Saturday, June 25, 2022

సముద్రపు నత్త

 ఇటు జంతువులా ఆహారాన్ని ఆరగిస్తూనే.. మరోవైపు మొక్కల్లా శరీరంలోనే ఆహారాన్ని తయారు చేసుకుంటోందని గుర్తించారు. దాని గుట్టు తెలిస్తే మానవాళి భవిష్యత్తే మారిపోతుందని అంటున్నారు. ఆ విశేషాలేమిటో తెలుసుకుందామా.. మొక్కలకు.. జంతువులకు మధ్య..

అదో సముద్రపు నత్త (సీ స్లగ్‌). చూడటానికి ఆకుపై పాకుతున్న నత్తలా ఉంటుంది. కానీ దాని శరీరమే అచ్చం ఆకులా ఉంటుంది. అలా కనిపించడమే కాదు.. నిజంగానే
అది సగం జంతువులా, మరో సగం మొక్కలా బతికేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికా తూర్పు తీరంలో మాత్రమే కనిపించే ఈ సముద్రపు నత్తలకు 'ఎలిసియా క్లోరోటికా' అని పేరుపెట్టారు.



నాచు నుంచి పత్ర హరితాన్ని సంగ్రహించి.. మొక్కలు భూమి నుంచి నీరు, పోషకాలనుగ్రహించి.. సూర్యరశ్మి సాయంతో ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇందులో మొక్కల ఆకుల్లో ఉండే 'పత్ర హరితం (క్లోరోప్లాస్ట్‌)' చాలా కీలకం. ఈ క్లోరోప్లాస్ట్‌ కణాల వల్లే ఆకులకు ఆకుపచ్చ రంగు వస్తుంది. సాధారణంగా 'ఎలిసియా క్లోరోటికా' నత్తలు సముద్రాల్లో ఉండే నాచు (ఆల్గే)ను తిని బతుకుతుంటాయి. ఈ క్రమంలో నత్తలు నాచులోని క్లోరోప్లాస్ట్‌లను తమ శరీరంలో విలీనం చేసుకుంటున్నాయని.. వాటి సాయంతో ఆహారాన్ని ఉత్పత్తి (ఫొటో సింథసిస్‌) చేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఆ 'గుట్టు' తేల్చితే ఎన్నో అద్భుతాలు
'ఎలిసియా క్లోరోటికా' నత్తలు క్లోరోఫిల్‌ను ఎలా సంగ్రహించగలుగుతున్నాయి, ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నాయనేది తేల్చితే..ఎన్నో అద్భుత టెక్నాలజీలను రూపొందించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సౌరశక్తిని ఉపయోగించి నేరుగా ఆహారం తయరుచేయగల సాంకేతికతను అభివృద్ధి చేయవచ్చని అంటున్నారు. అడవుల
నరికివేత తగ్గిపోతుందని, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని.. పర్యావరణాన్ని కాపాడవచ్చని పేర్కొంటున్నారు. చంద్రుడు, ఇతర గ్రహాలపైకి వెళ్లే మనుషులకు ఆహారం సమస్య ఉండదని అంటున్నారు






తేల్చాల్సిన అంశాలెన్నో!

'ఎలిసియా క్లోరోటికా' నత్తలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. వాటి సంఖ్య చాలా తక్కువని, అంతరించిపోయే దశలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే వాటి 'గుట్టు' తేల్చే పనిలో పడ్డారు. ఈ క్రమంలో కొన్ని అంశాలపై దృష్టి సారించారు.
మొక్కలు, జంతువులు కణాలు పూర్తిగా వేరుగా ఉంటాయి.
అలాంటిది వీటి మధ్య జీవ, రసాయనపరంగా అనుసంధానం ఎలా కుదిరింది?

మొక్కల క్లోరోప్లాస్ట్‌లను ఈ నత్తలు ఎలా వినియోగించుకో గలుగుతున్నాయి?
ఏదైనా తిన్నప్పుడు కడుపులో జీర్ణమైపోతాయి.
అలాంటప్పుడు ఈ నత్తల కడుపులో క్లోరోప్లాస్ట్‌లు దెబ్బతినకుండా ఎలా ఉంటున్నాయి?






Sunday, June 19, 2022

music day

 కర్ణాటక అటు హిందుస్తానీ సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు ఒకే వేదికపై కూర్చుని జుగల్‌బందీ కచేరీలతో శ్రోతలను అలరించిన సందర్భాలు నిన్నటితరం సంగీతాభిమానులకు తెలిసిన ముచ్చటే! ఇప్పటికీ తరచుగా జుగల్‌బందీ కచేరీలు దేశ విదేశాల్లో విరివిగా జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఇటీవలి కాలంలో దేశంలోని భిన్న సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు మాత్రమే కాదు, విదేశీ విద్వాంసులతో కలసి చేసే ఫ్యూజన్‌ కచేరీలు కూడా పెరుగుతున్నాయి. ఫ్యూజన్‌ ఆల్బమ్స్‌కు అన్ని ప్రాంతాల్లోనూ శ్రోతల ఆదరణ పెరుగుతోంది. ఫ్యూజన్‌ ప్రయోగాలు సంగీతం విశ్వజనీనమని చాటుతున్నాయి.

జూన్‌ 21 ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం...

మనుషులకు మాటల కంటే ముందే సంగీతం తెలుసు. దాదాపు లక్షన్నర ఏళ్ల కిందట భాషల పుట్టుక జరిగితే, దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల ఏళ్ల కిందటే పాతరాతి యుగం మానవులకు సంగీతం తెలుసుననడానికి ఆధారాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో దొరికిన ఎముకలతో చేసిన వేణువులు, తాళవాద్య పరికరాలే ఇందుకు నిదర్శనమని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. భాషలు, లిపులు ఏర్పడిన తర్వాత ప్రపంచం నలుమూలలా సంగీతాన్ని లిపిబద్ధం చేసే ప్రక్రియ కూడా మొదలైంది. ప్రపంచంలోని ఏ సంప్రదాయానికి చెందిన సంగీతంలోనైనా ఉండేవి ఆ సప్తస్వరాలే! ప్రకృతిలోని ధ్వనులే సప్తస్వరాలకు, రకరకాల తాళాలకు మూలం. మన దేశంలో సంగీతం చిరకాలంగా ఉంది.


ఇటు కర్ణాటక అటు హిందుస్తానీ సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు ఒకే వేదికపై కూర్చుని జుగల్‌బందీ కచేరీలతో శ్రోతలను అలరించిన సందర్భాలు నిన్నటితరం సంగీతాభిమానులకు తెలిసిన ముచ్చటే! ఇప్పటికీ తరచుగా జుగల్‌బందీ కచేరీలు దేశ విదేశాల్లో విరివిగా జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఇటీవలి కాలంలో దేశంలోని భిన్న సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు మాత్రమే కాదు, విదేశీ విద్వాంసులతో కలసి చేసే ఫ్యూజన్‌ కచేరీలు కూడా పెరుగుతున్నాయి. ఫ్యూజన్‌ ఆల్బమ్స్‌కు అన్ని ప్రాంతాల్లోనూ శ్రోతల ఆదరణ పెరుగుతోంది. ఫ్యూజన్‌ ప్రయోగాలు సంగీతం విశ్వజనీనమని చాటుతున్నాయి.
జూన్‌ 21 ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం...

మనుషులకు మాటల కంటే ముందే సంగీతం తెలుసు. దాదాపు లక్షన్నర ఏళ్ల కిందట భాషల పుట్టుక జరిగితే, దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల ఏళ్ల కిందటే పాతరాతి యుగం మానవులకు సంగీతం తెలుసుననడానికి ఆధారాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో దొరికిన ఎముకలతో చేసిన వేణువులు, తాళవాద్య పరికరాలే ఇందుకు నిదర్శనమని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. భాషలు, లిపులు ఏర్పడిన తర్వాత ప్రపంచం నలుమూలలా సంగీతాన్ని లిపిబద్ధం చేసే ప్రక్రియ కూడా మొదలైంది. ప్రపంచంలోని ఏ సంప్రదాయానికి చెందిన సంగీతంలోనైనా ఉండేవి ఆ సప్తస్వరాలే! ప్రకృతిలోని ధ్వనులే సప్తస్వరాలకు, రకరకాల తాళాలకు మూలం. మన దేశంలో సంగీతం చిరకాలంగా ఉంది.

ప్రణవనాదమైన ఓంకారమే అనాదినాదమని పురాణాలు చెబుతాయి. భారతీయ సంప్రదాయ సంగీతానికి మూలాలు సామవేదంలో ఉన్నాయి. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్ది నుంచి క్రీస్తుశకం ఏడో శతాబ్ది మధ్యకాలంలో భారతీయ సంగీతం శాస్త్రీయతను సంతరించుకుంది. ఆ కాలంలోనే సంస్కృతంలో సంగీతానికి సంబంధించిన పలు గ్రంథాలు వెలువడ్డాయి. క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది తర్వాత ఉత్తర భారత, దక్షిణ భారత ప్రాంతాల్లో సంగీత శైలీభేదాలు ప్రస్ఫుటంగా ఏర్పడుతూ వచ్చాయి. ఉత్తరాది సంగీతం హిందుస్తానీ సంగీతంగా, దక్షిణాది సంగీతం కర్ణాటక సంగీతంగా అవతరించాయి. బ్రిటిష్‌కాలంలో పాశ్చాత్య సంగీతం ఇక్కడి ప్రజలకు చేరువైంది. పలు పాశ్చాత్య వాద్య పరికరాలు మన సంగీతకారులను ఆకట్టుకున్నాయి. క్లారినెట్, వయోలిన్, గిటార్, మాండోలిన్, పియానో వంటి పాశ్చాత్య వాద్య పరికరాలను భారతీయ సంప్రదాయ సంగీతకారులు అక్కున చేర్చుకున్నారు.

