Tuesday, January 27, 2026
Saturday, January 17, 2026
అది 1971 తారు రోడ్లు అంతగాలేని కాలం.
అమీనాబాద మా అమ్మమ్మగారి ఊరు .అమ్మ తొండంగిలో టీచరుగా పనిచేసేది.వేసవి సెలవులకు నన్ను తీసుకుని ఉప్పాడ శివారు అమీనాబాద అమ్మమ్మ ఇంటికి తీసుకు వచ్చేది. అమీనాబాద గ్రామం మొదల్లో రెండు నుయ్యిలు , రెండు దేవతల గుళ్ళు, మధ్యలో రావిచెట్టు ఉండేవి.ఎక్కడైనా మాదిగపేట ఊరు చివరన ఉంటుంది.ఇక్కడ ఊరు మొదల్లోనే ఉండేది. అందువలనేమో అమీనాబాద మాదిగపేటటంటే చుట్టు ప్రక్కల గ్రామాలకు గౌరవం ఉండేది. ఊరులోకి వెళ్ళేప్పుడు ఎడమ ప్రక్క మామిడి తోట ఉండేది. అందులో సీతాఫలం చెట్లు అక్కడక్కడ రెండు కొబ్బరిచెట్లు.జిల్లేడు, రక్కీసు,సీతమ్మోరు పొదలు,పల్లేరు పాదులు ఉండేవి.తోట మధ్యలో నీటి గుంటలు ఉండేవి. చుట్టూ అంతా ఇసకక్షక్ష
క్ష
క్ష
క్షహక్ష
ౄ కోరడి ఉండేది.దాని మీద బ్రహ్మజెమ్ముడు మట్టలు గుచ్చి ఉండేవి అవి చాలా ఎత్తుగా పెరిగేవి. వాటికి కమల పువ్వులాంటి పూలు గుత్తు గుత్తులుగా ఉండేవి. వాటి వాసన బలే గమ్మత్తుగా ఉండేది.అక్కడక్కడ కనకంబరం పొదలు కొరడి వారల్లో ఉండేవి.కుడి ప్రక్కన మాదిగపేట ఉండేది.మధ్యలో ఇసకబాట ఉండేది.మాదిగ పేటకు అమీనాబాద వాడపేటకు మద్యలో బారికి వీరన్న జామతోట ఉండేది. రాత్రి ఏడు ఎనిమిది అయ్యిందంటే మాదిగపేట దాటి వాడపేటలోని వెళ్ళడానికి బయపడేవారు.మాదిగపేటదాటి సీకోటి భూలోకు ఇంటివరకు దెయ్యాల్లాంటి తాటి చెట్లతో నిర్మానుష్యంగా బిక్కు బిక్కుమంటూ ఉండేది. కిరసనాయిలు బుడ్డీ పెట్టిన లాంతర్లు పట్టుకుని వెడితే కాని దారి కనబడేది కాదు అప్పటికి కరెంటు లేదు.ఉప్పాడలో కరెంటు స్ధంబాలు ఉన్నా 60 వాట్ల గాజు బల్బులు వెలుగుతూ ఉండేది. ఆ వెలుగు ఆ స్ధంబం కిందే ఉండేది.నేను నా వయస్సు వారైన రక్థసంబందీకుల స్నేహితులతో ఆడుకునేవాడిని. ఆ రోజుల్లో వెన్నెల పట్టపగలంత కాంతి వంతంగా ఉండేది. చందమామ వెలుగు కళ్ళల్లో జిగేలు మనేది.స్వచ్చమైన కాలుష్యం ఎరుగని వాతావరణం అది . మంచుకి వెన్నెల వెలుగుకూ చలివేసేది.దానికి తోడు పాదాలు మునిగేంత లోతైన ఇసక ఊరంతా ఉండేది.ఆ ఇసకలో పిల్లలం గూళ్ళు కట్టుకుని ఆడుకునేవాళ్ళం.ఆకలి మరచి ఆడుకునేవాళ్ళం ఊరంతా తాటాకు ఇళ్ళే ఇళ్ళమద్యన పరిగెడెతూ ఆడుకునేవాళ్ళం.ఇళ్ళమధ్య పరిగెడుతూంటే ప్రతీ ఇంటి దగ్గర కూరల పులుసుల వాసన గుమాయించేది. చేపల పులుసు, ఎండు చేపల పులుసు, ఎండుకక్కల కూర,కరుగులు సమురు వాసన ముక్కుపుటాలను అదరగొట్టేవి. ఒకొ ఇంటి దగ్గర కమ్మటి కల్లు వాసన వచ్చేది. ఆడపిల్లలు మగపిల్లలం కలసి ఆడుకునేవాళ్ళం.చాలా సేపు ఆడుకునేవాళ్ళం. నేను ఊరునుండి వచ్చేవాడిని కాబట్టి ప్రతీ కుటుంబం ప్రేమగా చూసేవారు. పెద్దవాళ్ళయితే ముద్దలు తినిపించేవారు. ఎవరో ఒకరి ఇంటి దగ్గర తినేసేవాడిని.అప్పుడప్పుడు మాదిగ మాష్టీల ఆడపిల్లల డాన్సు ప్రొగ్రాం ఉంటుండేది. హర్మోనియం, డోలుకుతో మగాడు పాట పాడుతుండే ఆడపిల్ల మోకాళ్ళు దాకా గౌను వేసుకుని బలే ఢాన్సు చేసేది.తరువాత మాదిగలు పెట్టే భోజనం తినే పోయేవారు.
నేను ఆడుకుని ఆడుకుని ఇంటికి పోయేవాడిని మా ఇల్లు పేటకు చివరన పుంతకు ఆనుకుని ఉండేది.నేను పుంతలోకి చూసేవాడిని కాదు ఎందుకంటే పుంతలో కొండికికాయల చెట్టు ఉండేది.దాని మీద దెయ్యం ఉంటుందేమోనని భయం వేసేది.వెన్నెల వెలుగుకి చెట్టు నీడతో పుంత చీకటిగా ఉండేది. ఆడవారు ఇద్దరు ముగ్గురు కలసి చెంబులు పట్టుకుని మరుగుదొడ్డిగి పుంతంటే వెళ్ళేవారు. వెడుతూ వెడుతూ బయట నులకమంచం మీద కుర్చుని తలదువ్వించుకునే మా అమ్మను పలకరించి పోతుండేవారు. రాత్రి పది దాటిందంటే ఊరంతా నిద్రలోకి జారుకునేది. రెండు నులక మంచాలు వేసి ఇంటి ముందు వాకిట్లోనే వెన్నెల చల్లదనంలో పడుకునే వాళ్ళం. దోమలు లేని కాలం అది. హాయిగా గురకపెట్టి పడుకునే కాలం. అమ్మ త్వరగానే నిద్రలోకి జారుకునేది .నేను మా అమ్మమ్మ గంగమ్మ మంచంలోకి పోయి పడుకునేవాడిని. ఎందుకంటే మా మామ్మ మంచం క్రింద వెచ్చటి కుంపటి ఉండేది .దాని వెచ్చదనం బలే ఉండేది. తొందరగా నిద్రవచ్చేది. మా మామ్మ చుట్ట కాల్చేది. ఆ లంక పొగాకు వాసన బలే మత్థుగా ఉండేది.మా మామ్మ మా అమ్మ చూడకుండా చుట్ట కాల్చమని ఇచ్చేది . నేను గబ గబా పొగలాడేవాడిని .పొగ ఎలా వదలాలో తెలియక ఉక్కరి బిక్కిరి అయ్యోవాడిని. కళ్ళవెంట నీళ్ళు వచ్చేవి. మామ్మ కంగారు పడి చేవండి చెంబుతో నీరు తాగించేది. మెల్లగా ముసుగు వేసి పడుకునే లోగా ఎక్కడి నుండో అరుస్తూ అరుస్తూ తీతుకు పిట్ట కీచుపెట్టుకుంటు ఇంటి మీద నుండి ఎగురుతూ అటూ ఇటూ తిరిగేది.దాని అరుపంటే ఆ రోజుల్లో అందరూ భయపడి చచ్చేవారు. అది ఇంటి మీదనుండి ఎగిరితే
ఆ ఇంటిలో కాని ఆ పేటలోకాని ఎవరో ఒకరు చనిపోతారని నమ్మకం. మా అమ్మమ్మ దాని అరుపు విని తుళ్ళి పడిలేచి ఆ తీతుకు పిట్టను నానా భూతులు తిట్టేది. నానా శాపనార్దాలు పెట్టేది.మా అమ్మమ్మ తిడుతుంటే దుప్పట్లో భయపడి దాకునేవాడిని. భయంతో హడలిపోయేవాడిని. నా ఇల్లే దొరికిందంటే దొంగముండా నీకు, నా మనవడు లేకలేక వస్తే మా మంచం మీద ఎగురుతున్నావు నీకు పోయేకాలం వచ్చిందంటే అని తిడితూ నన్ను ఒడిలో పొదిమికొని దుప్పటి కప్పి పడుకొబెట్టేది మా అమ్మమ్మ. ఇఫ్పుడు తీతీకు పిట్టలేదు. దాని అరుపు విందామన్నా లేదు.ఎక్కడికి పోయాయో ఎంటో .ఆ జాతి పిట్టలు అది నల్లగా ఉంటుందంట.దాని తోక పొడపుగా ఉండి చివర కత్తెరలా ఉంటుందట. దానిని కత్తిరి పిట్టఅని కూడా అనేవారు ఆ రోజుల్లో.
