రచన రంగవల్లులు RACHANA RANGAVALLULU
JANASRI
Tuesday, January 27, 2026
Saturday, January 17, 2026
అది 1971 తారు రోడ్లు అంతగాలేని కాలం.
అమీనాబాద మా అమ్మమ్మగారి ఊరు .అమ్మ తొండంగిలో టీచరుగా పనిచేసేది.వేసవి సెలవులకు నన్ను తీసుకుని ఉప్పాడ శివారు అమీనాబాద అమ్మమ్మ ఇంటికి తీసుకు వచ్చేది. అమీనాబాద గ్రామం మొదల్లో రెండు నుయ్యిలు , రెండు దేవతల గుళ్ళు, మధ్యలో రావిచెట్టు ఉండేవి.ఎక్కడైనా మాదిగపేట ఊరు చివరన ఉంటుంది.ఇక్కడ ఊరు మొదల్లోనే ఉండేది. అందువలనేమో అమీనాబాద మాదిగపేటటంటే చుట్టు ప్రక్కల గ్రామాలకు గౌరవం ఉండేది. ఊరులోకి వెళ్ళేప్పుడు ఎడమ ప్రక్క మామిడి తోట ఉండేది. అందులో సీతాఫలం చెట్లు అక్కడక్కడ రెండు కొబ్బరిచెట్లు.జిల్లేడు, రక్కీసు,సీతమ్మోరు పొదలు,పల్లేరు పాదులు ఉండేవి.తోట మధ్యలో నీటి గుంటలు ఉండేవి. చుట్టూ అంతా ఇసకక్షక్ష
క్ష
క్ష
క్షహక్ష
ౄ కోరడి ఉండేది.దాని మీద బ్రహ్మజెమ్ముడు మట్టలు గుచ్చి ఉండేవి అవి చాలా ఎత్తుగా పెరిగేవి. వాటికి కమల పువ్వులాంటి పూలు గుత్తు గుత్తులుగా ఉండేవి. వాటి వాసన బలే గమ్మత్తుగా ఉండేది.అక్కడక్కడ కనకంబరం పొదలు కొరడి వారల్లో ఉండేవి.కుడి ప్రక్కన మాదిగపేట ఉండేది.మధ్యలో ఇసకబాట ఉండేది.మాదిగ పేటకు అమీనాబాద వాడపేటకు మద్యలో బారికి వీరన్న జామతోట ఉండేది. రాత్రి ఏడు ఎనిమిది అయ్యిందంటే మాదిగపేట దాటి వాడపేటలోని వెళ్ళడానికి బయపడేవారు.మాదిగపేటదాటి సీకోటి భూలోకు ఇంటివరకు దెయ్యాల్లాంటి తాటి చెట్లతో నిర్మానుష్యంగా బిక్కు బిక్కుమంటూ ఉండేది. కిరసనాయిలు బుడ్డీ పెట్టిన లాంతర్లు పట్టుకుని వెడితే కాని దారి కనబడేది కాదు అప్పటికి కరెంటు లేదు.ఉప్పాడలో కరెంటు స్ధంబాలు ఉన్నా 60 వాట్ల గాజు బల్బులు వెలుగుతూ ఉండేది. ఆ వెలుగు ఆ స్ధంబం కిందే ఉండేది.నేను నా వయస్సు వారైన రక్థసంబందీకుల స్నేహితులతో ఆడుకునేవాడిని. ఆ రోజుల్లో వెన్నెల పట్టపగలంత కాంతి వంతంగా ఉండేది. చందమామ వెలుగు కళ్ళల్లో జిగేలు మనేది.స్వచ్చమైన కాలుష్యం ఎరుగని వాతావరణం అది . మంచుకి వెన్నెల వెలుగుకూ చలివేసేది.దానికి తోడు పాదాలు మునిగేంత లోతైన ఇసక ఊరంతా ఉండేది.ఆ ఇసకలో పిల్లలం గూళ్ళు కట్టుకుని ఆడుకునేవాళ్ళం.ఆకలి మరచి ఆడుకునేవాళ్ళం ఊరంతా తాటాకు ఇళ్ళే ఇళ్ళమద్యన పరిగెడెతూ ఆడుకునేవాళ్ళం.ఇళ్ళమధ్య పరిగెడుతూంటే ప్రతీ ఇంటి దగ్గర కూరల పులుసుల వాసన గుమాయించేది. చేపల పులుసు, ఎండు చేపల పులుసు, ఎండుకక్కల కూర,కరుగులు సమురు వాసన ముక్కుపుటాలను అదరగొట్టేవి. ఒకొ ఇంటి దగ్గర కమ్మటి కల్లు వాసన వచ్చేది. ఆడపిల్లలు మగపిల్లలం కలసి ఆడుకునేవాళ్ళం.చాలా సేపు ఆడుకునేవాళ్ళం. నేను ఊరునుండి వచ్చేవాడిని కాబట్టి ప్రతీ కుటుంబం ప్రేమగా చూసేవారు. పెద్దవాళ్ళయితే ముద్దలు తినిపించేవారు. ఎవరో ఒకరి ఇంటి దగ్గర తినేసేవాడిని.అప్పుడప్పుడు మాదిగ మాష్టీల ఆడపిల్లల డాన్సు ప్రొగ్రాం ఉంటుండేది. హర్మోనియం, డోలుకుతో మగాడు పాట పాడుతుండే ఆడపిల్ల మోకాళ్ళు దాకా గౌను వేసుకుని బలే ఢాన్సు చేసేది.తరువాత మాదిగలు పెట్టే భోజనం తినే పోయేవారు.