హిందుస్తానీ, కర్ణాటక సంగీత శైలీ సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడిన తర్వాత చాలాకాలం పాటు సంగీతకారులు ఎవరికి వారు గిరిగీసుకుని, తమ తమ శైలీ సంప్రదాయాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇరవయ్యో శతాబ్దిలో పాశ్చాత్య సంగీతం కూడా పరిచయమయ్యాక సంగీతం విశ్వజనీనమైనదనే ఎరుక కలిగి, వేర్వేరు సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు ఒకే వేదికపై జుగల్‌బందీలు నిర్వహించే స్థాయిలో సామరస్యాన్ని పెంపొందించుకున్నారు. ఇటీవలి కాలంలోనైతే పాశ్చాత్య విద్వాంసులతోనూ కలసి ఫ్యూజన్‌ కచేరీలతో మన సంగీతకారులు శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నారు. నిజానికి ఫ్యూజన్‌ ప్రయోగాలు నిన్న మొన్నటివి కావు. హిందుస్తానీ సరోద్‌ విద్వాంసుడు ఉస్తాద్‌ అలీ అక్బర్‌ఖాన్‌ 1955లోనే పాశ్చాత్య సంగీతకారులతో కలసి అమెరికాలో తొలి ఫ్యూజన్‌ కచేరీ చేశారు. ఆ తర్వాత 1960లలో కొందరు భారతీయ విద్వాంసులు రాక్‌ ఎన్‌ రోల్‌ బృందాలతో కలసి ఫ్యూజన్‌ కచేరీలు చేశారు.

సంప్రదాయ సంగీతంపై పాశ్చాత్య ప్రభావం
భారతీయ సంగీతంలో హిందుస్తానీ, కర్ణాటక సంగీత సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడ్డాయి. హిందుస్తానీ సంగీతంపై పర్షియన్, అరబిక్‌ సంగీత శైలుల ప్రభావం ఉంటే, కర్ణాటక సంగీతంపై యూరోపియన్‌ సంగీత ప్రభావం కనిపిస్తుంది. పదహారో శతాబ్దికి చెందిన పురందరదాసు కర్ణాటక సంగీత పితామహుడు. ఆయన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదో శతబ్దాలకు చెందిన శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్‌లు కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా ప్రఖ్యాతి పొందారు. కర్ణాటక సంగీత త్రిమూర్తుల కాలంలోనే కర్ణాటక సంగీతంపై పాశ్చాత్య ప్రభావం మొదలైంది. ముత్తుస్వామి దీక్షితార్‌ శంకరాభరణ రాగంలో రచించిన 'నోట్టు స్వరాలు' పాశ్చాత్య సంగీతానికి దగ్గరగా ఉంటాయి.

ముత్తుస్వామి దీక్షితార్‌ వంటి కర్ణాటక సంగీత విద్వాంసులను ఆదరించిన తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య బ్యాండ్‌ బృందం కూడా ఉండేది. అప్పట్లో తంజావూరు సంస్థానానికి చెందిన కర్ణాటక సంగీతకారుల్లో వరాహప్ప దీక్షిత పండితుల వంటివారు పాశ్చాత్య బ్యాండ్‌ బృందం వద్ద పాశ్చాత్య సంగీతం నేర్చుకుని, అందులోనూ ప్రావీణ్యం సాధించారు. తంజావూరు ఆస్థానంలో వయోలిన్‌పై పూర్తిస్థాయి పాశ్చాత్య సంగీత కచేరీ చేసిన ఘతన వరాహప్ప దీక్షిత పండితులకే దక్కుతుంది. ఆయనకు పియానో వాయించడంలోనూ అద్భుతమైన నైపుణ్యం ఉండేది. తెలుగువాడైన త్యాగరాజు శంకరాభరణం, సుపోషిణి వంటి రాగాల్లో కొన్ని కీర్తనలకు చేసిన స్వరకల్పనలు పాశ్చాత్య సంగీత శైలికి దగ్గరగా ఉంటాయి.

ఫ్యూజన్‌ ప్రయోగాలు
హిందుస్తానీ, కర్ణాటక సంగీత విద్వాంసుల జుగల్‌బందీ కచేరీలు ఒకరకంగా ఫ్యూజన్‌ కచేరీలుగానే చెప్పుకోవచ్చు. ఈ జుగల్‌బందీలకు భిన్నంగా పూర్తిగా పాశ్చాత్య సంగీతకారులతో కలసి చేసే ఫ్యూజన్‌ కచేరీలకు గత శతాబ్ది ద్వితీయార్ధంలో పునాదులు పడ్డాయి. ఇంగ్లిష్‌ రాక్‌బ్యాండ్‌ 'బీటిల్స్‌' బృందానికి చెందిన గిటారిస్ట్‌ జార్జ్‌ హారిసన్, అమెరికన్‌ వయోలినిస్ట్‌ యెహుది మెనుహిన్‌ వంటి వారితో కలసి పండిట్‌ రవిశంకర్‌ 1960 దశకంలోనే ఫ్యూజన్‌ కచేరీలు చేశారు. అప్పటి నుంచే భారతీయ సంగీతకారుల్లో ఫ్యూజన్‌ ప్రయోగాలపై ఆసక్తి పెరిగింది. పాశ్చాత్య సంగీతకారుల్లోనూ భారతీయ సంగీతంపై ఆసక్తి మొదలైంది. జార్జ్‌ హారిసన్‌ స్వయంగా పండిట్‌ రవిశంకర్‌ వద్ద సితార్‌ నేర్చుకుని, 'బీటిల్స్‌' పాట 'నార్వేజియన్‌ వుడ్‌'లో సితార్‌ స్వరాలను పలికించాడు. పండిట్‌ రవిశంకర్‌ కృషి ఫలితంగా ప్రాక్‌ పాశ్చాత్య సంగీతాల మధ్య వారధి ఏర్పడింది.

తర్వాతి కాలంలో హరిహరన్, లెస్లీ లెవిస్‌లు కలసి 'కలోనియల్‌ కజిన్స్‌' పేరుతో ఫ్యూజన్‌ కచేరీలు చేయడమే కాకుండా, ఆల్బమ్స్‌ కూడా విడుదల చేశారు. మన దేశంలో ఇప్పుడు పలు ఫ్యూజన్‌ బ్యాండ్స్‌ క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. దేశ విదేశాల్లో పర్యటిస్తూ శ్రోతలను అలరిస్తున్నాయి. శాస్త్రీయ సంగీతంలో సుస్థిరస్థానం సాధించి, ఫ్యూజన్‌ ప్రయోగాలతో అలరించిన వారిలో ఎల్‌.సుబ్రమణ్యం, ఎల్‌.శంకర్, మాండోలిన్‌ శ్రీనివాస్, రాజేష్‌ వైద్య, విక్కు వినాయకరామ్, ఉస్తాద్‌ షాహిద్‌ పర్వేజ్, సితారా దేవి, జాకీర్‌ హుస్సేన్‌ వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఎన్ని రకాల శైలీ భేదాలు, మరెన్ని రకాల సంప్రదాయాలు ఉన్నా సంగీతమంతా ఒక్కటేనని ఫ్యూజన్‌ కళాకారులు తమ కార్యక్రమాల ద్వారా నిరూపిస్తున్నారు. ప్రపంచ దేశాల నడుమ సాంస్కృతిక సామరస్యాన్ని పెంపొందించడంలో ఫ్యూజన్‌ కళాకారులు సాగిస్తున్న కృషి నిరుపమానం.
కూత ఘనం

పిట్ట కొంచెం కూత ఘనం అనే రీతిలో పసితనం వీడని కొందరు బాలలు శాస్త్రీయ సంగీతంలో అద్భుతంగా రాణిస్తూ, అంతర్జాతీయ స్థాయిలోనూ మన్ననలు పొందుతున్నారు. గురుగ్రామ్‌కు చెందిన గౌరీ మిశ్రా అతి పిన్నవయస్కురాలైన పియానిస్టుగా రికార్డులకెక్కింది. తొమ్మిదేళ్ల వయసులోనే 2015లో తొలి సోలో కచేరీ చేసి ఈ అరుదైన ఘనత సాధించింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య స్వరాలను పియానోపై అలవోకగా పలికించే గౌరీ మిశ్రా ప్రతిభకు ఎ.ఆర్‌.రెహమాన్, అద్నాన్‌ సమీ వంటి దిగ్గజాలు సైతం ముగ్ధులవడం విశేషం. అతి పిన్నవయస్కుడైన తబలా వాద్యకారుడిగా గిన్నిస్‌ రికార్డు సాధించిన తృప్త్‌రాజ్‌ పాండ్య అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. పాండ్య తన మూడేళ్ల వయసులోనే ఆలిండియా రేడియో ద్వారా తన వాద్యనైపుణ్యాన్ని ప్రదర్శించి, ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్, హరిప్రసాద్‌ చౌరాసియా వంటి దిగ్గజాల ప్రశంసలు పొందాడు. చెన్నైకి చెందిన లిడియన్‌ నాదస్వరం పియానో వాద్యకారుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు.

నాలుగేళ్ల వయసులోనే శాస్త్రీయ సంగీతాభ్యాసం మొదలుపెట్టిన లిడియన్‌ నాదస్వరం తన పదమూడేళ్ల వయసులోనే ఒక సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. కేరళకు చెందిన శ్రేయా జయదీప్‌ శాస్త్రీయ సంగీతం అభ్యసించి, రియాలిటీ షోలలోను, సినిమాల్లోనూ రాణిస్తోంది. ఆమె ఇప్పటికే రెండువందలకు పైగా ఆల్బమ్స్‌ కూడా విడుదల చేసింది. కేరళలో పుట్టి చెన్నైలో స్థిరపడిన కులదీప్‌ పాయ్‌ ఎందరో బాలలను సంగీతంలో తీర్చిదిద్దుతున్నారు.