Thursday, January 15, 2026
దొమ్మరాట
గ్రామ పదిబొడ్డులో డప్పు, డోలు మోగుతుండగా ఈల వేస్తూ హౌరియా, హౌరియా అంటూ వేగంగా మొగ్గలు వేస్తూ వినోదాన్ని వంచే వారు పలురకాలుగా చేసే విన్యాసాలలో కూడినదే ఈ దొమ్మరాట, దొమ్మరలు ఈ దొమ్మరాటను కడతారు. సంక్రాంతి పర్వదినాలలోనూ. కోతల సమయంలోను మనకు కనిపించే ఈ కళారూపం ఆంధ్రనాట అతి ప్రాచీన కళారూపంగా దొమ్మర సాములు అని పిలవబడే బొమ్మరి కుటుంబాలలోని ఆడపడుచులు ప్రధాన ఆకర్షణ నిలిచి ఈ బొమ్మరాటను రక్తికట్టిస్తారు. మనం ఈనాడు సర్కస్ అని పిలువబడుతున్న దానికి మూలం ఈ బొమ్మరాటే అంటారు. ఇందులో సర్కస్ మనం చూసే విన్యాసాల మొగ్గలు, ఊయాలూగడం, తీగపై గెడసహాయంతో నడవడం. తీగమీద సైకిలు నడపడం, గెడను తలకిందకు పెట్టి పైర్ ఎక్కడం, బండరాళ్ళను మోచేతిలో పగలగొట్టం వంటి విన్యాసాలతో ఈ దొమ్మరాట మా సేవారిని కదలనీయకుండా చేస్తుంది.
13వ శతాబ్దంనాటి సాహిత్య చరిత్రలో తన పేరును ప్రముఖ కవులలో ఘనంగానే ఈ దొమ్మరాట రాయించుకుంది. పాల్కూరి సోమనాథుడుతన పంచదారాధ్య చరిత్రలోనూ, శ్రీనాధుడు శృంగార నైషదైరిలోను నాచన సోమన ఉత్తర హరివం శరిలోనూ, చంద్రశేఖ చరిత్ర లోను ఈ దొమ్మలాటను గురించి రాయబడింది. విజయనగర రాజుల కాలంలోనూ మహార్నవమి ఉత్సవాలలోనూ దొమ్మరి వారు క్రూరమృగాలలో వళ్ళు గగుర్పాటు చేటల్ల విద్యాసాలు ప్రదర్శించే వారని కూడా అరబుల్క్ అనే విదేశీయుడు రాసాడు.
బొమ్మరి విద్య వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. ఈ దొమ్మరి కుటుంబాలలోని వారు చిన్ననాటి నుండే ఈ విద్యలో తర్పీదు పొందుతూ ఉంటారు. దొమ్మరాట కట్టే వారు గ్రామంలోనికి పోయి గ్రాము పెద్దల అనుమతి కోరతారు. అనుమతి అభించగానే ఓ పెద్ద వెదురు గడను ఊరి మధ్య నిలబెట్టి దానిని నలువైపులావ తాళ్ళతో లాగి కడతారు. వెదురు గడ చివర ఇనుప ఊచ ఉంటుంది. అదే గెడకు దూరంగా మరో గెడను నిలిపి గెడకు ఈ గెడకు మధ్య బలమైన ఇనుప తీగను కడతారు.
బొమ్మరాటకు ముందు డప్పు, డోలు, బుల్బుల్ లేదా హార్మోనియం ఉపయోగించి హుషారెత్తించే పాటలు పాడతారు. దానికి తగ్గట్టు చిన్న పిల్లలు వాని పడుచుయువతులు రాని డాన్సు కడతారు. పడుచులు కిట్టి బస్సును చూసి యువకులు హుషారుగా ఈలలు వేస్తూ ప్రదర్శన చుట్టూ గుమిగూడతారు. మొగ్గలుతో ప్రారంభమయ్యే దొమ్మరాటకు చక్కిలి గింతలు పెట్టే వాత్యానంలో దొమ్మరాటను ఆడించే పెద్ద ఒక్కోవిన్యాసాన్ని ప్రవేశపెడతాడు. మనిషి దూరలేని గూడ్రటి ఇసుప చట్రాన్ని తీసుకుని అందులోంచి వరుసగా యువతీ యువకులు సులువుగా దూరం నుండి పరిగెత్తుకువచ్చి మొగ్గలేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
బొమ్మరి బృందంలోని బలమైన యువకుడు, ఆనచేతికి గుడ్డను చుట్టుకొని బండరాయిని ముక్కలు ముక్కలుగా చేయడం ఓ విన్యాసం. వీరి ఆటలోని ఆఖరి అంశం సాని గెడ ఎక్కడం చేతిలో దాదాపు పాతిక అడుగుల పొడవైన గెడపట్టుకుని ముందుగా అటూ ఇటూ కదలకుండా పొడవైన ఎదురు కర్రలకు బిగించిన ఇనుపతీగపై ఒదువుగా నడుస్తుంటూ చూసే ప్రక్షలు ఈలలు వేయకుండా ఉండలేరు. తీగపై ముందుకు పరిచిన యువతి మరలా అలాగే వెనక్కితిరిగి కొంత సేపు తీగపై నడుస్తుంది. ఆతరువాత మధ్యలో నిలబెట్టిన వెదరు గడను కణుపుల వద్ద కాలి వేళ్ళను నొక్కి పెట్టి నిచ్చెనొక్కి నట్లు పైకి ఎక్కి ఆస బొడ్డు దగ్గర బిగించుకున్న ఇనుప బిళ్ళలో గెడకుగల ఇనుప ఊచను ఉంచి గాలిలో పదుకుని డప్పు మోత ఉదృతంగా వినిపిస్తుంటుగా గిర్రున తిరుగుతూ సంబ్రమచ్చర్యాలకు గురి చేస్తుంది. ఒక్కొర్టు సారి ప్రేక్షలు గెడసాని కింద విడిపోతుందేమోనని బయంతో కేకలు కూడా వేస్తుంటారు.
చిన్న పిల్లలు చేసే కసరత్తులు బలే సరదా అనిపిస్తాయి. ప్రదర్శన చివరిలో చుట్టూ చేరిన వారి నుండి డబ్బు యాచిస్తారు. గ్రామంలో 3 నాలుగు ప్రదర్శనన్చి మరో గ్రామం పోతూ సంచార జీవనం గడుపుతూ ఉంటారు ఈ దొమ్మరాట ఆడేవారు. దొమ్మరాట ఆడేవారు పెద్దాపురం. రాజానగరం వంటి ప్రాంతాలలో మన జిల్లానందు నివసిస్తూ ఉన్నారు.
పిట్టల దొర
పోన్య సంబాషణా చాతుర్యంతో ఇంటిసారిని కడుపు వున్న నవ్వించే కళారూపం పిట్టలదొర జాతీయ అంతర్జాతీయ స్థానిక విశేషాలను కోడి అబద్దాలను Cలుగా మాట్లాడుతున్న వేషగానిపై ఏమాత్రం కోసం చూపించకుండా కళారూపాన్ని ప్రేక్షకులు అస్వాదించడం ఈ కూరు ఎంటోనీ ప్రత్యేకత. ఈ వేషాల్ని పగటి వేషాలలో మనం ప్రముఖంగా చూడగలం, ఈ పిట్టల దొర వేషాన్ని వివిధ ప్రాంతాలలో రకరకాలు పేర్లతో పిలుస్తారు. వైర లత్కోరుబ్ బుద్దర్ ఖాన్ ముపాచీనాయడం అని అంటారు. ఈ వేషం పగటిపూలే కడతారు. ఈ వేషం కూడా.