నేను ఆడుకుని ఆడుకుని ఇంటికి పోయేవాడిని మా ఇల్లు పేటకు చివరన పుంతకు ఆనుకుని ఉండేది.నేను పుంతలోకి చూసేవాడిని కాదు ఎందుకంటే పుంతలో కొండికికాయల చెట్టు ఉండేది.దాని మీద దెయ్యం ఉంటుందేమోనని భయం వేసేది.వెన్నెల వెలుగుకి చెట్టు నీడతో పుంత చీకటిగా ఉండేది. ఆడవారు ఇద్దరు ముగ్గురు కలసి చెంబులు పట్టుకుని మరుగుదొడ్డిగి పుంతంటే వెళ్ళేవారు. వెడుతూ వెడుతూ బయట నులకమంచం మీద కుర్చుని తలదువ్వించుకునే మా అమ్మను పలకరించి పోతుండేవారు. రాత్రి పది దాటిందంటే ఊరంతా నిద్రలోకి జారుకునేది. రెండు నులక మంచాలు వేసి ఇంటి ముందు వాకిట్లోనే వెన్నెల చల్లదనంలో పడుకునే వాళ్ళం. దోమలు లేని కాలం అది. హాయిగా గురకపెట్టి పడుకునే కాలం. అమ్మ త్వరగానే నిద్రలోకి జారుకునేది .నేను మా అమ్మమ్మ గంగమ్మ మంచంలోకి పోయి పడుకునేవాడిని. ఎందుకంటే మా మామ్మ మంచం క్రింద వెచ్చటి కుంపటి ఉండేది .దాని వెచ్చదనం బలే ఉండేది. తొందరగా నిద్రవచ్చేది. మా మామ్మ చుట్ట కాల్చేది. ఆ లంక పొగాకు వాసన బలే మత్థుగా ఉండేది.మా మామ్మ మా అమ్మ చూడకుండా చుట్ట కాల్చమని ఇచ్చేది . నేను గబ గబా పొగలాడేవాడిని .పొగ ఎలా వదలాలో తెలియక ఉక్కరి బిక్కిరి అయ్యోవాడిని. కళ్ళవెంట నీళ్ళు వచ్చేవి. మామ్మ కంగారు పడి చేవండి చెంబుతో నీరు తాగించేది. మెల్లగా ముసుగు వేసి పడుకునే లోగా ఎక్కడి నుండో అరుస్తూ అరుస్తూ తీతుకు పిట్ట కీచుపెట్టుకుంటు ఇంటి మీద నుండి ఎగురుతూ అటూ ఇటూ తిరిగేది.దాని అరుపంటే ఆ రోజుల్లో అందరూ భయపడి చచ్చేవారు. అది ఇంటి మీదనుండి ఎగిరితే
ఆ ఇంటిలో కాని ఆ పేటలోకాని ఎవరో ఒకరు చనిపోతారని నమ్మకం. మా అమ్మమ్మ దాని అరుపు విని తుళ్ళి పడిలేచి ఆ తీతుకు పిట్టను నానా భూతులు తిట్టేది. నానా శాపనార్దాలు పెట్టేది.మా అమ్మమ్మ తిడుతుంటే దుప్పట్లో భయపడి దాకునేవాడిని. భయంతో హడలిపోయేవాడిని. నా ఇల్లే దొరికిందంటే దొంగముండా నీకు, నా మనవడు లేకలేక వస్తే మా మంచం మీద ఎగురుతున్నావు నీకు పోయేకాలం వచ్చిందంటే అని తిడితూ నన్ను ఒడిలో పొదిమికొని దుప్పటి కప్పి పడుకొబెట్టేది మా అమ్మమ్మ. ఇఫ్పుడు తీతీకు పిట్టలేదు. దాని అరుపు విందామన్నా లేదు.ఎక్కడికి పోయాయో ఎంటో .ఆ జాతి పిట్టలు అది నల్లగా ఉంటుందంట.దాని తోక పొడపుగా ఉండి చివర కత్తెరలా ఉంటుందట. దానిని కత్తిరి పిట్టఅని కూడా అనేవారు ఆ రోజుల్లో.
Thursday, January 15, 2026
దొమ్మరాట
గ్రామ పదిబొడ్డులో డప్పు, డోలు మోగుతుండగా ఈల వేస్తూ హౌరియా, హౌరియా అంటూ వేగంగా మొగ్గలు వేస్తూ వినోదాన్ని వంచే వారు పలురకాలుగా చేసే విన్యాసాలలో కూడినదే ఈ దొమ్మరాట, దొమ్మరలు ఈ దొమ్మరాటను కడతారు. సంక్రాంతి పర్వదినాలలోనూ. కోతల సమయంలోను మనకు కనిపించే ఈ కళారూపం ఆంధ్రనాట అతి ప్రాచీన కళారూపంగా దొమ్మర సాములు అని పిలవబడే బొమ్మరి కుటుంబాలలోని ఆడపడుచులు ప్రధాన ఆకర్షణ నిలిచి ఈ బొమ్మరాటను రక్తికట్టిస్తారు. మనం ఈనాడు సర్కస్ అని పిలువబడుతున్న దానికి మూలం ఈ బొమ్మరాటే అంటారు. ఇందులో సర్కస్ మనం చూసే విన్యాసాల మొగ్గలు, ఊయాలూగడం, తీగపై గెడసహాయంతో నడవడం. తీగమీద సైకిలు నడపడం, గెడను తలకిందకు పెట్టి పైర్ ఎక్కడం, బండరాళ్ళను మోచేతిలో పగలగొట్టం వంటి విన్యాసాలతో ఈ దొమ్మరాట మా సేవారిని కదలనీయకుండా చేస్తుంది.
