Monday, May 16, 2022

తమిళనాడుకు చెందిన దైవసహాయానికి మహిమాన్విత హోదా ప్రకటించిన పోప్‌ ఫ్రాన్సిస్‌

 తమిళనాడుకు చెందిన దైవసహాయానికి మహిమాన్విత హోదా ప్రకటించిన పోప్‌ ఫ్రాన్సిస్‌

వాటికన్‌ సిటీ: మూడు శతాబ్దాల క్రితం క్రైస్తవాన్ని స్వీకరించి, చిత్రహింసలకు గురైన తమిళనాడుకు చెందిన సాధారణ పౌరుడు దేవసహాయం పిళ్లైకి సెయింట్‌హుడ్‌ (మహిమాన్విత హోదా) లభించింది


వాటికన్‌ నగరంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆయనకు మహిమాన్విత హోదా ప్రకటించారు. భారత్‌కు చెందిన ఒక సాధారణ పౌరుడికి కేథలిక్కు మతంలో అత్యున్నత గౌరవం దక్కడం ఇదే మొదటిసాది. దేవసహాయంతో పాటు పలు దేశాలకు చెందిన మరో తొమ్మిది మందికి సెయింట్‌ హోదా ఇచ్చారు. వారిలో నలుగురు మహిళలున్నారు. 1712 ఏప్రిల్‌ 23న కేరళలోని ట్రావెంకోర్‌ రాజ్యంలో హిందూ నాయర్‌ కుటుంబంలో దేవసహాయం జన్మించారు.

ట్రావెంకోర్‌ రాజు మార్తాండ వర్మ సంస్థానంలో అధికారిగా పని చేశారు. క్రైస్తవం పట్ల ఆకర్షితుడై ఆ మతాన్ని స్వీకరించి ప్రబోధాలు చేయసాగారు. కోపోద్రిక్తుడైన రాజు దేవసహాయాన్ని ఊరూరా తిప్పుతూ చిత్రహింసలు పెట్టారు. అయినా ప్రజల సమానత్వంపైనే ప్రసంగాలు చేయడంతో 1752 జనవరి 14న కన్యాకుమారిలో కాల్చిచంపారు. దేవసహాయాన్ని చిత్రహింసలకు గురి చేసిన అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతమైన మహిమలు జరిగాయని భారత్‌కు చెందిన కేథలిక్‌ బిషప్స్‌ సమాఖ్య పోప్‌ ఫ్రాన్సిస్‌ దృష్టికి తీసుకెళ్లింది. ఆ మహిమలను 2014లో పోప్‌ గుర్తించినట్టు వెల్లడించారు

Friday, May 13, 2022

కాటన్ దొర

 నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః

స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం.. ":

(మాకు


ఈ నేలే కాదు.. ఆయన నడిచిన ప్రతిచోటా నీరు పారింది. కన్నీరు మాయమైంది. రైళ్లపై కాదు.. నీళ్లపై ఖర్చు చేయండని బ్రిటిష్‌ ప్రభుత్వంతోనే పోరాడిన అరుదైన ఆంగ్లేయుడు.. 123 సంవత్సరాల కిందే కన్నుమూసినా.. నేటికీ కోట్ల మంది జీవితాల్లో జీవనదిలా పారుతున్న అపర భగీరథుడు, డెల్టాశిల్పి.. దార్శనికుడు.. సర్‌ ఆర్థర్‌ కాటన్‌!

Sir Arthur Cotton: 11 మంది సంతానంలో పదోవాడిగా 1803 మే 15న జన్మించిన ఆర్థర్‌ థామస్‌ కాటన్‌ ఈస్టిండియా కంపెనీలో మిలిటరీ ఇంజినీర్‌గా ఎదిగి.. 1821లో భారత్‌కు వచ్చారు. మద్రాసు రాష్ట్ర చీఫ్‌ ఇంజినీర్‌ వద్ద అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా చేరారు. ఆంగ్లో-బర్మా యుద్ధం తర్వాత 1828 నాటికి కెప్టెన్‌గా ఎదిగిన కాటన్‌కు నీటిపారుదల బాధ్యతలు అప్పగించారు. చోళ రాజులు చేపట్టిన పనుల స్ఫూర్తితో కావేరీ నదిపై పలు ఆనకట్టలు కట్టి.. కరవు కాటకాలతో అల్లాడుతున్న తంజావూరు జిల్లాను అన్నపూర్ణగా మార్చేశారాయన. తిండికి అలమటించే తంజావూరు కాస్తా.. మద్రాసు రాష్ట్రంలో అత్యధిక పంట పండించే ప్రాంతంగానే కాదు.. యావత్‌ భారత్‌లోనే ఎక్కువ ఆదాయం ఇచ్చే జిల్లాగా మారింది.

అరకొర సదుపాయాలతోనే..: ధవళేశ్వరం ప్రాజెక్టుకు ముందు ఆంధ్రాలోని గోదావరి జిల్లా పరిస్థితి దారుణంగా ఉండేది. అతివృష్టి అనావృష్టితో అల్లాడేది. ఈ పరిస్థితి మార్చేలా.. గోదావరిపై బ్యారేజి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించారు కాటన్‌. అనుమతైతే వచ్చిందిగాని.. అడిగినన్నీ ఇవ్వలేదు. ఆరుగురు ఇంజినీర్లు, 8 మంది జూనియర్లు, 2వేల మంది మేస్త్రీలను అడిగితే.. ఒక యువ ఇంజినీరును, ఇద్దరు సర్వేయర్లను, కొంతమంది మేస్త్రీలను అప్పగించి చేయమన్నారు. పట్టుదలతో ఆ కొద్దిమందితోనే రంగంలోకి దిగారు కాటన్‌. 1847లో పనిమొదలైంది. మరుసటి ఏడాదే.. అనారోగ్య కారణాలతో ఆయన ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చింది. కలత చెందుతూనే తన కలల ప్రాజెక్టును విడిచి వెళ్లిన ఆయన.. రెండేళ్లలో తిరిగి వచ్చారు. కర్నల్‌ స్థాయికి పదోన్నతి పొంది.. రేయింబవళ్లు తన ఇంటిపనిలా పర్యవేక్షించారు.

సర్​ ఆర్థర్​ కాటన్

పాము కాటుతో కుమార్తె మరణించినా కుంగిపోకుండా.. బ్యారేజి పని ఆగకుండా జాగ్రత్తపడ్డారు. స్థానికంగా లభ్యమయ్యే సామగ్రినే వాడుతూ 1852కల్లా బ్యారేజిని నిర్మించారు. అనుకున్నదానికంటే తక్కువ ఖర్చులోనే పూర్తి చేసి చూపించారు. 370 మైళ్ల మేర కాలువలతో 3.6లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ.. గోదావరి ప్రాంత రూపురేఖలను, జీవితాలను మార్చేశారు. ధవళేశ్వరం తర్వాత.. కృష్ణా నదిపై దృష్టిసారించారు. 1855కల్లా ప్రకాశం బ్యారేజి పూర్తి చేశారు. 1858లో భారత్‌లోని అన్ని నదుల అనుసంధానానికి ప్రతిపాదించారు. కలకత్తా నుంచి కరాచీ దాకా.. ఇండస్‌ నుంచి నీలగిరుల దాకా నదులు, కాలువలను కలపాలనుకున్నారు. తాగునీరు, సాగునీటి సమస్యలతో పాటు.. జల రవాణా వ్యవస్థ కూడా ఎంతో లాభదాయకమవుతుందని కాటన్‌ ఆకాంక్షించారు.

