Friday, April 19, 2024

 రాచరికపు ఆనవాలు

అందనంత అనంత లోకాలకు పోయింది

రాజకీయ ఓనమాలు

అనంతవాయువుల్లో సేదతీరుతుంధి

రావు రాజుల మీసాలు

మెలివేకుని మెలివేసుకుని అలసిపోయాయి

దవళవర్ణపు దోతీలు

బీరువాలలో దిక్కులేక దుఖిఃస్తున్నాయి

చోక్కా చాటున చిక్కాలు

రోజూ సృశించే దాతృత్వపు చేతులకోసం ఎదురుచూస్తున్నాయి

సాంగత్య సమూహాలు

బిక్కు బిక్కుమంటూ గుండెలు 

అలిసేలా రోదిస్తున్నాయి

కొత్తపల్లి రాజకీయ ప్రభలు

ఉన్నపళంగా గుప్పున ఆరిపోయాయి

పెద్దరికపు గౌరవ చిహ్నాలు

గోడల చిత్రపటాలకే పరిమితమైపోయాయి

రాజకీయ రణరంగ చతురతలు

నడిపే సారధిలేక మూలన కూలబడ్డాయి

అల్పాహార విందులు

వెన్నువిరిగి గిల గిలలాడుతున్నాయి


రాచరికపు ఆనవాలు

అందనంత అనంత లోకాలకు పోయింది

రాజకీయ ఓనమాలు

అనంతవాయువుల్లో సేదతీరుతుంధి

రావు రాజుల మీసాలు

మెలివేకుని మెలివేసుకుని అలసిపోయాయి

దవళవర్ణపు దోతీలు

బీరువాలలో దిక్కులేక దుఖిఃస్తున్నాయి

చోక్కా చాటున చిక్కాలు

రోజూ సృశించే దాతృత్వపు చేతులకోసం ఎదురుచూస్తున్నాయి

సాంగత్య సమూహాలు

బిక్కు బిక్కుమంటూ గుండెలు అలిసేలా రోదిస్తున్నాయి

కొత్తపల్లి రాజకీయ ప్రభలు

ఉన్నపళంగా గుప్పున ఆరిపోయాయి

పెద్దరికపు గౌరవ చిహ్నాలు

గోడల చిత్రపటాలకే పరిమితమైపోయాయి

రాజకీయ రణరంగ చతురతలు

నడిపే సారధిలేక మూలన కూలబడ్డాయి

అల్పాహార విందులు

వెన్నువిరిగి గిల గిలలాడుతున్నాయి



























విజయ్ సినిమా

గుండుబోయిన రఘునందనరావు  అన్నదమ్ములు అందరూ ఒకేచోట నివసిస్తున్నారు.రఘునందనరావు తన వంశీకుల పత్రాలను కాపాడుతూ ఉంటుంటాడు.సంక్రాంతి పండగకు ఇల్లంతా సందడిగా ఉంటుంది .బోగి మంటల్లో రఘునందనరావు తల్లి కాగితాలను కాలుస్తూ చలిమంట కాగుతూ  ఉండటం చూస్తాడు .గబగబా తను దాచిన పత్రాలను వెతుకుతాడు కనబడవు.తల్లి తనెంతో భద్రంగా దాచిన వాటిని మంటల పాలుచేసిదని ఆవేశంగా బోగి మంటల కట్టేలతో కొడతాడు .తల్లి భోగిమంటల్లో పడి చనిపోతుంది.ఇంతలో పత్రాలున్న తోలు సంచి తెచ్చి భార్య మంగాదేవి ఇల్లు సర్దుతూ దాచిన సంగతి చెప్పి రఘునందనరావుకు ఇస్తుంది.తను చేసిన పనికి తలబాదుకుని ఏడుస్తుంటాడు. పండగకు వచ్చిన తమ్ముళ్ళు ఆవేశం పట్టలేక రఘునందనరావుని తుపాకీతో కాల్చి చంపేస్తారు.అక్కడ ఒకరిని ఒకరు చంపుకుంటారు.ఇల్లు వల్లకాడవుతుంది. గుండుబోయినవారి ఆడవాళ్ళు పిల్లలను తీసుకుని ప్రాణాలు అరిచేత పట్టుకుని కొంతమంది తప్పించుకుని పారిపోతారు.ఇల్లు మంటల్లో తగలబడిపోతుంది.