13వ శతాబ్దంనాటి సాహిత్య చరిత్రలో తన పేరును ప్రముఖ కవులలో ఘనంగానే ఈ దొమ్మరాట రాయించుకుంది. పాల్కూరి సోమనాథుడుతన పంచదారాధ్య చరిత్రలోనూ, శ్రీనాధుడు శృంగార నైషదైరిలోను నాచన సోమన ఉత్తర హరివం శరిలోనూ, చంద్రశేఖ చరిత్ర లోను ఈ దొమ్మలాటను గురించి రాయబడింది. విజయనగర రాజుల కాలంలోనూ మహార్నవమి ఉత్సవాలలోనూ దొమ్మరి వారు క్రూరమృగాలలో వళ్ళు గగుర్పాటు చేటల్ల విద్యాసాలు ప్రదర్శించే వారని కూడా అరబుల్క్ అనే విదేశీయుడు రాసాడు.
బొమ్మరి విద్య వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. ఈ దొమ్మరి కుటుంబాలలోని వారు చిన్ననాటి నుండే ఈ విద్యలో తర్పీదు పొందుతూ ఉంటారు. దొమ్మరాట కట్టే వారు గ్రామంలోనికి పోయి గ్రాము పెద్దల అనుమతి కోరతారు. అనుమతి అభించగానే ఓ పెద్ద వెదురు గడను ఊరి మధ్య నిలబెట్టి దానిని నలువైపులావ తాళ్ళతో లాగి కడతారు. వెదురు గడ చివర ఇనుప ఊచ ఉంటుంది. అదే గెడకు దూరంగా మరో గెడను నిలిపి గెడకు ఈ గెడకు మధ్య బలమైన ఇనుప తీగను కడతారు.
బొమ్మరాటకు ముందు డప్పు, డోలు, బుల్బుల్ లేదా హార్మోనియం ఉపయోగించి హుషారెత్తించే పాటలు పాడతారు. దానికి తగ్గట్టు చిన్న పిల్లలు వాని పడుచుయువతులు రాని డాన్సు కడతారు. పడుచులు కిట్టి బస్సును చూసి యువకులు హుషారుగా ఈలలు వేస్తూ ప్రదర్శన చుట్టూ గుమిగూడతారు. మొగ్గలుతో ప్రారంభమయ్యే దొమ్మరాటకు చక్కిలి గింతలు పెట్టే వాత్యానంలో దొమ్మరాటను ఆడించే పెద్ద ఒక్కోవిన్యాసాన్ని ప్రవేశపెడతాడు. మనిషి దూరలేని గూడ్రటి ఇసుప చట్రాన్ని తీసుకుని అందులోంచి వరుసగా యువతీ యువకులు సులువుగా దూరం నుండి పరిగెత్తుకువచ్చి మొగ్గలేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
బొమ్మరి బృందంలోని బలమైన యువకుడు, ఆనచేతికి గుడ్డను చుట్టుకొని బండరాయిని ముక్కలు ముక్కలుగా చేయడం ఓ విన్యాసం. వీరి ఆటలోని ఆఖరి అంశం సాని గెడ ఎక్కడం చేతిలో దాదాపు పాతిక అడుగుల పొడవైన గెడపట్టుకుని ముందుగా అటూ ఇటూ కదలకుండా పొడవైన ఎదురు కర్రలకు బిగించిన ఇనుపతీగపై ఒదువుగా నడుస్తుంటూ చూసే ప్రక్షలు ఈలలు వేయకుండా ఉండలేరు. తీగపై ముందుకు పరిచిన యువతి మరలా అలాగే వెనక్కితిరిగి కొంత సేపు తీగపై నడుస్తుంది. ఆతరువాత మధ్యలో నిలబెట్టిన వెదరు గడను కణుపుల వద్ద కాలి వేళ్ళను నొక్కి పెట్టి నిచ్చెనొక్కి నట్లు పైకి ఎక్కి ఆస బొడ్డు దగ్గర బిగించుకున్న ఇనుప బిళ్ళలో గెడకుగల ఇనుప ఊచను ఉంచి గాలిలో పదుకుని డప్పు మోత ఉదృతంగా వినిపిస్తుంటుగా గిర్రున తిరుగుతూ సంబ్రమచ్చర్యాలకు గురి చేస్తుంది. ఒక్కొర్టు సారి ప్రేక్షలు గెడసాని కింద విడిపోతుందేమోనని బయంతో కేకలు కూడా వేస్తుంటారు.
చిన్న పిల్లలు చేసే కసరత్తులు బలే సరదా అనిపిస్తాయి. ప్రదర్శన చివరిలో చుట్టూ చేరిన వారి నుండి డబ్బు యాచిస్తారు. గ్రామంలో 3 నాలుగు ప్రదర్శనన్చి మరో గ్రామం పోతూ సంచార జీవనం గడుపుతూ ఉంటారు ఈ దొమ్మరాట ఆడేవారు. దొమ్మరాట ఆడేవారు పెద్దాపురం. రాజానగరం వంటి ప్రాంతాలలో మన జిల్లానందు నివసిస్తూ ఉన్నారు.