రైల్వేలతో పాటు.. నీటి వసతికి, నీటి వనరులకు భారత్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కాటన్‌ ఆంగ్లేయ సర్కారుతో పోరాడారు. "భారత్‌కు స్టీల్‌ కాదు నీళ్లనివ్వండి.." అంటూ వాదించారు. ఆయన తీరు నచ్చని ఆంగ్లేయ అధికారులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఇక్కడి నుంచి పంపించేయాలని విఫలయత్నాలు చేశారు. కాటన్‌ బుర్రలో నీరు తప్ప మరేమీ లేదని వేళాకోళం చేశారు. చివరకు.. అభిశంసననూ కాటన్‌ ఎదుర్కోవాల్సి వచ్చింది. 1878లో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ విచారణ కమిటీ ముందు హాజరై 900 ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానమిచ్చారు.




1860లో పదవీవిరమణ చేసి ఇంగ్లాండ్‌ వెళ్లిన కాటన్‌ను 1861లో బ్రిటిష్‌ రాణి నైట్‌హుడ్‌తో సత్కరించింది. 1877లో సంభవించిన కరవు గురించి విన్న కాటన్‌... "భారత ప్రాధాన్యాలను గుర్తించటంలో మన (ఆంగ్లేయ) సర్కారు ఘోరంగా విఫలమైంది. కోట్ల మంది తిండికి చస్తుంటే.. కోట్లు ఖర్చు చేస్తూ రైల్వే లైన్లు వేస్తున్నాం. లక్షల మంది మరణం.. నాగరికులం అనుకొనే మన దేశానికే తలవంపు" అని ఆక్షేపించారు. ఆయన సిఫార్సు మేరకే.. పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (పీడబ్ల్యూడీ)ని ఆంగ్లేయ సర్కారు ఆరంభించింది.

భారత్‌ను విడిచి వెళ్లాక.. 84 ఏళ్ల వయసులో కాటన్‌ కొత్త ప్రాజెక్టు చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా కరవుకాటకాలు పోవాలంటే.. వ్యవసాయ విధానాలు మారాలని భావించారు. తన తోటనే ప్రయోగశాలగా చేసుకొని వ్యవసాయం, ఉద్యాన పంటలపైనా పరిశోధనలు చేశారు. ఉత్తరాల ద్వారా భారతీయ రైతులకు సూచనలిచ్చేవారు. తన పరిశోధన సాగుతుండగానే.. 96వ ఏట 1899లో కన్ను మూశారు కాటన్‌. ఒకవైపు ఆంగ్లేయులు భారత్‌ను అన్ని విధాలుగా లూటీ చేస్తుంటే.. భారతీయుల జీవితాల్లో వెలుగులు నింపాలని తపించిన మహనీయుడు.. భారతావని ఆత్మీయుడు కాటన్‌!

ఇదీ చదవండి: భారత రైల్వేపై బ్రిటిష్​ పెత్తనం.. అధికారాలన్నీ వారివే!





ఉయ్యాలవాడ

 ఉయ్యాలవాడ ఎవరు? ఆయన చరిత్ర ఏంటి? అంటూ వెతకడం మొదలుపెట్టారు. మనకు తెలియని ఓ ఉద్యమకారుడి గురించి తెలుసుకునేలా సైరా సినిమా ప్రభావం అందరిపై పడింది. కొందరు అతనే తొలి స్వాతంత్ర్య సమరయోధుడు అంటారు.. మరికొందరు తమకు దక్కాల్సిన రాజాభరణాల విషయంలో జరిగిన అన్యాయంపై తిరుగుబాటు చేసిన పాలెగాళ్ల నాయకుడు మాత్రమే అంటారు. అయితే ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ఎవరు? ఆయన చరిత్ర ఏంటి? అతను బ్రిటీష్‌ వాళ్లను ఎందుకు ఎదిరించాడు?


ఉయ్యాల వాడ చరిత్ర దాదాపు 150 ఏళ్ల క్రితం నాటిది. 18వ శతాబ్ధంలో రాయలసీమలో పాలెగాళ్ల వ్యవస్థ అమలులో ఉండేది. ఆ పాలెగాళ్లలో ఉయ్యాలవాడ కూడా ఒకరు. దాదాపు 80 మంది పాలెగాళ్లు నిజాం నవాబు బ్రిటిషు ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేశారు. నరసింహారెడ్డి తల్లి నీలమ్మ ఉయ్యాలవాడ కాపు పెదమల్లారెడ్డి రెండో భార్య. ఆమె తండ్రి కూడా జమిందారే. పేరు జయరామిరెడ్డి. అతనికి కొడుకులు లేకపోవడంతో మనవడు నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నారు. జయరామిరెడ్డి మరణం తరువాత పాలెగాళ్లకు ఇచ్చే భరణాన్ని రద్దు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. అతడి వారసుడైన నరసింహారెడ్డికి ఇచ్చేందుకు నిరాకరించింది. అంతేకాదు భరణం కొరకు తన అనుచరుడిని పంపిస్తే చాలా అవమానించి పంపాడు తహసీల్దార్. ఆ అవమానం నరసింహారెడ్డిలో ఉద్యమ కాంక్షను పెంచింది.

బ్రిటీష్‌ వాళ్లపై ఉయ్యాలవాడ పోరాటం

తనతో కలిసి వచ్చిన ఇతర పాలెగాళ్లను కూడగట్టుకుని.., 500 బోయసైన్యమంతో కలిసి బ్రిటిష్ ట్రెజరీపై 1846 జులై 10న దాడి చేశారు. ఆ ట్రెజరీ కోయిలకుంట్లలో ఉంది. అక్కడున్న తహసీల్దారును కూడా చంపేశారు. దీంతో బ్రిటిష్ సైన్యం అతనిని వెతకడం మొదలుపెట్టింది. అతడిని పట్టుకున్న వారికి భారీ బహుమతులు కూడా ప్రకటించారు. నరసింహారెడ్డి మరింత సైన్యాన్ని సమకూర్చుకుని గిద్దలూరు వద్ద కెప్టెన్ వాట్సన్ తో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో చాలా మేరకు సైన్యాన్ని నష్టపోయారు నరసింహారెడ్డి.

