,,,దారి తప్పుకో సైనికుడా.... అడ్డులే నన్ను వెళ్ళనివ్వు....ఏమిటా వెకిలి నవ్వు.....నేను సమరయ స్ర్తీని . నేనేం నిన్న మొన్నటి నుండి ఇక్కడ ఉంటున్న దానినేం కాదు . ఒమ్రీ రాజు కట్టించిన పట్నంలో అస్సూరు రాజు ఆజ్ఞతో నివశిస్తున్న సమరయ జాతి స్త్రీని. ఏం అంటున్నావు ? సంకరజాతి దానిననా ,అంటరాని దాన్ననా. మా తాతలు దొంగలా అయితే అయి ఉండవచ్చు .....ముందు అడ్డు తొలగు...... బావి వద్దకు పోవాలి ... చేయి వదులు ముందు . ఆ చెట్ల మాటున దేశదిమ్మరులుంటారు వెళ్ళి దాని చెయిపట్టుకో వదలమన్నాన.....ఛీ...... చేయి వదులు ( చేయిని సైనికుడి నుండి గుంజుకున్నట్టు నటిస్తూ ముఖం పై ఉమ్మి వేసినట్లు నటించి కోపంగా చూస్తున్నట్టు ముందుకు వెళుతూ బయలుదేరుతుంది నాలుగు అడుగులు వేసి )
( యాకోబు బావిని దూరం నుండి చూసి నట్లు నటించి) ....హమ్మయ్య... అదిగో యాకోబు బావి యాకోబు యేసేపుకు కట్టించిన బావి . ఆ నుయ్యి లో నీళ్ళు ఎంత తీయగా ఉంటాయి . ఎంత మధురంగా ఉంటాయి. ఎంత చల్లగా ఉంటాయో చెప్పలేను ( అని అనుకుంటూ ఒక్కసారిగా ఆశ్చర్యం నటిస్తూ .....ముఖం చిట్లించి.. ... బావి దగ్గర ఎవరో కూర్చున్నట్టు గమనించి) ....అమ్మో ఎవరో బావి వద్ద ఉన్నారు.....ఎవరైఉంటారు .... బావి అంచున కూర్చుంది ..ఎవరైయుంటారో.....ఎవరో యూదుడులా అంగీ వేసుకుని ఉన్నాడు..బావి గట్టునే కూర్చుని ఉన్నాడు...నేను చూస్తుంది నిజమేనా అతను యూదుడు కాదుగదా ఆ తేజస్సు ఆ గంభీరతా యూదులకే సొంతం సుమా మరెవరికి ఉంటుంది ఆ దర్పం .....నేను దగ్గరకు వెళ్ళవచ్చో లేదో . ..(గర్వపు గొంతుతో ).......ఆ నాకేం భయం యూదులకు మా సమరయులకు బద్ద వైరం ఉన్నమాట ఎవరు కాదనగలరు . .....అతను యూదుడైతే నాకేంటట , .....ఉండనీ నాకేం భయం. సమరయులు దేనిలో తీసిపోతారు ...యూదుల గొప్పేంటో ( తనలో తను మాట్లాడుకుంటూ....... బుగ్గలు నొక్కుకుంటూ దిగ్బ్రమకు లోనై ) దోపిడీ దొంగలు "విచ్చలవిడిగా బ్రతికే వ్యభిచారులు నివశించే ఈ సమరయ ప్రాంతానికి యూదులు ఏనాడో రావటం మాని యూదయ నుండి చుట్టూ తిరిగి గలలియ పోతున్నారు.మరి ఇతనెవరు చూస్తే యూదుడులాగే ఉన్నాడు. (నిట్టూర్చి ) ఏది జరిగితే అదే జరుగుతుంది .........దగ్గరగా వెళతాను.. నా పని నేను చేసుకుంటాను.......( అని బావి వద్దకు వెళ్ళినట్లు నాలుగడుగులు వేసి కూజాను క్రింద పెడుతుంది ఇంతలో మెస్సీయా దాహాం తీర్చమని నీళ్ళు అడుగుతాడు అది విని ఆశ్చర్యం నటిస్తూ ..) ఏంటేంటి ....దాహానికి నీరు ఇమ్మంటున్నావా ? నువు యూదుడవే కదా !