పిట్టల దొర
పోన్య సంబాషణా చాతుర్యంతో ఇంటిసారిని కడుపు వున్న నవ్వించే కళారూపం పిట్టలదొర జాతీయ అంతర్జాతీయ స్థానిక విశేషాలను కోడి అబద్దాలను Cలుగా మాట్లాడుతున్న వేషగానిపై ఏమాత్రం కోసం చూపించకుండా కళారూపాన్ని ప్రేక్షకులు అస్వాదించడం ఈ కూరు ఎంటోనీ ప్రత్యేకత. ఈ వేషాల్ని పగటి వేషాలలో మనం ప్రముఖంగా చూడగలం, ఈ పిట్టల దొర వేషాన్ని వివిధ ప్రాంతాలలో రకరకాలు పేర్లతో పిలుస్తారు. వైర లత్కోరుబ్ బుద్దర్ ఖాన్ ముపాచీనాయడం అని అంటారు. ఈ వేషం పగటిపూలే కడతారు. ఈ వేషం కూడా.
అనాదికాలం నుంచీ గ్రామీణులకు మత సాంఘించ విషయాలపై ఆసక్తిని కలిగించడం సత్యాలక్షవం, సామాజిక మేలుకొలుపులే ప్రధాన ఉద్దేశ్యంతో రూపొందిన సరస హాస్యపాత్రగా పిట్టలదొర వేషం మిలచబడింది. పల్లెల్లో స్వేచ్ఛగా తిరుగుతూ వినసొంపుగా అశువుగా మాటలు అల్లుకుంటూ బహు వేగంగా పదాలు దొర్తిస్తూ సమకాలీన సమాజంలోని లొసుగులను తమాషాగా వర్లిస్తూ ఈ వేషం దక్తి కట్టిస్తుంది. ఆలోచింప.
పిట్టల దొర వేషంలో గొప్పలు చెప్పకుంటూ ఉపన్యసిస్తూ అభినందనలు మాలో వారి ఈ వేషం మనిషి పేరడిని పోలి ఉంటుంది. బహుశా 1. బ్రిటీష్ వారు మనదేశంలో స్థిర పడుతున్న రోజుల్లో ఈ వేషం ప్రాచుర్యంపొంది బండవచ్చు ఖాకీ వేషధారణ, ప్యాంటు తిరుగులతో కూడిన కోటు దొవటోపి, రంగు చొక్యా టక్ చేస్తాడు. బూట్లు వేసుకుంటాడు. హిట్లరు మీసం ఉంటుంది. చేతిలో చెక్క తుపాలీ ఉంటుంది మెడలో సుమాలు కబ్బుకుంటాడు. గ్రామంలోకి రాగానే సంతోషములుముకుని ఆనందపడుతూ ఉంటారు. ముఖానికి బూడిద పులుముకుని బొగ్గుతో మీసాలు రుద్దుకుంటాడు. ఈ వేషగాడు గ్రాములలోకి రాగానే ఎక్కడ ఉన్న పిల్లలందరూ అతని చుట్టూ చేరిపోతారు అతని వెంట గ్రామమంగా తిరిగి సంబరపడుతూ ఉంటారు. పిట్టల దొర వెంటపడే కుక్కల పైన, పిల్లలపైన జోకులు వేస్తూ ఇంటింటికి తిరిగి ఘరానాగా యాచన (రాయల్ గంగ్) చేస్తాడు. ఈ దేవదు ఏ గ్రామం వెళ్లిన పిన్నలు పెద్దలు ఆసక్తికనబరచి ఆదరించేవారు. వీరిని ఆనందపరచడానికి అన సంభాషణా బాతుర్యాన్ని ఇలా వినిపిస్తూ తన కళా ప్రదర్వన మొదలెడతాడు.
గుడ్ మార్నింగ్ సాద్, అదేమిటిలా ఆశ్చర్యపోతున్నారు? నేను సాత్ పిట్టల దొరని, మా తాత గుట్టల దొర మానాన్ని తట్టల చొరనాధ్ మీ తాత దగ్గర మా తాత మూడు పూళ్ళు అప్పు తీసుకున్నాడు సార్ అది అలాగ అలాగ వెదు ఊళ్లలయ్యిందిసాద్ అరువు బరువు చేటని ఆ వెడువూరు తట్టలో పెట్టుకుని నెత్తిన మోసుకుంటూ వస్తుంటే ఇస్సాదియ్యా కాకి వచ్చి తిట్టతో సహా కాళ్లతో తన్నుకు పోయింది సార్.
అన్నట్టు మీ లాంటి గొప్పవారు అలా చేసారేమిటి సార్! మా నాయనమ్మ మూడో పెళ్ళికి రమ్మని కాకి వెంట కాడి, కాకి వెంట కారి జొప్పున వంద కాకులను పంపించానుసార్ కాకి తిరిగొచ్చిన పాపానపోలేదు సార్, మీద లేవలేక ఇక్కడే కాపురం పెట్టమని తరువాత తెలిసిందిసార్.