1846 అక్టోబర్‌లో నల్లమల కొండల్లో ఉన్న జగన్నాథ ఆలయంలో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ఉండగా బ్రిటిష్ సైన్యం అతడిని బంధించింది. అతడితో పాటూ కొన్ని వందల మందిని పట్టుకుంది. వారిలో ఒక్కొక్కరికి ఒక్కోలా శిక్ష వేశారు. వేలమందిలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిపై బందిపోటు దొంగగా ముద్ర వేసింది బ్రిటిషు ప్రభుత్వం. బ్రిటీష్‌ ప్రభుత్వంపై ఉయ్యాలవాడ తిరుగుబాటు చేశారని, హత్యలు, దోపిడిలకు పాల్పడ్డాడని, అతడో దోపిడి దొంగ అని బ్రిటిష్ కమిషనర్ తీర్పునిచ్చారు. అతనికి ఉరిశిక్ష వేస్తున్నట్టు ప్రకటించారు. 1847 ఫిబ్రవరి 22 ఉదయం 7 గంటలకు కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో కోవెలకుంట్ల సమీపంలో ఉన్న జుర్రేరు ఒడ్డున ప్రజలందరూ చూస్తుండగా బహిరంగంగా ఉరితీశారు. అతడి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీసే ఉంచారు. అంతే కాకుండా నరసింహారెడ్డితో పాటు పట్టుబడిన వందల మందిపై కేసు పెట్టారు. వీరిలో కొంతమందికి జైలు శిక్ష వేయగా.. మరికొందికి ద్వీపాంతర శిక్ష పడింది.

తొలి స్వాతంత్ర్య సమరయోధుడు!

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో 1857 సిపాయిల తిరుగుబాటుకి ప్రత్యేక స్థానం ఉంది. ఆ సంఘటనకు పదేళ్ల ముందే ఓ వీరుడు తెల్ల దొరలపై ఎర్ర జెండా ఎగురువేశాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తొలి స్వాతంత్ర్య పోరాట యోధుడిగా కేంద్రం గుర్తించింది. ఆయన 170వ వర్థంతి సందర్భంగా 2017లో ఓ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. ఒంటరిగా పోరాటం మొదలుపెట్టి వందల కొద్దీ సైన్యాన్ని సమకూర్చాడు. అతడు బ్రిటిషు సైన్యాన్ని సమర్థంగా ఎదుర్కొలేకపోవచ్చు, ఏడాది కూడా తన పోరాటాన్ని కొనసాగించలేక ప్రాణాలు విడిచి ఉండొచ్చు... కానీ అతని పోరాటం ఎంతో మందిలో ఉద్యమ స్పూర్తిని నింపింది. వేల మంది స్వాతంత్ర్య ఉద్యమం పట్ల అడుగులేసేలా చేసింది.

Friday, May 6, 2022

అల్లూరి

 అల్లూరి సీతారామరాజు పేరు చెప్పగానే ఒక ఉత్తేజం కలుగుతుంది. ప్రతీ తెలుగువాడిలో ఆ స్థాయి ముద్ర వేశారాయన. ఆయన సాగించిన మన్య ఉద్యమానికి సంబంధించిన అనేక అంశాలు ఇంకా బయటకి రావాల్సి ఉంది.



అలాంటి వాటిలో ఇదిగో ఈ బ్రిటీష్ అధికారులకు సంబంధించిన రెండు సమాధులు కూడా ఉన్నాయి.

దోపిడీకి గురవుతున్న గిరిజనులకు అండగా ఉద్యమం మొదలు పెట్టిన అల్లూరి సీతారామరాజు 1922 ఆగస్టు 22న మొదటిసారిగా చింతపల్లి, ఆ తరువాత 23, 24 తారీఖుల్లో కృష్ణ దేవిపేట, రాజవొమ్మంగి స్టేషన్లపై దాడిచేసి రిజిస్టర్‌లో సంతకాలు చేసి మరీ ఆయుధాలను పట్టుకెళ్ళాడు. వాటిలో 26 తుపాకులు, 2500 తూటాలు ఉన్నాయి. ఇది బ్రిటీష్ ప్రభుత్వం కలలో కూడా ఊహించనిది.

బ్రిటీష్ కాలంలో పోలీస్ స్టేషన్‌లను చూస్తేనే సామాన్య జనం అందునా గిరిజన ప్రాంతాల్లో ఉండేవారు వణికిపోయేవారు. అలాంటిది ఏకంగా పోలీస్ సిటీషన్‌పై దాడి అనేది బ్రిటీష్ అధికారులు సహించలేకపోయారు. ఎలాగైనా అల్లూరి సీతారామరాజుని అణచి వెయ్యాలని అనుకున్నారు. అటవీ ప్రాంతంలో గాలింపు మొదలుపెట్టారు.

అల్లూరు సీతారామరాజుని వెతికే క్రమంలో 1922 సెప్టెంబర్ 3 న బ్రిటీష్ పోలీసులకు, అల్లూరి దళానికి మధ్య చిన్నయుద్ధం జరిగింది. దానిలో అల్లూరి సీతారామరాజు సైన్యం విజయం సాధించగా ఒక బ్రిటీష్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఇది బ్రిటీష్ సైన్యం ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగించింది. రామరాజు పేరు మన్యం ప్రాతంలో మారుమోగిపోయింది. మరింత పట్టుదలకుపోయిన బ్రిటీష్‌ సైనం ఎలాగైనా అల్లూరిని మట్టు బెట్టాలని భావించిన షికారీగా పేరున్న్ క్రిస్టఫర్ విలియం స్కాట్ కోవర్డ్, లియోనెల్ నివెల్లే హైటర్ అనే ఇద్దరు అధికారులను రంగంలోకి దింపింది.

షికారీ అంటే మృగాల వేటగాడు కాదు.. మనుషుల వేటగాడు

వీరిలో స్కాట్ కోవర్డ్‌ను షికారీగా పిలవడం వెనుక ఒక పెద్ద కథే ఉంది. సాధారణంగా వేటగాళ్లను షికారీలని పిలుస్తారు. కానీ బ్రిటీష్ సైన్యంలో తమ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వేటాడే వాళ్లను షికారీలని పిలిచేవారు. అల్లూరి ఉద్యమం కంటే ముందే జరిగిన జలియన్ వాలా బాగ్ హత్యాకాండ జరిపిన జనరల్ డయ్యర్‌ను కూడా ఆంగ్లేయులు షికారీ అని పిలుచుకున్నారు.

అల్లూరి కథలోకి వస్తే స్కాట్ కోవర్డ్ 1895 29 మేలో జన్మించాడు. సైన్యంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాడు అనే పేరున్న స్కాట్ ను అల్లూరి సీతా రామరాజును చంపడం కోసం అసిస్టెంట్ సూపరెండెంట్ హోదాలో నియమించారు. 1914 నుంచి 1920 వరకూ బ్రిటీష్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన హైటర్‌ను కూడా అదే హోదాలో ప్రత్యేకంగా పిలిపించారు. ఆయన 11 సెప్టెంబర్ 1896 లో జన్మించాడు . వీళ్లిద్దరికీ అప్పజెప్పిన టాస్క్ ఒకటే అల్లూరి సీతా రామరాజును చంపడం.