అనాదికాలం నుంచీ గ్రామీణులకు మత సాంఘించ విషయాలపై ఆసక్తిని కలిగించడం సత్యాలక్షవం, సామాజిక మేలుకొలుపులే ప్రధాన ఉద్దేశ్యంతో రూపొందిన సరస హాస్యపాత్రగా పిట్టలదొర వేషం మిలచబడింది. పల్లెల్లో స్వేచ్ఛగా తిరుగుతూ వినసొంపుగా అశువుగా మాటలు అల్లుకుంటూ బహు వేగంగా పదాలు దొర్తిస్తూ సమకాలీన సమాజంలోని లొసుగులను తమాషాగా వర్లిస్తూ ఈ వేషం దక్తి కట్టిస్తుంది. ఆలోచింప.
పిట్టల దొర వేషంలో గొప్పలు చెప్పకుంటూ ఉపన్యసిస్తూ అభినందనలు మాలో వారి ఈ వేషం మనిషి పేరడిని పోలి ఉంటుంది. బహుశా 1. బ్రిటీష్ వారు మనదేశంలో స్థిర పడుతున్న రోజుల్లో ఈ వేషం ప్రాచుర్యంపొంది బండవచ్చు ఖాకీ వేషధారణ, ప్యాంటు తిరుగులతో కూడిన కోటు దొవటోపి, రంగు చొక్యా టక్ చేస్తాడు. బూట్లు వేసుకుంటాడు. హిట్లరు మీసం ఉంటుంది. చేతిలో చెక్క తుపాలీ ఉంటుంది మెడలో సుమాలు కబ్బుకుంటాడు. గ్రామంలోకి రాగానే సంతోషములుముకుని ఆనందపడుతూ ఉంటారు. ముఖానికి బూడిద పులుముకుని బొగ్గుతో మీసాలు రుద్దుకుంటాడు. ఈ వేషగాడు గ్రాములలోకి రాగానే ఎక్కడ ఉన్న పిల్లలందరూ అతని చుట్టూ చేరిపోతారు అతని వెంట గ్రామమంగా తిరిగి సంబరపడుతూ ఉంటారు. పిట్టల దొర వెంటపడే కుక్కల పైన, పిల్లలపైన జోకులు వేస్తూ ఇంటింటికి తిరిగి ఘరానాగా యాచన (రాయల్ గంగ్) చేస్తాడు. ఈ దేవదు ఏ గ్రామం వెళ్లిన పిన్నలు పెద్దలు ఆసక్తికనబరచి ఆదరించేవారు. వీరిని ఆనందపరచడానికి అన సంభాషణా బాతుర్యాన్ని ఇలా వినిపిస్తూ తన కళా ప్రదర్వన మొదలెడతాడు.
గుడ్ మార్నింగ్ సాద్, అదేమిటిలా ఆశ్చర్యపోతున్నారు? నేను సాత్ పిట్టల దొరని, మా తాత గుట్టల దొర మానాన్ని తట్టల చొరనాధ్ మీ తాత దగ్గర మా తాత మూడు పూళ్ళు అప్పు తీసుకున్నాడు సార్ అది అలాగ అలాగ వెదు ఊళ్లలయ్యిందిసాద్ అరువు బరువు చేటని ఆ వెడువూరు తట్టలో పెట్టుకుని నెత్తిన మోసుకుంటూ వస్తుంటే ఇస్సాదియ్యా కాకి వచ్చి తిట్టతో సహా కాళ్లతో తన్నుకు పోయింది సార్.
అన్నట్టు మీ లాంటి గొప్పవారు అలా చేసారేమిటి సార్! మా నాయనమ్మ మూడో పెళ్ళికి రమ్మని కాకి వెంట కాడి, కాకి వెంట కారి జొప్పున వంద కాకులను పంపించానుసార్ కాకి తిరిగొచ్చిన పాపానపోలేదు సార్, మీద లేవలేక ఇక్కడే కాపురం పెట్టమని తరువాత తెలిసిందిసార్.
మీరు రాకపోయే సరికి మీ కోసం నేనే పద్దామని బయలు దేదాను సార్, ఇంతకీ నా సంగతి మీకే ముందే తెలుసుంటుంది సార్. నా పెళ్ళికి బెల్లు గంగాళంలో అన్నం పంచానుసార్, ముళ్ళలో చేసిన స్వీట్లు తిని చుట్టాలందరూ మెచ్చుకున్నారుసార్ చేస్తే పిట్టలదొర పెళ్ళిలో చేసిన స్వీటులాగే చేసుకోవాలని చుట్టు పక్కల గ్రామాల వాళ్ళందరూ తీర్మానించుకున్నారు సార్, నేను కట్టించిన సముద్రంపైన వంతెన తొలకరి కల్లులనే కొట్టుకుపోవడంతో ప్రపంమంతా నస్సు ఒక మెచ్చుకుందిసార్ నేను తప్పిన ముయ్యిలు ఎండాకాలం నిండిపోయి, స్నానాలకు పోయిన వారిళ్ళంతా మునిగిపోయిన ఆంధ్రా అంతా అల్లకల్లోలమయ్యింది. సార్. ఈ పాటికి నేను మీకు పూర్తిగా తెలుసుంటాను సార్..
మీ దగ్గరకు రావాలని విమానమీదొద్దామంటే పల్టీలు కొట్టి పడి పోయేమోనని, రైలు మీడొద్దామంటే పట్టాలు తప్పుతుందేమోనని, కారు మీదొద్దామంటే దేనికైనా గుడ్డు కుంటుందేమోనని, బండి మీదొద్ది మంటే బోల్తాపడుతుందేమోనని ఓడయితే ముగిపోతుందని ఆలోచించి ఎందుకొచ్చిన బాధని కాలినడకన ముక్కు సూటిగా బయలదేరి ముచ్చలగుంటికి దక్షిణంగా తిరిగి కాకులు దూరని కావడవి, భీమలు దూరని గండభేరుండాలు, విలుగులు, పులుగులు మద్దులు, మారేళ్ళు, వెళ్ళళ్ళు, రొయ్యల పీతలు, కెల్లల మీదుగా ఏడేడు సప్త సముద్రాలు దాటి రగదూళిగా రానే వచ్చే సానుసార్ తమ యింటికి కారి నదకన వచ్చానని చిన్న మాపు చూడకండిసార్ మాయింట్లో బొల్లంత బంగారం వుంది.సార్. మొన్న గుమ్మడి కామంత బంగారాన్ని కుక్క ముట్టిందని గోడవతల పారేసుసాద్
సార్ మీదౌత్తరని భూదేవత పందిరి, ఆకాశమంత అరుగు నేయించానుసార్, ఎన్ని వంటలు చేయించాను సార్: ఎన్ని కూరలు చేయించాననుకున్నారుసాద్, పట్ కరారు పచ్చడి, ఉమ్మెతపూల ఇగుడు, ఇటుక రాళ్ళ వేపుడు, తాలూకు రము, లారీల కొద్ది పులిహోరా, చెరువుల కొద్దీ సాంచారు. జల్లేదు. పాల పెరుగు చేయించాను సారీ సార్ ఏమాట కామట చొప్పుకోవాలి గాని సార్ చూసిన వాద్యగాని తిన్న వాళ్ళు లేమోసార్, పిట్టల దొర వేషానికి ఖచ్చితమైన సాహిత్యరచన అంటూ ఏటీలేదు. ఎవరిలోచనట్లు వారు స్క్రిప్ట్ వారే తయారుచేసుంటారు. ఉందులో కళాకారుని సమయస్ఫూర్తి కూడా ప్రతిబించి స్తూ ఉంటుంది ఈ వేషం కట్టేకళాకారుడు సమకాలీన అంశాల పైన, సామాజిక అంశాలపైన పట్టు కలిగి ఉండాలి. అప్పుడే ప్రదర్శనను రసపత్తరంగా ఇవ్వగలుగుతాడు. పిట్టల దొర వేషం కట్టిన వారిలో నుర్రా రాఘన రెడ్డి కర్నాటి లక్ష్మీనరసయ మంచి ప్రదర్శన తారులుగా మన్ననలు పొందారు. ఈ వాటికీ అనేక వేదికల పైన పిట్టల దొర ఏకపాత్రాభినయంగా వేసే కళాకారులు ప్రథమ బహుమతులు గెలుచుకోవడం మనం చూస్తూ ఉంటున్నాము. పగటివేషాల స్క్రిప్ట్ రచయితలుగా అయ్యివు వెంకటకృష్ణ రరగు తాతాచారి.. సంగారాను కోటిరెడ్డి, ఆంధ్రనాట పెరెనావన్నారు. ఈ పిట్టలు దొరకు జానపదుల్లో వేటికీ మంచి ఆదరణ ఉంది.
