Wednesday, April 27, 2022

టైమ్ ట్రావెలింగ్

 

ప్యారలల్‌ టైమ్‌లైన్స్‌’తో మాత్రమే భూత, భవిష్యత్తులోకి ప్రయాణం

కెనడా శాస్త్రవేత్తల తాజా అధ్యయనం

కాంతి వేగాన్ని అధిగమిస్తే గతంలోకి

గామా కిరణాలను తట్టుకొనే స్పేస్‌షిప్‌ కీలకం

'ఆదిత్య 369' సినిమా చూశారా?

టైమ్‌ మెషీన్‌లో హీరో, హీరోయిన్లు రాయలవారి కాలంతో పాటు భవిష్యత్తులోకి వెళ్లి వస్తారు. మూవీ కాబట్టి ఎన్నైనా ఊహించుకోవచ్చు. నిజజీవితంలో ఇలాంటివి ఆచరణ సాధ్యం కాదని అనుకోవచ్చు. అయితే, 'టైమ్‌ ట్రావెల్‌’ సాధ్యాసాధ్యాలపై ఐన్‌స్టీన్‌ నుంచి స్టీఫెన్‌ హాకింగ్‌ వరకు ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించారు. తాజాగా, టైమ్‌ ట్రావెల్‌ సాధ్యమేనని కెనడాలోని బ్రాక్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అయితే, సమాంతర కాలక్రమంతో (ప్యారలల్‌ టైమ్‌లైన్స్‌) మాత్రమే దీన్ని ఆచరణలోకి తీసుకురావచ్చని వెల్లడించారు.

– నేషనల్‌ డెస్క్‌

ఎలా అర్థం చేసుకోవాలి?

'టైమ్‌ ట్రావెల్‌’ అనేది ఒక విస్తృతమైన కాన్సెప్ట్‌. దీన్ని అర్థం చేసుకునేందుకు ఓ ఉదాహరణ చెప్పుకోవచ్చు. సుదూర విశ్వంలో ఏవైనా రెండు నక్షత్రాలు ఢీకొని పేలితే, ఆ పేలుడు కాంతి మన కండ్లకు చేరుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంటే, ఇప్పుడు మనం అంతరిక్షంలో ఏదైనా పేలుడు కాంతిని చూస్తే… అది ఇప్పుడు కాకుండా ఎన్నో ఏండ్ల కింద పేలినట్లు లెక్క. అంటే గతించిన కాలంలో జరిగిన సంఘటనను ఇప్పుడు మనం వర్తమానంలో కండ్లారా చూస్తున్నా మన్నమాట. ఒకవేళ, అపసవ్య దిశలో (రివర్స్‌లో) కాంతి కంటే వేగంగా పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకొంటే భూమిపై వర్తమానం జరుగుతుండగానే.. పేలుడును ప్రత్యక్షంగా చూడగలం. ఇదే 'టైమ్‌ ట్రావెల్‌’ మూల సూత్రం.

ఎలా సాధ్యం?

ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం.. ద్రవ్యరాశి గల ఏ వస్తువూ కాంతికన్నా వేగంగా ప్రయాణించ లేదు. ఈ సృష్టిలో కాంతిదే అత్యధిక వేగం. కాంతి ప్రయాణం, ప్రవాహం వల్లే… కాలం కరిగిపోతు న్నట్టు భావిస్తారు. కాంతి ప్రయాణానికి సమానంగా మనమూ ప్రయాణిస్తే… అప్పుడు కాలవేగం స్థిరమవుతుంది. అంటే కాలంలో మార్పు ఉండదు. సాపేక్ష సిద్ధాంతాన్ని దాటుకొని కాంతి కంటే వేగంగా ప్రయాణిస్తే, భూత, భవిష్యత్తు కాలాలకు చేరుకో వచ్చు. సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల కంటే వేగంగా ప్రయాణిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇంత వేగంతో మనిషి ప్రయాణిస్తే రక్తప్రసరణ, అవయవాల మధ్య సమన్వయం కోల్పోయి మరణిస్తాడు. అందుకే, విశ్వంలోని హానికర గామా కిరణాలను తట్టుకొంటూ.. గురుత్వాకర్షణ, వేగాన్ని స్థిరపరిచే ప్రత్యేక స్పేస్‌షిప్‌ను అభివృద్ధి చేస్తే 'టైమ్‌ ట్రావెల్‌’ సాధ్యమవ్వొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

నిన్నటి సూర్యోదయాన్ని మళ్లీ చూడాలంటే..

వేల ఏండ్ల కిందట భూమిపై జరిగిన ఘటనలు ఇప్పటికీ అంతరిక్షంలో కాంతి రూపంలో వెళ్తూనే ఉంటాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. వాటిని మనం కండ్లారా చూడాలంటే, కాంతికంటే వేగంగా ప్రయాణించాలి. శూన్యంలో ఆ సంఘటనలు ఎంత దూరం ప్రయాణించాయో… అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే… అప్పుడు ఆ కాలంలోకి చేరుకోవచ్చు. మంగళవారం సూర్యోదయాన్ని కండ్లారా చూడాలంటే, 24 గంటలు వెనక్కి వెళ్లాలి. అంటే ఈ సమయంలో కాంతి ప్రయాణించిన 2,592 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని సెకను కంటే తక్కువ వ్యవధిలోనే అధిగమించాలి. అప్పుడే నిన్నటి సూర్యోదయాన్ని చూడగలం.

గతాన్ని మార్చవచ్చా?

గతంలోకి ప్రయాణించిన తర్వాత అక్కడి దృశ్యాలను మనం చూడగలమే తప్ప, వాటిలో ఎలాంటి మార్పు చేయలేమని పరిశోధకులు తెలిపారు. భూత, వర్తమాన కాలాలకు చెందిన ప్యార్‌లల్‌ లైన్స్‌ను ఆధారంగా చేసుకొని టైమ్‌ ట్రావెల్‌ను ఆచరణలో పెట్టొచ్చని బ్రాక్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

'టైమ్‌ ట్రావెల్‌’ అంటే?

కాలంలో ప్రయాణించడాన్ని స్థూలంగా 'టైమ్‌ ట్రావెల్‌’గా చెప్పొచ్చు. దీని సాయంతో గతవారం జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌ను ప్రేక్షకుల మధ్య స్టేడియంలో ఇప్పుడు కూర్చొని చూడొచ్చు. దీనికోసం కాలచక్రంలో 168 గంటలు వెనక్కి ప్రయాణించాల్సి ఉంటుంది.


పధి పరీక్షలు

 కాని ఒకప్పుడు పరీక్షలు ఎంతో చిత్ర విచిత్రంగా జరిగేవి. రకరకాల సెంటిమెంట్లు ఉండేవి. ఎన్నో సరదాలు చోటు చేసుకునేవి. ఈనాటి పరీక్షల సందర్భంగా

ఆనాటి పరీక్షల రీవిజిట్‌... కొంచెం రిలీఫ్‌ కోసం.

ఇప్పుడేముంది పిల్లలు ఛాయిస్‌తో సహా అన్నీ రాసేసేంత చదివేస్తున్నారుగానీ పూర్వం పరీక్షలంటే ప్రాణ హరీక్షలే. టీచర్లు రెడ్‌ ఇంక్‌ పెన్‌ తీసేది ఈ పేపర్లు దిద్దడానికే. సరిగ్గా మధ్యకు మడిచిన ఆన్సర్‌ షీట్ల కట్టతో సార్లు క్లాసులో అడుగుపెడితే పిల్లల పై ప్రాణాలు పైనే పోయేవి. టీచర్లు, సార్లు కూడా పిల్లల్ని టెన్షన్‌ పెట్టడంలో సృజనాత్మకత చూపేవారు. మొదట క్లాస్‌ టాపర్‌ పేపరు ఇచ్చేవారు. ఆ తర్వాత సెకండ్, థర్డ్‌ వచ్చినవాళ్ల పేపర్లు.

25కు పదిహేను మార్కులు తెచ్చుకున్నవారందరూ సేఫ్‌ జోన్‌లో ఉండేవారు. 15 కంటే తక్కువ వచ్చిన వారి పేపర్లు రాగానే సార్ల చేతిలో బెత్తం ప్రత్యక్షమయ్యేది. 14,13,12... మార్కులు తగ్గేకొద్దీ వీపులు చిట్లుతూ ఉండేది. చివరి పేపర్‌ వైపు అందరూ బిక్కుబిక్కుమంటూ చూసేవారు. ఆ పేపరు ఒకటో రెండో మార్కులు వచ్చిన స్టూడెంట్‌ది. ఆ స్టూడెంట్‌ పెట్టే పెడబొబ్బలను వినలేక స్కూల్‌ అటెండర్‌ టంగ్‌ టంగ్‌మని బెల్‌ కొట్టేస్తే తప్ప కోటింగ్‌ నిలిచేది కాదు.

పది మొదలు.. టెన్షన్‌ మొదలు
సరే. పదో క్లాసులో చేరినప్పటి నుంచి ఫైనల్‌ ఎగ్జామ్స్‌ టెన్షన్‌ విద్యార్థుల్లో ఊరూ వాడా దానయ్య దానమ్మ అందరూ ప్రవేశ పెట్టేవారు. టెన్త్‌ ఫెయిల్‌ కావడం అవమానం. ఫెయిల్‌ తప్పక చేసే రెండు సబ్జెక్ట్‌లు ఇంగ్లిష్, గణితం ఎలాగూ ఉండేవి. ఒకరికి ఇంగ్లిష్‌ అంటే కోల్డ్‌ అండ్‌ ఫీవర్‌. మరొకరికి లెక్కలంటే వామ్టింగ్స్‌ అండ్‌ మోషన్స్‌. ఆ రోజుల్లో ఎంత పేద తల్లిదండ్రులైనా టెన్త్‌ క్లాస్‌కు వచ్చిన తమ పిల్లల్ని ట్యూషన్‌లో చేర్పించేవారు. లెక్కలు రాకపోతే స్కూల్‌లో ఎలాగూ దెబ్బలు పడేవి.

ట్యూషన్‌లో కూడా అవే లెక్కలు రావు కనుక అక్కడా దెబ్బలు పడేవి. సాయంత్రం ఆరు నుంచి ఎనిదిన్నర వరకూ వదలకుండా ట్యూబ్‌లైట్ల వెలుతురులో తెగ చదివించేవారు. వారంలో ఆరురోజులు స్కూల్లో చదివితే ఆదివారం ట్యూషన్‌లో చదవాల్సి వచ్చేది. ఇంగ్లిష్‌ పొయెమ్‌ అప్పజెప్పడం అన్నింటి కంటే పెద్ద టార్చర్‌.

మొదటి రెండు లైన్లు చెప్పాక మూడో లైను దగ్గర ఆగి దిక్కులు చూస్తే చాక్‌పీస్‌ ముక్క గురి చూసి వచ్చి ముక్కుకు తగిలేది. చెక్క డస్టర్‌ నెత్తిని టప్‌టప్‌మని తాకేది. వెదురు బెత్తం దూకుడు ఏకుడు మీదుండేది. ట్యూషన్లు కాకుండా పాఠశాల, రాఘవేంద్ర, బూన్‌ గైడ్లు తల కింద పెట్టుకుని పడుకున్నా ఏమీ ఎక్కేది కాదు. టెన్త్‌ పాసైతే కాలేజీకి వెళ్లొచ్చు. కాని టెన్త్‌ పాసవడం చాలా పెద్ద విషయం. 100కి 35 మార్కులు తెచ్చుకోవాలి. ఆ రోజుల్లో విద్యార్థులది 35 మార్కుల కల.

పరీక్షలు... క్వశ్చన్‌ పేపర్లు
ఎగ్జామ్స్‌ మొదలవుతుండగా టెన్త్‌ చదివే పిల్లల డాబాల మీద, పెరళ్లల్లో బల్బులు లాగి వెలిగించేవారు. రాత్రిళ్లు తల్లులు టీ పెట్టి ఇచ్చేవారు. కంబైన్డ్‌ స్టడీలో పిల్లలు ఎవరేం చదువుతున్నారో తెలియనంత పెద్దగా చదివేవారు. ఆ తర్వాత హాల్‌టికెట్లు వస్తే వాటిని దేవుడి దగ్గర తప్ప మరెక్కడా పెట్టేవారు కాదు. దేవుడికి ఇదంతా టెన్షనే. అయితే మెయిన్‌ పేపర్‌ కాకుంటే బిట్‌ పేపర్‌గా ఆ రోజుల్లో పరీక్షలు సాగేవి.

