Friday, January 10, 2020

నీ పంతం నా సొంతం (జనశ్రీ)


నీ పంతం నా సొంతం (జనశ్రీ)
తుషార బిందువులు కవితా సంపుటి నుండి
పంతంతో పయనించే పావురమా
పౌరుషంగా పాలపుంతలకెగరకుమా
గాలి లేక రెక్కలు ఆడ లేవు
ఊసు లేక ఊహలు ఊగ లేవు
కోపం ఇంక చాలు కానీ
వెచ్చని గూటిలోకి వేగంగా రావమ్మా
అనుకున్న దేమీ లేదే అక్కడ
అమృతధార ఒడిలో ఇక్కడ
కౌగిలింతగా కమ్ముకుంది
మనసునిండా అలముకుంది
నా మాట విని కలతలు మాని
అదరం చేరి అమృత మందుకో
మినుగురు ని గూటిలో దీపంగా వెలిగించా
మంచు చినుకులను మల్లెపూలుగ చల్లా
సూరీడు చూడకుండా వెన్నెలమ్మ వెళ్లకుండా
గూడు చేరి గుండెనిండా మత్తుజల్లుకో
తుషార బిందువుల కవితా సంపుటి సినీ నటులు సాహితీవేత్త తనికెళ్ల భరణి ప్రపంచ రచయితల సభలలో ఆవిష్కరించారు
సిద్ధాంతపు బెన్ జాన్సన్
9908953245
ఉప్పాడ కొత్తపల్లి
తూర్పు గోదావరి జిల్లా


No comments:

Post a Comment

 మహాకవి జాషువా జీవితం-పిరదౌసి ఒక సందేశం మహాకవి జాషువా రచించిన కావ్యాల్లో ‘నా కథ’ మూడు భాగాలు చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో జీవిత కథకు చాలా...