మీరు రాకపోయే సరికి మీ కోసం నేనే పద్దామని బయలు దేదాను సార్, ఇంతకీ నా సంగతి మీకే ముందే తెలుసుంటుంది సార్. నా పెళ్ళికి బెల్లు గంగాళంలో అన్నం పంచానుసార్, ముళ్ళలో చేసిన స్వీట్లు తిని చుట్టాలందరూ మెచ్చుకున్నారుసార్ చేస్తే పిట్టలదొర పెళ్ళిలో చేసిన స్వీటులాగే చేసుకోవాలని చుట్టు పక్కల గ్రామాల వాళ్ళందరూ తీర్మానించుకున్నారు సార్, నేను కట్టించిన సముద్రంపైన వంతెన తొలకరి కల్లులనే కొట్టుకుపోవడంతో ప్రపంమంతా నస్సు ఒక మెచ్చుకుందిసార్ నేను తప్పిన ముయ్యిలు ఎండాకాలం నిండిపోయి, స్నానాలకు పోయిన వారిళ్ళంతా మునిగిపోయిన ఆంధ్రా అంతా అల్లకల్లోలమయ్యింది. సార్. ఈ పాటికి నేను మీకు పూర్తిగా తెలుసుంటాను సార్..
మీ దగ్గరకు రావాలని విమానమీదొద్దామంటే పల్టీలు కొట్టి పడి పోయేమోనని, రైలు మీడొద్దామంటే పట్టాలు తప్పుతుందేమోనని, కారు మీదొద్దామంటే దేనికైనా గుడ్డు కుంటుందేమోనని, బండి మీదొద్ది మంటే బోల్తాపడుతుందేమోనని ఓడయితే ముగిపోతుందని ఆలోచించి ఎందుకొచ్చిన బాధని కాలినడకన ముక్కు సూటిగా బయలదేరి ముచ్చలగుంటికి దక్షిణంగా తిరిగి కాకులు దూరని కావడవి, భీమలు దూరని గండభేరుండాలు, విలుగులు, పులుగులు మద్దులు, మారేళ్ళు, వెళ్ళళ్ళు, రొయ్యల పీతలు, కెల్లల మీదుగా ఏడేడు సప్త సముద్రాలు దాటి రగదూళిగా రానే వచ్చే సానుసార్ తమ యింటికి కారి నదకన వచ్చానని చిన్న మాపు చూడకండిసార్ మాయింట్లో బొల్లంత బంగారం వుంది.సార్. మొన్న గుమ్మడి కామంత బంగారాన్ని కుక్క ముట్టిందని గోడవతల పారేసుసాద్
సార్ మీదౌత్తరని భూదేవత పందిరి, ఆకాశమంత అరుగు నేయించానుసార్, ఎన్ని వంటలు చేయించాను సార్: ఎన్ని కూరలు చేయించాననుకున్నారుసాద్, పట్ కరారు పచ్చడి, ఉమ్మెతపూల ఇగుడు, ఇటుక రాళ్ళ వేపుడు, తాలూకు రము, లారీల కొద్ది పులిహోరా, చెరువుల కొద్దీ సాంచారు. జల్లేదు. పాల పెరుగు చేయించాను సారీ సార్ ఏమాట కామట చొప్పుకోవాలి గాని సార్ చూసిన వాద్యగాని తిన్న వాళ్ళు లేమోసార్, పిట్టల దొర వేషానికి ఖచ్చితమైన సాహిత్యరచన అంటూ ఏటీలేదు. ఎవరిలోచనట్లు వారు స్క్రిప్ట్ వారే తయారుచేసుంటారు. ఉందులో కళాకారుని సమయస్ఫూర్తి కూడా ప్రతిబించి స్తూ ఉంటుంది ఈ వేషం కట్టేకళాకారుడు సమకాలీన అంశాల పైన, సామాజిక అంశాలపైన పట్టు కలిగి ఉండాలి. అప్పుడే ప్రదర్శనను రసపత్తరంగా ఇవ్వగలుగుతాడు. పిట్టల దొర వేషం కట్టిన వారిలో నుర్రా రాఘన రెడ్డి కర్నాటి లక్ష్మీనరసయ మంచి ప్రదర్శన తారులుగా మన్ననలు పొందారు. ఈ వాటికీ అనేక వేదికల పైన పిట్టల దొర ఏకపాత్రాభినయంగా వేసే కళాకారులు ప్రథమ బహుమతులు గెలుచుకోవడం మనం చూస్తూ ఉంటున్నాము. పగటివేషాల స్క్రిప్ట్ రచయితలుగా అయ్యివు వెంకటకృష్ణ రరగు తాతాచారి.. సంగారాను కోటిరెడ్డి, ఆంధ్రనాట పెరెనావన్నారు. ఈ పిట్టలు దొరకు జానపదుల్లో వేటికీ మంచి ఆదరణ ఉంది.
పండరీ భజన
మన ఆంధ్రదేశంలో ఆ మూభాగం చుట్టివచ్చినవి, అందరినీ కదిలించినవీ భజన దళాలే అంటారు. ఇవి జానపద కళారూపాలకు చెందుతాయి. అందులో పండరీభజనకు ప్రత్యేక స్థానముంది మన జిల్లాలో గొల్లల మామిడాడ చాలా ప్రసిద్ధి చెందినది శ్రీ పదాల సత్యనారాయణరెడ్డి గురువుగా పరిసరప్రాంతాలలో చాలా మంది శిష్యులను తయారు చేసారు. ప్రస్తుతం రాజుపాలెం లంకలోని శ్రీ కురుల కొండయ్య దళం. పండనీభజనలో ఆంధ్రదేశమంతటా తమ ప్రదర్శనలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
విందరీభజన మహారాష్ట్రా నుంచి వచ్చిన కళారూపం పండరి పుణ్యక్షేత్రంలోని విఠలేశ్వరునిపై భక్తితో పాడేపాటలు, నృత్యాలు, సయనానందకరంగా ఉంటాయి. ఈ బజన చేసే కళాకారులు కాషాయి వస్త్రాలు ధరించి, కాషాయ తలపాగా, మెడలో పూలదండలు, కాళ్ళకు గజ్జెలు కట్టుకొంటారు. చేతిలో పొడవైన కర్రకు రెండంచుల జెండా ఎరుపు లేదా, కషాయి రంగు, పసుపు పచ్చరంగుది ఆడతారు. భజనలో కృష్ణలీలలను గానం చేసారు.