పండరీ భజన
మన ఆంధ్రదేశంలో ఆ మూభాగం చుట్టివచ్చినవి, అందరినీ కదిలించినవీ భజన దళాలే అంటారు. ఇవి జానపద కళారూపాలకు చెందుతాయి. అందులో పండరీభజనకు ప్రత్యేక స్థానముంది మన జిల్లాలో గొల్లల మామిడాడ చాలా ప్రసిద్ధి చెందినది శ్రీ పదాల సత్యనారాయణరెడ్డి గురువుగా పరిసరప్రాంతాలలో చాలా మంది శిష్యులను తయారు చేసారు. ప్రస్తుతం రాజుపాలెం లంకలోని శ్రీ కురుల కొండయ్య దళం. పండనీభజనలో ఆంధ్రదేశమంతటా తమ ప్రదర్శనలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
విందరీభజన మహారాష్ట్రా నుంచి వచ్చిన కళారూపం పండరి పుణ్యక్షేత్రంలోని విఠలేశ్వరునిపై భక్తితో పాడేపాటలు, నృత్యాలు, సయనానందకరంగా ఉంటాయి. ఈ బజన చేసే కళాకారులు కాషాయి వస్త్రాలు ధరించి, కాషాయ తలపాగా, మెడలో పూలదండలు, కాళ్ళకు గజ్జెలు కట్టుకొంటారు. చేతిలో పొడవైన కర్రకు రెండంచుల జెండా ఎరుపు లేదా, కషాయి రంగు, పసుపు పచ్చరంగుది ఆడతారు. భజనలో కృష్ణలీలలను గానం చేసారు.
50 మంది భోజన కారుల వరకు వలయంగా నిలబడి గురువు పాడే పాటకు అనుగుణంగా అడుగులు వేస్తు వర్తిస్తారు. 10-16 మధ్య నున్న పిల్లలు కూడా భజన బృందాలుగా ఏర్పడి భజన చేస్తారు. వీరు గురువు దగ్గర 'లయ' 'స్వర' పరిభజనంతో పాటు అవసరమైన సంగీతాన్ని అభ్యసిస్తారు. మధ్యలో గురువు పాడుతంలో హార్మోనియం, డోలక్, సంజీర, లేదా తబలా, పిల్లన గ్రోవి వంణ సహలాద్యుల సహకారంతో భజన రాత్రి 8 గంటలనుండి ప్రారంభమవుతుంది.
జెండా లేదా బెడాతే జాయేంగే పండారి జాయాగే అని పాడుతూ నృత్యం చేస్తుంటే కళాకారులు అడుగుల విన్యాసానికి అబ్బుర పడవలసిందే. ఇక ఎంత దూరమో ఎరుగామే పండారి" అనే పాటకు భజన కళాకారులు చేసే విన్యాసాలు చక్కని రసస్ఫూర్తిని కల్గిస్తూ చూపరులను పులకింపజేస్తాయి. ఈ పండరీ భజనలను దేవీ నవరాత్రులకు గణపతి నవరాత్రులకు గృహ ప్రవేశాలకు, తిరుపతి వెళ్ళే మొక్కుబడులు చెల్లించుకునే వారు ఈ ప్రదర్శనలను ఏర్పాటుచేస్తారు. పిండుదామా పిండుదామా ఆనంద గోపుపాలు పిండుదామా గోవింద గోపాల మదనగోపాలని గోవిందుడే గోపాలుడే మన ఆ కోరికను దెబ్బ కోవాలంగుడే అని బృందం చమటలు కక్కుతూ నృత్యం చేస్తుంటూ అందరు భజన తిలకిస్తూ ఆనందిస్తారు. యువజనుల శారీరక విన్యాసాలలో ప్రదర్శించే పండరీ భజన చూసి తీరవలసిందే. పెద్దాపురం మండలం చదలవాడా గ్రామం కూడా గొప్ప భజనలు చేసేది. ప్రస్తుతం వ్రేళ్ళమీద లెక్కపెట్టగలిగే ఈ పందరీభజన కళారూపం భజనలో తల మాచికమైనది.
కర్ర సాము
ప్రాచీన జానపదకళలకు చెందిన వాటిలో కొన్ని యుద్ధకళలకు చెందినవి ఉన్నాయి. వాటిలో మన ఆంధ్రదేశాన కత్తిసామూ, కర్రసాము ప్రధానమైనది. కర్రసాము ఈ నాటికి పల్లెల్లో మనకు కనిపిస్తూనే ఉంది. కర్రసామును వయస్సులో ఉన్న యువకులు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. సాయంత్రం సమయాల్లో గ్రామాలలో యువకులందరూ చేసి ఒక గురువు దగ్గర ఈ విద్యను నేర్చుకుంటారు. తన బలిష్టమైన పిడికిలితో కథ మధ్యగా పట్టుకుని గిర్రుమని తిప్పుతూ ఒక చేతి నుండి మరొక చేతిలోనికి మార్చుకుంటూ, ఒడుపు కలిగిన అడుగులు వేస్తూ కర్రసామును ప్రదర్శిస్తారు. ఈ కర్రసాము తిప్పేప్పుడు అనేక విన్యాసాలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ కర్ర సాధారణంగా మనం పొలం పనులకు పోయే రైతుల చేతులలో ఉండేది. ఈ కర్రసు బానా కర్ర అని కూడా అంటారు. ఇంచుమించు అడుగుల పొడవు ఉంటుంది.
పూర్వం రక్షణ వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందని రోజులలో గ్రామాలలోని యువకులే గ్రామరక్షణకు ఈ కర్రసాము విద్యను నేర్చుకుని రాత్రిసమయంలో గ్రామ రక్షణకు బయలు దేరేవారు. దేవాలయాలను దోపిడీ దొంగల బారి నుండి కాపాడడానికి, బందిపోటులు గ్రామంలో ప్రవేశంచకుండా వీరు కర్రసాము విద్య ద్వారా అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించేవారు. ఈ కర్ర సాము విద్య తెలిసిన వారిని పూర్వం జమిందారలు తమ ఉద్యోగస్థులుగా నియమించుకునేవారు. వీరుముష్టి వారు, హరిజనులు, నాయక తెగలకు చెందిన వారు ఈ కర్రసాము ప్రదర్శించడంలో నిష్ణాతులు.
కర్ర సామును 10 నుండి 15 మంది ప్రదర్శిస్తారు. డప్పులు, తనా వంటి వాయిద్యాలు మోగుతుండగా కర్రలను ఇడువుగా పట్టుకుని 15 మంది ఒకేసారి గిర్రున తిప్పుతారు. కొంత సేపయిన తరువాత ఒక యువకుడు రెండు చేతులలో రెండు కర్రలను మధ్యలో పట్టుకుని తన భుజబలంతో కర్ర కనబడనంత వేగంగా తిప్పుతూ ఉంటే ప్రేక్షకులు ఉద్వేగభరితులవుతారు. పూర్వం యుద్ధాలలో ఇదే విధంగా కర్ర సాము ప్రదర్శిస్తూ తిరుగుబాటు సైన్యాలను చెల్లా చెదురు చేసేవారని అంటారు. తరువాత ఇద్దరు చెరోకర్ర తీసుకుని ఒకరి తరువాత ఒకరు కర్రను జుళివుస్తుంటే మరొకరు ఒడుపుగా కాసుకుని, తిరిగి తనూ కర్రను జుళిపిస్తూ ఎదురుదాడి చేస్తాడు. ఉత్సవాల సందర్భంగాను, సంబరాలలోను ఈ కర్రసాము ప్రదర్వన ఏర్పాటు చేయడం రివాజు. ప్రధాన కూడలిలో ఊరేగింపును ఆపి ఈ ప్రదర్వన ఏర్పాటు చేస్తు ఉంటారు. కర్రసాము వ్యాయామానికి చెందిన విద్యకూడాను. ఈ విద్యను నేర్చుకున్న యువకుల చేతులు బలిష్టంగా ఉండడమే కాకుండా శరీర ఆకృతి
పగటి వేషం
నన్నెతకం నవలాదూపాలలో సగటి వేషం ఒకటి తెలుగులో వేషం వేయడమంటే పాత్రకు తగినట్లుగా అలంకరణ చేసుకోవడం నగటిపాటి నగటి పూటనే గ్రామాలలో తాము ప్రదర్శించనున్న వేషాన్ని ఎన్నుకుని అభినయించడం. ఇది ప్రాచీన కాలంలో ఎంతో ప్రజాధనం పొందిన కళ పగటి వేషాలు అనే దూటలోనే బహువచనం ఉంది. నలుగురు లేక ఐదుగురు ఒక పరాణకథను ఎన్నడ బభినయిస్తూ ఇంటి ఇంటి ముందు మూడు నాలుగు రోజుల దాకా ప్రదర్శిస్తారు ఇంటిలోని వారే వీరికి ప్రేక్షకులు.