నేను చేదతో తోడి నీకు నీరు పోస్తే త్రాగుతావా ? సమరయ స్ర్రీ తాకిన నీటిని నువు త్రాగుతావా ? .నేను ఎవరో తెలిసే మాట్లాడుతున్నావా ! యూదులు మేము వండినవి తినరట , మా చేతి నీరు త్రాగరట ,మాతో సంబాషించడానికే ఒప్పుకోరట . మరి నువేంటి త్రాగడానికి నీళ్ళడుగుతున్నావు.
నువు యూదుడవైతే......ఏషర్హద్దోన్ మిమ్మల్ని అస్సూరు రాజ్యం తీసుకుపోయాడుగా అక్కడే ఉండక ఈ సమరయ ప్రాంతంతో నీకేం పని ఇలా వచ్చావ్ .... ఏం మాట్లాడవేం ....పోనీలే అని విగ్రహారాధన మాని మన దేవుడైన యెహోవాను పూజిస్తే నెహేమ్యా ఊరుకున్నాడా మా సమరయులను సంకరజాతంటూ కలవవద్దని నిభందన పెట్టాడు . అయితేనేం మేము దేవుడిని విడిచి పెట్టలేదు. లేఖనాలు చదువటం మానలేదు . గెరీజీము కొండపై ఆలయం కట్టుకుని మెస్సీయ వస్తాడని ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని మీ యూదులు కలవనివ్వక పోతేనేం మేము గొప్పగానే బ్రతుకుతున్నాం , మరి మా సమరయ ప్రాంతంతో నీకేం పనో .ఏం మాట్లాడవేం . అందరిలాగే యూదయా నుండి చూట్టూ తిరిగి గలలియ పోలేక పోయావా మా సమరయ ప్రాంతంలోకి వచ్చావ్.........నీళ్ళు కావాలట నీళ్ళు ( గుడ్లురుమి నట్లు చూసి ....దగ్గరగా వెళ్ళినట్లు నాలుగు అడుగులు వేసి )
.ఇంతకూ.......ఎవరు నువ్వు ఈ మిట్టమధ్యహాన్నం ఇంత ఎండలో అంత ప్రశాంతంగా కూర్చున్నావ్ దేనికోసమో తెలుసుకోవచ్చా .చూస్తుంటే యూదు జాతివానిగానే కనబడుతున్నావు . నేను చూస్తుంది నిజమేనా ....( అవతలి నుండి నిజమే నువు చూస్తుంది అనే జవాబు విని ఆశ్చర్యాన్ని చూపిస్తూ )
ఆ అవునా ! యూదుడవే... ( కాస్త నెమ్మదైన గొంతుతో ) నేను ఎవరో తెలుసా ! సమరయ స్త్రీని అంటరాని జాతిలో పుట్టిన దానిని . మీరు ఈ యాకోబు బావి దగ్గరకు ఎందుకు వచ్చారు ? నేను పుట్టి ఉండగా ఓ యూదుడు ఇలా సమరయ ప్రాంతంలో అడుగు పెట్టడం ఇదే ప్రధమం . ఈ పాపుల మార్గాన రావడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. మా సమరయులు చూస్తే ఏదైనా గొడవ జరుగుతుందేమో అన్న భయం మీకులేదా ? నన్ను చూసి నవ్వుతూ శాంత వదనులై మాట్లాడుతున్నారు ( ఒకింత చెవులు నిక్కించి వింటున్నట్లు నటించి సంబ్రమాశ్చర్యాలకు లోనై )
అయ్యా ! ఏమిటి మీరంటున్నది ( మోకాళ్ళ పై కూలబడి ) ఏమిటి... ఏమిటీ..నేను వినేది నిజమేనా . నాకు ఐదుగురు భర్తలని ఆరవ భర్తతో ఉంటున్నానని అంటున్నారా ! నాకు తప్ప మరెవరికీ ఈ అంతరంగిక విషయం తెలియదు. మీకెలా తెలిసింది. నా అంతరంగ రహస్యాలు మీకెలా తెలిసాయి నమ్మలేకపోతున్నాను ?. నా అంతరంగ రహస్యాలు తెలిసేది దేవునికే కదా ! నేను నమ్మలేకుండా ఉన్నాను. మీరు సామాన్యులుగా కనబటంలేదు .సాక్షాత్తు దైవస్వరూపులుగా ఉన్నారు. నిజం చెప్పండి ఎవరు మీరు ?