మెయిన్‌ పేపర్‌ సరిగ్గా రాయలేకపోయినా వారినీ వీరిని అడిగి బిట్‌ పేపర్‌ ఏ, బి, సి, డిలు పెడితే ఎలాగోలా పాస్‌ అయిపోతామని భావించేవారు. నిజం కూడా. చాలామంది ఇన్విజిలేటర్లు 3 గంటల ఎగ్జామ్‌లో మొదటి రెండున్నర గంటలు స్ట్రిక్ట్‌గా ఉండి చివరి అరగంట చూసీ చూడనట్టు ఉండేవారు. అప్పుడు అందరూ బిట్లు చెప్పుకునేవారు. ఈలోపు ఏ గారాలబిడ్డ తండ్రో బిట్‌ పేపర్‌ సంపాదించి బయట నుంచి మొత్తం 30 బిట్ల ఆన్సర్‌ను ఒక చిట్టి మీద రాసి లోపల వేయించేవాడు.

అంటే 30కి 30 వచ్చేస్తాయన్నమాట. ఇక సెంటిమెంట్‌ చొక్కా, సెంటిమెంట్‌ పెన్, సెంటిమెంట్‌ ప్యాడ్‌... ఇవన్నీ తప్పనిసరి. పరీక్షలు జరిగినన్ని రోజులు 'పేపర్‌ ఈజీనా టఫ్ఫా' అనే ప్రశ్న వినబడుతూనే ఉండేది. అందరూ ఈజీగా పరీక్ష రాసేస్తే కొందరు స్టూడెంట్స్‌కు నచ్చేది కాదు. టఫ్‌గా వచ్చిన రోజు క్లెవర్లు ముసిముసి గా నవ్వుకుంటూ ఇల్లు చేరేవారు.

జీవితంలో మంచి ఉపాధి పొందడం తప్పనిసరి. కాని ఒక నిర్దిష్ట సమయంలో చూపే తెలివితేటలే మన మొత్తం తెలివికి కొలమానాలు కాబోవు. చిన్న చిన్న తప్పొప్పులు పరీక్షల్లో సహజం. కనుక మనకు వచ్చింది హాయిగా రాసి భారం కాలం మీద వేయడమే పరీక్షలు జరిగేన్ని రోజులు చేయవలసిన పని.

అందరూ బాగా పరీక్షలు రాయాలని కోరుకుందాం.
టెన్త్‌ బాగా చదివి పాస్‌ కావడానికి తల్లిదండ్రులు గిఫ్ట్‌ల ఆశ చూపేవారు. అబ్బాయిలకు సైకిల్‌ కొనిపెట్టడం చాలా పెద్ద గిఫ్ట్‌. అమ్మాయిలకు పట్టుపావడ, పాపిట బిళ్ల, కొత్త గజ్జెలు... ఇలాంటి తాయిలాల వరుస ఉండేది. డబ్బున్న తల్లిదండ్రులు 'నువ్వు పాసైతే వెయ్యి రూపాయలు ఇస్తా' అనేది ఆ రోజుల్లో రికార్డు మొత్తం లంచం. వీరే కాకుండా మేనత్త మేనమామలు కొత్త బట్టలు కొనిస్తామని, హెచ్‌ఎంటి వాచీ అని, తిరపతి తీసుకెళతామని... ఉపాధ్యాయులు కూడా మంచి మార్కులు తెచ్చుకున్నవారికి 'హీరో పెన్‌'కొనిస్తామని హామీ ఇచ్చేవారు. ఇక లాస్ట్‌ ఎగ్జామ్‌ రాసినరోజు సినిమాకు, ఐస్‌క్రీమ్‌కు వంద రూపాయలు ఇవ్వడం అనేది కామనాతి కామన్‌.

Tuesday, April 26, 2022

తెలంగాణ వంటలు

 డబుల్‌కామీట, గులాబ్‌జామ్‌, మిర్చిబజ్జీ, రుమాలీ రోటీ, తెలంగాణ నాటు కోడి కూర, చికెన్‌ధమ్‌ బిర్యానీ, ధమ్‌కా చికెన్‌,

మిర్చి గసాలు, ఆనియన్‌ రైతా, మటన్‌కర్రీ, తలకాయ కూర, బోటీదాల్చా, కోడిగుడ్డు పులుసు, బగారా రైస్‌, మిక్స్‌డ్‌ వెజ్‌ కుర్మా
వైట్‌ రైస్‌, మామిడికాయ పప్పు, దొండకాయ, కాజుఫ్రై, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, ములక్కాడ, కాజు, టమాట కర్రీ
వెల్లిపాయ కారం, టమాట, కొత్తిమీర తొక్కు, మామిడికాయ తొక్కు, పప్పుచారు అప్పడం, పచ్చిపులుసు, ఉలువ చారు క్రీమ్‌,
టమాట రసం, పెరుగు, బటర్‌స్కాచ్‌ ఐస్‌క్రీమ్‌, ఫ్రూట్స్‌ స్టాల్‌, అంబలి, బటర్‌ మిల్క్‌.

Thursday, April 21, 2022

శాస్త్రీయ నామాలు

 జంతువులు-పక్షులు

-పంది – ఆట్రియో డైక్టెలా సుయిడే
-కంగారూ – మాక్రోఫస్ మాక్రోపాడిడే
-నీటిగుర్రం- ఇప్పోకాంపస్ సిగ్నాంథిడే
-గాడిద – ఇక్వియస్ అసినస్
-ఏనుగు – ప్రోబోసిడియా ఎలిఫెంటిడే
-కుక్క – కానస్ ఫెమిలియారిస్
-పిల్లి – ఫిలస్ కాటస్
-కుందేలు – రొడెంటియా రాటస్
-జిరాఫీ – రాఫాకామిలో పార్డాలిస్
-గుర్రం – ఈక్వస్ కబాలస్
-బర్రె – బుబాలస్ బుబాలిస్
-తాచుపాము – నాజా నాజా
-కప్ప – రానా టైగ్రినా
-జలగ – హిరుడినేరియా గ్రాన్యులోజ
-పిచ్చుక – పాస్పర్ డొమెస్టికస్
-చీమ – హైమినోప్టెరస్ ఫార్మిసిడి
-నెమలి – పావో క్రిస్టేటస్
-పావురం – కొలంబియా లివియా
-కాకి – కోర్వస్ కరోనే
-తేనెటీగ – ఏఫిస్ ఇండికా

మొక్కలు
-నారింజ – సిట్రస్ సైనన్సిస్
-చింత – టామరిండస్ ఇండికా
-పైనాపిల్ – అనోనా స్కామోజస్
-అరటి – మ్యూసా పారడైసికా
-జామ – సిడియం గువ
-జీడిమామిడి – అనకార్డియం ఆక్సిడెంటాలిస్
-పసుపు – కుర్‌కుమా లోంగా
-మిరప – క్యాప్సికమ్ ఫ్రూటిసెన్స్
-వరి – ఒరైజా సెటైవా
-వంకాయ – సోలానమ్ మెలాంజినా
-బెండ – అబెలియాస్కస్ ఎస్కూలెంటస్
-తోటకూర – అమరాంథస్ విరిడిస్
-క్యాబేజీ – బ్రాసికా ఒలరేసియా రకం కాపిటేట
-ఆవాలు – బ్రాసికా జెన్షియా
-తేయాకు – కెమెల్లియా సైనన్సిస్
-ఉమ్మెత్త – దతురా మెటల్
-వెదురు – డెండ్రోకాలమస్ కలోస్ట్రాఖియస్
-టేకు – టెక్టోనా గ్రాండిస్
-మర్రి – ఫైకస్ బెంగాలెన్సిస్
-కొబ్బరి – కాకస్ న్యూసిఫెరా

Tuesday, April 19, 2022

easter message

 యేసుక్రీస్తు పుట్టిన నాటి నుండీ మానవాళి చరిత్ర ఆయన చుట్టూనే పరిభ్రమిస్తున్నది. కాలం తనకు ముందు, వెనుక క్రీస్తు నామాన్ని ధరించి సాగుతూ ఉన్నది.


భూమిమీద మరణాన్ని జయించి, శత్రువు తలను చితగ్గొట్టి, పునరుత్థానుడై, నలభై దినాలు ఈ నేలమీదే సంచరించి, దేవుని రాజ్య విషయాలను బోధించి, అనేక ప్రమాణాలను చూపిన ఏకైక దైవ మానవుడు, దేవుని అద్వితీయ కుమారుడు యేసు ప్రభువు! యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడైన రాజు అని అర్థం. ఈ 'రక్షకుడు' రారాజుగా మానవజాతికి శత్రువైన మృత్యువును జయించి, నరకపాత్రులమైన మనం పోగొట్టుకున్న స్వర్గం అనబడే నిత్యానందలోకంలోకి ప్రవేశాన్ని కల్పించాడు! అందుకే .. ఆ పేర్లు!

ఆయన ఆరోహణ కోసం వెళ్ళేముందు యెరూషలేములోని ఒలీవా పర్వతసానువులలో తన శిష్యులను కలసి, వారు చేయవలసిన పనులను వారికి వివరించారు. 'పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చినప్పుడు మీరు శక్తినొందెదరు గనుక ముందుగా యెరూషలేములోనూ, తర్వాత యూదయ, సమరయ దేశములలో, అనంతరం భూదిగంతాల వరకునూ మీరు నాకు సాక్షులైయుందుర'ని వాళ్లతో చెప్పారు. అందుకే, భూ దిగంతాల వరకూ ఈ సత్య శుభవార్త ప్రకటింపబడుతున్నది! వాళ్లు చూస్తుండగానే ఆయన ఆరోహణమై, వాళ్ల కళ్లకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొని పోయింది. వారంతా ఆకాశము తట్టు తేరి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు 'మీ వద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన యేసు ఏరీతిగా పరమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.' అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయంలో ఈ వివరాలున్నాయి.

క్రీస్తు ప్రభువు మృత్యుంజయుడై.. తాను జీవాధిపతి అని, నశించిన దానిని వెదకి రక్షించి నిత్యజీవం ఇవ్వడానికి వచ్చానని రుజువు పరచి ఇప్పటికి ఈ నేల మీద 2000 సంవత్సరాలకు పైగా అయింది! ఆయనకు ముందు చరిత్ర అంతా 'క్రీస్తుకు పూర్వం' అని, తర్వాతి కాలమంతా 'క్రీస్తు శకం' అని చరిత్ర నమోదు చేస్తున్నది. చరిత్రలో ప్రముఖులైన ఎందరో క్రీస్తును గురించి తమ అభిప్రాయాలను ప్రకటించారు. ఫ్రెంచ్‌ అధినేత నెపోలియన్‌ బోనాపార్టే, ప్రపంచ దేశాల స్థాపకుల గురించి చెప్తూ 'ఈ భూమి మీద సామ్రాజ్యాలను స్థాపించిన అలెగ్జాండర్, సీజర్‌ , నేను, చార్ల్‌ మాన్‌ .. యేసుక్రీస్తుతో ఏ విధముగానూ సరి పోలము .. మా మధ్య ఏ పోలికా లేదు, ఆయన 'ప్రేమ' పునాదిగా స్థాపించిన మహా సామ్రాజ్యం అంతమే లేనిది. ఎప్పటికీ నిలిచి ఉండేది! యేసుక్రీస్తు మానవుడు కాదు, మహోన్నతుడు!'

'ప్రేమ, సత్యం, త్యాగం అనే దివ్యమైన సద్గుణాలకు ఉన్నతమైన ప్రమాణాలను సాధించి, జీవించి , చూపించిన యేసుక్రీస్తును నేను ప్రేమించకుండా ఎలా ఉండగలను?' అన్నారు మన గాంధీజీ.
అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ మాటల్లో 'నేను యూదుడనే, గానీ, ఆ నజరేయుని (క్రీస్తు) ప్రకాశవంతమైన ప్రవాహంలో మునిగి పోయాను. క్రీస్తు ప్రభువు వ్యక్తిత్వాన్ని ఏ కలమూ వర్ణించలేదు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వారెవరైనా యేసు సాన్నిహిత్యాన్ని అనుభవించాల్సిందే!'
స్వామి వివేకానంద చెప్పిన మాటలు కూడా చూద్దాం 'యేసుక్రీస్తు దైవ కుమారుడు గనుకనే, దైవ జ్ఞానాన్ని తన మాటల్లోనూ, కార్యాల్లోనూ చూపించారు, ప్రకటించారు.'
ఇలా ఎందరెందరో క్రీస్తు ప్రభువును గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ప్రభువు చెప్పారు...
'తండ్రి నన్ను ఎలాగో ప్రేమించెనో, నేను మిమ్మును ఆలాగు ప్రేమించితిని. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకని నొకడు ప్రేమింపవలెను అనుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు.'
సిలువ మీద బలియాగం అయిన యేసు క్రీస్తు మృత్యుంజయుడై 40 దినములు ఈ భూమి మీద సంచరించి, అనేకమందికి దర్శనమిచ్చి, వాళ్లు చేయవలసిన విధివిధానాలను చెప్పి ఒలీవాల కొండ మీద తన శిష్యులతో చెప్పవలసిన మాటలు చెప్పి, దాదాపు 500 మంది యెరూషలేము వాస్తవ్యులు చూస్తూ ఉండగానే మేఘాలలోకి ఆరోహణమయ్యారు. అప్పుడు ఇద్దరు దేవదూతలు అక్కడ నిలబడి ఆ ప్రజలకు చెప్పారు..

