Monday, November 30, 2020

కైఫియ్యత్తుల్లో తొండంగి మండలం


 కైఫియ్యత్తుల్లో తొండంగి మండలం




వ్యాసకర్త

సిద్దాంతపు బెన్ జాన్ సన్ 

బాలసాహితీ రచయిత

9908953245


జిల్లాలోనే సువిశాలతీరప్రాంతం కలిగిన మండలం తొండంగి మండలం ప్రత్యేకత కలిగి ఉంది. తీరప్రాంతం చోడిపల్లిపేట మొదలు /. యాదవులు,మత్య్సకారులు నివశిస్తా ఉన్నారు.1785 లో మెకంజీ సేకరించిన కైఫియ్యత్తుల్లో ఈ తీరప్రాంతం గురించి వివరంగా ఉంది. కాకినాడకు చెందిన బల్లోజి బాబా రాసిన తూర్పుగోదావరి కైఫియ్యత్తుల్లో 

ఒక కైఫియత్తు అంతా దీనిగురించే ఉంది. బల్లోజిబాబా చరితార్దుడు అనడంలో సందేహం లేదు. 

1814 లో రాజమహేంద్రవరం జిల్లాగా ఉండే సమయంలో పిఠాపురం తాలుకాలో కోన అడవి గురించిన ప్రస్ధావన సంబరం కలిగిస్తుంది. ఇప్పటి రెవెన్యూ రికార్డుల్లో కూడా కోనఫారెస్టు అనే పిలుస్తున్నారు కూడా.ఈ కోనఫారెస్టు తూర్పున సముద్రం,పడమర పొన్నాడ, ఉత్తరంలో తొండంగి,వేమయి ( వేమవరం) గ్రామాలు ఉండేవి.ఈ కోన అడవిలో తిరిగే ఎడ్లు మామూలు ఎడ్లుకంటే బలిష్టంగా ఉండే కొమ్ములు తిన్నగా వంకరలేకుండా ఉండేవి. చప్పుడైతే చెంగు చెంగున పరుగులు తీస్తూ ఉండేవి. ఈ ఎడ్లు పగలు అడవిలో మేసి(గడ్డిపేట) రాత్రులు సముద్రపు కెరటాలు తగిలేలా పడుకుని సేదతీరుతూ ఉండేవి. వీటిని వేటాడం ఓ వినోదంగా ఉండేది. పిఠాపురం, పెద్దాపురం, కాకినాడు, కపిలేశ్వరపురం జమిందారులు, ఫ్రెంచి,బ్రిటీషు కలెక్టర్లు తుపాకీలతో వేటాడేవారు. ఈ అడవిలో పుశిణిగ,దొర్నిగ,గొల్లు లాంటి గుబురు చెట్లు, కుంకుడు చెట్లు( పాత పెరుమళ్ళపురం ప్రాంతంలో చూడవచ్చు) పాలచెట్లు ఉండేవి.

చిన్ని చెట్లు అని పొదలు ఉండేవి. పాలచెట్లు చాలా పొడవుగా వుండేవి. పాలచెట్ల తొర్రలు మనిషి కూర్చునేంత ఉండేవి.ఆ రోజుల్లో ఈ పాలచెట్లు నరికి రైతులు తూములుగా చేసి వ్యవసాయం చేసుకునేవారు. ఈ అడవి అంతా పిఠాపురం జంమిందారు ఏలుబడిలో వుండేది. తేనెపట్లు అధికంగా ఉండేవి.అడవిలోకి వెళ్ళడానికి బయపడేవారు. తేనెటీగల ఝంకారంచేస్తూ గుంపులు గుంపులుగా అడవి అంతా పెద్ద శబ్దం చేస్తూ ముసురుతూ వుండేవి.