80 సంవత్సరాల తరువాత

ఆ ఇల్లును కొంటాడు చెత్త పాతసామాన్లు వ్యాపారం చేసే హనుమంతు . ఇల్లు శుభ్రంచేస్తూ కొడుకు వీరేష్ ఓ తోలు సంచిలాంటిది చెక్కపెట్టెనుండి తీసి పాతసామాన్లు కొనే వాడికి అమ్మేస్తాడు.ఆ తోలు సంచి తిరిగి తండ్రి హనుమంతు దుకాణం చేరుతుంది.

జీవితంలో ఆటు పోట్లను తట్టుకుని విధి లీలలకు బలైన తండ్రి కొడుకులు.ఇద్దరు చెళ్ళుళ్ళు.

తండ్రి హనుమంతు పాత సామాన్ల దుకాణం నడుపుతూ పనిచేస్తూ ఉంటాడు. కొడుకు వీరేష్ బాగా చదువుకున్నా చెళ్ళిళ్ళ పెళ్ళి భాధ్యతలకు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు.ఇద్దరూ కలిసి సంపాధించిన సొమ్ముతో ఓ పాత ఇల్లు కొనుక్కుంటారు. అదే రఘునందనరావు ఇల్లు చేతులు మారి మారి హనుమంతుకు చేరుతుంది

చెళ్ళిళ్ళను కాలేజికీ దిగబెట్టి ఆటోలో కొట్టుకు పోతుంటాడు రోజూ వీరేష్. వీరేష్ బందువులందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు . హనుమంతు పరిస్దితికి బందువులు సరైన గౌరవం ఇవ్వరు.రోడ్డు పైనయితే అసలు పలుకరించరు.వేడుకలలో సరేసరి.

అవమానాలు వారికి మామూలైయ్యింది. అలవాటు చేసేసుకున్నారు.మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి కొడుకులు.వీరేష్ సరదా మనిషి, ఎంత అవమానించినా పోనీలే మన పరిస్దితి ఇంతే అనుకుని వీరికి దేవుడే బుద్ది చెపుతాడనుకునే మనిషి. ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఓ అమ్మాయిని ఇష్టపడతాడు కూడా.తనతో ఆటలు పాటలు .

ఓ సాయంత్రం వచ్చిన పాత సామాన్లు పేపరులో తోలుతో చుట్టిన పాత కాగితాల కట్ట కనిపిస్తుంది తండ్రి హనుమంతుకు. మామూలూగా చిన్నపాటి విలువైనవి ప్రక్కన పెట్టి వేరే రేటికి అమ్ముతూ ఉంటాడు హనుమంతు.అలాంటివి ఓ వీధి రౌడీ కొంటూ ఉంటాడు. అలా ప్రక్కన పెట్టిన కాగితాల కట్టను ఇంటికి తీసుకువెళతాడు. పిల్లలు నిద్రపోతున్నప్పుడు కట్టను విప్పి కాగితాలను చదువుతున్నప్పుడు ఓ విలువైన కాగితం ఆశ్చర్యపరుస్తుంది.మిగతా కాగితాలు విలువైనవిగా కనబడతాయి కూడా. అవి బద్రపరుస్తాడు. 

ఉదయం కొట్టుకెళ్ళినప్పుడు పాత సామాన్లు కొనే వీధి రౌడి దగ్గర పనిచేసే పైడిరాజు అనేవాడు నిన్న అమ్మే వాటిలో  ప్రక్కన పెట్టింది ఏమిటి వివరాలు చెప్పమంటాడు.హనుమంతు చెప్పడు .వెళ్ళి వీధి రౌడీతో చెపుతాడు పైడిరాజు. వీధి రౌడీ వచ్చి అల్లరి చేస్తాడు.ఎక్కడో ఉన్న కొడుకు వీరేష్  రౌడీలను సర్ది చెప్పి పంపిస్తాడు.తండ్రిని కారణం చెప్పమంటాడు వీరేష్ . తండ్రి చెప్పడు.

హనుమంతు రోజూ రాత్రుళ్ళు  పేపర్లు చదవడం. ఉదయమే పొరుగూర్లు పోవడం.కొట్టు పని వీరేష్ మీద పడేసి పోతుండటం చేస్తుంటాడు. వీరేష్ తండ్రి చేస్తుందేమిటో అర్దం కాక తలపీక్కుంటాడు.

సామాన్లు కోనే పైడిరాజు  కొట్టులో లేకుండా హనుమంతు రోజూ పొరుగూర్లు తిరగడం ఏదో ఉందన్న విషయం వీధి రౌడీకి చెపుతారు. వీధి రౌడీ హనుమంతుని ఫాలో అవుతాడు.అదే సమయంలో వీరేష్  తండ్రి ఎక్కడికి పోతున్నాడో తెలుసుకోవాలని వెనకే వెళతాడు.