తెలుగువాని అపూర్వ జానపద కళా సంపదలోని పగటి వేషం యొక్క అవిర్భావ కాలాన్ని నిర్ణయించే చాటి ఆధారం లభ్యం కాని పోయినా తెలుగు సాహిత్యంలో ఇది ప్రస్పుటంగా కనిపిస్తుంది. దీనికి వేముల వాడము కట్ సాక్ష్యం ఇతని కాలం క్రీ. శ 1121 ప్రాంతంగా నిర్ణయించబడింది. వేముల వాడ భీమకవి కళాంగ రాజావారి వెళ్ళాడు. కళింగ రాజు గంగుకు తను వచ్చిన సంగతి కబురంపాడు రాజు. వేముల వాడ మతని భాదను పట్టించుకోకపోవడంలో కోపోద్రేకుడైన భీమకవి కళింగ గంగును శపిస్తాడు. శాపం తగిలిన గంగుసు శత్రురాజులు దండిత్తి వచ్చి పోడిస్తారు కళింగ గంగు పారిపోయి బికారిగా తయారయ్యి వీడుల వెంట తిరుగుతూ ఓపాతర గోతిలో పడి ఏడుస్తుంటారు. ఇంతలో అలుప్రకగా పోతున్న వేముల వాడే భీమకవి కలింగ గంగు పరిస్థితి గమనించి జాలిపడి శాపతిమాచన కలిగిస్తాడు.
శాప విముకుడైన కళింగ గంగు దారినపోతున్న పగటి వేషగాళ్ల గుంపులో చేరతాడు. వారు తిన్నగా కళింగ దేశం చేరి అక్కడ పరిపాలిస్తున్న రాజు దగ్గత ప్రదర్శన ఇవ్వ గోరతారు. అక్కడి రాజు తన చేతిలో ఓడి పోయి పారిపోయిన కళింగ గంగు వేషం వేసుకుని పగటి పూట రమ్మంటాడు జగుంపులోని కళింగ గంగు తానే ఆ వేషం కట్టి పగటిపూట ప్రదర్శన యిస్తూ రాజు ముందుకు నెడతాడు. ప్రదర్వన చేస్తూ రాజును సమీపించి ఒక్క వేటున అతని శిరస్సును నరికి తిరిగి రాజవుతాడు. తెలుగు సాహిత్యంలో మొదటిగా పగటి వేషం ఇలా కనిపిస్తుంది.
ప్రాచీసతి గలిగిన జానపదకళ 20వ శతాబ్ది తొలి దశలో కూడా దేదీప్యమానంగా వెలిగింది. మైసూరు నుండి వచ్చిన తెలుగు బ్రాహ్మణుడు శ్రీ జిల్లా వరుఘుల వెంకటరామయ్య గారు తన పరివారంలో ఆంధ్రదేశం వచ్చి కృష్ణా జిల్లా వీరంకిలాకు దగ్గర హనుమంతాపురం రగ్రహారంలో అయ్యంగాళ్లు అనే పీఠాన్ని స్థాపించి పగటి వేషాలు నేర్పేవాడు. కష్టాతికష్ట మయిన విద్య ఆంధ్రదేశమందు కూచిపూడి వంశాలలో తొలుత అవతరించిందనికూడా చెప్పుకుంటారు. గోదావరి మండల యండలి కాకపుర్రు గ్రామం ఈ విద్యకు ప్రసిద్ధి చెందింది.
పగటి వేషాలు రెండు రకాలుగా కనిపిస్తాయి. 1 రామసవేషం 2 సాత్వీకవేషం ఈ వేషాలను బ్రాహ్మణులే కాకుండా యాదవులు. బంగాలవారు, విశ్వబ్రాహ్మణులు, తదితర ఇతర కులాలకు చెందిన వారు కూడా అభ్యసించి ప్రదర్శనలిస్తున్నారు. ఈపగటి వేషాలలోని ప్రక్రియ ముఖ్యంగా వేషంలో భాషలో, నడకల్లో, చేష్టల్లో లోకంలోని కొందరిని అనుకరించడం. గొప్పగా ఆరూపంలోని అతుక్కుపోవడమే ప్రత్యేకత ఆయా వేషాల ద్వారా సామాన్యులకి సంఘంలోని దురాచాల్ని గెలిగింతలు పెట్టి హాస్యంతో వ్యంగ్యంగా ఎత్తి చూపించడం యిందులోని ఉన్న మౌలిక సూత్రం వినోదం, విజ్ఞానం కలిగిన ఈ వేషాలను మగవాలేళ్ళవేస్తారు.
పగటి వేషాలు 32 వరకు ఉన్నాయి. వీనిలో బుడబుక్కలు, లంబాడీలు, చోడెమ్మలు, సోమయాజులు, సోమి వేదుల వాళ్ళు, దేవమ్మ, భద్రోజులు, గొల్లపాలుడు, మందుల వాళ్లు, సాకాని వైష్ణువులు, పిట్టలదొర, కొమ్మ దాసుడు. బారీ బైరాగి, సిద్ది కంపెనీ, అర్థవారివ్వ శక్తి బేతాళ దేవరపిట్టి మొదలైనవి సుప్రస్తి వేషాలు. ఈ పగటి వేషాల ప్రదర్శనకు సంగీతం, నృత్యం, వాచికం, ధన్యనుకరణ (మిమిక్రీ), అభినయా వంటివి. వన్నె తెచ్చే అంశాలు హార్మోనిస్ట్, వాయిద్య కారులు వారి వెంట తిరుగుతూ వాయిద్య సహకారాన్ని అందిస్తారు. గ్రామాల్లో ప్రజలతోపాటు ఆయా పాత్రలకు సంబంధించిన వారు కూడా ఆనందించి పగటి వేషాగాత్మకి కానుకలు ఇస్తారు. వారమంతా ప్రతీరోజూ వేషం గట్టి తిరిగిన ప్రదర్శనకారులు ఆఖరిరోజు ప్రతీ ఇంటికీ తిరిగి కానుకలు అర్పిస్తారు.
రాజమండ్రికి చెందిన విభూది భూనీ లింగం ఈ ప్రదర్శనల జనరజలకంగా ప్రదర్శిస్తూ ఈకళ అంతరించి పోకుండా కాపాడుతూ ఉన్నారు. ఈ కళను నమ్ముకుని రాజమండ్రి పెద్దాపురం తదితర ప్రంతాలలో కళా కారులు జీవిస్తూ ఉన్నారు, వీరు సంక్రాంతి పండగలప్పుడు, ఈ వేషాలను కడుతూ కనిపిస్తారు. నిజానికి ఒకనాడు మన పల్లె జనాలకి విజ్ఞానాన్ని అందజేసినవి చాలా వరకూ ఈ జానపద కళారూపాటే. ఇప్పుదిని ఆదరణ లేక క్షీణదశకు చేరుకున్నాయి. వీనిని పునరుద్ధరించడం అంటేమన సంస్కృతిని పునరుద్ధరించుకోవడమే దీనికి ప్రజలు. ఆయా! రంగాలలోని కళాకారులు బాధ్యత తీసి పరిరక్షించాలి. మన సంస్కృతీ చరిత్ర కోసమన్నా వీటిని విడియోలలోని, కేసెట్లలోను భద్రపరచాలి. భావితరాల వారికి కనీసం మ్యూజియం వస్తువుగా నైనా అందజేయడం మనందరి ముందున్న కర్తవ్యం.