'యేసుక్రీస్తు ఏ విధంగా పరలోకమునకు మేఘాలపై ఆరోహణమై వెళ్లారో, ఆ విధంగానే ఆయన తిరిగి వస్తార'ని! ఆయన కొరకు నమ్మకంగా జీవించిన వారిని మేఘ వాహనం మీద తీసుకుని వెళ్తారు, తర్వాత ఆయన తీర్పు తీర్చే రోజు ఒకటి ఉన్నది. మృత్యుంజయుడు తీర్పు తీర్చే న్యాయాధిపతిగా రాబోయే ఆ క్షణం కొరకు మనం సిద్ధపడాలి. దేవుడు మనకొరకు ఏర్పాటు చేసిన నిత్య రాజ్యమైన ఆ పరలోకానికి పాత్రులమయ్యేందుకు ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగుదాం. ఈ పునరుత్థాన పండుగ మనకిచ్చే సందేశం అదే. అందరికీ ఈస్టర్‌ పండుగ శుభాకాంక్షలు! దేవుడు మనందరినీ తన పునరుత్థానశక్తితో దీవించును గాక!
- ఝాన్సీ కె. వి. కుమారి

Monday, April 18, 2022

రాజ్యాంగ రచన

 రాజ్యాంగ రచన ప్రక్రియ రాజ్యాంగ సభ ద్వారా జరగాలని డిమాండ్‌ చేసిన తొలి వ్యక్తి మానవేంద్ర నాథ్‌ రాయ్‌. ఈ తరహా డిమాండ్‌నే కాంగ్రెస్‌ పార్టీ తొలిసారిగా 1935లో చేసింది. ఈ సభకు ఎన్నికయ్యే అభ్యర్థులను వయోజన ఓటింగ్‌ పద్ధతి ద్వారా ఎన్నుకోవాలని 1938లో జవహర్‌లాల్‌ నెహ్రూ కాంగ్రెస్‌ పక్షాన కోరారు. రాజ్యాంగ పరిషత్తు డిమాండ్‌ను తొలిసారిగా ఆగస్ట్‌ ఆఫర్‌ రూపంలో బ్రిటిష్‌ ప్రభుత్వం అంగీకరించింది. క్రిప్స్‌ రాయభారం ద్వారా సైద్ధాంతికంగా అధికారిక ప్రకటన చేయగా, క్యాబినెట్‌ మిషన్‌ పథకం ప్రకారం రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు అయింది. ఇతర ముఖ్య అంశాలు..

  • జనాభా ప్రాతిపదికన ప్రతి ప్రావిన్స్‌కు, స్వదేశీ సంస్థానాలకు రాజ్యాంగ పరిషత్తులో స్థానాలను కేటాయించారు.
  • దేశ విభజనకు ముందు ఇందులో మొత్తం 389 మంది సభ్యులు ఉండగా, విభజన తర్వాత 299కి తగ్గింది.
  • 1946 డిసెంబర్‌ 9వ తేదీన రాజ్యాంగ పరిషత్‌ తొలి సమావేశం నిర్వహించారు. దీనికి 211 మంది హాజరయ్యారు.
  • తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హాను, ఉపాధ్యక్షుడిగా ఫ్రాంక్‌ ఆంటోనిని ఎన్నుకున్నారు. సచ్చిదానంద సిన్హాను ఎన్నుకోవడానికి కారణం, అందరికంటే ఆయన సీనియర్‌ సభ్యుడు కావడం. దీనిని ఫ్రాన్స్‌ నుంచి స్వీకరించారు.
  • ప్రొటెం స్పీకర్‌ నియామకంలో నేటికి ఈ పద్ధతిని వినియోగిస్తున్నాం
  • రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల, 11 నెలల 18 రోజల సమయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 22 కమిటీలు ఏర్పడ్డాయి.
  • కీలకమైన మూసాయిదా కమిటీకి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నేతృత్వం వహించారు.
  • అన్నింటికంటే పెద్ద కమిటీ అయిన సలహా సంఘానికి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేతృత్వం వహించారు.
  • రాజ్యాంగ పరిషత్‌ చేసిన విధులు: జాతీయ జెండా ఆవిష్కరణ, కామన్‌వెల్త్‌లో భారత సభ్యత్వం ఆమోదం, కేంద్ర ప్రభుత్వ భాషగా దేవనాగరి లిపిలో హిందీని గుర్తించడం, జాతీయ గీతాన్ని, గేయాన్ని ఆమోదించడం, భారత తొలి రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్‌ను ఎన్నుకోవడం.
  • దేశ విభజనకు ముందు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తూర్పు పాకిస్థాన్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌)లో ఉన్న జెస్సోర్‌-ఖుల్న నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించారు. అక్కడ నుంచి నామినేట్‌ అయిన జోగేంద్రనాథ్‌ మండల్‌ తన స్థానాన్ని త్యాగం చేసి, అంబేద్కర్‌కు అప్పగించారు. అయితే దేశ విభజనతో అంబేద్కర్‌ స్థానాన్ని కోల్పోయారు.
  • తర్వాత ఎం.ఆర్‌.జయకర్‌ రాజీనామాతో ఖాళీ అయిన బాంబే రాష్ట్రం నుంచి మరోసారి రాజ్యాంగ పరిషత్‌కు ఆయన ఎన్నికయ్యారు.
  • భారత రాజ్యాంగ నిర్మాత, ఆధునిక మనువుగా అంబేద్కర్‌ పేరు పొందారు.
  • రాజ్యాంగ పరిషత్‌ రాజ్యాంగ నిర్మాణ విధులకు సమావేశం అయినప్పుడు రాజేంద్ర ప్రసాద్‌ నేతృత్వం వహించారు. కాగా శాసనాల విధిని నిర్వర్తించినప్పుడు మాత్రం జి.వి.మౌలాంకర్‌ అధ్యక్షత వహించారు. ఈయనే తర్వాత లోక్‌సభకు తొలి స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
  • రాజ్యాంగ పరిషత్తుపై పలు విమర్శలు కూడా ఉన్నాయి.
  • అవి.. ఇందులో సభ్యులు పరోక్షంగా ఎన్నికయ్యారు. వయోజన ఓటుహక్కు ప్రాతిపదికన ఎన్నిక కాలేదు.
  • అలాగే సమావేశాల నిర్వహణకు బ్రిటిష్‌ అనుమతి ఉండాలి. అంటే సార్వభౌమాధికారం లేదు. అయితే స్వాతంత్య్రం తర్వాత పూర్తి సార్వభౌమ సంస్థగా మారింది.
  • న్యాయవాదులు, రాజకీయ నాయకుల ఆధిపత్యం ఎక్కువగా ఉంది.
  • భారత రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్తు 11 సార్లు సమావేశమైంది.
  • రాజ్యాంగ రచనలో భాగంగా 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశారు.
  • రాజ్యాంగ రచనకు చేసిన వ్యయం రూ.64 లక్షలు
  • మౌలిక రాజ్యాంగాన్ని ఇటాలిక్‌ తరహాలో రాసింది ప్రేమ్‌ బెహారి నారాయణ్‌ రైజా.్ధ
  • రాజ్యాంగానికి హిందీ భాషలో కాలిగ్రఫి చేసింది వసంత్‌ కృష్ణన్‌ వైద్య.
  • మౌలిక రాజ్యాంగ ప్రతిలో జాతీయ చిహ్నాన్ని చిత్రించింది దీనానాథ్‌ భార్గవ.
  • చేతితో రాసిన రాజ్యాంగాన్ని ఢిల్లీలోని నేషనల్‌ మ్యూజియంలో భద్రపర్చారు. జడవాయువు అయిన
  • హీలియంతో నింపిన పెట్టెలో దాన్ని ఉంచారు. ఈ వాయువు చర్య జరపదు కాబట్టి రాజ్యాంగ ప్రతి అలాగే ఉంది.
  • రాజ్యాంగ పరిషత్తుకు సలహాదారుగా వ్యవహరించిన బెనెగల్‌ నరసింగరావు, తర్వాత హేగ్‌లోని
  • అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే.
  • రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నిక అయిన తెలుగువాళ్లు-ఎన్‌జీ రంగా, ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, మోటూరి సత్యనారాయణ, కళా వెంకట్రావ్‌, దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ తదితరులు.
  • రాజ్యాంగ పరిషత్తుకు ఉపాధ్యక్షులుగా హెస్‌సీ ముఖర్జిని, వి.టి. కృష్ణమాచారిని ఎన్నుకున్నారు.
  • మూసాయిదా కమిటీ మొత్తం 141 రోజులు విధులు నిర్వహించగా, రాజ్యాంగ పరిషత్‌ డ్రాఫ్ట్‌ను 114 రోజులపాటు పరిశీలించింది.

మాదిరి ప్రశ్నలు

1. కింది వానిలో సరైనవి ఏవి? (సి)
1. రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్‌ను ఎన్నుకున్నారు
2. రాజ్యాంగ పరిషత్తు ముఖ్య సలహాదారు గా బెనెగల్‌ నర్సింగరావు వ్యవహరించారు
3. రాజ్యాంగ పరిషత్తు ముఖ్య సలహాదారుగా బీఆర్‌ అంబేద్కర్‌ వ్యవహరించారు
ఎ. 1 సరైంది బి. 1, 3 సరైనవి
సి. 1, 2 సరైనవి డి. 3 సరైంది

2. కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి? ( బి)
ఎ. రాజ్యాంగ రచన క్రమంలో రాజ్యాంగ పరిషత్తు అన్ని అంశాలను ఓటింగ్‌ ద్వారా నిర్ణయించింది
బి. రాజ్యాంగ పరిషత్తు సమ్మతి, సమన్వయ పద్ధతిని వినియోగించింది
సి. ఓటింగ్‌, సమ్మతి, సమన్వయ పద్ధతిని వినియోగించింది డి. పైవేవి కాదు

3. పట్టాబి సీతారామయ్య నేతృత్వం వహించిన కమిటీలు ఏవి? (సి)
1. సభా కమిటీ
2. క్రిడెన్షియల్‌ కమిటీ
3. చీఫ్‌ కమిషనర్ల ప్రావిన్స్‌ల కమిటీ
ఎ. 1, 2 బి. 2, 3
సి. 1, 3 డి. 1, 2, 3

4. కింది వానిలో రాజ్యాంగ పరిషత్తు నిర్వహించిన విధులు ఏవి? (డి)
ఎ. రాజ్యాంగ రచన
బి. పార్లమెంట్‌గా వ్యవహరించడం
సి. జాతీయ జెండా ఆమోదం
డి. పైవన్నీ

5. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నేతృత్వం వహించిన మూసాయిదా కమిటీకి సంబంధించి కింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి? (డి)
1. ఈ కమిటీ ఆగస్ట్‌ 29, 1947న ఏర్పాటైంది
2. మూసాయిదా కమిటీ మొత్తం 141 రోజులు పనిచేసింది
3. ఇందులో ఆరుగురు సభ్యులు ఉన్నారు
4. బెనెగల్‌ నర్సింగరావు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నారు
ఎ. 1, 2 సరైనవి
బి. 1, 3, 4 సరైనవి
సి. 1, 2, 3, 4
డి. 1, 2, 3 సరైనవి

6. వివిధ కమిటీలు, వాటి చైర్మన్లతో జతపర్చండి. (సి)
1. సారథ్య కమిటీ ఎ. వరదాచారి
2. రాష్ర్టాల రాజ్యాంగాల కమిటీ బి. మోటూరి సత్యనారాయణ
3. భాషా కమిటీ సి. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌
4. పౌరసత్వంపై తాత్కాలిక కమిటీ డి. రాజేంద్రప్రసాద్‌
ఎ. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి. 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
సి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి. 1-డి, 2-ఎ, 3-బి, 4-సి

7. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నేతృత్వం వహించిన మూసాయిదా కమిటీలో భాగం కానివారుఎవరు? (డి)
ఎ. గోపాలస్వామి అయ్యంగార్‌
బి. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌
సి. కె.ఎం. మున్షి
డి. గోపీనాథ్‌ బర్దోలాయ్‌

8. కింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి? (బి)
1. రాజ్యాంగ సభలో లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని అంబేద్కర్‌ ప్రవేశపెట్టారు
2. రాజ్యాంగ సభలో లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రవేశపెట్టారు
3. 1947 జనవరి 22వ తేదీన లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు
ఎ. 1, 3 సరైనవి
బి. 2 సరైనది
సి. 2, 3 సరైనవి
డి. 1 సరైంది

9. రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి కింది వానిలో సరికానిది ఏది? (సి)
ఎ. ఇది పరోక్ష పద్ధతిలో ఎన్నికైంది
బి. ఇది సార్వభౌమ సంస్థ కాదు
సి. ఇది ప్రత్యక్షంగా ఎన్నికైంది
డి. ఇందులో కొందరు నామినేటెడ్‌ సభ్యులు కూడా ఉన్నారు

10. దేశ విభజన మూలంగా రాజ్యాంగ పరిషత్తులో స్థానం కోల్పోయిన వారిని గుర్తించండి? (డి)
1. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌
2. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌
3. సోమ్‌నాథ్‌ లహరి
ఎ. 1, 2 బి. 2
సి. 2, 3 డి. 1, 3

11. కింది వాటిని కాలక్రమం ఆధారంగా అమర్చండి? (ఎ)
1. క్యాబినెట్‌ మిషన్‌ ప్రణాళిక
2. ఆగస్ట్‌ ఆఫర్‌
3. క్రిప్స్‌ రాయభారం
4. ముసాయిదా కమిటీ ఏర్పాటు
ఎ. 2, 3, 1, 4 బి. 2, 1, 3, 4
సి. 2, 4, 1, 3 డి. 2, 3, 4, 1

12. రాజ్యాంగ పరిషత్తుకు ఏ ప్రావిన్స్‌ నుంచి ఎక్కువ మంది ప్రతినిధులు ఉన్నారు? ( సి)
ఎ. మద్రాస్‌
బి. పశ్చిమబెంగాల్‌
సి. యునైటెడ్‌ ప్రావిన్స్‌
డి. సెంట్రల్‌ ప్రావిన్స్‌-బేరర్‌

13. కింది సంఘటనలు, తేదీలను జతపర్చండి. (బి)
1. లక్ష్యాలు-ఆశయాల తీర్మానం ప్రవేశపెట్టిన రోజు ఎ. జనవరి 26, 1950
2. రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు బి. ఆగస్ట్‌ 29, 1947
3. ముసాయిదా కమిటీ ఏర్పాటైన రోజు సి. డిసెంబర్‌ 13, 1946
4. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు డి. నవంబర్‌ 26, 1949
ఎ. 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
బి. 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
సి. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి. 1-సి, 2-బి, 3-డి, 4-ఎ

14. రాజ్యాంగ పరిషత్తుకు ఏ స్వదేశీ సంస్థానం నుంచి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు? (ఎ)
ఎ. మైసూర్‌ బి. హైదరాబాద్‌
సి. గ్వాలియర్‌ డి. ట్రావెన్‌కోర్‌

15. రాజ్యాంగ పరిషత్తులో హిందూ మహాసభకు ప్రాతినిథ్యం వహించింది ఎవరు? (సి)
1. శ్యామప్రసాద్‌ ముఖర్జి
2. హెచ్‌పీ మోడి
3. ఎం.ఆర్‌.జయకర్‌
ఎ. 1, 2 బి. 1
సి. 1, 3 డి. 1, 2, 3

16. కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి? (ఎ)
ఎ. రాజ్యాంగ పరిషత్తులో కొంతమంది ఎన్నిక కాగా, కొంతమంది నామినేట్‌ అయ్యారు
బి. రాజ్యాంగ పరిషత్తు సభ్యులు అందరూ ఎన్నికైన వారే ఉన్నారు
సి. రాజ్యాంగ పరిషత్తులో మహిళలు లేరు డి. రాజ్యాంగ పరిషత్తులో ఎన్నికైన వారి కంటే నామినేట్‌ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది

17. బేగం ఎయిజాజ్‌ రసూల్‌కు సంబంధించి కింది వానిలో సరైనది ఏది? (బి)
ఎ. రాజ్యాంగ పరిషత్తుకు ఆమె ఉపాధ్యక్షురాలు
బి. రాజ్యాంగ పరిషత్‌లో సభ్యురాలిగా ఉన్న ఏకైక ముస్లిం మహిళ
సి. రాజ్యాంగ పరిషత్తు పార్లమెంట్‌ రూపంలో సమావేశం అయినప్పుడు అధ్యక్షత వహించిన మహిళ
డి. ఏదీ కాదు

18. న్యాయవిద్య చదవకుండా మూసాయిదా కమిటీలో సభ్యుడిగా ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు? (సి)
ఎ. కృష్ణ స్వామి అయ్యర్‌
బి. బీఎల్‌ మిట్టర్‌
సి. టి.టి. కృష్ణమాచారి
డి. కె.ఎం. మున్షి

19. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజే అమల్లోకి వచ్చిన అంశాలు కింది వానిలో ఏవి? (డి)
ఎ. పౌరసత్వం బి. ఎన్నికలు
సి. తాత్కాలిక పార్లమెంట్‌
డి. పైవన్నీ




ప్రపంచ దేశాల్లో ఆధునిక రాజ్యాల అవతరణకు మూలాధారం రాజ్యాంగం. ఆధునిక రాజ్యాల రాజకీయ ప్రక్రియా విధానాన్ని సూచించే నియమ నిబంధనల సముదాయ రూపంలో ఒక అత్యున్నత చట్టం ఉంటుంది


దీన్నే రాజ్యాంగం అంటారు.
-క్రీ.పూ. 384-322 కాలానికి చెందిన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ అప్పటికే ఉన్న 156 రాజ్యాంగాలను అధ్యయనం చేసి రాజ్యాంగ భావనను వివరించారు. అంతేకాకుండా ప్రభుత్వాలను శాస్త్రీయ పద్ధతిలో వర్గీకరించి రాజనీతిశాస్త్ర పితామహుడు అయ్యాడు. భారత రాజ్యాంగ ఆవిర్భావానికి కొన్ని చట్టాలు దోహదపడ్డాయి. రాజ్యాంగ నిర్మాణ పరిణామ క్రమాన్ని బీసీ రావత్ 6 దశలుగా అధ్యయనం చేయవచ్చునని పేర్కొన్నారు. అవి..

Iవ దశ (1600-1773)
-మొదటి ఎలిజబెత్ మహారాణి 1600, డిసెంబర్ 31న ఈస్టిండియా కంపెనీకి వ్యాపారం చేసుకునేందుకు రాయల్ చార్టర్ (ఏదైనా ఒక సంస్థ లేదా సంఘాల ఏర్పాటుకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీచేసే అనుమతిపత్రాన్ని చార్టర్ అంటారు) ద్వారా అనుమతించారు. దీంతో దేశంలో వ్యాపారం చేసుకునే క్రమంలో దేశంపై కంపెనీ పాలనాధికారాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కంపెనీ బెంగాల్, బొంబాయి, మద్రాసు రాష్ర్టాలను స్వాధీనం చేసుకుంది.
-ఈస్టిండియా కంపెనీ చేస్తున్న అవినీతిని బయటపెట్టేందుకు బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ బుర్గాయిక్ అధ్యక్షతన ఒక కమిటీని రహస్యంగా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కంపెనీ అవినీతి పెరిగిపోయిందని నివేదిక ఇచ్చి, కంపెనీ కార్యక్రమాలను క్రమబద్దం చేయమని సిఫారసు చేసింది.

IIవ దశ (1773-1858)
రెగ్యులేటింగ్ చట్టం (1773):
రెగ్యులేటింగ్ అంటే క్రమబద్దం చేయడం. వ్యాపారరీత్యా భారతదేశానికి వచ్చిన ఈస్టిండియా కంపెనీని క్రమబద్దం చేయడంతో పాటు దాని కార్యక్రమాలను నియంత్రించడానికి చేసిన మొదటి చట్టం కాబట్టి దీన్ని రెగ్యులేటింగ్ చట్టం అంటారు. దీన్ని దేశానికి సంబంధించి మొదటి లిఖిత రాజ్యాంగ చట్టంగా కూడా పేర్కొంటారు. అంతవరకు వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈస్టిండియా కంపెనీకి మొదటిసారిగా రాజకీయ, పరిపాలన, అధికారాలు లభించాయి.
-ఈ చట్టాన్ని 1773, మే 18న అప్పటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. బెంగాల్ గవర్నర్ హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ ఫోర్ట్ విలియం లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా మార్చారు. ఇతనికి సలహాలు ఇవ్వడానికి నలుగురు సభ్యులతో కూడిన కార్యనిర్వహణ మండలిని ఏర్పాటు చేశారు.

-ఆ విధంగా మొదటి గవర్నర్ జనరల్‌గా నియమితులైనవారు వారెన్ హేస్టింగ్స్. కార్యనిర్వహణ మండలిలోని నలుగురు సభ్యులు 1) క్లావెరింగ్ 2) బార్‌వెల్ 3) ఫిలిప్ ఫ్రాన్సిస్ 4) మాన్‌సన్.
-1774లో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులతో సుప్రీంకోర్ట్ ఆఫ్ జ్యూడికేచర్‌ను కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో ఏర్పాటు చేశారు. మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎలిజా ఎంఫే, న్యాయమూర్తులు రాబర్ట్ చాంబర్స్, సీజర్ లైమెస్టర్, జాన్ హైడ్.

పిట్స్ ఇండియా చట్టం (1784):
రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడానికి బ్రిటిష్ పార్లమెంట్ ఈ చట్టాన్ని 1784లో ఆమోదించింది. ఆనాటి బ్రిటన్ ప్రధానమంత్రి విలియం పిట్ ఈ చట్టాన్ని ప్రతిపాందించడంతో దీన్ని పిట్స్ ఇండియా చట్టం అని వ్యవహరిస్తారు. ఈ చట్టాన్ని చేసిన సమయంలో గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్.

-ఇంగ్లండ్‌లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక నూతన విభాగాన్ని ఆరుగురు సభ్యులతో ఏర్పాటుచేసి కంపెనీ రాజకీయ, సైనిక, రెవెన్యూ వ్యవహారాలను దీనికి అప్పగించారు. ముగ్గురు డైరెక్టర్లతో నియమించిన ఒక రహస్య కమిటీ ఈ బోర్డు ఆదేశాలను భారతదేశానికి చేరవేసేది. ఈ కోర్ట్ ఆఫ్ డెరెక్టర్స్ వాణిజ్య వ్యవహారాలకే పరిమితమైంది.

చార్టర్ చట్టం (1793):
ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారాలను విస్తృతం చేశారు. కంపెనీకిగల వ్యాపార గుత్తాధిపత్యాన్ని మరో 20 ఏండ్లు పొడిగించారు. బోర్డు కార్యదర్శిని పార్లమెంట్‌లో కూర్చోవడానికి అనుమతించారు. ఈ చట్టం సమయంలో గవర్నర్ జనరల్ కారన్‌వాలీస్.
-భారతీయుల హక్కులు, ఆస్తులు, వారసత్వం, వివాహం, మత విషయాలకు సంబంధించి గవర్నర్ జనరల్ చేసే నిబంధనలకు చట్టాలతోపాటుగా సమాన విలువు ఉంటుంది.

చార్టర్ చట్టం (1813):
దీని ద్వారా ఈస్టిండియా కంపెనీ చార్టర్‌ను మరో 20 ఏండ్లు పొడిగించారు. తేయాకు, చైనాతో వ్యాపారం మినహా కంపెనీకి వర్తకంపైగల గుత్తాధిపత్యాన్ని తొలగించి ప్రతి బ్రిటన్ పౌరుడికి వర్తకం చేసుకునే అవకాశం కల్పించి కంపెనీని కేవలం పరిపాలనాపరమైన సంస్థగా మార్చారు.
-భారతీయులకు మతపరమైన, విద్యాపరమైన అధ్యయనం కోసం ప్రతి ఏడాది రూ. లక్ష కేటాయించేలా ఏర్పాటు చేశారు. సివిల్ సర్వెంట్లకు శిక్షణా సదుపాయాన్ని కల్పించారు. ఈస్టిండియా కంపెనీలో భారతీయులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించారు.
-ఈ చట్టం ద్వారా భారత్‌కు క్రిస్టియన్ మిషనరీలు రావడానికి అనుమతించడంతో చర్చిలు, విద్యాలయాలు, ఆస్పత్రులు స్థాపితమయ్యాయి. దీంతో మతమార్పిడులకు అవకాశం ఏర్పడింది.

