Thursday, March 19, 2026

మహర్

 మహర్  అంటే మాల  ఏది నిజం

అంబేద్కర్ రాసిన అంటరానివారు ఎవరు

పుస్తకంలో  మహారాష్ట్రలో మహర్ లు  చచ్చిన గొడ్డు పై హక్కు కలిగి ఉన్నారు క్రీ శ 600 వందల సంవత్సరం నుండి ఇది ఉంది.అక్కడ మహర్లు చచ్చిన గొడ్డు గురించి తగువులాడి మరీ తీసుకునేవారు.ఇక్కడ ఆంధ్రలో మాదిగలు ఇదే హక్కు కలిగి ఉన్నారు.అయితే అంబేద్కర్ నిర్దారించిన దాని ప్రకారం ఆవు మాంసమే అంటరాని తనాన్ని సృష్టించింది.యఙ్ఞాలలో ఆవులను పరిశుభ్రమైన తాజా మాంసాన్ని తినే బ్రాహ్మణులు క్రీ శ 600 నుండి తినడం మానివేసారు.కాని ఊరు చివర పేదరికంలో బ్రతికే వారు దీనిని మానుకోలేదు సరికదా తాజ మాంసం తినే సంపద వారి దగ్గరలేదు.అందుకని చనిపోయీన గొడ్డు గురించి గొడవ పడి అది హక్కుగ పొందే లా చేసుకున్నారు.అది అపరిశుభ్రత అసహజం నుండి అంటరాని తనానికి దారి తీసింది.ఆపును మరింత పవిత్ర జంతువును చేయడంతో ఈ అంటరాని తనం మరింత ముదిరింది.మహరాష్ట్రలో మహర్ లు దీనిని హక్కుగ కలిగి ఉన్నారని అంబేద్కర్ రాసారు.అయితే మహర్ లు కూలీలుగ కుల వృత్తిలేని వారిగలేరు.వారు చర్మశుద్ది చేసారు.ఇక్కడ మాదిగలు అదే హక్కు కలిగి చర్మ వృత్తి కలిగి ఉన్నారు.ఇక్కడ మాలలు కుల వృత్తిలేకుండా వుండి కూలీలుగ ఉన్నారు. అంబేద్కర్  పశుమాంశ భక్షణను తీవ్రంగ వ్యతిరేకించారు.తినవద్దని మహర్ లను కోరారు.ఆయనకు దక్షిణాది రాష్ట్రాలలో ఏం జరుగుతుందో తెలియదు అని రాసారు.ఆయనకు అన్ని రాష్ట్రాల షెడ్యూలు తెగల జీవన విధానంపై స్పష్టమైన అవగాహనలేదని అన్నారు.ఎందుకంటే సమాచార వ్యవస్ద అప్పటికి ఏం మాత్రం అభివృద్ది చెందలేదని మనకు తెలియందు కాదు.ఆయనకు మహర్ లు పశుభక్షణ చేయటం ఇష్టంలేదు.మరి మాలలు ఎందుకు మహర్ లు మాలలు అంటున్నారో అర్దం కాలేదు.అంబేద్కర్ తన కులాన్ని చర్మకార వృత్తి కలిగినదిగా చెప్పుకుంటానికి ఒకరకంగా ఒప్పుకోలేదు.అందుకే మాలలు మహర్లను ఒక గాటిన కట్టి అందులో ఉంచాడు.అందుకే మాలలు ఆయనను మా వాడు మా మాల వాడు అంటున్నారు.కాని అంబేద్కర్ మహర్ లు చచ్చిన గొడ్డు పై హక్కు కలిగి ఉన్నారు అన్నారు.మరి మాలలు చచ్చిన గొడ్డు పై హక్కు కలిగి ఉండటానికి ప్రయత్నిస్తే బాగుంటుంది.లేదంటే మహర్లు మాదిగలు ఒకటే అని ఒప్పుకుంటే బాగుంటుంది

No comments:

Post a Comment

కొండేపూడి

 ఈదిమూడి లో మొదలైన ఈదురుగాలి  ఉమ్మడి రాష్ట్రమంతా ముసురుగ మారి మాదిగ జాతి మనస్సును జయిస్తుందని ఎవరికి అంచనాలులేవు.అంబేద్కరుడు ప్రసాధించిన రిజ...