50 మంది భోజన కారుల వరకు వలయంగా నిలబడి గురువు పాడే పాటకు అనుగుణంగా అడుగులు వేస్తు వర్తిస్తారు. 10-16 మధ్య నున్న పిల్లలు కూడా భజన బృందాలుగా ఏర్పడి భజన చేస్తారు. వీరు గురువు దగ్గర 'లయ' 'స్వర' పరిభజనంతో పాటు అవసరమైన సంగీతాన్ని అభ్యసిస్తారు. మధ్యలో గురువు పాడుతంలో హార్మోనియం, డోలక్, సంజీర, లేదా తబలా, పిల్లన గ్రోవి వంణ సహలాద్యుల సహకారంతో భజన రాత్రి 8 గంటలనుండి ప్రారంభమవుతుంది.
జెండా లేదా బెడాతే జాయేంగే పండారి జాయాగే అని పాడుతూ నృత్యం చేస్తుంటే కళాకారులు అడుగుల విన్యాసానికి అబ్బుర పడవలసిందే. ఇక ఎంత దూరమో ఎరుగామే పండారి" అనే పాటకు భజన కళాకారులు చేసే విన్యాసాలు చక్కని రసస్ఫూర్తిని కల్గిస్తూ చూపరులను పులకింపజేస్తాయి. ఈ పండరీ భజనలను దేవీ నవరాత్రులకు గణపతి నవరాత్రులకు గృహ ప్రవేశాలకు, తిరుపతి వెళ్ళే మొక్కుబడులు చెల్లించుకునే వారు ఈ ప్రదర్శనలను ఏర్పాటుచేస్తారు. పిండుదామా పిండుదామా ఆనంద గోపుపాలు పిండుదామా గోవింద గోపాల మదనగోపాలని గోవిందుడే గోపాలుడే మన ఆ కోరికను దెబ్బ కోవాలంగుడే అని బృందం చమటలు కక్కుతూ నృత్యం చేస్తుంటూ అందరు భజన తిలకిస్తూ ఆనందిస్తారు. యువజనుల శారీరక విన్యాసాలలో ప్రదర్శించే పండరీ భజన చూసి తీరవలసిందే. పెద్దాపురం మండలం చదలవాడా గ్రామం కూడా గొప్ప భజనలు చేసేది. ప్రస్తుతం వ్రేళ్ళమీద లెక్కపెట్టగలిగే ఈ పందరీభజన కళారూపం భజనలో తల మాచికమైనది.
కర్ర సాము
ప్రాచీన జానపదకళలకు చెందిన వాటిలో కొన్ని యుద్ధకళలకు చెందినవి ఉన్నాయి. వాటిలో మన ఆంధ్రదేశాన కత్తిసామూ, కర్రసాము ప్రధానమైనది. కర్రసాము ఈ నాటికి పల్లెల్లో మనకు కనిపిస్తూనే ఉంది. కర్రసామును వయస్సులో ఉన్న యువకులు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. సాయంత్రం సమయాల్లో గ్రామాలలో యువకులందరూ చేసి ఒక గురువు దగ్గర ఈ విద్యను నేర్చుకుంటారు. తన బలిష్టమైన పిడికిలితో కథ మధ్యగా పట్టుకుని గిర్రుమని తిప్పుతూ ఒక చేతి నుండి మరొక చేతిలోనికి మార్చుకుంటూ, ఒడుపు కలిగిన అడుగులు వేస్తూ కర్రసామును ప్రదర్శిస్తారు. ఈ కర్రసాము తిప్పేప్పుడు అనేక విన్యాసాలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ కర్ర సాధారణంగా మనం పొలం పనులకు పోయే రైతుల చేతులలో ఉండేది. ఈ కర్రసు బానా కర్ర అని కూడా అంటారు. ఇంచుమించు అడుగుల పొడవు ఉంటుంది.
పూర్వం రక్షణ వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందని రోజులలో గ్రామాలలోని యువకులే గ్రామరక్షణకు ఈ కర్రసాము విద్యను నేర్చుకుని రాత్రిసమయంలో గ్రామ రక్షణకు బయలు దేరేవారు. దేవాలయాలను దోపిడీ దొంగల బారి నుండి కాపాడడానికి, బందిపోటులు గ్రామంలో ప్రవేశంచకుండా వీరు కర్రసాము విద్య ద్వారా అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించేవారు. ఈ కర్ర సాము విద్య తెలిసిన వారిని పూర్వం జమిందారలు తమ ఉద్యోగస్థులుగా నియమించుకునేవారు. వీరుముష్టి వారు, హరిజనులు, నాయక తెగలకు చెందిన వారు ఈ కర్రసాము ప్రదర్శించడంలో నిష్ణాతులు.