అల్లూరి ఆచూకీ కోసం మొదలైన వేట :

అల్లూరి సీతారామరాజును ఎలాగైనా మట్టుబెట్టాలనే తమ ఆశయం కోసం ఈ ఇద్దరు అధికారులూ స్థానిక గిరిజనులను ప్రశ్నించడం , వేధించడం మొదలుపెట్టారు. అటవీప్రాంతం మొత్తం జల్లెడపట్టారు. అయినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో అల్లూరి ఆచూకీ కోసం స్థానికులపై ఒత్తిడి పెంచారు. అల్లూరిని పట్టిచ్చిన వారికి బహుమతి కూడా ప్రకటించారు.

మొదలైన వ్యూహాలు :

ఎలాగైనా సరే అల్లూరి సీతారామరాజుని పట్టుకోవాలన్న ఈ ఇద్దరు అధికారులు రామరాజు ఉద్యమం పట్ల సానుభూతిపరులపై కన్నేశారు. వాళ్ళ నుంచి రాబట్టిన సమాచారంతో గూడెం కొండల ప్రాంతంలో సీతారామరాజు ఉన్నాడని ఆయన్ను చంపడానికి బయలుదేరి వెళ్లారు. 1922 సెప్టెంబర్ 24న ఎటాక్ ప్లాన్ చేశారు. దీనిపై ముందుగానే సమాచారం అందుకున్న అల్లూరి సీతారామరాజు దళం దానికి ప్రతివ్యూహంతో రెడీగా ఉన్నారు.

అల్లూరి సీతారామరాజును మట్టుబెట్టాలని ఉత్సాహంగా బయల్దేరి వెళ్తున్న బ్రిటీష్ సైన్యానికి అనుకోని విధంగా అల్లూరి దళం ఎదురు తిరిగింది. దామనపల్లి ఘాట్ వద్దకు బ్రిటీష్ సైన్యం చేరుకోగానే మెరుపు దాడి చేసింది. పెద్ద ఎత్తున తుపాకులూ, సైన్యం వెంట ఉన్నా స్కాట్‌ సైన్యం ఏం చేయలేకపోయింది. ఘాట్‌ రోడ్డుకు ఇరువైపుల ఎత్తైన ప్రాంతాల్లో దాక్కొని దాడి మొదలు పెట్టింది అల్లూరి సైన్యం. దీంతో స్కాట్,హైటర్‌ అల్లూరి దళాన్ని ఏమీ చేయలేకపోయారు.

తీవ్రంగా పోరాడిన స్కాట్,హైటర్ యుద్ధ భూమిలో కన్నుమూశారు. ఇద్దరి తల్లోకి తూటాలు దూసుకుపోవడంతో అక్కడిక్కక్కడే మృతి చెందారు. ఈ దాడి టైంలో అల్లూరి సీతారామరాజు ఆ ప్రాంతంలో లేరు. ఉత్తరాది యాత్రలో ఉన్నారు. అయినా బ్రిటిష్‌ వారి ప్లాన్ తెలుసుకొని గెరిల్లా పద్దతిని అనుసరించారు. ఈ దాడిలో పాల్గొన్న భారతీయ సైనికులు ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టలేదు. అందుకే స్కాట్‌, హైటర్‌ డెడ్‌బాడీలను అక్కడే వదిలేసి సైనికులు వెళ్లిపోయారు.

జరిమానా కట్టి డెడ్‌బాడీలను తెచ్చుకున్న బ్రిటీష్ అధికారులు :

స్కాట్ ,హైటర్ మరణం, కనీసం వాళ్ళ శవాలను కూడా వెనక్కు తెచ్చుకోలేని పరిస్థితిలో తాము ఉండడం అనేది బ్రిటీష్ అధికారులకు తల కొట్టేసినట్టైంది. అయినా చేసేది లేక తమ వద్ద పని చేసే భారతీయులకు తెల్ల జెండా ఇచ్చి శాంతి మంత్రం పాటిస్తూ డెడ్‌బాడీలను పడి ఉన్న దామనపల్లి ఘాట్ వద్దకు వెళ్లారు. అక్కడే ఉన్న అల్లూరి సీతారామరాజు దళాన్ని తమ అధికారుల మృతదేహాలను అప్పజెప్పాలని కోరారు.

లేనిపోని ఆంక్షలతో స్థానిక గిరిజనుల ఉపాధి దెబ్బతీసినందుకు, వారిని బాధించినందుకు 500 రూపాయల జరిమానా విధించారు అల్లూరి సీతారామరాజు. దానితో ఆ జరిమానా కట్టి ఆ స్కాట్ ,హైటర్ డెడ్‌బాడీలను వెనక్కు తెచ్చుకున్నారు బ్రిటీష్ వాళ్ళు. వాటిని నర్సీపట్నంలో సమాధి చేశారు. ఆ సమాధులపై వారి వివరాలు చెక్కించిన బ్రిటీష్ అధికారులు వాటి రక్షణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

ముళ్లపొదలు-పిచ్చి మొక్కల మధ్య ఆ రెండు సమాధులు :

ఆ సమాధులు ఉన్న ప్రాంతం నాశనం కాకూడదని, స్వాతంత్య్రం ఇచ్చేసమయంలో ఓ కండిషన్‌ పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం. ఇదొక్కటే కాదు దేశంలో తాము నిర్మించిన అనేక కట్టడాలకు కూడా ఇదే కండిషన్ పెట్టారు బ్రిటీషర్లు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టొద్దన్నారు.

ప్రస్తుతానికి ఆ ప్రాంతం అలానే ఉన్నా .. చుట్టూ రకరకాల కట్టడాలువచ్చేసాయి. ఆ సమాధులు ఉన్న ప్రాంతం కూడా ఎలాంటి శుభ్రత లేకుండా ముళ్ల పొదలతో నిండి పోయింది. నర్సీపట్నంలోని ప్రజల్లో చాలామందికి సైతం ఈ సమాధుల చరిత్ర తెలియదు.