వెంకటాపురం గ్రామంలో ఓ ఇంటి ముందు బాగా వృద్దురాలైన ఆడ మనిషితొ మాట్లాడుతూ ఉండగా వీధి రౌడీ వాహనాలతో చుట్టిముట్టి ఘర్షణ పడి హనుమంతుని ఇష్టాను సారం కొడుతుంటే మధ్యలోకి వెళ్ళి హనుమంతుని రక్షించబోతాడు వీరేష్ .ఓ రౌడీ కత్తిపుచ్చుకుని హనుమంతుని పొడి చేస్తాడు.

కంగారు పడిన వీరేష్  తండ్రిని తీసుకుని పట్నంలోని ఆసుపత్రకి తీసుకువస్తాడు. హనుమంతు కొడుకు వీరేష్ కు రహస్యం చెప్పబోయి చనిపోతాడు.

తండ్రి కర్మకాండలు పూర్తి చేసిన వీరేష్ కు హఠాత్తుగా ఒకటి గుర్తుకు వచ్చి బైకుపై కంగారుగా వెంకటాపురం వైపు పోతాడు.

అక్కడ ముసలావిడ చావు బ్రతుకుల మధ్య ఉంటుంది. ఆ ఇంటి వాళ్ళు ముసలావిడతో మాట్లాడడానికి ఒప్పుకోరు. అందులో పెద్దాయన నేను ప్రక్కన ఉంటాను మీరు అందరూ బయటకు పొండి అని తలుపు దగ్గరకు వేసి మాట్లాడమంటాడు. ముసలావిడ అతి కష్టంమీద హనుమంతు చెప్పింది చెపుతుంది. ముసలావిడ బందువు పెద్దాయన కూడా వింటాడు. అది విన్న వీరేష్ ఆఘమేఘాలమీద ఇంటికి వచ్చి చూసే సరికి రౌడీలు ఇల్లంతా చిందరవందరచేసి ఇంటికి నిప్పు పెట్టేసి పోతారు.చెళ్ళిళ్ళు ఇల్లు తగలబటం చూసి ఏడుస్తూ ఉంటారు. తగలబడే ఇంటిలోనికి వీరేష్ వెళ్ళి తండ్రి రోజూ చదివే కాగితాలున్న తోలు సంచిని వెతికి పట్టుకుని బయటకు వస్తాడు. చెళ్ళిళ్ళను తోలుసంచిని తీసుకుని  తగలబడుతున్న ఇంటిని వదిలి భారంగా పట్నం వైపు బయలుదేరతాడు.హైదరాబాదు వీరికి ఆహ్వానం పలుకుతుంది .

బిజెనెస్ మాగ్నేట్  రావు మాధవరావు బొంబాయి నగరాన్ని శాసించే సత్తా కలిగినవాడు. అతని చేయని బిజినెస్ లేదు.రాజకీయ నాయకులతో నిత్యం ఢీల్స్ చేసే వ్యక్తి.

హైదరాబాదులోని అతని కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు

 వీరేష్ .చెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తాడు. పెళ్ళిళ్ళకు రమ్మని బందువులను ఆహ్వానించినా రారు. పెదవి విరుస్తారు. పెళ్ళిళ్ళలో  రావు మాధవరావు కూతురు వీరేష్ తో టచప్ పెట్టుకుని మనసు పెంచుకుంటుంది. వీరేష్ భాధ్యతలు తీరడంతో  తండ్రి వదిలిన కార్యం పై దృష్టి పెట్టి ఫైలు తీస్తాడు.

వెంకటాపురం వెళ్ళి చనిపోయిన ముసలావిడ బందువును కలుస్తాడు. వివరాలన్నీ చెప్పి తను కూడా తీసుకువచ్చిన కాగితాలు ఆధారం చూపిస్తాడు.తను సహకరిస్తానంటాడు. అతని పేరు రామరాజు .రామరాజు వీరేష్ ని తీసుకుని వెళ్ళి తన బందువులందరినీ ఒక్కొక్కరిని పరిచయం చేస్తాడు.రామరాజుని బందువులను ఎతైన కొండ పైకి తీసుకువెళ్ళి తను చేయబోయేది చూపిస్తాడు వీరేష్ .

