Thursday, March 19, 2026

 చాకలి వాళ్ళ మీద రెడ్ల దాడి

3 నెలల పసికందును కాళ్ళతో త్రొక్కి

చంపిన సంఘటన దిగ్బ్రమ కలిగిస్తుంది

సాధించాం సాధించాం అనుకుటుంన్నాం

ఈ సంఘటన మన భాధ్యతను గుర్తు చేస్తుంది

ఈ సంఘటన నా చిన్నతనంలో జరిగిన నా బాల్యపు మరకను గుర్తు చేస్తుంది.ఇది 1977 లో జరిగింది.నేను దివిలి గ్రామంలో ఉండేవాళ్ళం. హైస్కూల్లో ఆరవతరగతి చదువుతున్న రోజులు

హైస్కూలు విడిచిపెట్టారు .అందరం ఇంటికి వస్తున్నాం దివిలి గ్రామం నడిబోడ్డున పెద్ద కాలువ ఉంటుంది ఆ కాలువ గట్టునుండి ఇంటికి వెళ్ళాలి. అక్కడ ఆ రోజు ఊరి జనం అంతా నిలబడి ఉన్నారు ఏదో సినిమా సీనులా అక్కడ తెల్ల పంచులు కట్టుకున్న ఓ ఐదుగురు చెక్క కుర్చీల్లో కూర్చుని ఉన్నారు.అందులో మధ్యలోని వ్యక్తి అస్తమాను మీసం తిప్పుకుంటున్నాడు.ఆ ఐదుగురు చేతుల్లో చేతికర్రలున్నాయి.కొంత సేపటికి ఊరులో నుండి ఇంటికి పోవడానికి బట్టలమూట పట్టుకుని ఓ ముసలమ్మ వచ్చింది వాళ్ళను దాటుకుని వెళతా ఉంటే మధ్యలోని వ్యక్తి ఉన్నపళంగా లేచి బంలంగా బాదేసాడు ముసలిదాన్ని వెర్రి కేకలు పెట్టుకుంటూ ఏడుస్తూ పారిపోయింది.ఇంతలో ఓ వ్యక్తి సైకిలు పై మూటను పట్టుకు వచ్చాడు ముగ్గురు లేచి ఇష్టవచ్చినట్లు కొట్టారు.అతను దణ్ణం పెడుతున్నా వినలేదు.అలా చీకటి పడేవరకు బయటకు వెళ్ళి ఇళ్ళకు వస్తున్న చాకలి కుటుంబాలను చితకబాదారు లంజాకొడుకులు

తలుచుకుంటుంటే అప్పుడు భయంతో కొట్టుకున్న గుండే ఇప్పుడు ఆవేశంతో కొట్టుకుంటుంది ఎంత దురాగతాలను భరించారు 

యాభై ఏళ్ళైనా చాకళ్ళ పరిస్దితి మారలేదు.మందకృష్ణే లేకపోతే మన జాతి పరిస్దితి ఏంటి. ఏంత ధైర్యంగా ఉన్నాం మహానుభావుడువలన

No comments:

Post a Comment

కొండేపూడి

 ఈదిమూడి లో మొదలైన ఈదురుగాలి  ఉమ్మడి రాష్ట్రమంతా ముసురుగ మారి మాదిగ జాతి మనస్సును జయిస్తుందని ఎవరికి అంచనాలులేవు.అంబేద్కరుడు ప్రసాధించిన రిజ...