            చిన్నపూలచెట్లు పూలు బలే గమ్మతైన పూలు మంచి సువాసన భరితమైన పూలు. తేనెటీగలు ఈ పూలనుండి వరి చేల పువ్వారు నుండి తేనె సేకరించి పాలచెట్లతొర్రల్లో తేనెతుట్టలను పెట్టేవి. అడవి అంతా తేనె తుట్టలే . ఈ తేనె సువాసన భరితమై మహా రుచిగా ఉండేది.ఈ చిన్నపూల చెట్లతేనె నవంబరు మాసంలో దొరికేది. పిఠాపురం జమిందారులు  తేనె సేకరించేవారిని మకాం పెట్టించి తేనె పట్టుకెళ్ళేవారు. అయితే ఈ తేనె ఇప్పటి తేనెలా ఉండేది కాదు దీపావళి సామానుల్లో కలిపే సూరేకారంలా ఉండేది. పలుకులు పలుకులుగా ఉండేది. జమిందారులు మహా ఇష్టంగా తినేవారు. 

    తొండంగి, వేమవరం, పొన్నాడ పరిసరాల్లో వరి బాగా పండేది.  ఆ రోజుల్లో తొండంగి నువ్వుల పంటకు ప్రసిద్ది చెందింది. దేశం నలు మూలలనుండి నువ్వుల కొనుగోలుకు వ్యాపారులు వచ్చేవారు.కోనఫారెస్టులో ఇండ్లకు ఉపయోగించే కలపదొరికేది కాదు. చింతచెట్లు ( చింతకాయలపేట పేరు అందుకే వచ్చి ఉండవచ్చు ), వేపచెట్లు,తుమ్మచెట్లు,అడవి ఎద్దులు,గుబురుగా ఉన్న ముళ్ళపొదలు,తుప్ప అడవి విస్తారంగా ఉండేవి. ఈ వివరాలన్నీ బల్లోజి బాబా రాసిన మెకంజీ తూర్పుగోదావరి కైఫియ్యత్తుల్లో దొరుకుతున్నాయి.ఇలాంటి మంచి పుస్తకాలను అందరూ చదవాలి ఆదరించాలి. పాఠశాలల లైబ్రరీలలో తప్పక ఉంచవలసిన పుస్తకం.


తీర గ్రామాలు ఎప్పుడు వచ్చాయి?

మెకంజీ 1814—1815 ఈ కైఫియ్యత్తులు సేకరించాడు. అప్పటికి ఇవి ఓ పదేళ్ళు వెనక రాసి ఉండవచ్చు. అంటే 1800 సంవత్సరానికి కోనప్రాంతం అడవిగానే ఉంది. సువిశాలమైన భూభాగం ,తీరప్రాతం ఉండటంతో దేశంలోని మత్య్సకారుల దృష్టి ఈ ప్రాంతం పై పడింది. ఆ క్రమంలో మెల్లగా వలసలు బర్మా, ఒరిస్సా,పూరి,మచిలీపట్నం,యానం,పాండిచ్చేరి,తమిళనాడు, ఇలా తీరప్రాంతాలనుండి వలసలు పెరిగాయి. మెల్లగా 1850  తరువాత మనం చూస్తున్న గ్రామాలుగా ఏర్పడ్డాయనుకోవచ్చు. ఎడ్లు లెక్కకు మిక్కిలి సహజంగా దొరుకుతున్నాయి కాబట్టి యాదవులు వచ్చి చేరి ఉండవచ్చు. అందుకే ఇక్కడ ఆవులమంద,గడ్డిపేట లాంటి గ్రామాలు ఏర్పడ్డాయనుకోవచ్చు.