ఆయన వద్ద శిష్యరికం పొందుతున్న వారిలో రాహుల్‌ వెల్లాల్, సూర్యగాయత్రి, సూర్యనారాయణన్, రఘురామ్‌ మణికంఠన్, భవ్య గణపతి తదితరులు విశేషంగా రాణిస్తున్నారు. 'యూట్యూబ్‌'ను మాధ్యమంగా చేసుకున్న తొలి శాస్త్రీయ సంగీతకారుడైన కులదీప్‌ పాయ్‌ తన శిష్యులను కూడా ఇదే మాధ్యమం ద్వారా శ్రోతలకు చేరువ చేస్తున్నారు. పాయ్‌ శిష్యుల్లో కొందరు అంతర్జాతీయ వేదికలపైనా మెరుపులు మెరిపిస్తుండటం విశేషం. ఇటీవలి కాలంలో సంగీతంలో రాణిస్తున్న బాల కళాకారులు సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకుంటున్నా, ఏదో ఒకే సంప్రదాయానికి పరిమితమైపోకుండా, వేర్వేరు సంప్రదాయ శైలులనూ ఆకళింపు చేసుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలతో సంగీతానికి గల విశ్వజనీనతను చాటుతున్నారు.

మన సంగీతంలో పాశ్చాత్యవాద్యాలు
మన సంగీత కచేరీల్లోకి పాశ్చాత్యవాద్య పరికరాలు బ్రిటిష్‌ హయాంలోనే ప్రవేశించాయి. కర్ణాటక సంగీత కచేరీలకు క్లారినెట్‌ను తొలిసారిగా మహాదేవ నట్టువనార్‌ పరిచయం చేశారు. తర్వాతి కాలంలో ఎ.కె.సి. నటరాజన్‌ వంటివారు క్లారినెట్‌ను కర్ణాటక సంగీతానికి మరింతగా చేరువ చేశారు. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మహాదేవ నట్టువనార్‌ తంజావూరు మరాఠా రాజుల ఆస్థాన విద్వాంసుడిగా ఉండేవారు. అప్పట్లోనే ఆయన పాశ్చాత్య పరికరమైన క్లారినెట్‌పై ఆయన అద్భుతమైన స్వరవిన్యాసాలు చేసి, పండిత పామరులను అలరించారు. తర్వాతి కాలంలో క్లారినెట్‌ కర్ణాటక సంగీతానికి మరింతగా చేరువైంది. తంజావూరు ఆస్థానానికి చెందిన వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితార్‌ సోదరుడు బాలస్వామి దీక్షితార్‌ పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో కర్ణాటక సంగీతానికి వయోలిన్‌ను పరిచయం చేశారు. ద్వారం వెంకటస్వామినాయుడు వయోలిన్‌ను కర్ణాటక సంగీతంలో అవిభాజ్య వాద్యం స్థాయికి చేర్చారు.

ద్వారం వెంకటస్వామినాయుడు ప్రభావంతో కర్ణాటక సంగీత కచేరీలలో వయోలిన్‌ ఒక తప్పనిసరి పక్కవాద్యం స్థాయికి చేరుకుంది. అంతేకాదు, వయోలిన్‌తో సోలో కచేరీలిచ్చే ఉద్దండులు కర్ణాటక సంగీతంలో చాలామందే ఉన్నారు. కదిరి గోపాలనాథ్‌ తొలిసారిగా శాక్సోఫోన్‌ను కర్ణాటక సంగీతానికి పరిచయం చేశారు. ఇరవయ్యో శతాబ్దంలో మరికొన్ని పాశ్చాత్య వాద్యపరికరాలు కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలకు పరిచయమయ్యాయి. పాశ్చాత్య వాద్యపరికరమైన శాక్సోఫోన్‌కు కొద్దిపాటి మార్పులు చేసి, దానిని కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోని గమకాలన్నీ పలికేలా తీర్చిదిద్దారు.

మాండోలిన్‌ను శ్రీనివాస్‌ బాలుడిగా ఉన్నప్పుడే కర్ణాటక సంగీతానికి పరిచయం చేసి, 'మాండోలిన్‌ శ్రీనివాస్‌'గా ప్రఖ్యాతి పొందారు. సుకుమార్‌ ప్రసాద్‌ తొలిసారిగా గిటార్‌ను కర్ణాటక సంగీత కచేరీలకు పరిచయం చేశారు. అనిల్‌ శ్రీనివాసన్‌ పియానోను కర్ణాటక సంగీతానికి పరిచయం చేశారు. పాశ్చాత్య వాద్యపరికరమైన హార్మోనియం పంతొమ్మిదో శతాబ్దం నాటికి మన దేశంలో బాగా జనాదరణ పొందింది. పరిమాణంలో కొన్ని మార్పులకు లోనై, హిందుస్తానీ గాత్ర కచేరీలకు పక్కవాద్యంగా చక్కగా ఇమిడిపోయింది. పాశ్చాత్య వాద్యపరికాలు మన సంప్రదాయ సంగీతంలోని నిశితమైన గమకాలను, సంగతులను పలికించలేవనే విమర్శలు ఉన్నా, వాటిని తమవిగా చేసుకుని కచేరీలు చేసిన కళాకారులు ఆ విమర్శలన్నింటినీ వమ్ము చేశారు.

ఆధునిక కాలంలో మన భారతీయ సంగీత విద్వాంసులు పలువురు ప్రపంచ స్థాయిలో మన్ననలు అందుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై కచేరీలు చేసి, శ్రోతలను ఉర్రూతలూపారు. అంతర్జాతీయ వేదికలపై మెరిసిన వారిలో అటు హిందుస్తానీ, ఇటు కర్ణాటక సంగీత విద్వాంసులు ఉన్నారు. శైలీ సంప్రదాయాలు వేర్వేరు అయినా, సంగీతం అంతా ఒక్కటేననే భావనతో భిన్న సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు జుగల్‌బందీ కచేరీలతో భారతీయ సంగీత రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. భీమ్‌సేన్‌ జోషి, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, పండిట్‌ జస్‌రాజ్, ఎల్‌.సుబ్రమణ్యం తదితరుల జుగల్‌బందీలు భారతీయ సంగీతానికే వన్నె తెచ్చేవిగా నిలుస్తాయి. హిందుస్తానీ సంగీతకారుల్లో సితార్‌ విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్, షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్, సరోద్‌ విద్వాంసుడు ఉస్తాద్‌ అమ్జద్‌ అలీ ఖాన్, వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్‌ చౌరాసియా, సంతూర్‌ విద్వాంసుడు శివకుమార్‌ శర్మ, తబలా విద్వాంసుడు ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ తదితరులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

ఆధునిక కర్ణాటక సంగీతకారుల్లో చెంబై వైద్యనాథ భాగవతార్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మహారాజపురం సంతానం, శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మధురై మణి అయ్యర్, డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి, జి.ఎన్‌.బాలసుబ్రమణ్యం, టి.ఎన్‌.శేషగోపాలన్‌ తదితర గాయకులు చెరగని ముద్ర వేశారు. ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్, ఎం.ఎల్‌.వసంతకుమారి కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులుగా గుర్తింపు పొందారు.

ద్వారంవారి తర్వాత వయొలినిస్టుల్లో లాల్గుడి జయరామన్, కన్నకుడి వైద్యనాథన్, ఎం.ఎస్‌.గోపాలకృష్ణన్, అన్నవరపు రామస్వామి, ఎల్‌.వైద్యనాథన్, ఎల్‌.సుబ్రమణ్యం, ఎల్‌. శంకర్, అవసరాల కన్యాకుమారి, వైణికుల్లో ఈమని శంకరశాస్త్రి, చిట్టిబాబు, దొరైస్వామి అయ్యంగార్, ఇ.గాయత్రి, జయంతి కుమరేశ్, వేణుగానంలో టి.ఆర్‌.మహాలింగం, ఎన్‌.రమణి, ప్రపంచం సీతారాం, నాదస్వరంలో షేక్‌ చినమౌలానా, టి.ఎన్‌.రాజరత్నం పిళ్లె తదితరులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించిన వారిలో ప్రముఖులు. ఇప్పటి తరంలో టి.ఎం.కృష్ణ, సిక్కిల్‌ గురుచరణ్, పాల్ఘాట్‌ రామ్‌ప్రసాద్, అక్కారయ్‌ శుభలక్ష్మి, అమృతా మురళి, విద్యా కళ్యాణరామన్‌ తదితరులు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో రాణిస్తున్నారు.

సంప్రదాయ సంగీతంపై పాశ్చాత్య ప్రభావం
భారతీయ సంగీతంలో హిందుస్తానీ, కర్ణాటక సంగీత సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడ్డాయి. హిందుస్తానీ సంగీతంపై పర్షియన్, అరబిక్‌ సంగీత శైలుల ప్రభావం ఉంటే, కర్ణాటక సంగీతంపై యూరోపియన్‌ సంగీత ప్రభావం కనిపిస్తుంది. పదహారో శతాబ్దికి చెందిన పురందరదాసు కర్ణాటక సంగీత పితామహుడు. ఆయన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదో శతబ్దాలకు చెందిన శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్‌లు కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా ప్రఖ్యాతి పొందారు. కర్ణాటక సంగీత త్రిమూర్తుల కాలంలోనే కర్ణాటక సంగీతంపై పాశ్చాత్య ప్రభావం మొదలైంది.

ముత్తుస్వామి దీక్షితార్‌ శంకరాభరణ రాగంలో రచించిన 'నోట్టు స్వరాలు' పాశ్చాత్య సంగీతానికి దగ్గరగా ఉంటాయి. ముత్తుస్వామి దీక్షితార్‌ వంటి కర్ణాటక సంగీత విద్వాంసులను ఆదరించిన తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య బ్యాండ్‌ బృందం కూడా ఉండేది. అప్పట్లో తంజావూరు సంస్థానానికి చెందిన కర్ణాటక సంగీతకారుల్లో వరాహప్ప దీక్షిత పండితుల వంటివారు పాశ్చాత్య బ్యాండ్‌ బృందం వద్ద పాశ్చాత్య సంగీతం నేర్చుకుని, అందులోనూ ప్రావీణ్యం సాధించారు. తంజావూరు ఆస్థానంలో వయోలిన్‌పై పూర్తిస్థాయి పాశ్చాత్య సంగీత కచేరీ చేసిన ఘతన వరాహప్ప దీక్షిత పండితులకే దక్కుతుంది. ఆయనకు పియానో వాయించడంలోనూ అద్భుతమైన నైపుణ్యం ఉండేది. తెలుగువాడైన త్యాగరాజు శంకరాభరణం, సుపోషిణి వంటి రాగాల్లో కొన్ని కీర్తనలకు చేసిన స్వరకల్పనలు పాశ్చాత్య సంగీత శైలికి దగ్గరగా ఉంటాయి.

