Friday, January 10, 2020

సందె మెరుపు ( జనశ్రీ )


సందె మెరుపు  (  జనశ్రీ )
తుషారబిందువులు కవితాసంపుటి నుండి
సందె మెరుపులో  పలికే నాదము
మువ్వల వీణపై పలికిన రాగము
ఆ రాగం చెలి పిలుపో
ఆ పిలుపే కొసమెరుపో
నా ప్రేమ కు తొలి గెలుపో
చీకటి ఒడిలో నిదురించే తామరం
భాను నీ రాకతో బరువుగా తెరిచే నేత్రం
వెన్నెల వెలుగులోవిరిసే కమలం
భ్రమరం కోసమే చిందే మధురం
ఉషోదయంలో భానుడు  ఊహించని రీతిలో
చల్లని వేళ బ్రమరానికి కలిగిన బ్రాంతిలో
మైమరచి చిందేసే పాడే గీతము
మనసు ఉండక పాడితి నీ కోసము
తుషార బిందువుల కవితా సంపుటిని ప్రముఖ సాహితీ వేత్త, ప్రముఖ నటులు తనికెళ్ల భరణి ప్రపంచ రచయితల సభలలో ఆవిష్కరించారు
సిద్ధాంతపు బెన్ జాన్సన్
ఉప్పాడ కొత్తపల్లి
9908953245
తూర్పు గోదావరి జిల్లా


No comments:

Post a Comment

ALIVI