 


కైఫియ్యత్తులో కొత్తపల్లి మండలం*


 *కైఫియ్యత్తులో కొత్తపల్లి మండలం*

వ్యాసకర్త

సిద్దాంతపు బెన్ జాన్ సన్ (జనశ్రీ)

ఆంగ్ల ఉపాధ్యాయులు

బాల సాహితీ రచయిత


  తన నివసిస్తున్న చోటు ఏ నాటిదో తెలుసుకోవాలనే కుతూహలం ప్రతీ ఒక్కరికీ వెంటాడుతూ ఉంటుంది.తాతముత్తాతల గురించి వింటేనే మనసు పులకరిస్తుంది.ఓ ఉద్వేగం ముసుకుంటుంది. దాని ఆత్మీయత బావన స్పర్శ దేనికీ సాటిరాదు మరి.కొత్తపల్లి మండలం వేల సంవత్సరాల నాటిదే అంటే ఓ క్షణం దిగ్బ్రమ కలగకమానదు. కాని కొంత మంది అవును అంటారు కాని ఏమీ చెప్పలేరు. అయితే మన పూర్వీకులు ఎంత గొప్పవారంటే తాటాకుల పత్రాలలోను, రాగిరేకుల్లో, శాసనాలలోను స్ధానిక చరిత్రలు రాసుకునేవారు. వాటిని దండకవిలెలు అనేవారు. వీటికి విలువ వుండేది కాదు. ఆనాటి సంస్కృతాంధ్ర కవితాఘోషలో వీటి శబ్దం అస్సలు వినిపించేది కాదు. అయినా కరణాలు, జమిందారులు వారి వంశ చరిత్రకోసం రాయించుకునేవారు. అయితే అవి కొంత కాలానికి కనుమరుగయ్యేవి. అవ్వవా  మరి గ్రంధాలయాలు ఉన్నాయా ఏమిటి ఆరోజుల్లో  అయితే ఓ మహానుబావుడుకి ఆ విలువ తెలిసింది అవి అపురూపమనిపించింది. అంతే తన జీతభత్యాలు త్యాగంచేసి వీటిని సేకరించాడు. మామూలుగా కాదు ప్రపంచంలో  ఇప్పటి వరకూ మానవమాత్రుడు ఎవరూ  చేయనంత సేకరణ. ఇప్పటికీ కొన్ని వేల సేకరణలు అలాగే వున్నాయి. పరిశోధకులు నిత్యం పనిచేస్తున్నా తరగడం లేదు. ఆయన ఎవరో కాదు మెకంజీ .స్కాట్లాండు దేశస్దుడు. 1783లో సర్వేయరుగా భారతదేశం వచ్చాడు. ఆయనికి ఈ దండకవిలెలు ఆశ్చర్యమనిపించింది. వీటి సేకరణకు ముందు బ్రిటీష్ వారు నిదులిచ్చినా  ఆ తరువాత ఆపేశారు. సమకాలీకులు పనికిరాని వస్తు సేకరణ అన్నారు. అయితేనో బుర్రయ్య అనే బహుబాషా కోవిదుడిని ప్రక్కన పెట్టుకుని ఊరూర పంపించి సేకరించాడు. ఈదండకవిలలనే  మహ్మదీయులు ఆ తరువాత కఫీయ్యత్తులుగా పిలిచేవారు. ఇది ఉర్దూ పదం నుండి వచ్చింది. కఫియ్యత్ అంటే సంగతులు, విశేషాలు అని అర్దం  వీటికి ఆ పేరే వాడుకలో ఉండి పోయింది.

      మెకంజీ 1784—1790 ప్రాంతంలో రాయలసీమలో ఉన్నాడు. అక్కడ నుండే కఫియ్యత్తులు సేకరించాడు.వాటిలో తూర్పుగోదావరివి 10 ఉన్నాయి. 

వీటిని 600 సంవత్సరంలో కొంకిపర్రు అని,1700 సంవత్సరంలో కాకినాడు అని ఇప్పుడు కాకినాడ  అని పిలిచే కాకినాడలో ఉండే మహానుబావుడు బల్లోజి బాబా వెలుగులోకి తెచ్చాడు.తూర్పుగోదావరి కఫియ్యత్తులు పిఠాపురం,పెద్దాపురం,కాకినాడ పరిసర ప్రాంత గ్రామాల చరిత్రలను జమిందారుల చరిత్రలు  తెలుపుతుంది. ఇందులో కొత్తపల్లి గ్రామం గురించి పెద్దగా తెలియకపోయినా మండలానికి సంబందించి ఓ స్పష్టత మరి కొంత సమాచారం దొరకడం నిజంగా కొత్తపల్లి వాసులం అందరం మెకంజీ మహాశయునికి ఋణపడి వున్నాం.  