ఫ్యూజన్‌ ప్రయోగాలు
హిందుస్తానీ, కర్ణాటక సంగీత విద్వాంసుల జుగల్‌బందీ కచేరీలు ఒకరకంగా ఫ్యూజన్‌ కచేరీలుగానే చెప్పుకోవచ్చు. ఈ జుగల్‌బందీలకు భిన్నంగా పూర్తిగా పాశ్చాత్య సంగీతకారులతో కలసి చేసే ఫ్యూజన్‌ కచేరీలకు గత శతాబ్ది ద్వితీయార్ధంలో పునాదులు పడ్డాయి. ఇంగ్లిష్‌ రాక్‌బ్యాండ్‌ 'బీటిల్స్‌' బృందానికి చెందిన గిటారిస్ట్‌ జార్జ్‌ హారిసన్, అమెరికన్‌ వయోలినిస్ట్‌ యెహుది మెనుహిన్‌ వంటి వారితో కలసి పండిట్‌ రవిశంకర్‌ 1960 దశకంలోనే ఫ్యూజన్‌ కచేరీలు చేశారు. అప్పటి నుంచే భారతీయ సంగీతకారుల్లో ఫ్యూజన్‌ ప్రయోగాలపై ఆసక్తి పెరిగింది. పాశ్చాత్య సంగీతకారుల్లోనూ భారతీయ సంగీతంపై ఆసక్తి మొదలైంది. జార్జ్‌ హారిసన్‌ స్వయంగా పండిట్‌ రవిశంకర్‌ వద్ద సితార్‌ నేర్చుకుని, 'బీటిల్స్‌' పాట 'నార్వేజియన్‌ వుడ్‌'లో సితార్‌ స్వరాలను పలికించాడు.

పండిట్‌ రవిశంకర్‌ కృషి ఫలితంగా ప్రాక్‌ పాశ్చాత్య సంగీతాల మధ్య వారధి ఏర్పడింది. తర్వాతి కాలంలో హరిహరన్, లెస్లీ లెవిస్‌లు కలసి 'కలోనియల్‌ కజిన్స్‌' పేరుతో ఫ్యూజన్‌ కచేరీలు చేయడమే కాకుండా, ఆల్బమ్స్‌ కూడా విడుదల చేశారు. మన దేశంలో ఇప్పుడు పలు ఫ్యూజన్‌ బ్యాండ్స్‌ క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. దేశ విదేశాల్లో పర్యటిస్తూ శ్రోతలను అలరిస్తున్నాయి. శాస్త్రీయ సంగీతంలో సుస్థిరస్థానం సాధించి, ఫ్యూజన్‌ ప్రయోగాలతో అలరించిన వారిలో ఎల్‌.సుబ్రమణ్యం, ఎల్‌.శంకర్, మాండోలిన్‌ శ్రీనివాస్, రాజేష్‌ వైద్య, విక్కు వినాయకరామ్, ఉస్తాద్‌ షాహిద్‌ పర్వేజ్, సితారా దేవి, జాకీర్‌ హుస్సేన్‌ వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఎన్ని రకాల శైలీ భేదాలు, మరెన్ని రకాల సంప్రదాయాలు ఉన్నా సంగీతమంతా ఒక్కటేనని ఫ్యూజన్‌ కళాకారులు తమ కార్యక్రమాల ద్వారా నిరూపిస్తున్నారు. ప్రపంచ దేశాల నడుమ సాంస్కృతిక సామరస్యాన్ని పెంపొందించడంలో ఫ్యూజన్‌ కళాకారులు సాగిస్తున్న కృషి నిరుపమానం.
కూత ఘనం
పిట్ట కొంచెం కూత ఘనం అనే రీతిలో పసితనం వీడని కొందరు బాలలు శాస్త్రీయ సంగీతంలో అద్భుతంగా రాణిస్తూ, అంతర్జాతీయ స్థాయిలోనూ మన్ననలు పొందుతున్నారు. గురుగ్రామ్‌కు చెందిన గౌరీ మిశ్రా అతి పిన్నవయస్కురాలైన పియానిస్టుగా రికార్డులకెక్కింది. తొమ్మిదేళ్ల వయసులోనే 2015లో తొలి సోలో కచేరీ చేసి ఈ అరుదైన ఘనత సాధించింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య స్వరాలను పియానోపై అలవోకగా పలికించే గౌరీ మిశ్రా ప్రతిభకు ఎ.ఆర్‌.రెహమాన్, అద్నాన్‌ సమీ వంటి దిగ్గజాలు సైతం ముగ్ధులవడం విశేషం. అతి పిన్నవయస్కుడైన తబలా వాద్యకారుడిగా గిన్నిస్‌ రికార్డు సాధించిన తృప్త్‌రాజ్‌ పాండ్య అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. పాండ్య తన మూడేళ్ల వయసులోనే ఆలిండియా రేడియో ద్వారా తన వాద్యనైపుణ్యాన్ని ప్రదర్శించి, ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్, హరిప్రసాద్‌ చౌరాసియా వంటి దిగ్గజాల ప్రశంసలు పొందాడు. చెన్నైకి చెందిన లిడియన్‌ నాదస్వరం పియానో వాద్యకారుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు.

ఆయన వద్ద శిష్యరికం పొందుతున్న వారిలో రాహుల్‌ వెల్లాల్, సూర్యగాయత్రి, సూర్యనారాయణన్, రఘురామ్‌ మణికంఠన్, భవ్య గణపతి తదితరులు విశేషంగా రాణిస్తున్నారు. 'యూట్యూబ్‌'ను మాధ్యమంగా చేసుకున్న తొలి శాస్త్రీయ సంగీతకారుడైన కులదీప్‌ పాయ్‌ తన శిష్యులను కూడా ఇదే మాధ్యమం ద్వారా శ్రోతలకు చేరువ చేస్తున్నారు. పాయ్‌ శిష్యుల్లో కొందరు అంతర్జాతీయ వేదికలపైనా మెరుపులు మెరిపిస్తుండటం విశేషం. ఇటీవలి కాలంలో సంగీతంలో రాణిస్తున్న బాల కళాకారులు సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకుంటున్నా, ఏదో ఒకే సంప్రదాయానికి పరిమితమైపోకుండా, వేర్వేరు సంప్రదాయ శైలులనూ ఆకళింపు చేసుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలతో సంగీతానికి గల విశ్వజనీనతను చాటుతున్నారు.



Sunday, June 12, 2022

పులి

 





ప్రత్తిపాడు ప్రాంతంలో సంచరిస్తున్న పులిపై అధ్యయనం

ఇది ఒడిశా అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న అటవీ శాఖ

దాని రూటు, ఆ ప్రాంతంలో ఉన్న పులుల గురించి తెలుసుకునేందుకు కసరత్తు

ఏపీ-ఒడిశా మధ్య పులుల కొత్త కారిడార్‌పై ఊహాగానాలు

సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రాంతంలో సంచరిస్తున్న పులి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది

దాన్ని పట్టుకోవడంతోపాటు అది ఈ ప్రాంతానికి ఎలా వచ్చిందో తెలుసుకోవడం సవాలుగా మారింది. గత 20 రోజులుగా ఈ ప్రాంతంలో పులి సంచరిస్తోంది. తొలుత.. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి, పోతులూరు గ్రామాల్లో పశువులు మాయమవడంతో మొదట ఏదో అడవి జంతువు వచ్చినట్లు భావించారు.

వరుసగా పశువులు మాయమవుతుండడం, వాటి కళేబరాలు కనబడుతుండడంతో స్థానికులు పులి తిరుగుతున్నట్లు చెబుతూ వచ్చారు. దీంతో అటవీ శాఖాధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అడుగుల ముద్రలు ఇతర గుర్తుల ఆధారంగా దాన్ని పులిగా నిర్థారించారు. మొదట్లో అది పోలవరం ప్రాజెక్టు కాలువ ప్రాంతంలో తిరిగింది. ఆ తర్వాత ఆహారం, నీరు దొరికే ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తూ వచ్చింది.

దానిని పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలేందుకు కెమెరాలు ఏర్పాటుచేశారు. కొన్నిచోట్ల బోన్లు పెట్టినా అది చిక్కలేదు. పులుల సంచారం, వాటిని దారి మళ్లించడంలో నిష్ణాతులైన శ్రీశైలం టైగర్‌ రిజర్వు ఫారెస్టు సిబ్బంది అక్కడికి వెళ్లి పులిని పట్టుకోవడం లేదా దారి మళ్లించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో ఆ ప్రయత్నాలు ఇంకా ముమ్మరం చేసినట్లు కాకినాడ డీఎఫ్‌ఓ ఐకేవీ రాజు తెలిపారు.

ఒడిశా నుంచే వచ్చిందా?
3-4 ఏళ్ల వయసున్న ఈ పులి ఒడిశా అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. విజయనగరం జిల్లా సాలూరు, విశాఖ అటవీ ప్రాంతం మీదుగా ఇది ప్రత్తిపాడు అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు అటవీ శాఖ అంచనా వేస్తోంది. పాపికొండల అభయారణ్యంలో నాలుగైదు పులులు ఉన్నా ఇది అక్కడి నుంచి వచ్చింది కాదని చెబుతున్నారు.

ఇది కచ్చితంగా ఒడిశా నుంచి వచ్చిందే అయ్యుంటుందనే ఉద్దేశంతో అటువైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని గురించి తెలుసుకునేందుకు అటవీ శాఖ ఇప్పటికే ఎన్‌టీసీఏ (నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ)ని సంప్రదించారు. ఒడిశాలోని సత్‌కోసియా, సిమిల్‌పాల్‌ టైగర్‌ రిజర్వు ప్రాంతాలు, వాటికి ఆనుకుని ఏపీ-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని అడవుల్లో ఉన్న పులుల వివరాలను సేకరిస్తున్నారు.