పంబకథ
సత్తెమ్మ సంబరాలలో అంబరానే జగదంబరానే అంటూ అమ్మవారిని సంజనాదంతో మేలుకొలుపుతూ ఈ సంబనవదులు కనిపిస్తూ ఉంటారు. సాంబ్రాణి దూపాలతో సంబరాళ్ళు సత్తెమ్మ ఆదిశక్తిని, సృష్టి ఆవిర్భావమని, సత్తెమ్మ మహత్యాలు గూర్చి ఈ పంబకడ వెలుతుంటారు. విజాపురం దగ్గర రథాల పేటలోని పంబ కళాకారుల బృందం నాయకుడు వీరబ్బాయిని సంబకథ గురించి విశేషాలు తెలుపమని అడగగా మనకి అనేక విషయాలు తెలియజేస్తున్నారు.
రెండు సన్నని చిన్న వీరణాలు వంటివి కలిసి కట్టబడి రెండు వైపులా మేకతోలుతో మూయబడి ఉండే వాయిధ్యమే వియివారం ఒక వైపు ఒక నెదురు పుల్లతో వాయిస్తూ మరొక వైపు చేతిలో మంద్ర స్థాయిలోనూ, తారాస్థాయిలోను వాయిస్తుంటే కలిగే శబ్దం వెంకటక్యం పంబలర్యం అని వస్తుంది వందవాయిద్యాయినికి సహవాయిధ్యంగా జముకు, తంబూరా కూడా ఉంటుంది. పాట పాడే గురువు కాలికి గజ్జెలు కట్టుకుని చెంపలకు గంధం పూసుకుని ఎగురుతూ చిందులేస్తూ రథ పాడుతుంటే మిగిలిన ఇద్దరు వంతలు తమ వాయిద్యాలలో శృతి కలుపుతూ. పాడతారు. ఈ వాయిధ్య గాళ్ళు చెవిదగ్గర చేయిఉంచి ఆ అంటూ రాగం తీస్తు వంత పాడతారు.
మొక్కుబడులు చెల్లించకునేవారు, సంబరాలు, ఉత్సవాలు జరిపేవారు వీరిని ఆహ్వానించి పాట పాడించుకుంటారు. తెల్లవార్లు పాట పాడిన తరువాత చీట తీసుకుని అందులో అమ్మవారిలా పిండితో చేసిన బొమ్మను తయారు చేసి చేటలో ఉంచి వంబవాదం వాయిస్తూ సత్తెమ్మ ఎవరి ఇలవేలుపో వారి తలపై ఈ పాపవేటను ఉంచి దీవిస్తారు అనంతరం ఊరవతలకు తీసుకెళ్ళి మేక కాని కోడిని కాని కోసి దిష్టి తీన వేటలో ఉంచిన అమ్మవారిన సాగనంపుతారు. దీవింపజేసుకున్న వారు సంబల వారికి చేటలో కాసుకలు చేస్తారు.
సత్తెమ్మ తల్లిని సాగనంపేప్పుడు సత్తెమ్మ తల్లి గుడి ముందర పద్మం వంటి ముగ్గును వేస్తారు. ఆపద్మం వంటి ముగ్గులో మేకపోతు రక్తంలో అలంకరిస్తారు. ముగ్గురు ఒక కొత్త కుండలోనికి ఎత్తుతారు. ఆకడవను కత్తెర కడవ అంటారు. తమలో ఒకరికి కొత్తకోర, కొత్తరవిక తొడిగి నెత్తికి ఎత్తుతారు. మేక పేగులు తీసి అతనికి ఎడజందెం. పెద్ద జందెం వేసి అతనిని సత్తెమ్మగా భావిస్తూ వీదుల వెంట ఊరేగి ఎంపుగా తీసుకువెళతారు. ఊరు చివరికి వచ్చేసరికి సత్తెమ్మ తల్లిని ఉద్దేశించి
"ఆనందమమ్మా - ఆనందమే సంతోషమమ్మా - సంతోషమే ముత్యాల ముగ్గుల్లోన నీకనమ్మ వజ్రాల వెన్నెల నీకే నమ్మా సనివిడి, వడపపు సాయి గంథాలు నీకేనమ్మా. కారుకోళ్ళు, మేకలు నీకేనమ్మా"
అని సన్నసన్నగా పాడుతూ ఊరుదాటగానే బండబూతుల పాటలు ప్రారంభిస్తారు అలా పాడడం సత్తెమ్మ తల్లికి ఇష్టమంటారు వీరు. శ్రీనాథుడు క్రీడాభిరామంలో పేర్కొన్న భవానీలు అనబడేవారు వీరే, వీరు కులానికి పంబ కులానికి చెందిన వారు, ఈ సత్తెమ్మ తల్లి జాతరులు పసలపూడి, కాకినాడ, వందలపాక వంటి గ్రామాలలో ప్రసిద్ధి చెందాయి. దానమ్మ సంబధాలని తాడేపల్లిగూడెం వద్ద బాగా జరుగుతాయి. దానిలో దానమ్మ కద చెబుతారు. ఇది మందాతరాజు కథ. అలాగే శెనగల కథ చెబుతారు. ఇది బలే సరదాగా ఉంటుంది. ఇద్దరు అన్నదమ్ములు పెనగతోట పెంచుతాంటారు. పెద్ద వాడు మంచి బుద్ధిగలిగిన వాడు చిన్నవాడు పిసినారి. ఒకరోజు సత్తెమ్మ చిన్న వాడిని ఆటపట్టిస్తాడు. అమ్మవారు అలిగి చిన్నవాడిని చంపబోతుండగా పెద్దవాడు వచ్చి అమ్మవారిని శరణు వేడతాడు అమ్మవారు శాంతించి కోవలతో ఊరవతల: కూర్చుంటుంది. ఇక పెద్దవాడు అమ్మవారిని ఏం కోరితే ఊరిలోనికి వస్తానని అడిగితే చిన్నవాడి ముఖం మీద పది ఉమ్ములు ఉస్తానంటుంది. పెద్దవాడు పోయి తమ్ముడిని అడగడం మరలా అమ్మవారు మరోకోరిక కోరడం ఇలాసాగుతుంది. కథ దానమ్మ, సత్తెమ్మ, తలుపులమ్మ, మాదిగల కులవేల్పు గొతేలమ్మ వంటి జాతరులలో ఈ పంబ కథ చెప్పబడుతూ ఉంటుంది. ఈ వంటి కళాకారులు చేసేవి ఇల వేల్పులు, కులవేల్పు సంబరాలు పిఠాపురం రథాల పేటలో ఈ వంబ కథ చెప్పే పంబ కులస్థులు ఉన్నారు. వారిలో శివకంచి వీరబ్బాయి. సంబకథాగానం చేయడంలో మానిపిట్ట ఇతనికి శివరంచి ఏసు తంబూరా వాయిస్తూనే, వారే చంద్రరావు జముడు వాయిస్తూ సహగానం చేస్తున్నారు. వీరుపాడే దోనెపాట, శెట్టిబలిజ గానవాసం, స్వామి వారి విద్యలు పంబకథలు జానపదారళా విశిష్టతను తెలియజేస్తూనే ఉంటాయి.
కోలాటం
శతాబ్దాల నుండి తెలుగు వారు పోషించుకుంటూ వస్తున్న జానపద కళారూపాలలో కోలాటం ఒకటి దేవాలయాలలో జరిగే ఉత్సవాల సంధర్భంగా కోలాటం ప్రత్యేకాకర్షణ, ఆధ్యాత్మిక కీర్తనలను, భజనలను ఆలపిస్తూ కోలలు వేయడం ఈ ప్రక్రియ ప్రధాన లక్షణం. కోలాటం ఇరువురు వ్యక్తుల మధ్య సాగే కళారూపం ఇరువురు వ్యక్తులు రెండు చేతులలో కర్రలు పట్టుకుని ఎదురెదురుగా నిలబడి పాటలు పాడుతూ తాళానికి అనుగుణంగా గతిభేదాన్ని పాటిస్తూ అభినయిస్తూ వుంటారు. ఈ కోలాటాన్ని గూర్చి విజయనగర రాజుల కాలంలోనూ, పాల్కురికి సోమనాథుని బసలపురాణం నందు కూడా చెప్పబడింది..