         మనం త్రిలింగదేశం మధ్యలో ఉండే ఆంధ్ర ప్రాంతవాసులం.ఈ ప్రాంతం ప్రొలునాడు(పిఠాపురం,గొల్లప్రొలు,ప్రత్తిపాడు,తుని, పెద్దాపురం)  కిమ్మూరులోపరగణాలో ఇసుకపల్లి కొత్తపల్లి.చెల్లూరు పరగాణాలో పొన్నాడ, కొమరిగిరి ఉండేవి. 

     అంతకుముందు చూసుకుంటే1087నుండి 1093 వీరచోడుడు పరిపాలనలో వేంగీరాజ్యంలో ( శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం) మనం ఎక్కువగా పరిపాలించబడ్డాం. 

1182 నాటికే సంపర పేరు కనబడుతుంది. పిఠాపురం కుంతీమాదవస్వామి ఆలయంలోని శాసనంలో 1187 లో నవఖండ్రవాడ,కొండెవరం గ్రామాలను ఏర్పరచి కుంతీ మాధవస్వామికి దానంగా ఇచ్చినట్టుఉంది. బహుశా ఇవి ప్రొలునాడుకు దగ్గరగా ఉండటం వలన కాబోలు.అయితే పూర్వం సంపర నియోకవర్గం అక్కడ కొంత ఇక్కడ కొంత ఎలా ఉండేదో పూర్వం కొత్తపల్లి మండలం కూడా అలాగే వున్నట్టు కనబడుతుంది. ఇసుకపల్లి పూర్తిగా వేరే పరగణాలో ఉండేది. ఉప్పాడ గ్రామం గురించి ఆఖరున తెలుసుకుందాం.


కొమరిగిరి

   1353 లో వేమారెడ్డి తరువాత పెద వెంకప్ప జమిందారీ ఏలుబడిలో కొవ్వాడ ,కొత్తపల్లి,  పొన్నాడ ఉన్నాయి. పెద వెంకప్ప తరువాత విస్సామ అనే మహిళ పరిపాలించింది.1399 లో కొమరగిరికి చెందిన గోగ్గయ రాజు పిఠాపురం కుంతీమాదవస్వామికి బృందావనం చేయించి ఇచ్చాడు. వేంగీరాజ్య పాలకుడు రెడ్డిపరిపాలకుడు కాటమవేమారెడ్డి అతని కుమారుడు కుమారగిరి రెడ్డి పేరు మీద కొమరగిరి 1422 లో ఏర్పడింది. చెల్లూరు పరగణాలో ఉన్న కొమరగిరిని కూమారగిరిరెడ్డి విష్ణుభట్టారకుడు అనే బ్రాహ్మణుడికి కరణీకంగా ఇచ్చాడు.అతను అగ్రహారం కట్టించాడు. ఓ ఐదు బ్రాహ్మణ కుటుంబాలు శొంటివారు,ఆదిరాజు వారు ,వెదురూరు వారు,కంభంపాటి వారు ఉండేవారు. కొండెవరంలో కొంత భూమిని దానం చేసి తామ్రపత్రాలు రాసి వంశపారంపర్య హక్కులిచ్చాడు. ఆంధ్రాకు బ్రాహ్మణులు తమిళనాడు నుండి ఎక్కువగా వచ్చారు. వంద సంవత్సరాల తరువాత అగ్రహారం అగ్నికి ఆహుతి అయ్యింది.మద్దాల అప్పలరాజు అనే ఆయన మరలా ఇళ్ళుకట్టించాడు.కొమరగిరికి ఉత్తరాన చెరువు తవ్వించాడు. దక్షిణం వైపు తమ్మవరం కూడా ఆనాటి నుండి ఉంది. తమ్మసాని ఉండేది మేడలో అందుకే తమ్మవరం అని పేరు వచ్చింది.కొమరగిరి మాదన్న అనే వెలమవారు విష్ణుఆలయాన్ని కట్టించాడు. కొమరగిరిలో మల్యాల వెంకట్రావు ఒక శివాలయం కట్టించాడు.అరవైపుట్ల భూమి కేటాయించి ఉత్సవాలు చేసేవాడు.కొమరగిరిని కుమారగిరిరెడ్డి 14 సంవత్సరాలు పరిపాలించాడు.ఒకప్పుడు మండలానికి తలమానికమై భాసిల్లన గ్రామం మండలం మూలలో నిశ్శబ్దంగా మనుగడ సాగించడం కాలం మార్పుగా భావించవచ్చు. ఈ కఫీయ్యత్తును  చెల్లూరు కరణం శీతన్న రాయిస్తే వెంకటశాస్త్రి రాసినట్లుంది.