అక్కడి నుంచి ఇది ఏపీకిలోకి ప్రవేశించిందా అన్న కోణంలో విస్తృతంగా అధ్యయనం చేస్తున్నారు. సాధారణంగా దేశంలోని టైగర్‌ రిజర్వు ప్రాంతాల్లో ఉన్న పులుల వివరాలన్నీ ఎన్‌టీసీఏ వద్ద ఉంటాయి. కెమెరాల ట్రాప్‌ ద్వారా ఆ టైగర్‌ రిజర్వులోని ప్రతి పులికి ఒక కోడ్‌ ఇచ్చి గుర్తిస్తారు. అలా అక్కడి జాబితాలో ఉన్న పులులతో ఇక్కడ తిరుగుతున్న పులిని పోల్చి చూస్తారు.

ఇది ఆ జాబితాలోని పులేనా!?
ఒకవేళ ఇక్కడ తిరుగుతున్న పులి ఆ జాబితాలోనిది అయితే అది ఏ మార్గంలో వచ్చిందో అధ్యయనం చేస్తారు. అదే జరిగితే ఈ మార్గం గుండా కొత్త పులుల కారిడార్‌ ఏర్పడినట్లే. అంటే ఏపీ, ఒడిశా మధ్య కొత్త పులుల కారిడార్‌ ఏర్పడినట్లు నిర్థారిస్తారు. ఇటీవల నల్లమల నుంచి శేషాచలం అడవులకు ఇలాగే కొత్త పులుల కారిడార్‌ ఏర్పడింది.

ఇదే తరహాలో కొత్త కారిడార్‌ ఏర్పడిందా అనే అనుమానాలు అటవీ శాఖాధికారుల్లో వ్యక్తమవుతున్నాయి. కానీ, దీన్ని నిర్థారించడం అంత సులువు కాదని, ఎన్నో అధ్యయనాలు, ఆధారాలు కావాలని చెబుతున్నారు. అక్కడి పులుల జాబితాలో ఇది లేకపోతే ఈ పులి ఎక్కడిదో అన్నది మిస్టరీగానే ఉండే అవకాశం ఉంది. లేకపోతే అక్కడి కెమెరా ట్రాప్‌లకు దొరక్కుండా అయినా ఉండాలి. ఇవన్నీ తెలియాలంటే చాలా సమయం పడుతుందని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. అందుకే ఎన్‌టీసీఏ ద్వారా ఈ పులి గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు

శంఖవరం, జూన్‌ 12: ఇరవై రోజులుగా సంచలనం సృష్టిస్తున్న పెద్ద పులి కత్తిపూడి నల్లకొండపై తిష్టవేసింది. సబ్‌ప్లాన్‌ మైదాన ప్రాంతం నుంచి రిజర్వు ఫారెస్టు దాటుకుంటూ హైవేకు కూతవేటు దూరంలో ఉన్న నల్లకొండపై శనివారం రాత్రి వజ్రకూ టం శివార్లలో ఆటోకి అడ్డుపడింది పెద్దపులే అని అటవీ అధికారులు గుర్తించారు.

వర్షంవల్ల పాదముద్రలు అక్కడ కనిపించకపోయినా పెద్దపులి సంచరించిన ప్రాంతాల్లో దాని ముద్రితమై ఉన్నాయి. కత్తిపూడి ట్రక్కులేబై సమీపంలోను, రామన్నపాలెం సమీపం కొండల్లోను వీటి ముద్రలు అధికంగా కనిపించాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలోనే పెద్దపులి రాత్రి బస చేసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పెద్దపులి తిరిగాడే ప్రాంతం, అది తిరిగే అవకాశం ఉన్న ఐదు కీలక ప్రదేశాలను గుర్తించి ట్రాఫికింగ్‌ కెమెరాలను అధికారులు అమర్చారు.

బోనులకు చిక్కకుండా తప్పించుకుంటూ..

పెద్దపులి వారంరోజులుగా ఏ జంతువునూ వేటాడకపోయినా పాదముద్రల ఆధారంగానే తన ఉనికిని చాటుతోంది. వాటి ద్వారానే అధికారులూ దాన్ని వెంబడిస్తున్నారు. ఎక్కడికక్కడ బోనులు ఏర్పాటు చేస్తున్నారు. అయినా ఎక్కడా వాటికి చిక్కకుండా చాకచక్యంగా వ్యవహరిస్తోంది. మత్తుమందు ఇచ్చే ప్రయత్నమే చేయాలని ఎన్‌ఎస్‌ఆర్‌ అధి కారి ఒకరు అభిప్రాయపడ్డారు. అలా మత్తు మందు ద్వారా పులిని పట్టాలంటే అను కూల ప్రదేశం కావాలని, చెరువులు, పోలవరం పెద్దకాలువలూ ఉండకూడదని ఆయన చెప్తున్నారు. శని, ఆదివారాల్లో పెద్దపులి తి రిగాడిన ప్రదేశం మైదాన ప్రాంతంగా గు ర్తించారు. ఈ ప్రాంతంలో మత్తు ఇవ్వడానికి అనుకూలంగానే ఉంటుందంటున్నారు.

భయాందోళనలో ప్రజలు

కత్తిపూడి పరిసర ప్రాంతాల్లో పెద్దపులి తిరుగుతుందనే సమాచారంతో కత్తిపూడి, వజ్రకూటం, నెల్లిపూడి పరిసర ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పులి పాదముద్రలు కనిపించడంతో పరిసర ప్రాంత రైతులు పొలాల్లోకి వెళ్లాలంటే హడలెత్తిపోతున్నారు. పులి సంచరించే ప్రాంతంలో ప్రజలు కలియ తిరగకుండా ఉండాలని, దానివల్ల పులి దాని రూటు మార్చుకుంటుందని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు



ఆంధ్ర ప్రదేశ్ : అమరావతి : జూన్ 12 ( హిం స)

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శంఖవరం మండలం కొత్త వజ్రకూటం దొడ్ల డెయిరీ మర్రి చెట్టు వద్ద పులి సంచరిస్తోంది.


శనివారం రాత్రి వజ్రకూటం నుండి కత్తిపూడి వైపు వెళ్తున్న ఆటో పైకి పెద్ద పులి దూకింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకున్న పరిశీలించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి అటవీశాఖ అధికారులు చేరుకున్నారు. పులి పాదముద్రలను సేకరించిన అటవీ శాఖ అధికారులు.. తొందరలోనే పులిని పట్టుకుంటామని చెబుతున్నారు. పులి సంచారంతో ప్రజలు వణికిపోతున్నారు.





Kakinada: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రజలను పులి భయం ఇంకా వీడడం లేదు. పులి ఏదో దిక్కున కనిపించి హడలెత్తిస్తుంది.


అటవీశాఖ అధికారులకు చిక్కకుండా జనాలకు కనిపిస్తూ గుండెల్లో గుబులురేపుతోంది. తాజాగా శంఖవరం మండలం కొత్త వజ్రకూటం దొడ్ల డెయిరీ వద్ద బెంగాల్ టైగర్ సంచారం చేసినట్లు తెలుస్తోంది. వజ్రకూటం నుంచి కత్తిపూడి వైపు వెళ్తున్న ఆటో డ్రైవర్ కి పెద్దపులి కనిపించింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీశాఖ సిబ్బంది పులి పాదముద్రలను సేకరించే పనిలో పడ్డారు. రాత్రి వేళల్లో ఎవరూ బయటకు రావద్దని అటవీశాఖ సిబ్బంది హెచ్చరిస్తోంది.




కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రజలను పులి భయం వీడడం లేదు. పులి ఏదో దిక్కున కనిపించి హడలెత్తిస్తోంది. అటవీశాఖ అధికారులకు చిక్కకుండా జనాలకు కనిపిస్తూ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.


లేటస్ట్‌గా శంఖవరం మండలం కొత్త వజ్రకూటం దొడ్ల డెయిరీ దగ్గర ఈ బెంగాల్ టైగర్ సంచారం చేసినట్లు తెలుస్తోంది. వజ్రకూటం నుంచి కత్తిపూడి వైపు వెళ్తున్న ఆటో డ్రైవర్ కి పెద్దపులి కనిపించింది.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీశాఖ సిబ్బంది పులి పాదముద్రలను సేకరించే పనిలో పడ్డారు. రాత్రి వేళల్లో ఎవరూ బయటకు రావద్దని అటవీశాఖ సిబ్బంది హెచ్చరిస్తున్నారు.





Bengal tiger: ఈ మధ్య కాలంలో పులులు జనవాసాల మధ్యకు వచ్చేస్తున్నాయి. అడవులను వదిలి పరిసర ప్రాంతాలు, పొలాల్లోకి రావడంతో భయాందోళన వ్యక్తం అవుతోంది.


ఇక ఏపీలోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శంఖవరం మండలం కొత్త వజ్రకూటం దొడ్ల డెయిరీ మర్రి చెట్టు వద్ద బెంగాల్ టైగర్ (పులి) సంచరిస్తోంది. తాజాగా శనివారం రాత్రి వజ్రకూటం నుండి కత్తిపూడి వైపు వెళ్తున్న ఆటో పైకి పెద్ద పులి దూకింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకున్న పరిశీలించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి అటవీశాఖ అధికారులు చేరుకున్నారు.

పులి పాదముద్రలను సేకరించిన అటవీ శాఖ అధికారులు.. తొందరలోనే పులిని పట్టుకుంటామని చెబుతున్నారు. బెంగాల్‌ టైగర్‌ సంచారంతో ప్రజలు వణికిపోతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో ఎవ్వరు కూడా బయటకు రాకూడదని అటవీ శాఖ అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు.