చార్టర్ చట్టం (1833):
దీని ద్వారా ఈస్టిండియా కంపెనీ చార్టర్‌ను మరో 20 ఏండ్లు పొడిగించారు. ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవి భారత్ గవర్నర్ జనరల్‌గా మారింది. దీంతో బెంగాల్ గవర్నర్ జనరల్‌గా ఉన్న విలియం బెంటింక్ భారత మొదటి గవర్నర్ జనరల్ అయ్యాడు.
-ఈస్టిండియా కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దుచేసి పరిపాలనా సంస్థగా మార్చారు. యూరోపియన్లు భారత్‌కు వలసవచ్చేందుకు, భూమి, ఆస్తులు సంపాదించుకునేందుకు ఉన్న నియంత్రణలను తొలగించి వారికి పూర్తిస్వేచ్ఛ కల్పించారు. దీంతో బ్రిటిష్ వలసరాజ్య స్థాపనకు చట్టబద్దత కల్పించినట్లయ్యింది.

-భారతీయ పాలనలో కోవనెంటెడ్ పోస్టుల్లో మెరిట్ కలిగిన భారతీయులను నియమించాలని రాజారామ్మోహన్ రాయ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సివిల్ సర్వీసుల నియమకాల్లో బహిరంగ పోటీ పద్ధతిని ప్రతిపాదించారు. కానీ కోర్ట్ ఆఫ్ డెరెక్టర్స్ వ్యతిరేకించడంతో కొంతమేరకు పురోగతి సాధించింది.
-భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక భారతీయ లా కమిషన్‌ను నియమించారు. దీనికి మొదటి అధ్యక్షుడు లార్డ్ మెకాలే.

చార్టర్ చట్టం (1853):
చార్టర్ చట్టాల్లో ఇది చివరిది. ఈసారి కంపెనీ పాలనను పొడిగించలేదు. బ్రిటన్ పార్లమెంట్ అనుమతి ఉన్నంతవరకు మాత్రమే వ్యాపారాన్ని నిర్వహించుకునే అవకాశం కల్పించారు. దీంతో కంపెనీ పాలన త్వరలోనే అంతమవుతుందని సూచించినట్లయ్యింది.
-గవర్నర్ జనరల్ సాధారణ మండలి అధికారాలను శాసన, కార్యనిర్వహణ విధులుగా విభజించారు. శాసనాలు రూపొందించే ప్రక్రియ కోసం మొదటిసారిగా ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని మినీ పార్లమెంట్ అంటారు.






Wednesday, April 13, 2022

ఛందస్సు

 పద్య లక్షణాలు తెలిపే శాస్త్రం.

(గేయ లక్షణాలు కూడా)

  • ఛందస్సు ఛద్‌ అనే సంస్కృత ధాతువు నుంచి పుట్టింది.
  • ఛద్‌ అంటే చదీ ఆహ్లాదనే, చదీ సంవరణేః
  • ఛందస్సు = జ్ఞానం + వేదం
  • ఛందస్సు రుషులకు పాదం వంటిది.
  • ఛందస్సు అనే పదం మొదట వాల్మీకి నోటివెంట వచ్చింది.
  • ఛందస్సు అంటే గాయత్రిమాత అని అర్థం.
  • చదీ ఆహ్లాదనే : ఒక విధమైన లయ కలిగి మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
  • చదీ సంవరణే : మనస్సులోని భావాలకు ఒక విలక్షణమైన ఆకృతి కలిగిస్తుంది.
  • ఛందస్సు శాస్త్ర పితామహుడు, మూల పురుషుడు పింగళుడు. (పింగళ ఛందము – రచన).
  • పింగళ ఛందము సంస్కృతంలో ప్రామాణిక గ్రంథం.
  • తెలుగులో ప్రామాణికమైన గ్రంథం (ఛందోగ్రంథం)- కవిజనాశ్రయ
  • అనంతామాత్యుడు రాసిన ఛందోగ్రంథం – ఛందోదర్పణం
  • కవిజనాశ్రయ గ్రంథం రచించింది – మల్లియ రేచన .
  • ఏకాక్షర గణాలతో గణ విభజన చేసే పద్యం ఏది ?
  • ఇంద్రగణాల సంఖ్య మాత్రలన్నింటిని అనురాధ అనే పద్యంలోని వర్ణాల సంఖ్యలో సగం సంఖ్యను
  • తీసివేసి మత్తకోకిల పద్యంలో మూడవ గణం మాత్రలను తీస్తే వచ్చే సంఖ్య ఎంత ? – 6/2

ఛందస్సు రెండు రకాలు
1. మార్గ ఛందస్సు 2. దేశీ ఛందస్సు
1) మార్గ ఛందస్సు – సంస్కృతం నుంచి తెలుగులోకి చేరిన పదాలు (ఉత్పలమాల+ చంపకమాల+మత్తేభం+శార్దూలం+మత్తకోకిల)
2) దేశీ ఛందస్సు – అచ్చమైన తెలుగు పద్యాలతో ఏర్పడిన పద్యాలు (జాతి, ఉపజాతి పద్యాలు)

పద్యాలు – రకాలు
పద్యాలు మూడు రకాలు.


1. వృత్త 2. జాతి 3. ఉపజాతి
1) వృత్త పద్యాలు – ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం, మత్తకోకిల
2) జాతి పద్యాలు – కందం, ద్విపద
3) ఉపజాతి పద్యాలు – తేటగీతి, ఆటవెలది, సీసం
[అరే మామ తే ఆ సీస – CODE]
అక్షరాల సంఖ్యను అనుసరించి పద్యాల పేర్లు
10 అక్షరాలు – పంక్తి
15 అక్షరాలు – అతిశక్వరి
18 అక్షరాలు – ధృతి
19 అక్షరాలు – అతిధృతి
20 అక్షరాలు – కృతి
21 అక్షరాలు – ప్రకృతి
22 అక్షరాలు – ఆకృతి

మాత్రల ఆధారంగా గతులు
3 మాత్రలు – త్రిసగతి
4 మాత్రలు – చతురస్రగతి
5 మాత్రలు – ఖండగతి
7 మాత్రలు – మిశ్రగతి
9 మాత్రలు – సంకీర్ణగతి

1. వృత్త పద్యాలు – ఒకే విధమైన గణనియమం, యతిస్థాననియమం, అక్షర సంఖ్యానియ మం కలిగిన పద్యాలు వృత్త పద్యాలు.
ఈ పద్యాల్లో సాధారణంగా ఉండే లక్షణాలు ఇవి : ఇది వృత్త పద్యం, ప్రాసనియమం కలిగి ఉంటాయి, నాలుగు పాదాలు ఉంటాయి.
ఉత్పలమాల
ఉత్పలమాలలోని గణాలు
భ, ర, న, భ, భ, ర, వ
యతి స్థానం 10వ అక్షరం
20 అక్షరాలు ఉంటాయి

చంపకమాల
చంపకమాలలోని గణాలు న, జ, భ, జ, జ, జ, ర
యతిస్థానం 11వ అక్షరం
21 అక్షరాలు ఉంటాయి.

శార్దూలం
శార్దూలంలోని గణాలు మ, స, జ, స, త, త, గ
యతిస్థానం 13వ అక్షరం
19 అక్షరాలు ఉంటాయి.

మత్తేభం
మత్తేభంలోని గణాలు స, భ, ర, న, మ, య, వ
యతిస్థానం 14వ అక్షరం
20 అక్షరాలు ఉంటాయి

1. ఉత్పలమాల పద్యంలో మొత్తం ఎన్ని లఘువులు ఉంటాయి ?
ఎ) 20 బి) 24
సి) 48 డి) 54
వివరణ- భ, ర, న, భ, భ, ర, వ = 12 x 4 = 48

2. శార్దూల విక్రీడిత పద్యంలో గురువుల సంఖ్య ఎంత ?
ఎ) 44 బి) 48 సి) 54 డి) 38
వివరణ – మ, స, జ, స, త, త, గ x 4 = 11 x 4 = 44

3. ధృత్యుండాతడు మూడులోకములలో బెంపొం దు సర్వేశ్వరా ! యతి అక్షరం ఏంటి?
ఎ) ము బి) పొ సి) బెం డి) లో
వివరణ – శార్దూలం – 13వ అక్షరం
మత్తేభ పద్యంలో లఘువు, గురువుల సంఖ్య- 80
వివరణ – స, భ, ర, న, మ, య, వ x 4 = 20 x 4= 80

జాతి పద్యం :-
ద్విపద, కంద పద్యాలు (దేశీ ఛందస్సు)
ద్విపద – ద్వి + పద = ద్విపద
జాతి పద్యాలకు తల్లి వంటిది ఈ పద్యం.
కన్నడ భాషలో రగడ అనే పద్యానికి సమాన పద్యం
తెలుగులో ద్విపద పద్యాలకు ఆద్యులు పాల్కురికి సోమనాథుడు.
బిరుదులు – కవితాచార్య, తత్వ విద్యా కలాపి, ప్రత్యక్షవృంగీశావధాన,
ద్విపద అనే ప్రక్రియ కనుమరుగవుతున్న సందర్భంలో పునఃజీవం పోసింది గోరన. అంతేకాకుండా తన రచనలు ఎక్కువ ద్విపదలోనే ఉంటాయి.
ద్విపదకి ఆధునిక కాలంలో మిక్కిలి
ప్రజా దరణ కల్పించింది తాళ్లపాక కవులు.

జవాబులు
1-సీ, 2-ఏ, 3-సీ

లఘువు-గురువు లక్షణాలు
పద్య పాదంలో దీర్ఘం లేని అక్షరాలు లఘువులు.
ఉదాహరణకు- I I I
అ, ఇ, ఎ
పద్యపాదంలో దీర్ఘం ఉన్న అక్షరాలు గురువులు
ఉదాహరణకు- U U U
ఆ, ఈ, ఏ
అరసున్నాతో కూడుకొని ఉన్నది లఘువు.
I I I I
ఉదా. – అ | టc | జ | ని
O నిండు సున్నాతో కూడి ఉన్నది గురువు
U U
ఉదా. – అం | దం
పొల్లు అక్షరంతో కూడుకున్నది గురువు
U U
ఉదా. – శం | కర్‌
విసర్గతో కూడుకున్నది గురువు
U U I U
ఉదా. – అంతః | పురం
ఐ త్వ అక్షరాలు వాటంతటవే గురువులు
U U I U
ఉదా. – ఐరావతం
ఔ త్వ అక్షరాలు వాటంతటవే గురువులు
U I U
ఉదా. – ఔషధం
ద్విత్వాక్షరానికి ముందు ఉన్నది గురువు
U I
ఉదా.- అమ్మ
సంయుక్తాక్షరానికి ముందు ఉన్న అక్షరం గురువు
I U I
ఉదా. – అపర్ణ

గణాల వర్గీకరణ
గణాల వర్గీకరణ నాలుగు రకాలు
1. ఏకాక్షర గణాలు : ఇవి రెండు ల – I , గ – U
2. ద్వయాక్షర గణాలు : ఇవి నాలుగు లల- II, లగ -IU , గగ – UU, గల – UI
3. త్రయాక్షర గణాలు : ఇవి ఎనిమిది భ- UII, జ- IUI, స- IIU, య- IUU, ర- UIU, త- UUI, మ- UUU, న- III
4. చతురాక్షర గణాలు :
ఇవి మూడు నల-IIII, నగ-IIIU, సల- IIUI
లగ – IUకు మరో పేరు వగణం
గల – UIకు మరో పేరు హగణం
త్రయాక్షర గణాలను విసర్గ గణాలు అంటారు.