పసలపూడికి చెందిన కోలాటం కళాకారుడు, గురువు అల్లు సింహచలం దశాబ్దాలుగా కోలాటదళాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రదేశమంతా ప్రదర్శనలు ఇచ్చారు. వీరి కోలాటం నృత్యాన్ని సినిదర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాధ్ తన సిరిసిరి మువ్వ, సినిమాలో చిత్రీకరించారు కూడాను. ఉత్సవాలు జరిగే దేవీనవరాత్రులు, గణపతినవరాత్రులు, మరిడమ్మ జాతరలు వంటి సంధర్భాలలో ఈ కోలాట కళాకారుల ప్రదర్శన తిలకించి. తీరవలసిందే
30 మంది వరకు కళాకారులు రలయంగా నిలబడి చేతిలో రూళ్ళకర్రలు (గీతలు గీసుకునే కర్రలు) గుండ్రంగా సాపు చేయిబడి ఒక అడుగు 'పోదవ కర్రలను ప్రతీ ఒక్కరూ రెండేసి చొప్పున రెండు చేతుల్లో పట్టుకుని కర్రను తాగిస్తూ లయిబద్ధంగా అడుగులేస్తూ తెయ్యిక్కడ తాజనుతా అంటూ జానపదగీతం అందుకుంటారు.
ఓ చిన్నదానా విడువనె కొంగు" వంటి జానపద గీతాలు భక్తిగీతాలూ గురువు పాడుతుంటే కోలాటం వేసేవారు. ఆ పల్లవిని వంతగా పాడుతూ గెంతుతుంటే వినదానికి చూడటానికి వినోదంగా ఉంటుంది. ఈ కోలాటాలు పల్లెలలోని ఆయా పేటల యువరులు విరామకాలంలో ఒక గురువును పెట్టుకుని నేర్చుకుంటారు. నేర్చుకున్న కోలాటాన్ని సంబరాలలో సరదాగా వేస్తూంటారు. కోలాటం ఆడవారు, మగవారు కూడా ఆడతారు.
కోలాటం ఆడేవారు ఐనేను, నిర్వరు, తలకు రిబ్బన్లు, కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు. వీరి మధ్యలో వాయిధ్యలు బృందం హర్మనియం, డోలక్, తాళాలు, డప్పు వంటి సహకారంతో వీరి కీర్తనలకు సంగీతమందిస్తుంది. ప్రధాన గాయకుడు పాటపాడుతూ అడుగు మాడేలా తనచేతిలోని కోలాగకర్రలలో లయిమార్చగానే అందరూ అడుగులు మారుస్తూ నృత్యం చేస్తారు. వీరు భక్తిగీతాలు, రామకీర్తనలు, సప్తతరంగాలు, కృష్ణ తరంగాలు వంటివి అలపిస్తారు.
ఈ కోలాటంలో జానపదులకు ఉత్తేజాన్ని, ఉత్సాహన్ని వర్ణచలనం, వేషసామరస్యం, గమన సామరస్యం, మువ్వల మోత, కోలల లయి, రాగ సరళి కంఠకుళ, కళాసౌందర్యలు వుక్కుడిగా ఏకమయి మనలను ఆలపిస్తారు. కోలాటంలో జడల కోలాటం అనే ప్రక్రియ చాలా ఆసక్తిని కలిగిస్తుంది. అందరూ చేతిలో తాడుల వంటివి పట్టుకుని కోలాటం చేస్తూ జడలా అల్లుతారు. మరలా అలానే పాడుతూ అడుగును మార్చుకుని ఆ జడను విప్పేస్తారు. "వీరు కీర్తనలలో శరణు శ్రీ గణనాథ దేవా శరణు శరణు శంకరతనయా, పాలనచేసే పార్వతి తనయ, బొజ్జనిందా ఉండ్రాళ్ళు పోసేద, బుజ్జగింపుము మరి మరి బ్రోసి" అంటూ గణపతి గీతంతో ప్రారంభించి కరిళింగు మడుగులోపల వాడలో కృష్ణుడు వాడదుగో, అల్లడుగో కృష్ణుడు, నల్ల నల్లనివాడు నామంబు కలవాడు" అంటూ సాగే కోలాటం మన జానపదకళలకు సుసంపన్నం చేసిందనడంలో సందేహంలేదు. ఇటువంటి కళారూపాలను యువకులు అభ్యసిస్తే ప్రత్యేకమైన వ్యాయామాలు అభ్యసించకుండానే చక్కని ఆరోగ్యాన్ని పొందగలుగుతారు.
బుట్టబొమ్మలు
తెలుగు నాట గ్రామదేవతల జాతరలలోను, సంబరాలలోను, తీర్థాలకు కూడా ఈ బుట్టబొమ్మలు కనిపిస్తుంటాయి. బుట్టబొమ్మలు కూడా జానపదాకళారూపానికి చెందినవే. దూరం నుండి ఈ బొమ్మలను చూడగానే చటక్కున ఆకర్షితులవకమానరు గబగబా అంగలు వేసుకుంటూ ఈ ప్రదర్శన జరిగే చోటికి చేరనివారు వుండరు. అంత అకట్టుకునే విధంగా ఉంటాయి. ఈ బుట్టబొమ్మలు: బుట్టబొమ్మలు ఉత్సవాలకే పడుతుంటారు సాధారణంగా ఈ బుట్టబొమ్మలు ప్రదర్శనలో పాములవాడు, పాములవాడి భార్య రాధ, కృష్ణుడు మొదలైనవి ఉంటాయి. ఇందులోనే గుర్రాలాట, గొర్రగేదెలు వంటి బుట్టబొమ్మలు కూడా మనకు కనువిందు చేస్తాయి.
బుట్టబొమ్మలు తయారీకి వెదురుగడలు, చింతగింజల గుజ్జు, రకరకాల రంగులు ఉపయోగిస్తారు. వెదురుగడలను బద్దలుగా చీరి చక్కుని నైపున్యంతో బద్దతన్నిటిని ఒకదానికి ఒకటి చేర్చి బొమ్మలను తయారు చేస్తారు. దానికి చింతగింజల గుజ్జును పూయడంతో రూపాన్ని తీర్చుదిద్దుతారు. దీనికి చక్కని రంగులు పూసి ఆకర్షిణీయంగా తీర్చుదిద్దుతారు. ఈ బొమ్మలను ఎత్తుకుని ఆడే కళాకారుడు తన బొడ్డు కింది వరకూ బొమ్మ విచ్చేట్టు బొమ్మను తయారు చేసుకుంటాడు. ఈ బొమ్మలు పెద్దపెద్దగా ఉంటాయి. కళాకారుడు ఒక పరికిణీని కాళ్ళ వివర వంట కుపెట్టుంచుకుంటాడు, పరికిణీ ధరించిన తరువాత బుట్టబొమ్మను ఎత్తుకుని తలకిందనుండి తగిలించుకుని బొడ్డు దగ్గర రంధ్రాలనుండి 'చూస్తూ బొమ్మను దరువులకు అణుగుణంగా ఆడిస్తుంటాడు. ఈ బొమ్మలు ఎత్తుకున్న కళాకారుడు నృత్యంచేయడానికి వీలుగా రామడోలు వేళందారు వాయిద్య సహకారం అందిస్తారు. ఇందులో భాగంగానే గుర్రాల బొమ్మలు కూడా వుంటాయి. గుర్రాల ముఖాలు వెదురు తడికలతో తయారుచేసి ఆ గుర్రాల బొమ్మలు తగిలించుకున్న వ్యక్తి తన పాదాలకు రెండు మూడు అడుగుల పొడవుగల కర్రలను కట్టుకుని గుర్ర మెద వద్దగల కన్నం నుండి పైకి వచ్చి గుర్రం నడుస్నున్నట్లు కట్టుకున్న కర్రలతో వాయిద్యాలకునుగుణంగా నడుస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది. పిల్లలను బాగా ఆకర్షించి ఆనందింపచేసే కళారూపం బుట్టబొమ్మలు.