మూడు నుంచి అయిదేళ్ల లోపు వయసు ఉన్న రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ ఇరవై రోజులుగా అటవీ ప్రాంతానికి కూతవేటు దూరంలోని మైదాన ప్రదేశాల్లో తిరగడం విశేషమే.


యవ్వనంలో ఉన్న ఈ బెబ్బులి ఇక్కడ ఇన్ని రోజులు ఎందుకు ఉంది? ముప్పై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఎందుకు తిరుగుతోందన్నది ఆసక్తికరంగా మారింది.

పాదముద్రలే ఆనవాళ్లు

పెద్దపులి ఒక చోటకు పరిమితం కావడం లేదు. శనివారం రాత్రి వజ్రకూటం సమీపంలోని రెండు కొండల మధ్య ఆటోలో వెళ్తున్నవారి కంటపడి అలజడి రేపింది. వజ్రకూటం, రామన్నపాలెం, కత్తిపూడి గ్రామాల పరిధిలోని కొండల్లో పలుచోట్ల దాని పాదముద్రలు గుర్తిచారు. జాతీయ రహదారికి 5 కి.మీ. లోపే సంచరించడంతో యంత్రాంగంలోనూ మరింత ఆందోళన పెరిగింది. ఎన్‌ఎస్‌టీఆర్‌ డీఆర్‌వో ప్రసాద్‌రెడ్డి బృందం ఆ మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది.

20 రోజులుగా ఇక్కడే...

జిల్లా కేంద్రం కాకినాడకు 40 కిలోమీటర్ల దూరంలోని ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, గొల్లప్రోలు మండలాల మధ్య 20 రోజులుగా పులి సంచరిస్తోంది. ఒమ్మంగి, పొదురుపాక, పోతులూరు, కొడవలి, వజ్రకూటం ప్రాంతాలు కొండలు, వాగులు, పుష్కర, ఏలేరు కాలువలతో ఉంటాయి. వందల ఎకరాల్లో సరుగుడు తోటలు, చెట్లతో ఉన్న మెట్టలు అడవిని తలపిస్తాయి. ఇదే అనువుగా బెబ్బులి భావించి ఉంటుందని అటవీశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆకలికి మించి వేటాడని, బోనులో ఎరవేసినా.. లొంగని వ్యాఘ్రం ఇప్పటికి అయిదు పశువులను వధించింది. దాన్ని తిరిగి అడవిలోకి పంపాలనే మంత్రాంగాన్ని తిప్పికొడుతూ ఇక్కడిక్కడే తిరుగుతోంది.

ఎందుకు ఉందంటే..?

* పులి ఇన్ని రోజులు అటవీప్రాంత సమీప మైదానంలో తిష్ఠ వేయడానికి కారణాలను వన్యప్రాణి, అటవీ అధికారులు విశ్లేషించుకుంటున్నారు.

పులి కౌమారదశకు చేరినపుడు అదో ప్రత్యేక భూభాగాన్ని (టెరిటరీ) ఖాయపరుచుకుంటుంది. మగ పులి 25 నుంచి 40 చ.కి.మీ. విస్తీర్ణాన్ని తన రాజ్యంగా భావిస్తుంది. తన కదలికలు, ఉంచే ఆనవాళ్లతో మిగతా జంతువులు పులి ఉనికిని గుర్తిస్తాయని చెబుతున్నారు. వేటకు అనువుగా ఉన్న పరిస్థితులను అది చూసుకుంటుంది.

పులి ఉండే తన సహజ ఆవాసంలో పరిస్థితులకు విఘాతం కలిగి ఉండవచ్ఛు అడవుల్లోనూ ఏదో రూపేణా జనం చేసే చప్పుళ్లు కారణం కావచ్ఛు రిజర్వు ఫారెస్టులనే ఖనిజ తవ్వకాలకు, ఇతర క్వారీలకు కేటాయిస్తున్నారు. విశాఖ మన్యం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపప్రణాళిక మన్యం వంతాడ, ఏజెన్సీ వరకూ జరిగిన పరిణామాలు ఇందుకు నిదర్శనం కాగా..వన్యప్రాణులు జనం బాట పట్టడానికి ఇదో కారణం.

ఆహార పిరమిడ్‌లో ప్రాథమిక లబ్ధిదారులు శాకాహార జంతువులు, వాటిపై ఆధారపడే మాంసాహారులు వీటిని నియంత్రించే పులి, చిరుత, సింహం. ఆహార సైకిల్‌కు భంగం అనిపించిన పరిస్థితుల్లోనూ వన్యప్రాణులు పక్కచూపు చూస్తాయి. మన్యం చేరువగా ఉన్న ఈ ప్రాంతంలో పాడిపశువులు, అడవి పందులు, కణుజులు, గొర్రగేదెలు పులి పరిశీలనలో ఉండడం వల్లే ఇన్నిరోజులు తిష్ఠ వేసిందనుకుంటున్నారు.

బైనాక్యులర్‌లో కనిపించినంత కంటి దృష్టి ఉండే పెద్దపులి చురుకుదనమూ అంతే.. తనచుట్టూ జరుగుతున్న అలికిడిని ఎంతదూరంలో ఉన్నా పసిగడుతోందని భావిస్తున్నారు.




అడవికి మళ్లేలా...

పులి అని గుర్తించినప్పటి నుంచి దానిని అడవిలోకి పంపే దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాం. యుక్త వయసులో ఉన్న మగ పులి అది. తెలివిగానూ తిరుగుతోంది. ఒక ప్రాంతానికి పరిమితమై సంచరించడం లేదు. అందుచేత దాని గమనాన్ని పరిశీలిస్తూ ఊళ్లలోకి రాకుండా పెట్రోలింగ్‌ చేయడమే కీలకం. ఇప్పటివరకు అది పశువులనే వేటాడింది. ప్రజలకు హాని కలగకుండా చూస్తాం.

-సెల్వం, వన్యప్రాణి విభాగం డీఎఫ్‌వో









Friday, June 10, 2022

వయాగ్రా

 లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు వయాగ్రా తీసుకుంటూ ఉంటారు ఎక్కువమంది. అంతేకాకుండా లైంగిక సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఎక్కువగా వయాగ్రా వాడటం లాంటివి చేస్తూ ఉంటారు. అది కూడా వైద్యుల సూచన మేరకు మాత్రమే అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా లైంగిక సామర్థ్యం పెంచడంలో ఎంతో పాపులర్ అయిన వయాగ్రా పొరపాటున తయారుచేయబడిన ఒక ఔషధం అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.


శాస్త్రవేత్తలు ఎప్పుడూ ఏదో ఒక వ్యాధికి మందు కనుగొనడానికి ఎన్నో రకాల పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి సమయంలో పొరపాటున మరో ఔషధాన్ని కనుగొనడం లాంటివి ఎన్నో సార్లు జరిగాయి. ఇప్పటి వరకు చాలా ప్రొడక్ట్స్ ని కూడా పొరపాటున కనుగొన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో పాపులర్ అయ్యాయి. అలాగే ఇక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న వయాగ్రాని కూడా పొరపాటున కనుగొన్నారట శాస్త్రవేత్తలు.

ఆంజైన అనే ఒక హృదయ రోగానికి మెడిసిన్ తయారు చేసేందుకు బ్రిటన్ ఫైజర్ సంస్థ శాస్త్రవేత్తలు రెండు దశాబ్దాల క్రితం ఒక పరిశోధన ప్రారంభించారట. ఈ క్రమంలోనే ఒక ఔషధాన్ని కనుగొని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారట. ఇక క్లినికల్ ట్రయల్స్ లో యువకుల జననాంగం అసాధారణ రీతిలో ఉద్రేకం కావడం గమనించి ఇక దీని పై మరింత ప్రత్యేకమైన దృష్టి పెట్టి చివరికి వయాగ్రా తయారు చేశారట. పొరపాటున తయారు చేయబడిన ఈ ఔషధం 1998 లో ఫైజర్ సంస్థకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది అని చెప్పాలి.

Sunday, June 5, 2022

కోతుల మరణం



సహజంగా సృష్టిలోని జీవరాసులు ఏవి చనిపోయిన వాటి కళేబరాలను మనం చూస్తుంటాము. వాటి షవశేషాలను చూస్తుంటాము. కాని కోతుల కళేబరాలు ఎక్కడ క


నిపించవు. ఎందుకు ? ... అవి మరణిస్తాయని వాటికి వారం ముందే తెలిసిపోతుంది అంట. అలా తెలుసుకున్నాక ఎవరి కంట పడకుండా, సంచారం లేనిచోట ఏ ఆహారం తీసుకోకుండా, తనకు కావలసిన గుంతను తవ్వి అందులో పడుకుండి పోతాయట. అవి చనిపోయాక భూమి తనంతట అదే మట్టితో కప్పేస్తుంది. ఆ ఒక్క వారం అవి తపస్సు చేస్తాయి. సాధారణంగా ఎవరైనా గెంతుతుంటే లేక అల్లరి చేస్తుంటే కోతులతో పోలుస్తాము. ఒక్క నిమిషం ఒకచోట కూర్చోడు కోతిలాగా గెంతుతూనే ఉంటాడు అని. అలాంటిది కోతులు ఒక వారం ఒకే చోట కదలకుండా ఉండిపోతాయంటే ఆశ్చర్యం వేసింది.