ఇంద్రగణాలు (6)-
నల-IIII, నగ-IIIU, సల-IIUI, భ-UII, ర-UIU, త-UUI
[చతురాక్షరాల భరతం పడుతా – CODE]
సూర్యగణాలు
(2) :- నగణం-III, హగణం-UI

code
ఉ – భ – UUI – 20
చ – న – III – 21
శా – మ – UUU – 19
మ – స – IIU – 20

పద్య పాదాన్ని సరైన వరుసలో అమర్చండి
ఎ) నల్గడం బెదరగా బి) ప్రతతుల్‌
సి) బాఱెన్‌ మనోవేగుడై డి) సాల్పడి

నల్గడం బెదరగా | ప్రతతుల్‌ | బాఱెన్‌ మనోవేగుడై | సాల్పడి
U I U I I I I U I I U U U I U U I U U I I

అక్షరం – 20
స, భ, ర, న, మ, ర, వ – IIU
భ, ర, న, భ, భ, ర, వ – UII
UII పునారావృతం కాలేదు కనుక స, భ, ర, న, మ, ర, వ
ప్రతతుల్‌ | సాల్పడి | నల్గడం | బెదర | గాబాఱెన్‌ | మనోవే | గుడై
I I U U I I U I U I I I U U U I U U I U
స భ ర న మ ర వ

పద్య పాదాన్ని సరైన వరుసలో అమర్చండి
ఎ) తపసులెం బి) బారదో
సి) బ్రోవంగనానీవోపవో డి) పూరంబేరుల
వివరణ –
తపసులెం బారదో బ్రోవంగనీవోపవో పూరంబేరుల
I I I U UIU U U I U U I U U U U I I

మ, స, జ, స, త, త, గ (డి బి ఎ సి) – శార్దూలం
పూరంబే | రుల బా | రదో త | పసులెం | బ్రోవంగ | నీవోప | వో
UUU I I U I U I I I U U U I U U I U

పద్య పాదాన్ని సరైన వరుసలో అమర్చండి
ఎ) మైనసకు బి) వాచివికింజెడిపోయె
సి)వనకరిచిక్కె డి) మీనుతా
వివరణ : సి ఎ డి బి
మైనసకు వాచివికింజెడిపోయె వనకరిచిక్కె మీనుతా
U I I I U I I U I I U I I I I I U I UIU
న,జ,భ,జ,జ,జ,ర
వనక | రిచిక్కె | మైనస | కువాచి | వికింబె | డిపోయె | మీనుతా
III IUI UII IUI IUI IUI UIU

ఆతత పక్షమారుతరయప్రవికంపితఫరార్ణితాచల ఏ పద్య పాదం ?
ఈ పద్య పాదం ఉత్పలమాల పద్యం
l ఉత్పలమాల పద్యంలోని మాత్రల సంఖ్య ?(డి)
ఎ) 20 బి) 80 సి) 27 డి) 28
వివరణ –
ఏక మాత్ర కాలంలో పలికేది – లఘువు (I)
ద్విమాత్ర కాలంలో పలికేది – గురువు (U)
భ ర న భ భ ర వ
UII UIU III UII UII UIU IU

l శార్దూల పద్యంలోని మాత్రల సంఖ్య : మ స జ స త త గ
11 x 2 = 22
1 x 8 = 8
30 x 4 = 120




Friday, April 8, 2022

క్రైస్తవ సాహిత్యం

 క్రైస్తవ సాహిత్యం క్రైస్తవ ఇతివృత్తాలతో వ్యవహరించే మరియు క్రైస్తవ ప్రపంచ దృక్పథాన్ని కలిగి ఉన్న రచన. ఇది చాలా వైవిధ్యమైన రచన యొక్క భారీ శరీరాన్ని కలిగి ఉంది.


యేసుక్రీస్తు మరణం తరువాత మొదటి శతాబ్దం మధ్యలో, క్రీస్తు విశ్వాసం రోమ్ మరియు సామ్రాజ్యం యొక్క పశ్చిమ భాగంలో అపొస్తలుల మిషనరీ పనితో చొరబడింది, కాని సువార్తికులు గ్రీకును అలవాటుగా ఉపయోగించారు. చాలా మంది ప్రజలు ఉన్నందున, పాశ్చాత్య చర్చిలో గ్రీకు భాష కూడా బలంగా ఉంది. ఈ కారణంగానే క్రైస్తవ సాహిత్యం మొదటి 1-2 శతాబ్దాలుగా గ్రీకు భాషలో ప్రత్యేకంగా ఉంది. లాటిన్ వాడకానికి తలుపులు తెరిచిన అనర్గళమైన టెర్టుల్లియన్ ముందు, బైబిల్ యొక్క లాటిన్ అనువాదం << వల్గేట్ "ఇటారా" అని పిలవబడే "ఇటారా" యొక్క నమూనా ప్రారంభించబడిందని తెలుస్తోంది. 3 వ శతాబ్దంలో తీవ్రతరం అయిన సామ్రాజ్యం యొక్క ఆందోళన, 4 వ శతాబ్దంలో అద్భుతంగా అభివృద్ధి చెందింది, మరియు ప్రాంతాల విభజన స్పష్టంగా ఉంది మరియు సిద్ధాంత సాహిత్యం సాధారణంగా లాటిన్లో ఉంటుంది. అతను సిప్రియన్, కార్తాజినియన్ బిషప్, అనేక సిద్ధాంతపరమైన రచనలను విడిచిపెట్టాడు, క్షమాపణ అని పిలువబడే మినుసియస్ ఫెలిక్స్ (3 వ శతాబ్దం ప్రారంభంలో), "ది టీచింగ్స్ ఆఫ్ గాడ్" యొక్క 7 సంపుటాలు మరియు బలిదానం యొక్క జీవిత చరిత్ర. "క్రిస్టియన్ సిసిరో" అని పిలువబడే లాక్టాంటియస్ మరియు ఇతరులు ఈ యుగానికి చెందినవారు. అంతేకాక, ఈ నలుగురూ ఆఫ్రికా ప్రావిన్స్‌కు చెందినవారని గమనించాలి.

దీనిని అనుసరించి, 4 వ శతాబ్దంలో, ముగ్గురు ప్రముఖ క్రైస్తవ రచయితలు ప్రచురించబడ్డారు. ఈ కాలంలో అంబ్రోసియస్, హిరోనిమస్ మరియు అగస్టిన్ ఒకరికొకరు సన్నిహితంగా కనిపించారు. ముగ్గురూ క్షమాపణలు, అలాగే చాలా రచనలు మరియు పెద్ద అక్షరాలు రాశారు, కాని అంబ్రోసియస్ కూడా రాశారు. శ్లోకం వ్యవస్థాపకులలో ఒకరిగా పిలువబడే అతని రచన, ది ఎటర్నల్ క్రియేటర్ ఆఫ్ ది వరల్డ్, మరియు అనేక ఇతర కవితలు విస్తృతంగా ఉపయోగించబడ్డాయి మరియు చాలా మంది వంచనదారులను కూడా ఉత్పత్తి చేశాయి. హిరోనిమస్ లాటిన్ బైబిల్ "వల్గేట్" యొక్క అనువాదకుడు, మరియు అగస్టిన్ " దేవుని రాజ్యం మరియు ఒప్పుకోలు రచయితలందరికీ ఇవన్నీ ముఖ్యమని చెప్పకుండానే ఇది జరుగుతుంది. అయినప్పటికీ, ఇవి ఇప్పటికీ మూలాధారమైనవి, మరియు క్రైస్తవ కవిత్వం కూడా మొదటిసారి సాహిత్య రంగానికి చేరుకుంటుంది ure రేలియస్ క్లెమెన్స్. స్పెయిన్లో జన్మించిన అతను మతపరమైనవాడు మరియు తన తరువాతి సంవత్సరాల్లో శ్లోకాల నిర్మాణానికి తనను తాను అంకితం చేసుకున్నాడు. "అమరవీరుల పువ్వు, గులాబీ మొగ్గ, ఇంకా వికసించినది, తెల్లవారుజామున గీతలు కొట్టడం" లేదా "చనిపోయినవారిని పాతిపెట్టడానికి పాట", ఇది శిశువును హేరోడ్ ది గ్రేట్ ac చకోత గురించి వివరిస్తుంది. 12 మంది అమరవీరులను వివరించే "కిరీటం గురించి" ముఖ్యంగా అద్భుతమైనది. ఫ్రాన్స్‌లోని బోర్డియక్స్‌లో జన్మించిన నోరా యొక్క పౌలినస్ కూడా అతనిని అనుసరించిన ఒక అద్భుతమైన క్రైస్తవ కవి, కానీ సున్నితమైన హృదయంతో సెయింట్ ఫెలిక్స్ జననం మరియు క్రైస్తవుల వివాహ పాట వంటి పాటలు రాశారు.

5 వ మరియు 6 వ శతాబ్దాలలో, సామ్రాజ్యం యొక్క పశ్చిమ భాగాన్ని జర్మన్ ప్రజలు స్వాధీనం చేసుకుని, ఆందోళన మరియు గందరగోళంలో పడిపోయినప్పుడు, సాహిత్యం పూర్తిగా బలహీనపడింది, కాని విశ్వాసం యొక్క అభిరుచి దీనికి విరుద్ధంగా మారింది మరియు అగస్టిన్ శిష్యుడైన మామోరు. ఒరోసియస్, "ఆన్ ది రీన్ ఆఫ్ గాడ్" రచయిత, సెడులియస్, చాలా క్రైస్తవ కవి (470 చుట్టూ చురుకుగా), గద్యంలో, " తత్వశాస్త్రం సౌకర్యం "చర్చి చరిత్ర" కు ప్రసిద్ధి చెందిన బోథియస్ మరియు కాసియోడోరస్, దీని జాబితాలో "చర్చి చరిత్ర" ఉన్నాయి మరియు మిషనరీ పనుల పరంగా, 5 వ శతాబ్దంలో పోప్ లియో I తరువాత, బెనెడిక్టైన్ ప్రారంభించిన బెనెడిక్టస్ మరియు పోప్ గ్రెగొరీ I, ప్రత్యేక ప్రస్తావనకు అర్హులు . సిద్ధాంత స్థాపన మరియు మతపరమైన ఆదేశాల నియంత్రణ కారణంగా ఈ ముగ్గురూ చాలా ఉపన్యాసాలు, సంపాదకీయాలు, లేఖలు మొదలైనవి రాశారు, కాని బెనెడిక్టస్ యొక్క "రాజ్యాంగ రాజ్యాంగం (బెనెడిక్ట్ ఆఫ్ నర్సింగ్)" ముఖ్యంగా వంశపారంపర్యంగా ఉంది. దానిపై గొప్ప ప్రభావం చూపింది. మరోవైపు, "ఫిలాసఫీ కంఫర్ట్" అనేది అమరవీరుల పుస్తకం, మరియు మధ్య యుగం మరియు ఆధునిక కాలంలో చాలా మంది పాఠకులను ఆకట్టుకుంది. ప్రసిద్ధ కవి హోలీ క్రాస్ యొక్క శ్లోకం "రాజు యొక్క జెండా కొనసాగుతుంది" వంటి రచయిత ఫార్చునాటస్‌తో పాటు, కొలంబా వంటి ఐరిష్ ఆరాధనల కార్యకలాపాలు గొప్పవి.

తరువాతి శతాబ్దాలు మధ్యయుగ చీకటి అని పిలవబడే శాంతి మరియు సాహిత్య ఉదయాన్నే చివరికి తాకిన యుగం, మరియు ముఖ్యంగా, వేదాంతశాస్త్రం యొక్క పునరుజ్జీవనం ప్రధానంగా ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్‌లలో ప్రయత్నించబడింది, మరియు చార్లెమాగ్నే పట్టాభిషేకం యొక్క 800 వ వార్షికోత్సవం ఇది ఒక చిరస్మరణీయమైనది కాథలిక్ సాహిత్యానికి సంవత్సరం. మొదట, 7 వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో, "చర్చి చరిత్ర" మరియు అనేక ఇతర పుస్తకాలను వ్రాసిన బేడా మరియు షెర్బోర్న్ బిషప్‌గా ఉన్న ఆల్డెల్మ్ మరియు "పవిత్ర వర్జిన్ ప్రశంస" అనే సుదీర్ఘ కవితను రాశారు. అది బయటకు వచ్చింది. చార్లెమాగ్నే యొక్క విద్యా విధానంలో పాల్గొన్న అల్కుయిన్ తరువాతి ఉన్నత స్థాయి సోదరుడు. ఈ కాలంలో బ్రిటన్కు ఇద్దరు కవులు ఉన్నారు, కేడ్మోన్ (7 వ శతాబ్దం చివర) మరియు పాత ఆంగ్లంలో మతపరమైన కవిత్వం రాసిన కినెవోల్ఫ్ (8 వ శతాబ్దం చివరి).