కర్ర సామును 10 నుండి 15 మంది ప్రదర్శిస్తారు. డప్పులు, తనా వంటి వాయిద్యాలు మోగుతుండగా కర్రలను ఇడువుగా పట్టుకుని 15 మంది ఒకేసారి గిర్రున తిప్పుతారు. కొంత సేపయిన తరువాత ఒక యువకుడు రెండు చేతులలో రెండు కర్రలను మధ్యలో పట్టుకుని తన భుజబలంతో కర్ర కనబడనంత వేగంగా తిప్పుతూ ఉంటే ప్రేక్షకులు ఉద్వేగభరితులవుతారు. పూర్వం యుద్ధాలలో ఇదే విధంగా కర్ర సాము ప్రదర్శిస్తూ తిరుగుబాటు సైన్యాలను చెల్లా చెదురు చేసేవారని అంటారు. తరువాత ఇద్దరు చెరోకర్ర తీసుకుని ఒకరి తరువాత ఒకరు కర్రను జుళివుస్తుంటే మరొకరు ఒడుపుగా కాసుకుని, తిరిగి తనూ కర్రను జుళిపిస్తూ ఎదురుదాడి చేస్తాడు. ఉత్సవాల సందర్భంగాను, సంబరాలలోను ఈ కర్రసాము ప్రదర్వన ఏర్పాటు చేయడం రివాజు. ప్రధాన కూడలిలో ఊరేగింపును ఆపి ఈ ప్రదర్వన ఏర్పాటు చేస్తు ఉంటారు. కర్రసాము వ్యాయామానికి చెందిన విద్యకూడాను. ఈ విద్యను నేర్చుకున్న యువకుల చేతులు బలిష్టంగా ఉండడమే కాకుండా శరీర ఆకృతి
పగటి వేషం
నన్నెతకం నవలాదూపాలలో సగటి వేషం ఒకటి తెలుగులో వేషం వేయడమంటే పాత్రకు తగినట్లుగా అలంకరణ చేసుకోవడం నగటిపాటి నగటి పూటనే గ్రామాలలో తాము ప్రదర్శించనున్న వేషాన్ని ఎన్నుకుని అభినయించడం. ఇది ప్రాచీన కాలంలో ఎంతో ప్రజాధనం పొందిన కళ పగటి వేషాలు అనే దూటలోనే బహువచనం ఉంది. నలుగురు లేక ఐదుగురు ఒక పరాణకథను ఎన్నడ బభినయిస్తూ ఇంటి ఇంటి ముందు మూడు నాలుగు రోజుల దాకా ప్రదర్శిస్తారు ఇంటిలోని వారే వీరికి ప్రేక్షకులు.
తెలుగువాని అపూర్వ జానపద కళా సంపదలోని పగటి వేషం యొక్క అవిర్భావ కాలాన్ని నిర్ణయించే చాటి ఆధారం లభ్యం కాని పోయినా తెలుగు సాహిత్యంలో ఇది ప్రస్పుటంగా కనిపిస్తుంది. దీనికి వేముల వాడము కట్ సాక్ష్యం ఇతని కాలం క్రీ. శ 1121 ప్రాంతంగా నిర్ణయించబడింది. వేముల వాడ భీమకవి కళాంగ రాజావారి వెళ్ళాడు. కళింగ రాజు గంగుకు తను వచ్చిన సంగతి కబురంపాడు రాజు. వేముల వాడ మతని భాదను పట్టించుకోకపోవడంలో కోపోద్రేకుడైన భీమకవి కళింగ గంగును శపిస్తాడు. శాపం తగిలిన గంగుసు శత్రురాజులు దండిత్తి వచ్చి పోడిస్తారు కళింగ గంగు పారిపోయి బికారిగా తయారయ్యి వీడుల వెంట తిరుగుతూ ఓపాతర గోతిలో పడి ఏడుస్తుంటారు. ఇంతలో అలుప్రకగా పోతున్న వేముల వాడే భీమకవి కలింగ గంగు పరిస్థితి గమనించి జాలిపడి శాపతిమాచన కలిగిస్తాడు.
శాప విముకుడైన కళింగ గంగు దారినపోతున్న పగటి వేషగాళ్ల గుంపులో చేరతాడు. వారు తిన్నగా కళింగ దేశం చేరి అక్కడ పరిపాలిస్తున్న రాజు దగ్గత ప్రదర్శన ఇవ్వ గోరతారు. అక్కడి రాజు తన చేతిలో ఓడి పోయి పారిపోయిన కళింగ గంగు వేషం వేసుకుని పగటి పూట రమ్మంటాడు జగుంపులోని కళింగ గంగు తానే ఆ వేషం కట్టి పగటిపూట ప్రదర్శన యిస్తూ రాజు ముందుకు నెడతాడు. ప్రదర్వన చేస్తూ రాజును సమీపించి ఒక్క వేటున అతని శిరస్సును నరికి తిరిగి రాజవుతాడు. తెలుగు సాహిత్యంలో మొదటిగా పగటి వేషం ఇలా కనిపిస్తుంది.