 ఆంజనేయుడు శ్రీ రాముడు వద్ద అడిగి పొందిన వరం అని... మరణం ముందుగా గ్రహించి ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా... పుట్టలోని జీవాలకు ఆహారంగా మారాలి. నా దేహం ఎవరి కంట పడనీక అని వరం అడిగాడు. ఆ హనుమయ్య, అందుకే ఒక్క కోతి ప్రమాదంలో చనిపోయినా మిగతా కోతలు కలిసి పుట్టమన్ను ఉన్న చోటుకు తీసుకుని వెళ్లి దేహం పూర్తిగా కప్పబడేవరకు కదలిరావట. అందుకే కోతులకు ఇష్టమైన అరటిపండ్లు అందివ్వాలని అంటారు. అలాగే మీరు రామాయణం చదువుతున్నా లేక ఎక్కడైనా రామాయణ పారాయణం జరుగుతుంటే అక్కడ కోతి ప్రత్యక్షమౌతుందని విన్నాను. అందుకేనేమో హనుమను మించిన భక్తుడు లేడు అంటారు. దేవుడు ఉన్నాడు అనడానికి ఇదొక ఉదాహరణ. మీరే

నాడులు

 సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

వెన్నెముక పొడవునా ఉండే శ క్తి కేంద్రాలను చక్రాలు అంటారు. ఇవి నాడీ వ్యవస్థ ఆధారితంగా ఉంటాయి. కటిభాగం నుంచి మొదలై కపాలానికి చేరతాయి. వీటిలో సహస్రార చక్రం అన్నింటికన్నా కీలకమైనది. వెన్నెముకలో సుషుమ్న, ఇడ , పింగళ అనే ప్రధాన కేంద్రాలు ఉంటాయి. జీవ శక్తికీ, ప్రాణశక్తికీ కేంద్రంగా ఈ చక్రాలను పరిగణిస్తారు. స్థూల శరీరానికి సంబంధించిన ఒక మౌలిక అంశమే ప్రాణం. ప్రాణశక్తిని చైతన్యపరిచే ఈ చక్రాలే జీవితానికి మూలం.



ఈ సప్త చక్రాలు ఎక్కడ ఉంటాయి? వాటి పేర్లేమిటి?

ఈ ఏడు ప్రధాన చక్రాలలో మొదటిది మూలాధారం. ఇది వెన్నెముక అట్టడుగు పూసకు దగ్గరగా ఉంటుంది. జననాంగానికీ, పురీషనాళానికీ మధ్య ప్రదేశంలో ఉంటుంది. రెండవది, స్వాధిష్ఠానం. జననాంగానికి కొంచెం పైన ఉంటుంది. మూడవది మణిపూరం. అది బొడ్డుకింద ఉంటుంది. నాలుగు అనాహతం. ఇది ఉరఃపంజరంలో పక్కటెముకలు కలిసే ప్రాంతంలో ఉంటుంది. అయిదవ చక్రం విశుద్ధి. అది కంఠం కింద ఉండే గుంట ప్రాంతంలో ఉంటుంది. ఆజ్ఞా చక్రం ఆరవది. అది కనుబొమల మధ్య ఉంటుంది. ఏడవ చక్రం సహస్రార చక్రం. దీన్ని బ్రహ్మ రంధ్రం అని కూడా అంటారు. నడినెత్తి మీద ఉంటుంది. శిశువు జన్మించినప్పుడు ఇది మెత్తటి ప్రాంతంగా ఉంటుంది.

యోగా సాధకుడు ఏఏ చక్రాల్లో ఉన్నాడో... ఆయా చక్రాలు కొన్ని సూచనలు ఇస్తాయి. తద్వారా ఆ చక్రాలు జాగృతి అయినట్లు భావించుకోవాలి. అవేమిటంటే..

1. మూలాధార చక్రము - మన దగ్గర లేని పదార్థాల వాసనలు రావడం, రతిక్రీడ దృశ్యాలు

2. స్వాధిష్ఠాన చక్రము - ఇష్టపదార్ధాల రుచులు గుర్తుకి రావడం, గుప్తనిధుల దృశ్యాలు

3.మణిపూరక చక్రము - అన్ని రకాల ప్రమాదాలు కనిపించటం

4. అనాహత చక్రం - ప్రమాదాలు జరిగే ప్రాంతాలు తరచుగా కనిపించడం

5. విశుద్ధి చక్రము - వివిధ రకాల శబ్దాలు వినబడటం

6.ఆజ్ఞా చక్రము - ఓంకార నాదం వినబడటం

7. గుణ చక్రం - త్రిగుణాలు హెచ్చుతగ్గులు రావడం

8. కర్మచక్రం - వివిధ రకాల ఆయుధాలు కనబడటం త్రిశూలం, ఖడ్గం ,రామ బాణం, చక్రం ,బ్రహ్మదండం సందర్శనం

9. కాలచక్రం- ప్రేత ఆత్మ దర్శనాలు, త్రికాల జ్ఞానం

10. బ్రహ్మ చక్రం-దశ మహా విద్య దేవతల దర్శనం

11. సహస్రార చక్రం - కర్పూరం సుగంధ పరిమళాలు వాసనలు రావటం

12. హృదయ చక్రం- హనుమాన్/అనంత పద్మనాభుని దర్శనాలు, ఇష్టలింగం రావటం

13. బ్రహ్మరంధ్రము - కపాలం దర్శనాలు, త్రి గ్రంధులు - త్రిమూర్తులు దర్శనాలు

అలాగే మనము ఏఏ చక్రాల శుద్ధిలో ఉన్నామో తెలియాలంటే ఈ రకమైన అనుభవాలు కలుగుతాయి.

1. మూలాధార చక్రము - మనకు సంబంధం లేకుండా కామ విషయాలలో ఇరుక్కోవటం, శరీరం తేలికగా గాలిలో ఎగరడం

2. స్వాధిష్ఠాన చక్రము -వాంతులవడం, ధన సంబంధ విషయాల్లో ఇరుక్కోవటం, నీళ్ల విరోచనాలు అవ్వడం

3. మణిపూరక చక్రము - విపరీతమైన వేడి బొడ్డు ప్రాంతంలో నొప్పి, అన్ని రకాల ప్రమాదాలు కనిపించటం

4. అనాహత చక్రం - విపరీతమైన ధ్యానం చేయడం, జపాలు పూజలు చేయాలని అనిపించటం

5. విశుద్ధి చక్రము - చెవిలో సముద్ర హోరు,గాలి హోరు, నీటి సవ్వడి, నీటి అలల శబ్దాలు వినిపించడం, ఏదో చేయాలని తీవ్రమైన జ్ఞాన సంబంధ వాంఛలు కలగడం

6. ఆజ్ఞా చక్రము - కనుబొమ్మల మధ్య కోడిగుడ్డు ఆకారంలో శ్వేత జ్యోతి దర్శనం

7. గుణ చక్రం - పరోపకారార్ధం ఇదంశరీరం - ఇతరుల కోసం దీనుల కోసం ఏదైనా చేయాలని బలంగా అనిపించడం

8. కర్మచక్రం - ధర్మం పాటించాలి అని అనిపించటం, సత్ప్రవర్తన కలిగి ఉండటం

9. కాలచక్రం- చావు మరణ, మృత్యు భయాలు భయపడటం, ప్రేతఆత్మ దర్శనాలు పొందుట

10. బ్రహ్మ చక్రం- వివిధ రకాల తత్వం, ఆత్మ, బ్రహ్మ జ్ఞానం కోసం పరితపించడం భూమండలం వివిధ లోకాల దర్శనం

11. సహస్రార చక్రం - మలము నుండి కర్పూర వాసన, శరీరం నుండి సుగంధ పరిమళం వాసన

12. హృదయ చక్రం- ఏకైక ఇష్ట కోరిక ఏమిటో తెలియటం, ఏకైక కోరిక జిజ్ఞాస

13. బ్రహ్మరంధ్రము - మహా మృత్యు దర్శన జిజ్ఞాసలు కలగడం. త్రి గ్రంధులు - ఆయా లోకాలు దర్శనం అనగా శివ విష్ణు బ్రహ్మ లోకాల దర్శనం.

నాగ దోషం

 నాగదేవత ఆగ్రహిస్తే... సర్పదోషం కలుగుతుంది. సర్పానికి తలను రాహు అని... తోకను కేతు అని పిలుస్తారు. రాహు ఎప్పుడూ ఏదో ఒకటి కోరుకుంటుంది, ఆకలితో ఉంటుంది, గందరగోళం చేస్తుంది... కేతు మాత్రం సమస్యల్ని అధిగమిస్తుంది, మోక్షం పొందుతుంది. చుట్టూ ఉన్న పర్యావరణాన్ని ఎవరైనా నాశనం చేస్తే... రాహుకు ఆగ్రహం వస్తుంది. పండితుల ప్రకారం సర్పాలకు అత్యంత ఎక్కువ శక్తి ఉంటుంది. అవి ప్రకృతి శక్తులను రక్షిస్తూ ఉంటాయి




నాగదోషం పడితే ఏమవుతుంది: రాహు పట్టిన మహిళలు శుభ్రతను ఇష్టపడతారు. హై లైఫ్ స్టైల్ ఉండాలనుకుంటారు. పెళ్లైన తర్వాత కూడా మగవాళ్లను ఆకర్షించాలి అనుకుంటారు. అదే కేతు పట్టిన మగవాళ్లైతే... స్వార్థంతో ఉంటారు. ప్రతి మహిళనూ మోసం చెయ్యాలని చూస్తారు. ప్రయాణాలు ఇష్టపడతారు.

కేతు పట్టిన మహిళలైతే... స్వతంత్రంగా ఉంటారు, అన్నీ స్వయంగా చేసుకుంటారు. వారు తమ భాగస్వామిని త్వరగా కోల్పోతారు. అంటే విడాకులు ఇవ్వడం లేదా వితంతు అవ్వడం వంటివి జరుగుతాయి. కేతు పట్టిన మగవాళ్లైతే మతపరమైన, తత్వ భావనలతో ఉంటారు. తమ భాగస్వాములకు వారు మర్యాదగా, గౌరవసూచకంగా ఉండరు. వారు విడాకులు తీసుకున్న వారిని, వితంతువులను ఆకర్షించేందుకు యత్నిస్తారు.

నాగదోషానికి కారణాలు: అంత్యక్రియలు ఆలస్యంగా జరిగినా, అపరిచితుల ద్వారా జరిగినా ఈ దోషం చుట్టుకునే ప్రమాదం ఉంటుంది. అంత్యక్రియలప్పుడు చితిపై శరీరంలోని అన్ని అవయవాలూ కాలకపోతే ఈ దోషం రావచ్చు. వ్యక్తి ప్రమాదంలో, బాంబ్ దాడిలో చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా, హత్య జరిగినా, విషం తాగి చనిపోయినా సర్ప దోషం పట్టుకునే వీలుంది. పూర్వీకులు పుట్టకముందే బిడ్డను చంపేస్తే అది కూడా సర్పదోషానికి దారితీస్తుంది. పూర్వం తమ తాలూకు వారు ఎవరైనా బాణామతి, చిల్లంగి లాంటివి చేసివుంటే ఇప్పుడు వీరికి సర్పదోషం పట్టుకుంటుంది.