నిస్సంకుల నాయన


కపిలేశ్వరపురం రాజు దేవుమహారాజు అనుగ్రహంతో నిస్సంకులనాయన అనే బ్రాహ్మణుడు పొన్నాడ,ఇసుకపల్లి కలిపి 21 గ్రామాలు కరణీకం రాయించుకున్నాడు. అతని దగ్గర గుమాస్తాలుగా పనిచే ముగ్గురు గుమాస్తాలు వడ్డావు మారకొండయ్య,నండూరి తిమ్మరాజు,తోలేటి వీర్రాజు, మోసంచేసి రాజమండ్రికి చెందిన కాటంపల్లి వీరయ్య తో చేతులుకలిపి 21 గ్రామాలను నిస్సంకుల నాయన నుంచి లాక్కుని పంచుకుంటారు. పంపకంలో 1573 లో అయ్యపటనేని మార్కండ్రాజు పొన్నాడకు కరణీకం రాయించుకున్నాడు.

1671—79 లో పిఠాపురం జంమిందారు తెలుగు రాయినంగారు

ప్రోలునాడు పరిపాలిస్తున్నపు అతని ఆఖరి కొడుకు రంగసాయి గొల్కొండ నవాబు దగ్గర సేనాపతిగా ఉండేవాడు. మంచి చదరంగం ఆటగాడు. ఒకరోజు ఆటలో నవాబు అబ్దుల్ హుస్సేన్ ఓడిపోతే రంగసాయి కత్తితో పొడుకుని స్వామి భక్తిని ప్రదర్శిస్తాడు.హుస్సేన్ రంగసాయి ప్రేమకు ముగ్దుడై అతని అన్నలు రావుచందర్రావు,రావు జగ్గారావు ప్రొలునాడు అప్పగిస్తూ పిఠాపురం కోటను ఇస్తాడు. వీరి హయాంలోనే ఏలేరు నదీ నీళ్ళు కిమ్మూరులో పరగణాలో ఉన్న కొత్తపల్లి, ఇసుకపల్లికి ప్రొలునాడు( పిఠాపురం,గొల్లప్రొలు,ప్రత్తిపాడు) మండలాలకు పంచారు. ఆనాటి నుండి మనం ఏలేరు నీళ్ళు సాగుకు ఉపయోగిస్తున్నాం.