చూస్తుంటే మీరు సమరయుల పట్ల ప్రేమ జాలి కలిగి ఉన్నట్లు ఉన్నారు . పాపులను క్షమించే వారిగా ప్రేమించే వారిగా కనబడుతున్నారు . యూదులు గొప్పవారు కదా ఈ సమరయస్ర్రీ ఇచ్చే నీరు నిజంగా త్రాగుతారా! నిజం చెప్పండి (ఏదో ఆశ్చర్యంగా అర్దంకానట్లు ముఖం పెట్టి )
ఏంటి జీవజలములా ..జీవజలములు..ఇస్తారా? ఏమిటి మీరనేది తోడుకోడానికి చేదలేదు కదా మీ దగ్గర , మరి నాకు జీవజలం ఎలా ఇస్తారు? మీ మాటలు వింటుంటే హృదయం ఉప్పొంగుతుంది. అసలు మీరు ఎవరు ? మీ పేరేంటి ? నా పాపాలు తెలిసేది దేవునికే కదా. .మీరు ఎవరో తెలుసుకోవాలని ఉంది.
ఈ రోజు నా హృదయమెందుకో భారంగా ఉంది. మీతో మాట్లాడుతుంటే హృదయంలో పశ్చత్తాపం కలుగుతుంది . మిమ్ములను చూస్తున్నా , మీ మాటలు వింటున్నా నిత్యజీవం, నిత్యరక్షణ,నిత్యరాజ్యం లోకి పిలుస్తున్నట్టు ఉంది. మన తండ్రి అయిన యాకోబు కంటే మీరు గొప్పగా ఉన్నారే . పాపుల రక్షకుడు మెస్సయ్య వస్తాడని లేఖనాలలో తెలుసుకున్నాను. ఆయన కోసమే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాం. ఇంతకూ మీరు ఎవరో చెప్పటం లేదు ? ( కొంతసేపు ఆగి వినినట్లు నటించి )
అయ్యా ! ఏమిటి మీరంటున్నది.మనం అందరం దేవుని వారసులమా .ఆయన ఇచ్చు రక్షణ అందరికీ సమానమేనా ,యూదులని ,సమరయులని,పాపులని ,నీతిమంతులని భేదాలే లేవా అందరికీ ఆయన రక్షణ ఇచ్చేవాడు ఉన్నాడా !
అయ్యా ! ( రోదిస్తూ ) ఎన్నో పాపాలు చేసాను, విగ్రహారాధన చేసాను, నన్ను క్షమిస్తాడా! ఈ పాపిని క్షమిస్తాడా వచ్చే మెస్సియ్యా ( గుక్కపట్టి ఏడుస్తుంది ) పాపపు జీవితమని తెలిసీ తప్పులు చేసాను . ఇహలోక వాంచలకు లొంగిపోయాను . నేను ఘోర పాపిని ...ఘోర పాపిని ( దుఃఖపడి కొంతసేపటికి తేరుకుని లేచి నిలబడి దీన వదనురాలై )
అయ్యా మీ పేరు ఏంటో చెప్పనేలేదు? ( మెస్సీయ అని పేరు వినగానే ఆశ్చర్యం తో పరవశురాలై దిగ్బ్రమ చెంది స్దానువురాలై )
ఏమిటి మెస్సయ్య ! లోకరక్షణార్దం ఈ భువిలో వెలసే మెస్సియ్యె నా మీరు . మేం ఎదురు చూసే మెస్సయ్య మీరేనా ! అయ్యా నన్ను మన్నించండి!ఈ పాపిని క్షమించండి! అయ్యా మీరు నన్ను అమ్మా అని పిలుస్తున్నారా ! నేను ధన్యురాలని అయ్యా ధన్యురాలిని !
