Wednesday, November 2, 2022

తోలుబొమ్మలాట — జానపదకళారూపాలు 6

  తోలుబొమ్మలాట

రచన జనశ్రీ

రచన జనశ్రీ

8555990104

bensonnila@rediffmail.com



శతాబ్దాల తరబడి భారతీయ సంస్కృతిలో భాగంగా అందరినీ అలరించిన అపురూప కళారూపాలలో పురాతనమైన కళారూపం తోలుబొమ్మలాట. జింక లేదా మేక తోలుతో తయారయిన ఈ బొమ్మలు తెలుగువారి జీవితంలో విడదీయరాని భాగంగా మమేకమయినవి. ప్రస్తుతం నిశ్శబ్దంగా అంతరిస్తూ మినుకు మినుకుమంటూ ఆధునిక నాగరికతకు ఎదురీదుతున్న జానపదకళారూపం తోలుబొమ్మలాట. ఈ విశిష్ట కళారూపం పండితారాధ్య చరిత్రలోను, "పల్నాటి చరిత్రలోను ప్రస్తావించబడిన ప్రాచీన కళ ఇది. వర్షాలు కురవకుంటే తోలుబొమ్మలాటలోని విరాటపర్వం ప్రదర్శిస్తే వర్షాలు కురుస్తాయని ఈనాటికి పల్లె ప్రజలకు విశ్వాసం.


తోలు బొమ్మలాట లలిత కళల సమాహారం అనడంలో సందేహం లేదు. ఇందులో సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేకఖనం, శిల్పాలతో కూడిన సంపూర్ణ కలయింది. ఊరు మధ్య ఖాళీ ప్రదేశంలో మూడు వైపుల మూసి వేసి, నాలుగవ భాగం వైపు తెర కడతారు. లోపల దీపాల వెలుగులో తెరమీద తోలుబొమ్మలు నిలిపి దానిని కదుపుతూ ఉంటారు. రామాయణ, భారత , భాగవత ఘట్టాలను కీర్తనలుగాను, పద్యాలుగాను, వచనాలుగాను ఆయా ప్రాంతాల మాండలీకతో కూడిన సంభాషణలుగా వెనుకనుంచి పలుకుతూ రసవత్తరంగా రాత్రంతా సాగే ప్రదర్శన తోలుబొమ్మలాట. ఈ కళ నేటి సినిమాకు మాతృక అనడంలో అతిశయోక్తి లేదు.


తోలు బొమ్మల తయారీ ప్రాచీన కళానైపుణ్యానికి ఓ మచ్చుతునక. సాధారణంగా నాలుగు అడుగుల తోలు: బొమ్మ తయారు చేయాలంటే

రెండు మేక చర్మాలు, గోరు గొల్లలు, మేకులు, వెదురు బద్దలు, గేదె కొమ్ములు, దారాలు మొదలయినవి అవసరముంటుంది. బొమ్మను మూడు భాగాలుగా తయారు చేసి కదలికలకు అనువుగా అతుకుతారు. బొమ్మలకు ఆనాడు ప్రకృతి సిద్ధంగా లభించే రంగులు వాడేవారు. నేడు ఆధునికమైన రసాయనిక రంగులను వాడుతున్నారు. ప్రదర్శన ఇచ్చేప్పుడు నేపధ్యానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పాత్రల సంఖ్యలను బట్టి ప్రదర్శన కారులు 10 మందికి పైగా అవసరమవుతారు. వీరు హార్మోనియం, మృదంగం, ఇతర వాయిద్యాలు, పెద్ద పెద్ద చప్పుడు చేసే చెక్క బల్లలు, డబ్బాలు, విద్యుద్దీపాలు, మైకులు ఉపయోగిస్తారు. రామాయణ, భాగవతాల నుండి, లంకా దహనం, లక్ష్మణ మూర్చ, ఉత్తర గోగ్రహణం, రావణ గర్వభంగం, సుందరకాండ, శశిరేఖ పరిణయం,బాణాసుర, తదితర ప్రదర్శనలిస్తుంటారు .  నాలుగు దశాబ్దాల క్రితం వరకు తరతమ భేధాలు మరచి ఆబాలగోపాలం ప్రదర్శనలను తిలకించే వారు. కేరింతలు కొట్టి ఆనందించేవారు. సినిమా విదేశీ టి.వి. ఛానళ్ళ ప్రభావంతో క్రమేణా అదృశ్యమయ్యే పరిస్థితికి చేరుకుంది ఈ తోలుబొమ్మలాట. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం మాధవ పట్నం గ్రామం తోలుబొమ్మలు ఆడించే కళాకారులకు ప్రసిద్ధి చెందింది. 600 మందికి పైగా కళాకారులు ఈ గ్రామంలో నివసిస్తూ ఈ ప్రదర్శన కోసం 50 బృందాలుగా ఏర్పడి జీవిస్తూ ఉన్నారు.


ప్రస్తుత కాల మాన పరిస్థితుల దృష్ణా మనుగడకోసం ఈ తోలుబొమ్మలాట కళాకారులు తమ ఇతి వృత్తాలను మార్చుకొని కుటుంబ నియంత్రణ, ఎయిడ్స్, పల్స్ పోలియో, జన్మభూమి, బాలకార్మిక నిర్మూల బాల్య వివాహాలు,వంటి సామాజిక చైతన్య ఇతివృత్తం గల రూపకాలను ప్రదర్శిస్తూ జాతీయ, అంతర్జాతీయంగా కీర్తి గడిస్తున్నారు. శరవేగంగా దూసుకు వస్తున్న ఎలక్ట్రానిక్ యుగంతో పోటీ పడలేక ఇలాంటి జానపదకళా రూపాలు కనుమరుగు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇటువంటి కళారూపాలను ఆదరించి, కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైనా వుంది. ఈ కళకే అంకితమయిన మాధవ పట్నం గ్రామ నివాసి తోలు బొమ్మలాట కళాకారుడు తోట పవన్ కుమార్ మరియు వారి బృందం దేశ, విదేశాలలో ప్రదర్శనలిస్తూ, విశేష ఖ్యాతిని గడించారు. వీరి బృందం అమెరికా: ఆస్ట్రేలియా, మారిషస్ దేశాలలో పలు ప్రదర్శనలిచ్చి భారతీయ కళావైభవాన్ని చాటి చెపుతున్నారు.


No comments:

Post a Comment

సినీ కథ లైనులు

 యాక్సడెంట్ లో ప్రాణాలు పోతాయి ఇద్దరికీ స్నేహితుడే సాక్షి ఇద్దరి చావుకు కాలంలో ఆస్ట్రెలియా పోతాడు ఫ్రెంఢు ఓ ముప్పై సంవత్సరాల తరువాత బిజినెస్...