Monday, August 15, 2022

జెండా పరిణామక్రమం

 


భారత రాజ్యాంగ సభ 1947 జూలై, 22న స్వరాజ్ పతాకాన్ని భారత జాతీయ పతాకంగా స్వీకరించింది. అయితే చిన్న మార్పు చేసింది. మధ్యలో తెలుపు రంగులో చరఖా స్థానంలో అశోకుడు ధర్మ చక్రాన్ని గ్రహించారు.

జెండా పరిణామ క్రమం ఇదీ.


మొదటి జెండా: -

1960 ఆగస్టు 7న కలకత్తా నగరం పార్సీ బగాన్ లో ఎగరవేశారు. ఈ పతాకంలో పైనుంచి కిందికి ఆకుపచ్చ, పసుపుపచ్చ, ఎరుపు పార్టీలు ఉండేవి. ఆకుపచ్చ పట్టీలో 8 రాష్ట్రాలకు గుర్తుగా 8 కమలం పూలు, పసుపు పచ్చ పట్టీలో "బందే వందేమాతరం" అని ఉండేవి. ఎరుపు రంగు పట్టీలో ఎడమ వైపు చంద్రుడు, కుడి వైపు సూర్యుడిని ఉంచారు.


భికాజీ కామా పతాకం: -

1907లో మొదటి దానికి కొంచెం మార్పులు చేసి భికాజీ కామా రెండో జెండా రూపొందించాడు. దీనిని అదే సంవత్సరం పారిస్ లో భారతీయ విప్లవకారుల మధ్య ఎగురవేశారు. పై పట్టిలో ఎనిమిదికి బదులుగా ఏడు కమలం పూలు, ఎరుపు స్థానంలో కషాయాన్ని ఉపయోగించారు. పైనుంచి కిందికి కాషాయం, పసుపుపచ్చ, ఆకుపచ్చ రంగులు వరుసగా ఉంటాయి.


హోమ్ రూల్ పతాకం: -

హోమ్ రూల్ ఉద్యమంలో భాగంగా అనిబిసెంట్, లోకమాన్య తిలక్ కొత్త జెండా రూపొందించారు. ఇందులో ఒక రంగు తర్వాత మరో రంగు వచ్చే ఐదు ఎరుపు, నాలుగు ఆకుపచ్చ పట్టిలను కలిగి ఉన్నాయి. వీటిపై సప్తరుషులకు గుర్తుగా ఏడు నక్షత్రాలు ఉండేవి. పైభాగంలో ఓ మూలన చంద్రరేఖ, మరో మూలాన యూనియన్ జాక్( బ్రిటిష్ ఇండియా పతాకం) ఉండేవి.


గాంధీజీ త్రివర్ణ పతాకం: -

1921లో మధ్యలో చరఖా గుర్తుతో త్రివర్ణ పతాకాన్ని గాంధీజీ ప్రతిపాదించాడు. ఇందులో వర్ణాలు ప్రధాన మతాలకు ప్రతీకలుగా ఉండాలనుకున్నాడు. తర్వాత రంగులు లౌకికవాదం ప్రతిబింబించేలా ఉండాలని భావించాడు. ఈ పతాకంలో దిగువన ఉన్న ఎరుపు త్యాగాన్ని, మధ్యలో ఉన్న ఆకుపచ్చ ఆశను, పైన ఉన్న తెలుపు శాంతికి ప్రతీకలు.


పింగళి వెంకయ్య పతాకం: -

ప్రస్తుత పతాకానికి చాలా దగ్గరగా ఉన్నది 1923లో ఉనికిలోకి వచ్చింది. దానిని తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించాడు. ఇందులో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. తెలుగు భాగంలో చరఖా ఉండేది. దీనిని 1923 ఏప్రిల్ 13న నాగపూర్ లో ఎగరవేశారు. దీనికి స్వరాజ్ పతాకం అని పేరు పెట్టారు.






భారత జాతీయ పతాకం అన్నది దీర్ఘ చతురస్రాకారంలో కాషాయం, తెలుపు, పచ్చ రంగులు సమ నిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో 24 ఆకులు కలిగిన నేవీ బ్లూ రంగులో ఉండే చక్రమైన అశోక చక్రంతో ఉంటుంది. 1947 జూలై 22న భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ప్రస్తుతం ఉన్న రూపంలో ఆమోదం పొంది, 1947 ఆగస్టు 15న భారత డొమినియన్‌కు అధికారిక పతాకంగా ఆమోదం పొందింది. తర్వాత క్రమేపీ భారత గణతంత్రానికి అధికారిక పతాకంగా స్వీకరించారు. భారతదేశంలో తిరంగా (హిందీ: तिरंगा) లేక ట్రైకలర్ (English: Tri-color) అన్న పదాలు భారత జాతీయ పతాకాన్ని సూచిస్తాయి. పింగళి వెంకయ్య రూపకల్పన చేయగా[N 1] 1923లో మొదట ఎగిరిన స్వరాజ్ పతాకం అని పేరున్న భారత జాతీయ కాంగ్రెస్ పతాకం భారత జాతీయ పతాకానికి ఆధారం.
చట్టప్రకారం జెండా ఖద్దరుతో తయారుచేయాలి. జాతీయోద్యమానికి, స్వరాజ్య పోరాటానికి సంకేతంగా మహాత్మా గాంధీ ఖద్దరును ఉపయోగించడం దీనికి కారణం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ పతాకాన్ని తయారుచేయాల్సిన పద్ధతిని, ప్రత్యేక లక్షణాలను నిర్దేశించింది. పతాకాన్ని తయారుచేయడానికి ఖాదీ అభివృద్ధి, గ్రామీణ పరిశ్రమల కమీషన్‌కే హక్కు ఉంది. ఈ కమీషన్‌ ఇతర స్థానిక గ్రూపులకు తయారీ అప్పగించిస్తుంది. 2009 నాటికి పతాకం ఏకైక తయారీదారుగా కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘం ఉంది.

భారత జెండా కోడ్‌, జాతీయ చిహ్నాలకు సంబంధించిన ఇతర చట్టాలు జెండా వాడుకకు వర్తిస్తాయి. మొదట్లో ఈ కోడ్ భారత స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ దినోత్సవాల సందర్భంగా తప్ప మిగతా రోజుల్లో సాధారణ పౌరులు జెండాను వాడడం నిషేధించింది. 2002లో నవీన్ జిందాల్ అభ్యర్థన పరిశీలిస్తూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సాధారణ పౌరులు జెండాను వాడుకునేందుకు వీలుగా కోడ్‌ను సవరించమని భారత ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. దాన్ని అనుసరించి భారతీయ కేంద్ర మంత్రివర్గం కోడ్‌ను పరిమితంగా వాడేందుకు సాధారణ పౌరులకు వీలునిస్తూ సవరించింది. 2005లో మరోసారి కోడ్‌ను సవరించి కొన్ని రకాల దుస్తుల మీద ఉపయోగించడం సహా మరికొన్ని అదనపు వాడుకలను అనుమతించారు. జెండాను ఎగురవేయడం, ఇతర జాతీయ, సాధారణ జెండాలతో కలిపి భారత జాతీయ పతాకాన్ని వాడేప్పుడు అనుసరించాల్సిన విధానాలకు ఆ కోడ్ వర్తిస్తుంది.




No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...