వీరేష్  స్నేహితుడు రాఘవ టీ కేఫ్ లో కలుస్తాడు. తనని ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. తను చేయబోయే ప్రాజెక్టులో సహకరించమని కోరతాడు. 

హీరోయిన్ తో రొమాన్సు జరుగుతుండగా

MRO గా పని చేస్తున్న మిత్రుడు కలుస్తాడు వీరేష్ కు.తన దగ్గర ఓ సమాచారముందని దానికి సహాయం చేయమని కోరతాడు. స్నేహితుడు mro  మల్లేష్  ఒప్పుకుంటాడు.

అదే రోజు సాయంత్రం వీరేష్ మల్లేష్ ఇరువురూ కలుస్తారు.

తోలు సంచి విప్పి కాగితాలు చూపిస్తాడు.

కాగితాలు చదువుతున్న మల్లేష్ కు బుర్ర తిరిగిపోతుంది.ఇది నిజమా అబద్దమా అంటూ

వీరేష్ ను నువు దాస్తుంది ఏంటో తెలుసా ఓ పెద్ద నిధి తాలూకు సమాచారం. అది విన్న వీరేష్ నిధి ఎక్కడుంది అని అడుగుతాడు. మల్లేష్ నిధి కాదు నిధి కంటే గొప్పది అని నేను ఈ పని చేయడానికి ఒప్పుకున్నాను అంటు షేక్ హేండ్ ఇస్తాడు. రేపే మన పని మొదలు పెడుతున్నామంటూ బయలు దేరతారు.

 లేండ్ లార్డ్  వేల ఎకరాలలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని స్దాపించి ప్రభుత్వాలను కనుసన్నలలో నడిపించే రావు మాధవరావు అంటే వెంకటాపురం ప్రాంతాలలో హడల్ .చోటా మోటా రౌడీలు దారి తప్పిన అధికారులు తను విసిరిపారేసే మామూళ్ళకు బానిసలు.

ఆ సామ్రాజ్యాన్ని కూల్చడానికి బయలు దేరారు. అది వీరికీ తెలియదు . మాధవరావుకు తెలియదు .మల్లేష్ వీరేష్  ముందు వారు వేసుకున్న మొదటి ప్లేన్  వీరేష్ వెంకటాపురం mro  గా బదిలీపై రావడం.దానికి వాళ్ళ మిత్రురాలు జిల్లా కలెక్టరు మౌనికా శర్మను కలుస్తారు. తను వీరేష్ ను వెంకటాపురం MRO గా నియమిస్తుంది.

వెంకటాపురం వస్తాడు వీరేష్ .వీరేష్ రావడం 

రౌడీ గ్యాంగ్ కి తెలిసి పోతుంది. రహస్యంగా వీరేష్ ఏం చేస్తున్నాడో గమనిస్తారు . రైతు రామరాజు ఇంటికి వెళ్ళి మంతనాలు చేయడం గమనిస్తారు. ఈ విషయం స్దానిక రౌడీ మూకద్వారా మినిష్టర్ వాసూరావుకు తెలుస్తుంది. అందరినీ ఓ కన్నేసి ఉంచమని చెపుతాడు.

రైతు రామరాజు వీరేష్ చాలా మంది రైతు కుటుంబాలను కలసి మంతనాలు చేస్తారు. వీరేష్ చెప్పినట్టే కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తారు.వీరేష్ పనిని మల్లేష్ కు అప్పజెప్పి హైదరాబాదు వచ్చేస్తాడు. మల్లేష్ రైతు రామరాజును తీసుకుని బయలు దేరతాడు.

రావు మాధవరావు మినిస్టర్ వాసూరావు

రోజువారి సిట్టింగ్ లో మాదవరావు వాసూరావును అడుగుతాడు వెంకటాపురంలో ఎవడికోసమో వెతకమన్నావట నాకు చెప్పకూడనిదా అంటాడు. అదేం లేదు సమయం వచ్చినప్పుడు చెపుతానంటాడు. వాసూరావు మీద చిందులేస్తాడు మాధవరావు.

హైదరాబాదు చేరుకున్న మల్లేష్ వీరేష్ ను కలసి వీరేష్ ఇచ్చిన సమాచారం మేరకు వాటి వివరాలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తాడు. నీ దగ్గర ఉన్న ఆధారంతో మొత్తం రికవరీ చేసుకునే వీలుంది అంటాడు.

వీరేష్ , Mro ,  రైతు రామరాజు మాధవరావు పొలాలలోనికి పోయి మాట్లాడు కోవడం  ఈ విషయం మాధవరావుకు తెలుస్తుంది



 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...