కొత్తపల్లి గ్రామం


కొత్తపల్లి గ్రామం కాకినాడ డివిజన్ లో ఎలా అయితే ఉందో ఆశ్చర్యంగా 1080ఆనాటి నుండి కొంకిపర్రు(కాకినాడ), 1420 చెల్లూరు పరిగణాలోను ఉంటూ వస్తుంది. గజపతులు బెజవాడలో రావు వంశీకులను గానుగ ఆడించి చంపడంతో  పిఠాపురం,పెద్దాపురం సంస్దానాలకు వచ్చేస్తారు.  వీరి చరిత్రను పిఠాపురం పెద్దాపురం, చిత్రాడ  రావు వంశీకుల క్రమాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. అయితే కొత్తపల్లి వేయి సంవత్సరాల నుండి ఉన్నా వేంగీ పరిపాలనలోనే ఉంది. ఇక పిఠాపురం పెద మహీపతిరావు పెద్దాపురం వత్సవాయిని ఆడపిల్లలకు కట్నకానుకలుగా కోరడంతో బహుశా కొత్తపల్లిని పెద్దాపురం వత్సవాయి ఇచ్చి ఉండవచ్చు అక్కడ నుండి కొన్ని రావు వారి కుటుంబాలు కొండెవరం, కొమరగిరి, కొత్తపల్లికి17 వ శతాబ్దం మొదటిలో తరలి వచ్చాయి. వీరి రాకతో కొండెవరం పిఠాపురం సంస్దానానికి దగ్గరగా ఉండటంతో కొండెవరం ఒ వెలుగు వెలిగింది. అది చెలికాని రామారావు వరకూ సాగింది.క్రమంగా అక్కడ ప్రభావం చూపేవారు తగ్గిపోవడంతో కొత్తపల్లి 1900 దశకంలో వెలుగులోకి వచ్చింది. ఇసుకపల్లి, పొన్నాడ, కొమరగిరి మెల్లగా ప్రాభవం కోల్పొయాయి. వీరి వంశీకుల చరిత్ర పిఠాపురం, పెద్దాపురం రావు వారి క్రమాన్ని చూస్తే తెలుస్తుంది.

ఉప్పాడ గ్రామం

ఇది కైఫియ్యత్తులో ఎక్కడా కనబడదు. సముద్రతీర ప్రాంతమైన కొమరగిరి అనే కనబడుతుంది.అయితే కైఫియతుల ప్రకారం

కొత్తపల్లి తరువాత సముద్రపు తీర ప్రాంతం వరకు దట్టమైన కీకారణ్యం అని చెప్పబడింది.

ఇది 1700 వరకు కీకారణ్యంగానే ఉంది. పిఠాపురం జంమిందారు ,కలెక్టర్లు తుపాకీతో వేటకు వచ్చేవారని చినపువ్వు తెనే కైఫియత్తులో తెలుస్తుంది. కోన ఫారెస్టు అంటే ఉప్పాడ మొదలు వేమవరం వరకూ అతి భయంకరమైన కీకారణ్యం అని చెప్పబడింది. 17 వ శతాబ్దం చివరలో గ్రామం ఏర్పడినట్లుంది నిర్దారించవచ్చు. బ్రాహ్మణులు కొత్తపల్లి నందు ఆయుర్వేద వైద్యం చేస్తుండేవారు వారిలో పాలంకి వారు ఆయుర్వేదం, సన్నిది రాజు

 వారు పౌరహిత్యం చేస్తూ ఉప్పాడలో స్ధిరపడి వుండవచ్చు. వీరితొ పాటే గ్రామం అభివృద్ది చెంది వుండవచ్చు. ఎందుకంటే 17 వ శతాబ్దం చివరలో సన్నిదిరాజు జగ్గకవి రచించిన కురవంజీ అనే తిన్నడు కధను స్వయంగా రాసి వీధి నాటకంగా ప్రదర్శింపచేసేవాడు. వీరి వంశీకులు ఇప్పటికీ పౌరహిత్యం చేస్తున్నారు.ఇక మత్య్సకారులు 1700 శతాబ్దంలో నుండి పూరి, మచిలీపట్నం, బర్మా,ఒరిస్సా,విశాఖ ప్రాంతాలనుండి వలసలు వస్తూ కొనఫారెస్టు వెంబడి స్దిర నివాసం ఏర్పరచుకున్నట్టు ఖాయంగా కనబడుతుంది.


కృతఙ్ఞతలు

బల్లోజు

తూర్పుగోదావరి జిల్లా

కైఫియ్యత్తులు నుండి




 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...