పాపపు ఊబిలో దిగజారిన నా బ్రతుకులో అశాంతి ఊపిరాడనివ్వడంలేదు .దూరంనుంచి చూసినప్పుడే అనుకున్నాను ఈ పాపపు బ్రతుకు ఇక ముగియబోతుందని. గొంగళి పురుగు లాంటి నా జీవితం మీ చల్లని మాటతో రెక్కలు తొడిగింది.....అయ్యా నా పాపపు జీవితాన్ని విడనాడి ఈనాడే రూపాంతర అనుభవం పొందుతాను . మీరు ఇస్తానన్న జీవజలం పొందుతాను . ( కంగారు నటిస్తూ కనులు తుడుచుకుంటూ )
అయ్యా ఇక్కడే ఉండండి . మీరు అస్సలు కదలోద్దు . నేను పోయి మా ఊరి వారందరికీ పాపుల రక్షకుడు వచ్చాడని చెప్పి వస్తాను. ఇక్కడే ఉండండి ....ఇక్కడే ఉండండి ( అని కూజాను విడిచి ఊరివైపు వెళుతూ .....కంగారుగా నటిస్తూ..... పరిగెడుతూ వెనక్కి వస్తూ ఏమి పాలుపోని దానివలె ఆనంద పరవశురాలై నవ్వుతూ )
మెస్సయ్య వచ్చాడని పాపాలతో కొట్టుమిట్టులాడుతున్న మా సమరయులందరికీ చెప్పాలి . అంటరానివారిగా చూడబడుతున్న మా సమరయ జనాంగాన్ని ఇంట చేర్చుకునే స్నేహితుడు వచ్చాడని చెప్పాలి మెస్సియ్య పరిశుద్దమైన మాటలు వినడానికి రమ్మని స్వయంగా పిలుస్తాను . ప్రభు రాకను ప్రకటిస్తాను . ధన్యురాలిని మెస్సియ్యా . ధన్యురాలును ఈ సమరయ స్ర్రీ ఇక నుండి పాపాలను విడిచి రక్షణ పొందిన విశ్వాసురాలని ప్రకటిస్తాను. నేను మెస్సియ్య ఇచ్చే జీవజలములు పొందానని కేకలు వేసి మరీ చెపుతాను ఊరి వారందరికీ ఈ శుభవార్త చెప్పాలి మన పాపాలను పరిహరించడానికి మెస్సియ్య వచ్చాడని తెలుపుతాను పాపపు కడవను మోసిన ఈ సమరయ స్ర్రీ తన హృదయంలో జీవజలము బావిని పొందిందని సాక్ష్యమిస్తు బ్రతుకుతాను ..... హల్లెలూయ ( సంతోషకరమైన నవ్వు ..... ఆనందబాష్పాలు ) .
సమాధాన కర్త!ఈరోజు నీవు కూడా ప్రజలందరితోను వెలివేయబడ్డావా? అందరూ నిన్ను ఎందుకూ పనికిరానివాడు/పనికిరానిది అని హేలనచేస్తున్నారా? నీవు అంటరానికులంలో పుట్టావు అని హేలనచేస్తున్నారా? నీ భర్త, నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరూ నిన్ను విడచిపోయారా? భయపడొద్దు! పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈలోకానికి వచ్చారు. ఎవరైతే పాపులో, వెలివేయబడ్డారో, అంటరానివారిగా ఎంచబడ్డారో వాళ్ళ దగ్గరికే యేసయ్య వచ్చారు. ఈలోకంలో ఘనులైన వారిని వ్యర్ధం చేయడానికి ఎన్నికలేనివారిని ఆయన ఎన్నుకొన్నారు.ఆయనకి నీవుకావాలి! ప్రయాసబడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా! నాయొద్దకు రండి అని పిలుస్తున్నారు. ఆయన వద్దకు వస్తావా? వస్తే ఆయన నీపాపాన్ని కడిగి నిన్ను శుద్ధిచేసి పరలోకవారసునిగా చేస్తారు. విలువలేని నీకు విలువ నిస్తారు. అట్టి కృప మనందరికీ కలుగును గాక!ఆమెన్!(సశేషం)
సమరయ స్త్రీ