నాగదోషం రాకుండా ఏం చెయ్యాలి: విష్ణుమూర్తిని పూజించాలి. చండల యోగ నిర్వాణ పూజ చెయ్యాలి. అలాగే 11 ముఖాల రుద్రాక్ష మాల ధరించాలి. పసుపు రంగు మణి (yellow sapphire)ని ధరించాలి. గణపతిని పూజిస్తే ఒత్తిడి తగ్గుతుంది. పాజిటివిటీ కోసం చండల గ్రహ శాంతి పూజ చెయ్యించాలి. అలాగే... తేనె, పసుపు, పసుపురంగు స్వీట్లను టీచర్లకు, బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. పేదలకు పసుపు రంగు వస్తువులు దానం చెయ్యాలి. పక్షులు, జంతువులకు ఆహారం పెట్టాలి. చంద్ర గ్రహ మంత్రం జపించాలి. (ప్రతీకాత్మక చిత్రం)


నాగదోషం ఎలా నివారించుకోవాలి: సర్ప పరిహార పూజ చెయ్యించాలి. ఆ తర్వాత స్నానం చెయ్యాలి. మహాశివుణ్ని రోజూ పూజించాలి. శివలింగంపై నీరు, పాలు పొయ్యాలి. ఓం మనఃశివాయ అని 108 సార్లు రోజూ జపించాలి. నుదుటిపై చందనం రాసుకోవాలి. పంచముఖ సర్ప విగ్రహానికి ప్రతి మంగళవారం, శనివారం పూజ చెయ్యాలి. ఇలా 18 వారాలు చెయ్యాలి. ఇంట్లో నెమలి పించం ఉంచుకోవాలి. నాగపంచమి నాడు మహాభారతం చదవాలి. జ్యోతిష పండితుల సూచనలతో పంచ లోహాల ఉంగరం తొడగాలి. నవగ్రహ ఆలయాలు, రామేశ్వరం, కుంబకోణం లాంటి ఆలయాల్లో ప్రార్థనలు చెయ్యాలి. 42 బుధవారాలు... పప్పులను పేదలకు దానం చెయ్యాలి. (ప్రతీకాత్మక చిత్రం)



నాగదోషం ఉంటే ఏం చెయ్యకూడదు: నాగదోషం ఉంటే... ఉపవాస రోజుల్లో అంటే ఏకాదశి, శివరాత్రి, అష్టమి, గోగులాష్టమి రోజుల్లో ఏ పూజలు చెయ్యకూడదు. ఇంట్లో పూజ చెయ్యకూడదు. నాగ ఆలయాల్లో నమస్కారం పెట్టకూడదు. పూజ చేసేటప్పుడు కుటుంబ సభ్యులంతా తప్పక ఉండాలి. పీరియడ్స్ సమయాల్లో మహిళలైతే... నాగ ఆలయాల్లోకి వెళ్లకూడదు. మహిళల పీరయడ్స్ సమయాల్లో పూజలు చెయ్యకూడదు. గర్భిణీ అయిన స్త్రీలు నాగ ఆలయాలకు వెళ్లకూడదు. భోజనానికి ముందే పూజ చెయ్యాలి. (ప్రతీకాత్మక చిత్రం) (image credit - google play store) (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)




కళ్ళ మచ్చలు

 


అయితే, మీ రక్తంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండటం మీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బుల నుండి స్ట్రోక్ వరకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ పెరిగే సంకేతాలను గుర్తించక పోవడంతో దీని ప్రమాదం నేడు పెను ముప్పుగా మారింది. అంటే మీ కొవ్వు స్థాయి తెలియకపోవడం వల్ల మీ గుండె ప్రమాదంలో పడుతుంది. కళ్ల ద్వారా శరీరంలో కొవ్వు పెరుగుతున్నహెచ్చరికను గమనించవచ్చని వైద్యులు చెబుతున్నారు.హోవర్ చుక్కలు.. కళ్లలో కనబడే కదిలే స్పైడర్ వెబ్ లాంటిది. మీ దృష్టిలో నల్ల మచ్చలు లేదా స్ట్రీక్స్ (ఫ్లోట్స్) రెటీనా నరాల అడ్డంకికి సంకేతం. రెటీనా మీ కంటి వెనుక భాగంలో కాంతి-సున్నితమైన కణజాలం, రెటీనా ధమని ,రెటీనా నరాల ద్వారా రక్త ప్రవాహాన్ని అందుకుంటుంది. ఆ నరం మూసుకుపోయినప్పుడు దానిని రెటినా నెర్వ్స్ బ్లాకేజీ అంటారు.

నరాలు మూసుకుపోయినట్లయితే రక్తం, ద్రవం రెటీనాలోకి లీక్ అవుతాయి. ఇది జరిగినప్పుడు రెటీనా మాక్యులా ప్రాంతం ఎర్రబడినది కావచ్చు. వాపు మీ కేంద్ర దృష్టిని ప్రభావితం చేస్తుంది. రెటీనా డిటాచ్మెంట్ ఉన్నవారిలో ఊబకాయం ఒక సాధారణ లక్షణం. సెంట్రల్ రెటీనా డిటాచ్‌మెంట్ ఉన్నవారిలో కంటి వ్యాధి లేనివారి కంటే రెండు రెట్లు ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుందని 2008 అధ్యయనం కనుగొంది. రెటీనా నిర్లిప్తత ఇతర లక్షణాలు ఒక కంటిలో అస్పష్టమైన దృష్టి ఒక కంటిలో అస్పష్టమైన దృష్టి ప్రభావితమైన కంటిలో నొప్పి కలిగి ఉంటుంది

లక్షణాలు ఏమిటి? : మీరు కంటి తేలికలను ఎదుర్కొంటున్నారో లేదో మీకు తెలియకపోతే ఫ్లోట్‌లను గుర్తించడంలో సహాయపడే కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఫ్లోట్‌లు చిన్న గీతలు, హుక్స్, స్పైడర్ వెబ్ నమూనాలు లేదా ఇతర క్రమరహిత ఆకారాలు వంటి విభిన్న ఆకృతులను కలిగి ఉంటాయి. అవి థ్రెడ్‌ల వలె కనిపించవచ్చు. అవి దాదాపుగా కనిపిస్తున్నాయి. మీరు మీ కళ్ళను కదిలించినప్పుడు అవి చీకటి మచ్చలు లేదా కదిలే మచ్చల రూపంలో కూడా ఉండవచ్చు. మీరు ఈ ఫ్లోట్‌లను స్పష్టంగా చూడటానికి ప్రయత్నించినప్పుడు, అవి వీక్షణ నుండి త్వరగా దూరంగా ఉంటాయి. స్క్రీన్‌లు, నీలి ఆకాశం లేదా తెల్లటి గోడ వంటి ప్రకాశవంతమైన నేపథ్యాలకు వ్యతిరేకంగా ఐ ఫ్లోట్‌లు తరచుగా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఫ్లోట్‌ల తీవ్రత, పరిమాణం ,ఆకృతి వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి

రెటీనా ధమని మూసివేతను స్ట్రోక్ అని కూడా అంటారు. ఇది కంటిలోని నరాల కణాల పనిచేయకపోవడానికి కూడా దారితీస్తుంది. గరిష్టంగా దృష్టిని కోల్పోవచ్చు లేదా దృష్టిని మరింత దిగజార్చవచ్చు. రెటీనా నరాల మూసుకుపోయిన తర్వాత బాధితులు ఒక సంవత్సరంలోపు దృష్టిని తిరిగి పొందవచ్చు. కానీ దృష్టి నాణ్యత ఒకేలా ఉండదు. పునరావృతం కాకుండా నిరోధించడానికి మీ కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ ,బ్లడ్ ప్రెజర్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ జీవనశైలి, ఆహారం, వ్యాయామం కుటుంబ చరిత్ర ఈ ఆరోగ్య పరిస్థితులను అదుపులో ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
వైద్యుడిని ఎప్పుడు చూడాలి? : మీరు సాధారణం కంటే ఎక్కువగా కళ్లలో తేలియాడుతున్నట్లు, కళ్లలో కాంతి లేదా మీ దృష్టిలో ఏ వైపునైనా చీకటిని గమనించినట్లయితే, మీరు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. కళ్లలో తేలియాడే వ్యక్తులు కూడా అధిక కొలెస్ట్రాల్ కలిగి ఉండవలసిన అవసరం లేదు. మీలో ఎక్కువ కొవ్వు ఉందో లేదో తెలుసుకోవడానికి ఇది ఒక సంకేతంగా కూడా తీసుకోబడుతుంది. కొవ్వును నిర్ధారించడానికి వైద్యులు రక్త పరీక్ష చేస్తారు. దానిని నిరోధించే మార్గాలు ఏమిటి? : అధిక కొవ్వు పదార్ధాలను తినడం వల్ల కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది కాబట్టి మీ ఆహారాన్ని ఆరోగ్యకరమైన ఆహారంగా మార్చుకోవడం చాలా ముఖ్యం. ఓట్స్, యాపిల్స్, జీడిపప్పు ,బీన్స్ వంటి ఆహారాలలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మీ శరీరం కొవ్వును గ్రహించకుండా నిరోధిస్తుంది.
అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో రోజువారీ వ్యాయామం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ధూమపానం, మద్యపానం మానుకోండి. ఒత్తిడి లేని వైఖరిని కలిగి ఉండటానికి ప్రయత్నించండి. ఈ మార్పులన్నీ ఆరోగ్యకరమైన, కొలెస్ట్రాల్ లేని జీవితానికి దారి తీస్తాయి.(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them


 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...