అల్లూరి రగిల్చిన స్ఫూర్తి- నిత్య నూతనం :

అల్లూరిని వేటాడడానికి వెళ్లి తామే బలైన వేటగాళ్ల కథ ఇది. అల్లూరి సీతారామరాజు విప్లవాన్ని కేవలం ఒక పితూరీగా తగ్గించి చూపాలన్న బ్రిటీష్ కథనాలకు.. నిజానికి ఆయన నడిపిన ఉద్యమం ఎంత తీవ్రతరమైందో తెలిపే సంఘటనకు సాక్ష్యం ఈ సమాధులు. ఆయన ప్రాణాన్ని తీయడానికి ఎందుకు బ్రిటీష్ వాళ్ళు తహతహ లాడిపోయారో ఈ సమాధులను చూస్తే తెలుస్తుంది. అందుకే తరువాత కాలంలో నిరాయుధుడిగా ఉన్న అల్లూరిని అంత కిరాతకంగా చెట్టుకు కట్టేసి మరీ దారుణంగా చంపారు ఆంగ్లేయులు. అలా తమ కసినైతే తీర్చుకున్నారేమో గానీ తరతరాలుగా తెలుగువాళ్లలో అల్లూరి సీతారామరాజు రగిలించిన స్ఫూర్తిని మాత్రం అడ్డుకోలేకపోయారు

Monday, May 2, 2022

సంస్కృతం

 హిందీని జాతీయ భాషగా గుర్తించాలంటూ ఓ డిమాండ్ కూడా కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మోస్ట్ డిబేటబుల్ టాపిక్. కన్నడ స్టార్ సుదీప్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్‌ల మధ్య భాష విషయంలో జరిగిన వివాదం కూడా దీనికి తోడైంది. ఇప్పుడు వీటన్నింటినీ కాదని మరో నినాదం ప్రచారంలోకి వచ్చింది. అదే సంస్కృతాన్ని జాతీయ భాషగా గుర్తించాలనే డిమాండ్.

ఎందుకంటే మన దేశంలో అన్ని భాషలకు మూలం సంస్కృతమే అని ఆ భాషలోనే మన వేదాలు ఉన్నాయ్ కాబట్టి తమది జెన్యూన్ డిమాండ్ అనీ వీళ్లు అంటున్నారు. దీన్ని కేంద్రప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని చాలా మంది ట్వీట్లు కూడా చేస్తున్నారు.



సంస్కృతాన్ని జాతీయ భాషగా గుర్తించాలా వద్దా అనే విషయాన్ని వదిలేసి అసలు దేశంలోని భాషలకు మూలం సంస్కృతమే అన్న వాదన ఎంత వరకు నిజమనేది తెలుసుకుందాం. చాలా మంది అనుకునేట్లు భారతీయ భాషలకు మూలం సంస్కృతం కాదు. ప్రత్యేకించి తెలుగు, తమిళ, మలయాళ భాషలకు అసలు ఏ మాత్రం సంబంధం లేదు. అసలు కనీసం అవి ఒకే ఫ్యామిలీకి చెందిన భాషలు కూడా కావు.

మరి సంస్కృతం ఎక్కడి నుంచి వచ్చింది?

మన దేశ జనాభాలో 99 శాతం మంది మాట్లాడే 121 ప్రధాన భాషలు ఐదు వేర్వేరు భాషా కుటుంబాలకు చెందినవి. ఇది మేం చెబుతున్నది కాదు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ అధికారిక వెబ్ సైట్‌లో ఉన్న వివరాలే.

ఈ వివరాల ప్రకారం

1. ఇండో-యూరోపియన్ కుటుంబం
2. ద్రవిడియన్ లాంగ్వేజెస్
3. ఆస్ట్రో-ఏసియాటిక్
4. టిబెటో-బర్మీస్
5. సెమిటో హామిటిక్

1. ఇండో యూరోపియన్ కుటుంబం

ఇండోయూరోపియన్ అంటే ఇండియా, యూరోపియన్ ఖండం ప్రాంతంలో మాట్లాడే భాషల ఫ్యామిలీ అన్న మాట. మళ్లీ ఇండో యూరోపియన్ లో మూడు శాఖలు ఉన్నాయి. ఇండో-ఆర్యన్, ఇరానియన్, జెర్మానిక్ అనే మూడు మూడు శాఖల భాషలు భారతదేశంలో ఉన్నాయి.

ఎ) ఇండో-ఆర్యన్ శాఖ: బంగాలీ దగ్గర మొదలు పెడితే డోగ్రీ, గుజరాతీ, హిందీ, కశ్మీరీ, మరాఠి, నేపాలీ, పంజాబీ, సంస్కృతం, ఉర్దూ ఇలాంటి భాషలన్నీ ఇండో ఆర్యన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన భాషలు.

బి) ఇరానియన్ శాఖ: 1. అఫ్ఘానీ/కాబూలీ/పష్తో

సి) జెర్మానిక్ శాఖ: 1. ఇంగ్లిష్

2. ద్రవిడియన్ కుటుంబం గురించి మాట్లాడుకుంటే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ నుంచి మొదలు పెట్టి, తులు, మాల్టో, గోండి లాంటి భాషలు ద్రవిడియన్ ఫ్యామిలీకి చెందినవి.

3. ఆస్ట్రో-ఏసియాటిక్: భుమీజ్, గడబ, హో, జువాంగ్, ఖారియా, ముండారి, సవర లాంటి భాషలన్నీ ఆస్ట్రో ఏసియాటిక్ లాంగ్వేజెస్ ఫ్యామిలీ నుంచి వచ్చాయి. ప్రత్యేకించి ఈ ఫ్యామిలీలో ముండారీ అనే భాషను చోటా నాగ్ పూర్ ప్లేట్ లో...మోన్ ఖేమర్ భాషను నార్త్ ఈస్ట్, అండమాన్ నికోబార్ దీవుల్లో మాట్లాడతారు.

4. టిబెటో-బర్మీస్: బోడో, మణిపురి,గారో, కుకీ, లడాఖీ, షేర్పా, టిబెటన్, త్రిపురి తదితర 66 భాషలు ఈ కుటుంబానికి చెందినవి. మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ప్రజలు వినియోగించే భాషను ఈ భాషా కుటుంబానికి చెందినవి.

5. సెమిటో హామిటిక్: అరబిక్/అరబీ

భారతదేశంలో అత్యధికులు అంటే 78 శాతం మందికి పైగా మాట్లాడే హిందీ తదితర 21 ప్రధాన భాషలు.. ఇండో-యూరోపియన్ కుటుంబంలోని ఇండో-ఇరానియన్ శాఖకు మళ్లీ దాంట్లో ఉపశాఖ అయిన ఇండో-ఆర్యన్ వర్గంలోకి వస్తాయి. ఇప్పుడు మన హిందీ కావచ్చు..సంస్కృతం కావచ్చు ఈ ఇండో ఆర్యన్ సమూహానికి సంబంధించిన భాషలు.ప్రస్తుతం ఇండో-యూరోపియన్ కుటుంబంలో ఎనిమిది శాఖలుగా మొత్తం 448 భాషలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రాచీన గ్రీకు, లాటిన్, సంస్కృతం మొదలుకొని.. ఆధునిక ఇంగ్లిష్, జర్మన్‌లతో పాటు హిందీ తదితర భాషలు ఇందులో ఉన్నాయి.

ఇండో-యూరోపియన్ భాష మాట్లాడే ఆర్యులు సుమారు క్రీ.పూ 1,500 సంవత్సరాల కిందట భారత దేశంలోకి వాయవ్య ప్రాంతం నుంచి విస్తరించారని భాషాశాస్త్ర పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

సంస్కృతం - హిందీ...