రెండవ బాగముప్రియ సహోదరీ/సహోదరులారా! మధ్యాహ్నం ఇంచుమించు 12గంటల సమయంలో యేసుప్రభులవారు సమరయ ప్రాంతంలో సుఖారు గ్రామ పొలిమేరల్లో గల యాకోబు బావి దగ్గర అలసియున్న రీతినే కూర్చోన్నట్లు చదువుకొన్నాం. యోహాను 4: 6,7 వచనాలు. అప్పుడు సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొనుటకు రాగా యేసు- దాహమునకిమ్మని ఆమెనడిగెను.ఇక్కడ మనం చూస్తే మధ్యాహ్నం పూట ఈ సమరయస్త్రీ నీరుకోసం బావిదగ్గరకు వచ్చింది. పల్లెటూర్లలో (పూర్వకాలం) స్త్రీలు వేకువఝామున లేచి మంచినీరుకోసం బావి దగ్గరకు వెళ్ళడం సర్వసాధారణం. అయితే ఉదయం 7గంటల తర్వాత ఎవరు బావికి రారు. ఆ సమయానికి ఆ రోజుకి సరిపడే నీళ్ళు తెచ్చేసుకొని వంట కార్యక్రమాలు కొనసాగించేవారు. కాని ఇక్కడ ఈ సమరయ స్త్రీ మధ్యాహ్నం రావడానికి కారణం ఏమిటి?1.తెచ్చుకొన్న నీరు అయిపోయిందా? తర్వాత వచనాలు ప్రకారం ఎంతమాత్రము కాదు.2. Privacy కోసమా? ఒంటరితనం కోసమా? ఏమో తెలియదు. ఒకవేళ ఒంటరితనం ఆశిస్తే ఏ కారణాల వలన?3. ఆ సమయంలో ఎవరూ బావి దగ్గర ఉండరని తెలిసా? ఏం ఎందువల్ల?4. తన పాపపు జీవితం కొనసాగించడానికి అదే మంచి సమయమనా? ఏమో! మనకి తెలియదు.5. *లేక తనజీవితాన్ని ఎరిగియున్న ఊరిజనం తనని సూటిపోటి మాటలతో భాదిస్తున్నందువలన వారిని తప్పించుకోడానికి ఆ సమయంలో వచ్చిందా?* మనకి తెలియదు.పూర్వకాలంలో ఒక విషయం ఊరంతా తెలియాలంటే నీలాటిరేవు(బావి)దగ్గర చెబితే కొంతసేపటకి ఊరంతా ప్రాకిపోతుంది, ఉన్నదానికి ఇంకొంచెం కలిపి చెప్పేవారు!! ఈమె గూర్చి కూడా అలా చెప్పుకోన్నారేమో!!6. లేక ప్రజలకి తన జీవితం ఎలాంటిదో తెలియక పోయినా తన అంతరాత్మ గద్దింపుతో ప్రజలకి తన ముఖం చూపించలేక మధ్యాహ్నం వచ్చిందేమో!!ఒకవేళ ప్రియ చదువరీ! నీవుకూడా అదే పరిస్తితిలో నున్నావా? చింతపడకు! ఇలాంటి స్తితిలో నున్న ఒక స్త్రీని రక్షించడానికి యేసయ్య అలసిపోయినా సరే ఆ బావి దగ్గర ఆగి ఆస్త్రీతో మాట్లాడారు. ఈలోకంలో ఎవరికీ మనజీవిత రహష్యాలు తెలియకపోయినా నిన్ను నన్ను పుట్టించిన ఆ సృష్టికర్తకు తెలుసు.ఆ సమరయ స్త్రీ ఆ సమయంలో అక్కడకు వస్తుందని తెలిసే యేసయ్య అక్కడికి వెళ్లి రక్షణను అందించారు.నాయీను గ్రామంలో విధవరాలి ఏకైక కుమారుడు చనిపోయాడని ఎరిగి ఒక రాత్రంతా నడచి (కపెర్నహూము నుండి నాయీను కి సుమారు 32 కి.మీ.) ఉదయాన్నే ఆ గ్రామం చేరుకొని ఆ విధవరాలి కుమారున్ని బ్రతికించి ఇచ్చారు.యేసయ్యని చూడాలని ఎప్పటినుంచో ఆశిస్తున్న పొట్టి జక్కయ్య కోసం ఆ ఊరు వచ్చి మేడిచెట్టు ఎక్కి కూర్చొన్న జక్కయ్యను పేరుపెట్టి మరీ పిలచి అంటున్నారు – జక్కయా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట బసచేయవలసి ఉంది.మనం చేసే ప్రతీ ఆక్రందన ప్రతీ ప్రార్ధన ఆయనకు వినబడుతుంది. నశించినదాని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు ఈలోకానికి వచ్చెను. నశించిపోయే స్తితిలో ఉన్న సమరయ స్త్రీ ని రక్షించిన యేసయ్య, నాయీను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్య, జక్కయ్యను పలకరించి రక్షించిన యేసయ్య నిన్నుకూడా సరియైన సమయంలో దర్శించబోతున్నారు.