ప్రాచీసతి గలిగిన జానపదకళ 20వ శతాబ్ది తొలి దశలో కూడా దేదీప్యమానంగా వెలిగింది. మైసూరు నుండి వచ్చిన తెలుగు బ్రాహ్మణుడు శ్రీ జిల్లా వరుఘుల వెంకటరామయ్య గారు తన పరివారంలో ఆంధ్రదేశం వచ్చి కృష్ణా జిల్లా వీరంకిలాకు దగ్గర హనుమంతాపురం రగ్రహారంలో అయ్యంగాళ్లు అనే పీఠాన్ని స్థాపించి పగటి వేషాలు నేర్పేవాడు. కష్టాతికష్ట మయిన విద్య ఆంధ్రదేశమందు కూచిపూడి వంశాలలో తొలుత అవతరించిందనికూడా చెప్పుకుంటారు. గోదావరి మండల యండలి కాకపుర్రు గ్రామం ఈ విద్యకు ప్రసిద్ధి చెందింది.
పగటి వేషాలు రెండు రకాలుగా కనిపిస్తాయి. 1 రామసవేషం 2 సాత్వీకవేషం ఈ వేషాలను బ్రాహ్మణులే కాకుండా యాదవులు. బంగాలవారు, విశ్వబ్రాహ్మణులు, తదితర ఇతర కులాలకు చెందిన వారు కూడా అభ్యసించి ప్రదర్శనలిస్తున్నారు. ఈపగటి వేషాలలోని ప్రక్రియ ముఖ్యంగా వేషంలో భాషలో, నడకల్లో, చేష్టల్లో లోకంలోని కొందరిని అనుకరించడం. గొప్పగా ఆరూపంలోని అతుక్కుపోవడమే ప్రత్యేకత ఆయా వేషాల ద్వారా సామాన్యులకి సంఘంలోని దురాచాల్ని గెలిగింతలు పెట్టి హాస్యంతో వ్యంగ్యంగా ఎత్తి చూపించడం యిందులోని ఉన్న మౌలిక సూత్రం వినోదం, విజ్ఞానం కలిగిన ఈ వేషాలను మగవాలేళ్ళవేస్తారు.
పగటి వేషాలు 32 వరకు ఉన్నాయి. వీనిలో బుడబుక్కలు, లంబాడీలు, చోడెమ్మలు, సోమయాజులు, సోమి వేదుల వాళ్ళు, దేవమ్మ, భద్రోజులు, గొల్లపాలుడు, మందుల వాళ్లు, సాకాని వైష్ణువులు, పిట్టలదొర, కొమ్మ దాసుడు. బారీ బైరాగి, సిద్ది కంపెనీ, అర్థవారివ్వ శక్తి బేతాళ దేవరపిట్టి మొదలైనవి సుప్రస్తి వేషాలు. ఈ పగటి వేషాల ప్రదర్శనకు సంగీతం, నృత్యం, వాచికం, ధన్యనుకరణ (మిమిక్రీ), అభినయా వంటివి. వన్నె తెచ్చే అంశాలు హార్మోనిస్ట్, వాయిద్య కారులు వారి వెంట తిరుగుతూ వాయిద్య సహకారాన్ని అందిస్తారు. గ్రామాల్లో ప్రజలతోపాటు ఆయా పాత్రలకు సంబంధించిన వారు కూడా ఆనందించి పగటి వేషాగాత్మకి కానుకలు ఇస్తారు. వారమంతా ప్రతీరోజూ వేషం గట్టి తిరిగిన ప్రదర్శనకారులు ఆఖరిరోజు ప్రతీ ఇంటికీ తిరిగి కానుకలు అర్పిస్తారు.
రాజమండ్రికి చెందిన విభూది భూనీ లింగం ఈ ప్రదర్శనల జనరజలకంగా ప్రదర్శిస్తూ ఈకళ అంతరించి పోకుండా కాపాడుతూ ఉన్నారు. ఈ కళను నమ్ముకుని రాజమండ్రి పెద్దాపురం తదితర ప్రంతాలలో కళా కారులు జీవిస్తూ ఉన్నారు, వీరు సంక్రాంతి పండగలప్పుడు, ఈ వేషాలను కడుతూ కనిపిస్తారు. నిజానికి ఒకనాడు మన పల్లె జనాలకి విజ్ఞానాన్ని అందజేసినవి చాలా వరకూ ఈ జానపద కళారూపాటే. ఇప్పుదిని ఆదరణ లేక క్షీణదశకు చేరుకున్నాయి. వీనిని పునరుద్ధరించడం అంటేమన సంస్కృతిని పునరుద్ధరించుకోవడమే దీనికి ప్రజలు. ఆయా! రంగాలలోని కళాకారులు బాధ్యత తీసి పరిరక్షించాలి. మన సంస్కృతీ చరిత్ర కోసమన్నా వీటిని విడియోలలోని, కేసెట్లలోను భద్రపరచాలి. భావితరాల వారికి కనీసం మ్యూజియం వస్తువుగా నైనా అందజేయడం మనందరి ముందున్న కర్తవ్యం.
-
చరవాణి, ముఖపుస్తకం లో మునిగిపోయిన కుటుంబాలు అనుబందాలు ఆప్యాయతలుశూన్యం తనదికాని లోకాన నోరుజారి నాలిక కరుచుకున్న జీవితం ...
-
నీలి మేఘం (జనశ్రీ) తుషార బిందువులు కవితా సంపుటి నుండి పువ్వల్లే వికసించావు నవ్వల్లే నవ్వించావు కలలల్లే కవ్వించావు పలుకరించుమా ప...
-
మల్లె పొద (జన శ్రీ) తుషార బిందువుల కవితా సంపుటి నుండి గుండె గిరులలో నీ రూపే నిండినే మనసు కోయిలై ప్రేమ కూతలు కోసనే నీ పిలుపే గిరు...