ఇతర భారతీయ ఇండో-ఆర్యన్ భాషల తరహాలోనే వేద సంస్కృతం నుంచి హిందీ పుట్టింది. ఈ క్రమంలో అనేక పరిణామాలు, ప్రభావాలు ఉన్నాయి. వేద సంస్కృతం 1,500 బీసీ కన్నా పురాతనమైనదని భాషాశాస్త్రవేత్తల అంచనా. తొలి వేదమైన రుగ్వేదం ఈ కాలానికి చెందిందని.. వేద సంస్కృతం క్రమంగా మారుతూ 250 బీసీ నాటికి ప్రాచీన వేదంగా రూపొందింది. కొంత కాలం పాటు సాహిత్య, శాసన భాషగా కొనసాగింది. కాల క్రమంలో వ్యాఖ్యానాలకు పరిమితమైపోయింది.

మరోవైపు 500 బీసీఈ నాటికి సామాన్య ప్రజల వాడుక భాష అయిన ప్రాకృతం ప్రాధాన్యం పెరిగింది.

తిణ దోసాని ఖేత్తాని
దోస దోస ఆయం పజా
తస్మాతి వీత దోశేషు
దిన్నం హోతి మహప్ఫలం..!

ఇది అంతరించిపోయిన ప్రాకృత భాషకు సంబంధించిన పద్యం. బౌద్ధులు, జైనులు చాలా వరకూ ఈ ప్రాకృత భాషలోనే గ్రంథాలు రచించారు. క్రీపూ 268 నుంచి 232 వరకూ భారత ఉపఖండాన్ని పరిపాలించిన అశోకుడి శాసనాలను కూడా ఈ వాడుక భాషలోనే వేయించారు.

మళ్లీ క్రీ.శకం 400 నాటికి ప్రాకృతంలోనే అపభ్రంశ మాండలికం ప్రాచుర్యం పొందింది. ఈ అపభ్రంశ నుంచి ఏడో శతాబ్దం నాటికి హిందీ ఆవిర్భావం మొదలైంది. నిజానికి అప్పటికి హిందీ భాషగా దీనికి నామకరణం చేయలేదు. మొఘలుల ఆస్థాన కవి అమీర్ ఖుస్రో 13వ శతాబ్దంలో తను 'హైందవి' భాషలో కవితలు రాసినట్లు చెప్పాడు.అంతకుముందు.. ఇండస్ - అంటే సింధూ నదికి తూర్పున 'హింద్' ప్రాంతంలో నివసించే వారిని చెప్పటానికి 'హిందీ' అనే పదాన్ని ఉపయోగించేవారు. ప్రాచీన పర్షియన్ భాష నుంచి ఈ పదం పుట్టింది. ఆ భాషలో 'హిందీ' అనే పదానికి అర్థం నేటి 'ఇండియన్'.

హిందీ, ఉర్దూలు రెండూ.. భాషాశాస్త్రపరంగా ఒకే ఉప మాండలికానికి చెందిన భిన్న సాహిత్య శైలులు. సాధారణంగా ఉపయోగించేటపుడు ఈ రెండు భాషలూ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కొన్ని పదాలు, పలికే తీరుల్లో స్వల్ప తేడాలు మాత్రమే ఉన్నాయి. లిపి కోసం హిందీ దేవనాగరిని ఉపయోగిస్తే.. ఉర్దూ పర్సో-అరబిక్ లిపిని ఉపయోగించారు.

స్వాతంత్య్రానికి ముందు.. స్వతంత్ర భారత జాతీయ భాషగా హిందుస్థానీ భాషను ప్రకటించాలని మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ తదితరులు భావించారు. అయితే.. పాకిస్థాన్ విడివడిన తర్వాత ఉర్దూను ఆ దేశ జాతీయ భాషగా ప్రకటించుకుంటే.. హిందీని భారతదేశ అధికార భాషగా చేశారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 343 ప్రకారం హిందీ అధికార భాష మాత్రమే. జాతీయ భాష కాదు.

ద్రవిడ భాషలు

సుమారు 6,000 సంవత్సరాల కిందట మూల ద్రవిడ భాష (ప్రోటో-ద్రవిడియన్ లాంగ్వేజ్) మాట్లాడేవారు. ఈ భాష మాట్లాడే ద్రవిడులు వాయవ్య దిశ నుంచి భారత ఉపఖండంలోకి ప్రవేశించి ఉంటారని.. సింధు నాగరికత వీరిదే అయి ఉండవచ్చునని కొందరు పరిశోధకులు ప్రతిపాదించారు. మరికొంత మంది ద్రవిడులు పూర్తిగా భారత్‌లోనే ఉద్భవించిన తెగ అని చెబుతారు మరికొంత మంది ద్రవిడులు పశ్చిమ ఆఫ్రికా ప్రాంతం నుంచి వలస వచ్చిన జాతిగా అభివర్ణిస్తారు. వీటిలో ద్రవిడులు ఎలా వచ్చారనేది నిర్దిష్టమైన సమాధానం లేకపోయినా...ద్రవిడ భాషలు ఇండో ఆర్యన్ భాషలకు సంబంధం లేదని మాత్రం స్పష్టమవుతోంది. భారత దేశంలోకి ఆర్యుల రాకతో...ద్రవిడ భాషలు మాట్లాడేవారు చాలా మంది ఆర్య సమాజంలో కలసిపోగా.. ప్రతిఘటించిన ద్రవిడులు క్రమంగా తూర్పు, దక్షిణ దిశలకు కదలిపోయారని భాషా పరిశోధకులు చెబుతూ ఉంటారు.

మూల ద్రావిడ భాష సుమారు 5,000 సంవత్సరాల కిందట

1) దక్షిణ ద్రావిడ
2) దక్షిణ మధ్య ద్రావిడ
3) మధ్య ద్రావిడ
4) ఉత్తర ద్రావిడ అనే నాలుగు శాఖలుగా విడిపోయింది.

ప్రస్తుతం ద్రవిడ భాషలలో అతి పెద్ద భాషలుగా ఉన్న తమిళం, మలయాళం, కన్నడ భాషలు దక్షిణ ద్రావిడ శాఖ నుంచి.. తెలుగు భాష దక్షిణ మధ్య ద్రావిడ నుంచి ఉద్భవించాయని చెబుతారు. ఆర్యులు 1500 బీసీ కాలంలో భారత ఉపఖండంలోకి ప్రవేశించేటప్పటికి అక్కడ ప్రధానంగా ఉన్న ద్రవిడ భాషా శాఖతో వారితో కలవటం వల్ల రుగ్వేదంలో సైతం కొన్ని ద్రవిడ భాషా పదాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తారు.

500 బీసీ నాటికి పాళీ, ప్రాకృతి వంటి వాడుక భాషలు ప్రాచుర్యం పొందటం ఆరంభమైంది. బౌద్ధ, జైన మతాలు రాజ్యాల ప్రోద్బలంతో ఉచ్ఛస్థితికి ఎదగటంతో.. ప్రాకృత భాషలు స్థిరపడగా సంస్కృతం క్రమంగా మొదటి భాష స్థానాన్ని కోల్పోయింది. పతంజలి కాలం నాటికి ప్రాకృత భాష తొలి భాషగా మారిపోగా.. సంస్కృతం మంత్రాలకు పరిమితమైంది.