అయితే గమనించ వలసినది ఏమిటంటే “దేవుని పని, దేవుని సమయంలో, దేవుని ప్రణాళిక ప్రకారం జరుగుతుంది.” దురదృష్టవశాత్తూ మనం అడిగిన వెంటనే పని జరిగిపోవాలి అని ఆశిస్తాము. కాని దేవుడు తన సమయంలో కార్యం చేస్తారు. మన ప్రణాళిక ప్రకారం పని జరిగితే ఆ సమస్య అప్పటికి తీరినా మరల వస్తుంది. అయితే దేవుని ప్రణాళిక ప్రకారం జరిగితే అది శాశ్వత పరిష్కారం.కాబట్టి బెదరిపోకు! అలసిపోకు! సోలసిపోకు! దేవుడు నిన్ను త్వరలో దర్శించబోతున్నారు.సమరయ స్త్రీని రక్షించడానికి మధ్యాహ్నం వేల కలసిన దేవుడు నిన్ను కూడా దర్శించబోతున్నారు.ఆమెన్!దైవాశీస్సులు!!(సశేషం)
సిద్దాంతపు వారి వంశ చరిత్ర
సిద్దాంతపు ఇంటి పేరు కలిగిన వారు .మండపేట నియోజకవర్గంలోని ప్రసిద్ద ఏడిద గ్రామ నివాసులు .వ్యవసాయకూలీలుగాను ప్రెంచి వారు దగ్గర పనివారు గాను ఉండేవారు.ప్రెంచి వారు నిర్మించే లూథరిన్ చర్చిలకు కూలీలుగ 250 సంవత్సరముల క్రితం పనిచేసారు.ప్రెంచివారు ద్వారా క్రైస్తవ మతం స్వీకరించిన తొలి క్రైస్తవ కుటుంబాలు.యానం చర్చి కూలీలుగ పనిచేసారు.బ్రిటీష్ వారు రాకకంటే ముందు వచ్చిన ప్రెంచి వారు ద్వారా క్రైస్తవ మతం స్వీకరించారు.ఏడిద సీతానగరం గ్రామంలో సిద్దాంతపు పుల్లయ్య నిర్మించిన లూథరన్ చర్చి దీనికి ప్రత్యక్ష్య సాక్ష్యం.ఇది ఈనాడు పునరుద్దరించబడింది.లూథరన్ చర్చిగానే కొనసాగుతున్నది.
1850 ప్రాంతంలొ నిజాం నవాబు సీతానగరం గ్రామంలో మాదిగ మాన్యం ఐదు ఎకారాలు ఇచ్చి గ్రామ కరణాల దగ్గర సహయకులుగ సిద్దాంతపు వారిని నియమించాడు.అలా ఏడిద సీతానగరం వలసపోయిన కుటుంబాలలో సిద్దాంతపు పుల్లయ్య ఒకడు.అతనికి ఐదుగురు కొడుకులు యేసేపు,బెంజమీను ,దేవానందం,సుందరరావు,ప్రభుదాసు, ఒక కూతురు కూతురు పేరు దీనమ్మ ( ప్రసవ సమయంలో సరైన వైద్యం లేక చనిపోయింది).ఏడిద ,దుళ్ళ అండ్రంగి,కపిలేశ్వరపురం వంటి గ్రామాలతో బందుత్వం కలిగి ఉన్నారు.సిద్దాంతపు వారి కుటుంబాలలో మొదటి విద్యావంతుడు సిద్దాంతపు దేవయ్య ( దేవానందం ) రెండవవాడు ప్రభుదాసు,మొదటి ప్రభుత్వ ఉద్యోగం పొందినవాడు సిద్దాంతపు దేవానందం.
ౌౌ
-
చరవాణి, ముఖపుస్తకం లో మునిగిపోయిన కుటుంబాలు అనుబందాలు ఆప్యాయతలుశూన్యం తనదికాని లోకాన నోరుజారి నాలిక కరుచుకున్న జీవితం ...
-
క్రైస్తవ మతాన్ని బిజెపి, ఆర్. ఎస్ .ఎస్ భారతదేశం నుండి పారద్రోలతాయనడం అనడం ఓ పెద్ద గ్లోబల్ ప్రచారం. క్రైస్తవులలో ఉన్న ఈ నమ్మకం అతి పెద్ద అప...
-
సంసోను ఆధ్యాత్మిక అంధకారం(ఏకపాత్ర) రచన : శ్రీ ఎస్.బెస్. జాన్స్ న్ స్వయంకృతం... స్వయంకృతం... నజీరు సంసోనుకు ఈ దుస్థితి స్వయంకృతం.. స్వయంకృతం...













.jpg)