కార్ల్ యొక్క ఆస్థానంలో సమావేశమైన చాలా మంది రచయితలలో, కవి థియోడాల్ఫ్ ఆఫ్ ఓర్లీన్స్ గా ప్రసిద్ది చెందాడు, ఈస్టర్ ముందు రోజు "కీర్తి, ప్రశంసలు మరియు గౌరవాన్ని ఆస్వాదించండి, క్రీస్తు ది రెడ్ లార్డ్" అనే శ్లోకం రచయిత. (సుమారు 750-821) మరియు యాంగిల్‌బర్ట్ (సుమారు 745-814), కానీ పాల్ ది డీకనస్ (సుమారు 720-797), "హిస్టరీ ఆఫ్ ది లోంబార్డ్స్" మరియు "థియోడల్ఫ్ ఆఫ్ ఓర్ల్గో గ్రెగోరియస్" రచయిత. ఎనిమిది స్వరాల స్థాయికి మూలంగా ఉన్న "ది హైమ్ ఆఫ్ బాప్టిజం టు జాన్" వంటి కవితలు ఉన్నాయి. అల్కుయిన్ ప్రవాహం చాలా అద్భుతమైన మత కవులకు జన్మనిచ్చింది, వీరిలో ఫుల్డా మఠం చేత రాబనస్ మౌరస్, గోట్స్‌చాక్ మరియు వాలాహ్ఫ్రిడ్ స్ట్రాబో (808 లేదా 809-849) వరుసగా భక్తి, విచారకరమైన మరియు మనోహరమైనవి. శ్లోకాల రచయితగా పిలుస్తారు. దాదాపు అదే తరం కవి సెడులియస్ స్కాటస్ (9 వ శతాబ్దం మధ్యకాలం), ఎరియుజెనా, అనేక ula హాజనిత తాత్విక మరియు వేదాంత రచనలలో మధ్యయుగ విద్యాసంస్థను నొక్కిచెప్పారు. ఈ కాలంలో చివరకు మొలకెత్తిన జర్మన్ సాహిత్యంలో పురాతన తక్కువ జర్మన్ భాషలో ఒటోఫ్లీట్ యొక్క సువార్త పాట మరియు రక్షకుని యొక్క మతపరమైన స్మారక చిహ్నాలు కూడా ఉన్నాయి.

తరువాతి శతాబ్దం ఒట్టో I చేత విద్య యొక్క పునరుజ్జీవనం కాలం, మరియు కవులు మరియు పండితులు ప్రధానంగా వివిధ ప్రదేశాలలో ఆశ్రమాలలో ఉత్పత్తి చేయబడ్డారు. ఇది అమరవీరుల జీవిత చరిత్రలో మరియు మాస్ యొక్క క్రమం లో ఆరు గద్య నాటకాల అభివృద్ధి, ఇది చర్చి సంగీతంలో ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది. దీనికి 9 వ శతాబ్దం చివరి భాగంలో నాట్కర్ బాల్బులస్ నోట్కర్ మరియు ఇతరులు ముందే ఉన్నారు మరియు సెయింట్ గాలెన్ యొక్క అబ్బే నుండి వివిధ ప్రదేశాలకు వ్యాపించారు. అతను "నో నోబెల్ స్పిరిట్" యొక్క "గోల్డెన్ సీక్వెల్" (ఎస్. లాంగ్టన్ లేదా పోప్ ఇన్నోసెంటియస్ III రాసిన) కు జన్మనిచ్చాడు. రోస్వితకు "మార్టిర్డమ్ ఆఫ్ సెయింట్ ఆగ్నెస్" మరియు "సెయింట్ పెలాజియస్ డెన్" వంటి రచనలు కూడా ఉన్నాయి. సెయింట్ గాలెన్ 11 వ శతాబ్దం ప్రారంభంలో దేవాలయ జీవిత చరిత్ర యొక్క ప్రతిభావంతులైన సంపాదకుడు ఎకెహార్డ్ IV (మ. 980-1060) ను కలిగి ఉన్నాడు. తరువాత, చల్లటి హృదయపూర్వక పూజారి పీటర్ డామియన్ ("సాంగ్ ఇన్ ది సాంగ్" మరియు ఇతర రచయితలు), లాన్ఫ్రాంక్ (మ .1005-89), కాంటర్బరీ యొక్క ఆర్చ్ బిషప్, అన్సెల్మ్ యొక్క అధికారులు మరియు అన్నింటికంటే చాలా మంది హాజరయ్యారు. పారిస్ విశ్వవిద్యాలయం. ఆ సమయంలో మత ప్రపంచంలో ప్రధాన వ్యక్తిగా ఉన్న అబెలార్డ్ మరియు అతని ప్రత్యర్థి, క్లెర్బ్యూకు చెందిన బెర్నార్డ్, తరువాతి తరానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ముఖ్యంగా, అబెలార్డ్ మరియు అతని ఉంపుడుగత్తె ఎలోయిస్ యొక్క విషాద ప్రేమ కథ విశ్వవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది మరియు వారు మార్పిడి చేసిన అనేక లేఖలు, ముఖ్యంగా మొదటిది, ది స్టోరీ ఆఫ్ మై దురదృష్టం మధ్యయుగ మత సాహిత్యంలో నిలుస్తుంది. .. డేవిడ్ యొక్క విలపించే పాటతో సహా ఎలోయిస్ కోసం అతను రాసిన అనేక శ్లోకాలు ఇప్పటికీ ఉన్నాయి. పైన పేర్కొన్న "రోజ్ సీక్వెల్" కూడా బెర్నార్డ్ యొక్క రచన అని చెప్పబడింది.

13 వ శతాబ్దంలో, అనేకమంది ప్రసిద్ధ వేదాంతవేత్తలు మరియు సంపాదకీయవాదులు క్రైస్తవ సాహిత్యం యొక్క పునరుజ్జీవనం వలె ఉత్పత్తి చేయబడ్డారు. అల్బెర్టస్ మాగ్నస్, అతని శిష్యుడు థామస్ అక్వినాస్ మరియు ఫ్రాన్సిస్కాన్ ఆర్. బేకన్ ప్రధానంగా ఉన్నారు, కాని థామస్ పోప్ అర్బన్ IV ఆదేశాల మేరకు యూకారిస్ట్ డే కోసం చేసిన అనేక అద్భుతమైన రచనలు ఉన్నాయి. శ్లోకాలు మరియు ఫాలో-అప్‌లు ఉన్నాయి, ముఖ్యంగా "పోప్ మాగ్నస్, రక్షకుడిని స్తుతించండి" ఒక అందమైన పద్యం. ఏదేమైనా, మధ్య యుగాలలో అతిపెద్ద లాటిన్ మత కవిత టామాసో డా సెలనో (మ .1190-1260), అతను చివరి తీర్పు రోజు పాడాడు మరియు ఇప్పటికీ చనిపోయినవారి అంత్యక్రియల procession రేగింపు. పూజలో క్రమం తప్పకుండా ఉపయోగిస్తారు. జాకోపోన్ డా తోడి (మ .1230-1306) యొక్క "ది వర్జిన్స్ బాధ" మరొక ప్రసిద్ధ శ్లోకం.

మధ్య యుగాలలో ఉత్పత్తి చేయబడిన అనేక మంది సాధువులు, అమరవీరులు మరియు అద్భుత కథలలో, ప్రారంభ రోజుల్లో తెలియని రచయిత "సెయింట్ జెనోవాడెన్" 8 వ శతాబ్దం నాటిది, యాసలో కూడా ఉంది. . ఇప్పటికే 11 వ శతాబ్దంలో, చాలా సాహిత్యం << సెయింట్ అలెక్సీ జీవిత చరిత్ర . ముఖ్యంగా, హీస్టర్బాజా యొక్క సిజేరియస్ (మ .1180-1240) యొక్క "మిరాకిల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్" చాలా ఆసక్తికరమైన ఎపిసోడ్లను సేకరించడం ద్వారా విస్తృతంగా చదవబడింది. అలాగే, 13 వ శతాబ్దం చివరలో సవరించబడిందని భావించిన "రోమన్ పర్సనల్ రికార్డ్", పురాతన మరియు ఆధునిక కాలానికి చెందిన సుమారు 180 వృత్తాంతాల సమాహారం, మరియు కంటెంట్ ఇతరత్రా అయినప్పటికీ, ఇది బ్రిటిష్ పండితుల చేతులు, మరియు మత భక్తి సాధారణం. మత సాహిత్యం అని పిలవవలసిన వ్యాసాలు చాలా ఉన్నాయి. ఇంతలో, ఇటలీలోని ఆర్డర్ వ్యవస్థాపకులు ఇద్దరు ఫ్రాన్సిస్కో మరియు డొమినిక్స్ ఇద్దరూ లాటిన్ లేదా ఇటాలియన్ భాషలలో సిద్ధాంతాలు, మతపరమైన ఆర్డర్ నియమాలు మరియు ఉపన్యాసాలు రాశారు. అన్నింటికంటే, ఫ్రాన్సిస్కో యొక్క విచిత్రమైన వ్యక్తిత్వం మరియు అతని పేదరికం యొక్క బోధనలు అతని మాటలు మరియు పనులను నమోదు చేశాయి. పూర్తి పుస్తకం పుస్తకంలో, ముఖ్యంగా ఇటాలియన్‌లో కనిపించే సూర్యుని పాట మధ్య యుగాలలోని స్వచ్ఛమైన పాటలలో ఒకటి. జాతీయ సాహిత్యం లౌకిక సాహిత్యంలోకి ప్రవహిస్తుంది, అయితే, "చాన్సన్ డి గెస్టే" లోని "అమీ మరియు అమీర్" కథ మరియు ఎస్చెన్‌బాచ్ "పెర్సివాల్" లో హోలీ కప్ కోసం వోల్ఫ్రామ్ తపన కథ కూడా ఒకటే. 13 వ శతాబ్దం ఆరంభంలో హార్ట్‌మన్ యొక్క అమాయక ప్రేమ మరియు అద్భుతాల కథ దయనీయ హెన్రిచ్ >> ఒక ఉద్ధరించే మత వాతావరణం చుట్టూ ఉంది. అదనంగా, ఇది <చాన్సన్ డి గెస్టే> లో ఒక ఉత్తమ రచన. ది సాంగ్ ఆఫ్ రోలాండ్ 11 (11 నుండి 12 వ శతాబ్దం ప్రారంభంలో) క్రూసేడర్స్ యొక్క ఆదర్శాన్ని కూడా సమర్థిస్తుంది మరియు ఇది చర్చి యొక్క ప్రమోషన్ అని ఒక అద్భుతమైన మతపరమైన పని అని చెప్పవచ్చు.

దీని తరువాత యుగంలో, ప్రధానంగా ఇటలీలో డాంటే మరియు పెట్రాల్కా చురుకుగా ఉన్నారు.

Wednesday, April 6, 2022

రాజరికం శిధిలావస్ధ

 భారతదేశంలోని దాదాపు 500 రాజ కుటుంబాల (Royal Families) సంపద చాలా కాలంగా క్షీణిస్తోంది. 1947లో బ్రిటన్ (Britain) నుంచి స్వాతంత్య్రం ( Independence) పొందిన తర్వాత వారి ఆడంబరమైన జీవనశైలి నాటకీయంగా తగ్గిపోయింది.

వివిధ రాజకుటుంబాలు, మహారాజులు, మహారాణులు, నవాబులు, బేగంలు, నిజాంలు, యువరాజులు, యువరాణులు అందరి అధికారాలు తొలగిపోయాయి.. వారి భూములను స్వాధీనం చేసుకొన్నారు.. కొందరికీ ఇప్పటికీ పరిహారం దక్కకపోవడం గమనార్హం. అయితే రాజ కుటుంబాలకు చెందిన కొందరు శక్తివంతమైన వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులుగా మారితే.. మరికొందరు తమ వద్ద ఉన్న రత్నాలు, నగలు, నౌకలు తదితర ఆస్తులను అమ్ముకొని, అప్పులపాలై, చాలీచాలని ఆదాయంతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. దీనావస్థలో ఉన్న రాజ కుటుంబాల కొన్ని గాధలు ఇవే..

ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాద్ చివరి నిజాం వారసులు

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఇప్పుడు అతని వారసుల వద్ద అతని సంపదలోని ఒక భాగం కంటే తక్కువ ఉంది. 20వ శతాబ్దం ప్రారంభం నాటికి నిజాం సంపద సుమారు 100 మిలియన్ పౌండ్లు. బంగారం, వెండి కడ్డీలు, 400 మిలియన్‌ పౌండ్ల విలువైన ఆభరణాలు ఉండేవి. కాగితాలు గాలికి ఎగిరిపోకుండా ఉంచే పేపర్ వెయిట్ కోసం 200 మిలియన్‌ పౌండ్ల విలువైన 185 క్యారెట్ వజ్రాన్ని నిజాం ఉపయోగించారు. అతని అంతఃపురంలో 86 మంది ఉంపుడుగత్తెలు ఉండేవారు. 100 మంది కంటే ఎక్కువ అక్రమ సంతానం ఉన్నట్లు సమాచారం. దీని కారణంగా 1990ల నాటికి అతని సంపదపై చట్టపరమైన హక్కుదారులు 400 మందికి పైగా చేరుకున్నారు.

ఇస్తాంబుల్‌లోని ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో బలహీనమైన, ముసలి తనంలో మధుమేహంతో.. చెప్పలేని సంపద, అందమైన మాజీ భార్యలు, 14,718 మంది సభికుల జ్ఞాపకాలతో బతుకుతున్న నిజాం వారసుడు ముకర్రం జా అత్యంత దురదృష్టవంతుడు.