వెయ్యేళ్ల కాలంలో ఈ భాషల్లో వేగంగా మార్పులు రావటం ప్రారంభించాయి. ప్రత్యేకించి ద్రావిడ, ఆర్య భాషాలు వేగంగా కలిసిపోవటంతో...చాలా పదాలు ఆర్యుల భాషా సమాజాలతో కలిసిపోయాయి. అయితే ఆర్యుల భాషలను ద్రావిడులు కచ్చితత్వంతో నేర్చుకోకపోవటం వల్ల ఈ రోజు చాలా మాండలికాలు ఏర్పడ్డాయి. సో ఇది మన దేశంలో భాషల వెనుక ఉన్న చరిత్ర. ద్రావిడ భాషలకు సంస్కృతం మూలం కాదు. ద్రవిడ భాషలు వాటికవే ప్రత్యేకం అనే విషయం చెప్పటమే ఈ విశ్లేషణ వెనుక ఉద్దేశం.

చీమలు

 ముందుగా చీమలు నిద్రపోతాయో లేదో తెలుసుకుందాం. గార్డియన్ నివేదిక ప్రకారం, చీమలు నిద్రపోతాయి. కానీ మనందరికీ అర్థమయ్యే రీతిలో అస్సలు కాదు.

1983లో చీమలపై చేసిన పరిశోధన ప్రకారం అవి 24 గంటలలో 12-12 గంటల వ్యవధిలో.. అది కూడా 8-8 నిమిషాలు మాత్రమే నిద్రపోతాయి. వాటికి నిద్ర కంటే కునుకులే ఎక్కువ ఇష్టం. అందుకే ఎక్కువగా చీమలు కదులుతూనే కనిపిస్తాయి. అవి ఎల్లప్పుడూ సరళ రేఖలో ఎందుకు కదులుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. BBC మ్యాగజైన్ సైన్స్ ఫోకస్ నివేదిక ప్రకారం, చీమను సామాజిక క్రిమి అని పిలుస్తారు. అవి కాలనీలు కట్టుకుంటాయి. టీమ్ వర్క్ చేస్తాయి. అవి సరళ రేఖలో కదలడానికి ఇదే కారణం. చీమల నుండి వచ్చే రసాయనంతో దీనికి సంబంధం ఉంది. చీమలు తమ ఇతర సహచరులతో కలిసి ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడల్లా అవి వరుసలో నడుస్తాయి. వాటి శరీరం వెనుక నుండి ఒక ప్రత్యేక రసాయనం బయటకు వస్తుంది, దీనిని ఫెరోమోన్స్ అని పిలుస్తారు. దాని వాసనను పసిగడుతూ ఇతర చీమలు ముందుకు సాగుతాయి. ఈ విధంగా ఒక లైన్ తయారయినట్లు కనిపిస్తుంది. ఎవరైనా ఈ లైన్‌ను విచ్ఛిన్నం చేస్తే, అవి కొన్ని సెకన్లలో తిరిగి సెట్ చేసుకుంటాయి. ఈ రసాయన వాసన ద్వారా, చీమల గుంపులు వాటి ఆహారాన్ని చేరుకోవడమే కాకుండా వాటి నివాస స్థలానికి కూడా చేరుకుంటాయి. ఈ రసాయనం సహాయంతో అవి వివిధ నిర్మాణాలను కూడా చేయగలవని ఈ నివేదిక చెబుతోంది.

Sunday, May 1, 2022

డొక్కా సీతమ్మ

 Dokka Sitamma: అన్నపూర్ణ దేవి(Annapurana Devi) అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ.. అన్నపూర్ణ దేవీ అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో (East Godavari District) డొక్క సీతమ్మ అని వింటూనే ఉన్నాం.



అర్థరాత్రి రెండుగంటల సమయంలో వర్షంలోతడిసిన వ్యక్తి “అమ్మా సీతమ్మ తల్లి .. ఆకలేస్తుందమ్మా” అని పిలవగానే ఎంతో ఆప్యాయంగా వంటచేసి అన్నం పెట్టి ,దుప్పటి ,వస్త్రాలు ఇవ్వగలిగిన ఔదార్యవతి డొక్కాసీతమ్మ తల్లి. ఆంధ్రుల కీర్తిని ఇంగ్లండు వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు సీతమ్మ . అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే మాతృప్రేమ మరువరానిది. నేటి తరానికి ఆమె గొప్పదనం గురించి తెలియజేద్దాం..

తూర్పు గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు అని ఒక మహాతల్లి ఉండేవారు. ఆవిడ పేరు మీద ఆక్విడెక్ట్ కూడా కట్టారు. ఆవిడ గొప్ప నిరతాన్నదాత. వచ్చిన వాళ్లకి లేదనకుండా అన్నం పెట్టేవారు. డొక్కా సీతమ్మ తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలుకా , మండపేట గ్రామంలో 1841, అక్టోబరు రెండోవారంలో జన్మించారు. ఈమె తండ్రి అనుపిండి భవానీశంకరం, తల్లి నరసమ్మ గార్లు. సీతమ్మ గారి తండ్రి శంకరం గారిని గ్రామస్తులు ‘బువ్వన్న’ గారనే పేరుతో పిలుస్తుండేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ ‘బువ్వ'(అన్నం) పెట్టటమే! అటువంటి తండ్రికి కూతురిగా జన్మించిన సీతమ్మ గారు అన్నార్తుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు. విద్యావాసనలు లేని లేని సాధారణ గృహిణి ఆమె. బాల్యంలో సీతమ్మకి తల్లితండ్రులు కథలు, పాటలు, పద్యాలు అన్నింటినీ నేర్పారు. సీతమ్మ బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ మరణిస్తే, ఇంటిని చక్కదిద్దే భారం సీతమ్మ గారి మీద పడింది. దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించారు.

లంకల గన్నవరంకి కోడలుగా అడుగు

గోదావరినదీ పరీవాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలను లంక గ్రామాలని అంటారు. అటువంటి ఒక లంక గ్రామం లంకగన్నవరం. ఆ గ్రామంలో డొక్కాజోగన్న పంతులనే పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా. వీటన్నిటినీ మించి మంచి వేదపండితుడు. బువ్వన్నగారు సీతమ్మను డొక్కా జోగన్న గారికిచ్చి అతి వైభవంగా వివాహాన్ని జరిపించారు. సీతమ్మ అత్తవారింట్లో అడుగు పెట్టగానే ఆమె ఇంటి పేరు ‘డొక్కా’ గా మారింది. ఆమెలో సహజంగా ఉన్న ఉదారగుణం, దాతృత్వం రోజు రోజుకూ పెరగసాగాయి. జోగన్న, సీతమ్మ గార్ల దాంపత్యం అన్యోన్యమైనది. ఆ పుణ్య దంపతులను చూసి చుట్టుపక్కల గ్రామాల వారందరూ గొప్పగా చెప్పుకునే వారు. ఆప్యాయతా, ఆదరణలకు నిలయంగా వారి ఇంటిని గురించి ఆచుట్టుపక్కల గ్రామస్తులందరూ ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవారు. ఏ వేళ అతిధులు వచ్చినా వారికి అన్నపానాదులు లేవని చెప్పకుండా వారికి సకల మర్యాదాలు చెయ్యటం ఒక పవిత్రకార్యంగా ఆ దంపతులు స్వీకరించారు.

