Wednesday, August 19, 2020

రమ్య కథ

       

                   ఓ  రమ్య కథ

              (దివ్యాంగుల కథ)



      వేసవి సెలవులు ముగిసిన తరువాత  బడులు ప్రారంబమై అప్పుడే రెండునెలలు కావస్తుంది. క్లాసు మాస్టారు చెపుతున్నారు ఇలా ఈరోజు బడిలోకి  రమ్య అనే అమ్మాయి  చేరుతుందని మన ఔ తరగతిలోనే చేరిందని తను  కూర్చుంటానికి చోటు ఇమ్మని చెప్పగానే పిల్లల్లో ఒకటే అలజడి బయలుదేరింది.క్రొత్తగా వచ్చే అమ్మాయి  మా బెంచీలో కూర్చోవాలంటే మా బెంచీలో కూర్చోవాలని పోటీపడసాగారు. 

  రెండవ పీరియడు ప్రారంబమైయ్యింది . పిల్లల తలంపులన్నీ క్రొత్తగా చేరిన అమ్మాయి మీదే ఉన్నాయి.ఎదురు చూపులతో విసుగొచ్చింది అందరికి. తలదించి  నోట్సులు రాసుకుంటున్న పిల్లలకు గుమ్మందగ్గర చప్పుడైతే ఒక్కసారిగా తలెత్తి చూసారందరూ. అక్కడ దృశ్యం చూసి నోటమాటరాలేదు ఎవ్వరికీ. కాళ్ళు చచ్చుబడిన అమ్మాయిని రెండు చేతులతో ఎత్తుకుని ఉన్న తండ్రిని చూసారు. ఆ అమ్మాయి దివ్యాంగురాలు.

పిల్లలకు నిరూత్సాహం ఆవరించింది. అందమైన ఆరోగ్యంగా వుండేవాళ్ళు వస్తారనుకుంటే దివ్వాంగురాలు తమ తరగతి గదిలో చేరడంతో ఏమీ పాలుపోలేదు పిల్లలకు. అప్పటివరకూ మా బల్లంటే మా బల్ల అన్నవారు చోటు ఇష్వటం మానేసారు . మెల్లగా తండ్రివెళ్ళి ఆఖరున ఖాళీ బల్లపై కూర్చోబెట్టి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. పిల్లలెవ్వరూ రమ్య వంక కన్నెత్తి చూడలేదు పలకరించలేదు.

 రమ్య బడిలో చేరి నాలుగు రోజులు గడిచిపోయాయి ఎవరూ దగ్గరకు వెళ్ళి పలుకరించలేదు.

ఒకరోజు ఇంగ్లీషు టీచరు రమ్య ఎవరు అని అడిగింది. రమ్య నేనే టీచర్ అని చెప్పింది. ఇంగ్లీష్ రైటింగ్ చాలా బాగుంది క్లాసులో అందరికంటే చాలా అందగా వ్రాసావు  దస్తూరి బాగుంది అని మెచ్చుకుంది. టీచరు రమ్యను మెచ్చుకునే సరికి  పిల్లలు ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు . 

  తరువాత రోజు లెక్కలు మాస్టారు బోర్డుమీద లెక్క ఇచ్చి చేయమన్నారు . రమ్య క్షణంలో చేసి చూపించింది. తరగతి గదిలో పిల్లలకు మతి పోయింది. మేస్టారు రమ్య దగ్గరు వెళ్ళి రమ్య ప్రక్కన కూర్చుని చాలా సేపు కబుర్లాడారు.

అది తరగతిలోని పిల్లలకు ఆశ్చర్యమనిపించింది. ఇన్నాళ్ళు ఎప్పుడూ ఎవరి ప్రక్కన కూర్చోని మాస్టారు రమ్య ప్రక్కన కూర్చుని మాట్టాడే సరికి రమ్య సామాన్యమైంది కాదని మెల్లగా అర్దమయ్యింది. డ్రాయింగ్ టీచరు బొమ్మఇస్తే టీచరు కంటే బాగావేసి చూపింది రమ్య.ఇలా ప్రతీరోజూ ప్రతీ అంశంలో రమ్య ముందుంటంతో రమ్య పట్ల తమ అభి ప్రాయాన్ని మెల్లగా మార్చుకోసాగారు అందరూ.           ఒకరోజు ఇంటర్వువెల్ సమయంలో కొంతమంది మెల్లగా వెళ్ళి రమ్య తో మాట్లాడారు. మెల్ల మెల్లగా అందరూ చుట్టూ చేరారు. రమ్య చేతిలో కాగితం బొమ్మ చూసి సరదా పడిపోయారు. నీకు కాగితం బొమ్మలు చేయటం వచ్చా మాకు నేర్పవా అంటూ పోటీ పడ్డారు. వాళ్ళ సరదా చూసి రమ్యకు ముచ్చటేసి అందరికీ ఓపికగా చిలకలు, విమానాలు, గులాబీలు, పడవలు చేసి ఇచ్చింది .

   .  బాలల దినోత్సవానికి పాటలు పోటీ పెట్టింది క్రాప్ట్ టీచరు . తరగతిలో పిల్లలెవరూ పాడడానికి ముందుకూ రాకుండా  సిగ్గుపడుతుంటే  రమ్మ నేను పాడతానంటూ  తీయటి కంఠంతో " కోడి ఒక కోనలో"  అని గొంతెత్తి పాడింది. గది చప్పట్లతో మారుమోగింది. తరగతి గదిలో పిల్లలకు నోట మాటరాలేదు. రమ్య దివ్యాంగురాలు తనకు ఏమీ రాదని చదువుకు పనికి రాదని అనుకున్న పిల్లలకు  బాలల దినోత్సవంలో రమ్య  అన్నింటిలో మొదటి బహుమతులు గెలుచుకోవడంతో తీవ్రంగా ఆలోచనలో పడ్డారందరూ.రమ్య పట్ల తప్పుడు బావన కలిగినందుకు చింతించారు.

      బాలలదినోత్సవం తరువాత రోజు  తరగతి గదిలో పిల్లలందరూ కొట్టుకున్నంతగా  గొడవ పడుతున్నారు. రమ్యను ఎత్తుకుని తీసుకువచ్చిన తండ్రి దగ్గరకు పోయి మా బల్లపై కూర్చోపెట్టాలంటే మా బల్లపైన అంటూ గొడవ చేయసాగారు.

        సహచర పిల్లలో వచ్చిన మార్పుకు ఆనందపడిన రమ్య రోజుకు ఒకరి బల్లపై కూర్చుంటానికి అంగీకరించింది. వైకల్యం శరీరానికే కాని ప్రతిభకు, మనసుకు కాదని పిల్లలందరూ గ్రహించారు. అప్పటినుండి రమ్యను తమతో సమానంగా చూసుకుని స్నేహం చేస్తూ రమ్యకు అన్ని విషయాలలో సహయం చేయసాగారు. రమ్య పుట్టినరోజుకు  గిప్ట్ గా దివ్యాంగుల సైకిలు కొనిచ్చారు స్నేహితులందరూ.

   


No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...