* రాజా బ్రజరాజ్ క్షత్రియ బీర్బర్ చముపతి సింగ్, తిగిరియా మహాపాత్ర

తన రాజభవనాన్ని బలవంతంగా విక్రయించి, రాచరికపు అధికారాలను తొలగించడంతో రాజా బ్రజరాజ్ క్షత్రియ బీర్బర్ చముపతి సింగ్ ఇప్పుడు గ్రామ ప్రజల దయతో జీవిస్తున్నాడు. అతను ఒడిశాలో జీవించి ఉన్న చివరి మాజీ పాలకుడు. ఒకప్పుడు భారతదేశంలో విలాసవంతమైన రాజు. అతని వద్ద 25 లగ్జరీ కార్లు ఉండేవి. 30 మంది సేవకులతో ప్యాలెస్‌లో నివసించాడు. 13 పులులు, 28 చిరుతపులులను కాల్చి చంపిన వ్యక్తిగా ప్రసిద్ధి.

అయితే భారత స్వాతంత్య్రం తర్వాత అతని అదృష్టం అదృశ్యమైంది. తన రాష్ట్ర పన్ను ఆదాయాన్ని రాజు కోల్పోయారు. బదులుగా సంవత్సరానికి 130 పౌండ్ల ప్రైవీ పర్స్ ఇచ్చారు. 1960లో తన రాజభవనాన్ని 900 పౌండ్లకు బలవంతంగా విక్రయించవలసి వచ్చింది. తరువాత అతని భార్య విడిపోయింది. 1975లో ప్రభుత్వం చివరిగా మిగిలిన రాచరికపు అధికారాలను ఉపసంహరించుకుంది. ఆయన తన వార్షిక ఆదాయాన్ని కోల్పోయారు. ఈరోజు మధ్యాహ్న భోజనానికి అన్నం, పప్పు తెచ్చే గ్రామస్తుల దయతో శిథిలావస్థలో ఉన్న మట్టి గుడిసెలో జీవిస్తున్నారు. ఆ కాలంలో గొప్పతనాన్ని, ఇప్పుడు ఈ జీవితాన్ని చూస్తున్న తాను సంతోషంగానే ఉన్నానని.. అప్పుడు నేనే రాజుని, ఇప్పుడు నేను పేదవాడిని,, కానీ నాకేమీ పశ్చాత్తాపం లేదని రాజా బ్రజరాజ్ క్షత్రియ బీర్బర్ చముపతి సింగ్ చెబుతున్నారు.

* సుల్తానా బేగం, బహదూర్ షా జాఫర్ ముని మనవడి భార్య

భర్త చనిపోయాక ఫించనుతో 6 మంది పిల్లలను పోషించాల్సిన స్థాయికి ఆమె జీవితం పడిపోయింది. ఆమె బహదూర్ షా జాఫర్ ముని మనవడిని వివాహం చేసుకుంది. ఆమె భర్త ప్రిన్స్ మీర్జా బేదర్ బఖ్త్, ఆయన 1980లో మరణించినప్పటి నుంచి సుల్తానా పేదరికంలోకి దిగజారిపోయింది. కోల్‌కతాలోని ఒక మురికివాడలో ఒక చిన్న రెండు గదుల గుడిసెలో నివసిస్తోంది. ఆమె తన పొరుగువారితో వంటగదిని పంచుకొంటోంది. వీధి కొళాయి వద్ద నుంచి నీటిని తెచ్చుకొని వీధిలోనే పాత్రలను శుభ్రం చేసుకొంటోంది.

ఆమె 19వ శతాబ్దపు రాజకుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని రుజువు ఉన్నప్పటికీ.. సుల్తానా తన రోజువారీ జీవితాన్ని నెలకు అందే రూ.6000 ఫించనుతో గడుపుతోంది. ఆ మొత్తంలోనే తన ఐదుగురు కుమార్తెలు, కొడుకు బతకాల్సి వస్తోంది.

గ్వాలియర్ సింధియాస్

తోమర్లు గ్వాలియర్ అద్భుతమైన కోటను నిర్మించారు. మొఘలులు దానిని అపఖ్యాతి పాలైన జైలుగా మార్చారు. 1857 తిరుగుబాటుదారులు దీనిని వ్యూహాత్మక అవుట్‌పోస్ట్‌గా ఉపయోగించారు. చివరికి ఇది సింధియాలకు బలమైన కోటగా మారింది. గ్వాలియర్ కోటను సింధియాలు ఆయుధశాలగా, ఖజానాగా ఉపయోగించారు. సింధియాల వద్ద 'గంగాజలి'గా పేర్కొనే భారీ సంపదను దానిలోనే ఉంచారు. యుద్ధాలు, కరవు వంటి సమయాల్లో ఉపయోగించుకొనేందుకు ఆ సంపదను పోగు చేశారు.

ఈ ఖజానాకు బాధ్యత వహించిన మహారాజా జయజీరావు సింధియా హఠాత్తుగా మరణించడంతో.. ఆ సంపదను పొందేందుకు అవసరమైన రహస్య కోడ్‌ను అతని కుమారుడు మాధవరావుకు చెప్పలేకపోయారు. అప్పుడు మాధవరావు చిన్న పిల్లవాడు. దీంతో ఆ కుటుంబం చాలా ఏళ్లుగా ఆర్థికంగా చితికిపోయింది. ఏళ్ల తరబడి సంపద పోగొట్టుకుని జీవితం కష్టతరంగా మారింది. అదృష్టవశాత్తూ చివరికి మాధవరావు సంపద ఉన్న చోటును కనుక్కొన్నారు. వారి ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారమయ్యాయి. అతను నిధిని కనుగొన్నప్పుడు.. ఆస్తులను లిక్విడేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. టాటా సహా అనేక పరిశ్రమలు, కంపెనీలలో పెట్టుబడి పెట్టారు.

* జియావుద్దీన్ టుసీ, చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడు

జియావుద్దీన్ టుసీ చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌ ఆరో తరం వారసుడు. ప్రస్తుతం అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడుతున్నారు. అద్దె ఇంట్లో నివసిస్తున్న అతను ఇప్పటికీ ప్రభుత్వం పూర్వపు మొఘలుల ఆస్తులను చట్టబద్ధమైన వారసులకు అప్పజెబుతుందని నమ్ముతున్నారు. మొఘల్ వారసులకు రూ.100 స్కాలర్‌షిప్‌ను కొంతకాలం క్రితం ప్రభుత్వం నిలిపివేసింది. ఆ మొత్తాన్ని రూ.8 వేలకు పెంచాలని ఆయన కోరుతున్నారు. ఆర్థికంగా అణగారిన మొఘల్ వారసుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం డబ్బు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టుసీకి ఇద్దరు నిరుద్యోగ కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ఆ కుటుంబం ఫించనుపైనే ఆధారపడి జీవిస్తోంది.

ఉత్రదం తిరునాళ్ మార్తాండ వర్మ, ట్రాన్వాన్‌కోర్ మాజీ రాజు

ఇది తమ సంపదనంతా భగవంతుడికి ధారపోసిన కుటుంబం. 1750 నాటికి ట్రావెన్‌కోర్ ధనికంగా బలపడిన పెద్ద ప్రాంతంగా అవతరించింది. అప్పటి రాజు అద్వితీయమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అతను తన సంపదలన్నింటినీ ఆలయానికి అప్పగించాలని నిర్ణయించుకున్నారు. పద్మనాభస్వామి వారి కుటుంబ దైవం.

1839లో తిరుగుబాటుకు దాదాపు రెండు దశాబ్దాల ముందు వారు బ్రిటీష్‌వారిని ఎదిరించారు.. ఈ తర్వాత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ట్రావెన్‌కోర్‌లోని 50,000ల మంది సైన్యాన్ని తొలగించారు. బ్రిటిష్ రెజిమెంట్‌ల నిర్వహణకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఆ తర్వాత 2011లో తిరువనంతపురంలోని శ్రీపద్మనాభ స్వామి ఆలయంలోని ఖజానాలో అపారమైన సంపదను గుర్తించిన ప్రభుత్వం దానికి రాష్ట్ర రక్షణ కల్పించాలని ఆదేశించింది. అయితే ఈ నిధి తనకు లేదా ప్రభుత్వానికి చెందినది కాదని, దేవుడిదని రాజు ఒక ప్రకటన చేశారు.

టిప్పు సుల్తాన్ వారసులు

భారతదేశం నుంచి గొప్ప యోధులలో ఒకరు టిప్పు సుల్తాన్‌. అతని వారసులు ఇప్పుడు జీవనోపాధి కోసం రిక్షాలు లాగుతున్నారు. "టైగర్ ఆఫ్ మైసూర్"గా గౌరవం అందుకొన్న టిప్పు సుల్తాన్ తన సైనిక వ్యూహాలు, రాజనీతిజ్ఞతతో ఖ్యాతి పొందారు. 1799 మేలో సెరింగపట్నంలో బ్రిటిష్ వారితో పోరాడుతూ మరణించారు. అతని వంశం ఇప్పుడు అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. టిప్పు సుల్తాన్ వారసులు దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్నారు. మనుగడ కోసం చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. దేశంలోని అతిపెద్ద , ధనిక ముస్లిం ట్రస్ట్‌లలో ఒకటైన ప్రిన్స్ గులాం మహ్మద్ ట్రస్ట్‌కి వారసులుగా కొనసాగుతున్నప్పటికీ ఈ పరిస్థితి తప్పడం లేదు.

అతని 12 మంది కుమారులలో ఏడుగురికి వారసులు లేరు. మిగిలిన 5 మందిలో మూనిరుద్దీన్, గులాం మహ్మద్ అనే ఇద్దరు మాత్రమే గుర్తించగలిగినవారు. వారి వారసులు చిన్న వ్యాపారులుగా జీవనోపాధి పొందుతున్నారు. గులాం మహమ్మద్ వంశానికి చెందిన వారు శిథిలమైన హవేలీలో దుర్భరమైన పేదరికంలో జీవిస్తున్నారు.

సకీనా మహల్, అవధ్ యువరాణి

ఒకప్పుడు విస్తారమైన భూమిని పరిపాలించిన ఈ కుటుంబం, ఢిల్లీలోని ఒక అడవిలో ఉన్న అపఖ్యాతి పాలైన మహల్‌లో నివసిస్తోంది. యువరాణి సకీనా మహల్, ఆమె కుటుంబం అవద్ రాజ్యాన్ని పరిపాలించింది. ఒకప్పుడు మధ్య భారతదేశంలోని మముత్ స్వాత్‌ను పరిపాలించారు. ప్రస్తుతం మధ్య వయస్కులైన పి ఇన్సెస్ సకీనా , యువరాజు రియాజ్ మల్చా మహల్‌లో నివసిస్తున్నారు. ఈ నిర్మాణం ఒకప్పుడు తుగ్లక్ కాలం నాటి వేట వసతి గృహంగా ఉంది. ఇప్పుడు చెప్పలేనంతగా శిథిలావస్థకు చేరుకుంది. ప్రభుత్వంతో 9 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత చివరకు ప్రతి నెలాఖరున రూ.500, అదనంగా స్థలాలు కేటాయించారు.

Tuesday, April 5, 2022

వీడ్కోలు గీతం

 వీడ్కోలు గీతం


రచన: శ్రీ సిద్దాంతపు బెనాన్సన్, (జనశ్రీ) ఎమ్.ఎ., బి. ఎస్సీ, బి.యిడి, ఆంగ్ల ఉపాధ్యాయులు


లా... లాలాల లాలా..


మా బంగారు ఐడి నీకు కోటిదండాలు నిను ఏనాడు మరువం చదువుల గుడి మాకు మా బాల్యపు గురుతైన సౌధమా. ఆనందాల స్నేహితుల ఆలయమా మా వీడ్కోలు అలాపన ఆలకిస్తావా నీతో ఉండే వరమే ఇస్తావా.


ప్రియ గురుదేవుళ్ళారా 

మీ విద్యార్థులమంది

 మీ పాఠాలు బోధనలు 

మనసును తడిమే స్పర్శండి.


అల్లరి గోలలతో మిమ్ము బాదించుంటేను

 క్షమియించి దీవించి మమ్మును పంపండి. మా వీడ్కోలు ఆలాపన అలకిస్తారా మీ చిరకాలం ఉండే వరమే ఇస్తారా.


ప్రియ స్నేహపు చిరునామాలు మీ చేయిని విడవొద్దు మన బందాలు ఆత్మీయత చివురులు వేయాలి.


• పైపై చదువులతో మనం పై పైకెదగాలి మన పూరికి బడికి పేరును తేవాలి. | అమ్మ నాన్న మురిసి ఆనందించాలి. కలలాగ కరిగెను కాలమంతాను శిలలో ఉండిపోతే ఎంతో బాగుండు


Farewell Party Celebrations 2018


Z.P.H.S. U. KOTHAPALLI

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...