ఆవిడ ధృతి, దీక్ష ఎంత గోప్పవంటే.. ఆవిడ జీవితంలో ఒకేఒక్కసారి అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికని బయలుదేరారు. బయలుదేరి, గోదావరి వంతెన వద్ద పల్లకి ఆపారు. ఆవిడ పల్లకిలో కూర్చునారు, బోయీలు అలసిపోయి గట్టు మీద కూర్చున్నారు. అటుగా పి.గన్నవరం వైపు వెళ్ళిపోతున్న ఒక బృందంలో పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే, పెద్దవాళ్ళు “ఒక్క అరగంట లో గన్నవరం వెళ్లీపోతాం… అక్కడ సీతమ్మ మనకు అన్నం పెడతారు” అని మాట్లాడుకోవటం విన్నారు సీతమ్మ . వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్ళటం మానేసి, పల్లకి వెనక్కి తిప్పెయ్యండి… వీళ్ళకి అన్నం పెట్టాలి అని వెనుకకు వెళ్ళిపోయారు. అంతటి నిరతాన్న దాత ఆవిడ. అచిరకాలంలోనే ఉభయ గోదావరి జిల్లాల్లో.. ‘అపర అన్నపూర్ణ’ గా శ్రీమతి సీతమ్మ పేరుపొందారు.

నిరంతర అన్నదానంతో
ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్లిపోయిందంటే, అందరికీ పెట్టి పెట్టి, ఆ దంపతులకి తినటానికి ఏమీ లేకుండా పోయింది. ఒకానొకప్పుడు ఆవిడ భార్త “ఎందుకు ఇంకా ఈ అన్నదానం? మనకి కూడా తినటానికి ఏమీ లేదు. వచ్చి ఎవరైనా తలుపుకొడితే సిగ్గేస్తోంది! పెట్టడమా మానవు! ఇంత అన్నం పప్పైనా పెడతావు…” అన్నారు. దానికి ఆవిడ “నేను నిస్వార్థముగా పెట్టేటప్పుడు, వచ్చిన వారు తింటున్నప్పుడూ వచ్చినదీ, తింటున్నదీ శ్రీ మహా విష్ణువని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడు? మనకీ వాడే పెడతాడు” అని చెప్పింది. తరువాత ఒక రోజు సాయంకాలం ఇన్నాళ్ళ నుంచీ దున్నుతున్న అదే పొలానికి వెళ్లి సీతమ్మ భర్త గునంతో తవ్వుతున్నారు. గునపానికి ఏదో తగిలి ఖంగుమంది. ఆయన మట్టి తీసి చూస్తే ఒక బిందె కనపడింది. బిందె మూత తీస్తే, దాని నిండా బంగారు నాణాలే. ఆ బంగారు కాసుల రాశులతో మళ్లీ రొజూ కొన్ని వందల మందికి అన్నదానం చేసారు.

ఆశ్చర్యం ఏమిటంటే బ్రిటిష్ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా కలక్టరుకి డొక్కా సీతమ్మ ఫోటో తీసి పంపించమని ఉత్తరం వ్రాసాడు. దేనికి అంటే “నాకు పట్టాభిషేకం జరిగే సమయంలో ఆవిడకు నమస్కారం పెట్టాలి. కానీ ఆవిడ సముద్రం దాటి రారు కాబట్టి, ఆ సమయములో ఒక సోఫా వేసి, ఆవిడ ఫోటో అందులో పెట్టి, ఆవిడకు నమస్కారం పెట్టి అప్పుడు పట్టాభిషేకం చేసుకుంటా” అని వ్రాసాడు. తూర్పు గోదావరి జిల్లా కలక్టరు ఫోటోగ్రాఫర్ ని తీసుకుని ఆవిడ దగ్గరకు వెళ్తే, “నేను ఈ సన్మానాల కోసం, ఫోటోల కోసం, నమస్కారాల కోసం అన్నదానం చెయ్యలేదు. విష్ణు మూర్తికి అన్నం పెడుతున్నాని పెట్టాను. దీనికి ఫోటోలు పట్టభిషేకాలు ఎందుకు, వద్దు” అన్నారు ఆవిడ. “అమ్మ ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం. మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు” అని ఆ కలెక్టరు చెబితే, “నీ ఉద్యోగం పోతుంది అంటే, తీయించుకుంటా, నువ్వు అన్నం తినాలి” అని తీయించుకున్నారు ఆవిడ. బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి, నమస్కరించి, పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉంది. ఒక మనిషి నిస్వార్థముగా, ధృతితో, పట్టుదలతో లక్ష్య సిద్ది కోసం పాటుపడితే, వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు, వారిని దైవం కూడా నిరంతరం కాపాడుతారు. డొక్కా సీతమ్మ గారి జీవితమే దీనికి నిదర్శనం.

అన్నదానాన్ని మించిన దానంలేదని చెప్పటమే కాకుండా నిస్వార్ధంగా జాతి, కుల, మత విచక్షణ చూపించకుండా అన్నార్తులందరికీ మాతృప్రేమను పంచి జీవితాన్ని చరితార్ధం చేసుకున్న ‘అపర అన్నపూర్ణమ్మ’మన డొక్కా సీతమ్మ.. జాతిరత్నం. 1909 ఏప్రియల్ 28న శివైక్యం చెందారు. డొక్కా సీతమ్మ జీవిత చరిత్రను గురించి నేటి తరానికి తెలియచేయటం, ఆమె చేసిన నిస్స్వార్ధ సేవలను గుర్తుచేసి ఆమె చరిత్రనుండి స్ఫూర్తివంతుల ను చేయటమే ఆమహానీయురాలికి మనం ఇవ్వగలిగే ఘనమైన నివాళి!….

( బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనములనుండీ సేకరణ)

Tamil Nadu: రోడ్డును బ్లాక్ చేసిన ఏనుగు

సన్మాన పత్రం సుగుణక్క

 ఓ  ముగ్ద సుఖుమార సుగుణ సుసంపన్నరాశి మృదు మధుర సంభాషిణీ నిర్మలహృదయ గురుకులమణి దీప్తి , మా మనో  స్పూర్తి నేత్రి ,ఆదర్శమార్తీమణి మన అందరి ప్రే...