బుడబుక్కల వారు
శివుని చేతిలో కనిపించే భీమరుకమే బుడబుడక అంటేను. కోడికూత జామునే బుడబుడక చేతిలో పట్టుకుని ఊపుతూ పల్లెప్రజలను మేలుకొల్పే ప్రాచీన జానపద గాయకుడు బుడబుక్కల వాడు భక్తిని ప్రతిపాదిస్తూ పురాణ సంభంధమైన అనేక అంశాలను చెబుతూ ప్రజలకు సీతిభోధ చేయడం ఈ బుడబక్తుల వేషగాని ప్రధాన ఉద్దేశ్యం. ఈ వేషంలోని పాత్రపేరు 'రామజోగి'. సంక్రాంతి వస్తుందంటే నెది ముందు నుంచే ప్రతీ బటివీ పటుకరిస్తూ బంటాడు. రామజోగీలు, సాయిలవారు, బుడబుక్కల వాళ్ళు అని పిలువబడే వీరు క్రీడాకుళం. తూర్పుగోదావరి.. గుంటూరు, ప్రకాశం, సల్లగొండ జిల్లాలలో అధికంగా కనిపిస్తూ ఉంటారు.
'అంబ పలుకు జగదాంబ వెలుకు, ఉంచిలోని రామాక్ష్మి పలుకు అని పాడుతూ వచ్చే బుడబుక్కల వాడు చరిత్ర కందినంత ప్రాచీనకాలం. వాడే వీరి కధనం ప్రకారం మహరాష్ట్ర నుంచి వారి పూర్వీకుల ఆంధ్రదేశానికి వచ్చి స్థిరపడదినట్టుగా చెబుతారు. వీరి వాయిత్యం బుదేక("మేరకం), ఉడుక్క, పొందుక, డుక్క దుబ్డక్కా మొదలైన పేర్లతో పిలుస్తారు కూడాను. తెలుగు సాహిత్యంలో శ్రీనాథుడు మొదలు ఆధునిక కవి జాషువా బాకా ఎందరికార్యాలలోనే బుడబుక్కలవారి ప్రస్తావన వుంది.
బుడబుక్కల వేషధారణ ఆసక్తిని కలిగిస్తుంది. వీరి వేషధారణను గురించి వివరంగా అయ్యలరాజు రామభుద్రుని హంసవింశతి' కావ్యంతో ఉంది. నేటి బుడబుక్కల వాడు బిగుతుగా ధోవతని కట్టుకుంటాడు. తెల్లని చొక్కాపై రంగుల కోటు వేసుకుంటాడు. తలకు రుమాలు చుట్టుకుని, ప్రాతిగుడుగు లేదా కర్ర భుజానవేసుకుని దానికి జోలెలు తగిలిస్తాడు. నుదుటి పై నల్లని బోట్లు పెట్టుకుంటాడు. చెవులకు రంగు రంగుల చెవిదిద్దులు పెడతాడు. ఎడమ భుజాలపై జరికతోలును, భుజాలనుండి క్రిందివరకు వెనుకవైపు పులి చర్మాన్ని కూడా కట్టుకుంటాడు. సదుముకు ఒక గంట కట్టుకుంటాడు. ఈ వేషధారణతో వీధులలో తిరిగే బుడబుక్కలవాడు ఓ ప్రత్యేక ఆకర్షణ కలిగి వుంటాడు. తాను వాయించే వాద్యం నుండి మంద్ర మధ్యను, తారస్వరాలు పలికిస్తాడు.
మహరాజరాజ మార్తాండతేజ
చవికల్ప భుజరాజ సూత్రమా
శుభోజ్ఞయం కల్లవలె
మీ పని జయం వుండాలి.
మా పని నయం వుండాలి అంటూ ఎక్కడా ఆగకుండా మహభారతం నందుగల వీరులందరినీ వరుస కలుపుతూ చెబుతుంటే అతని ధారణ తల్లికి ముగ్ధులు కావలసిందే.
భూమి కంటే ముందుపుట్టినది ఉదకం, ఉదకంలో సంచరించినది మత్యం, మత్యకతు కల్గినవాడు మన్మథుడు, మన్మధుని అన్న బ్రహ్మ, బ్రహ్మ భార్య సరస్వతి, సరస్వతి పతి కవులు, శుక్రులు, శుక్రులు వారిచేత సకల పురాణములు గైకొనినివాడు పరీక్షితు మహరాజుల పురాణాలకు చెందిన వారి సంబంధాలను వివరిస్తూ పోతుంటే పండితులు కూడా ఆశ్చర్యానంధాలలోను కాక మానరు.
బుడబుక్కలవారి రాకను గ్రామాలకు శుభసూచికంగాను, లాభదాయకంగాను పల్లె ప్రాంతంవారు భావిస్తూ ఉంటారు. బుడబుక్కల వాయిద్యం సంద్రరేగి కర్రతో చేసి దానికి మేక, లేక జింక లేదా బావురు కప్ప చర్మాన్ని రెండువైపులా చిక్కని తాడుతో కుట్టి అంచులు, తంగడి, కర్రతో దుడతారు. ఈ వాయిద్యానికి చెరోవైపునా చిన్నతాదులకు తారువుందరులు బుడబుదమంటూ వచ్చే విచిత్ర శబ్దం మన ప్రాచీన చరిత్రను తనదైన రూపంలో పలుకుతూ ఇంకా కొనసాగించడం ఆనందించవలసిన విషయం.
బైటో భజన
దేశంలో లేని ఎల్ల పట్టణం లేనేలేదు ఆలయం ఉన్నచోట భజన కార్యక్రమాలు జరుగుతుంటాయన్లు సంగతి ప్రత్యేకిం చప్పదన్నరలేదు. పంద్ర సాంప్రదాయానికి ఆంధ్రదేశం పెట్టింది పేరు ఆలయాలలో రామాలయంటిని వోటేలేదు. కులానికో, రామాలయం. రామాలయం కూడా ఉంటాయి. రాత్రివేళల్లోనూ, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి, శివరాత్రి వంటి పుణ్యదినాలలో ఈ భక్తులు ఆలయ నుండిపాలలో మార్చుని, దేవుని ఫోటో ఎదురుగా పెట్టుకుని ఉత్తడి తాళాలతో భగవంతునిపై గూర్చిన పాటలు పద్యాలు పాడుతూ భజనలు చేస్తూంటారు:
ఆలయంలో పదిమందీ కూర్చుని భజన చేస్తూ భగవన్నామ సంకీర్తనలకే ఈ భజన సంప్రదాయం పరిమితం కాలేదు. వగలంతా కాయకష్టం చేసి రాత్రిపూట మానసిక, శారీరక విశాంత్రి కోసం భజన కార్యక్రమంలో పాల్గోనడం ఒకవంతు దీనిద్వారా మనస్సు నిర్మలమువుతుంది. కొద్దో గోప్పో పుణ్యభావన కలుగుతుంది. భజనలలో వివిధరకాలు ఉన్నప్పటికీ వైటో భజన సర్వసాధారణంగా అన్ని చోట్ల మనకు కనిపిస్తుంది.
రైటో భజన'లో హర్మోనియం, మద్దెల శృతివాయిధ్యం, కంజీర, ఇత్తడి తాళాలు 6 జతలు వుంటాయి. మండపంలో భజనబ్పందం వలయంగా కూర్చుని మైకుముందు ప్రధాన గాయకుడు కీర్తన అలపిస్తుంటే ఆ వెనుక అందరూ అదే చరణాన్ని పాడుతూవుంటారు. సాధారణంగా ప్రధాన నాయుకుడు మంచి కందమాధుర్యం కలిగి వుంటాడు. అందరూ కూర్చుని చేస్తారు. కాబట్టి దీనిని బైటో భజన అన్నారు.
ఈ భజనల్లో పాడేవారితో పాటు చూడడానికి వచ్చిన వారు కూడా వాదితో కలిసి భక్తి భావంతో ఉత్తిచోతులనే తాళాలుగా అనుకుంటూ. పాడుతూ కనిపిస్తారు. ఈ భజనల్లో పాల్గోనేవారు సంగీత పాండిత్యం కలవారై ఉంటారు. ఈ భజనలోని కీర్తనలునే కాకుండా కాళహస్తీశ్వర శతకం, దాశరధీ శతకం, ఇతర శతకాలలోని పద్యాలను కూడా రాగయుక్తంగా పాడుతుంటారు. ఆడవారు, మగవారు కూడా కలిసి ఈ భజనలో పాల్గొంటారు.
ఈ భజనలు ఏలాహలు, గుప్తాహలుగా కూడా సాగుతాయి. ఏడాహలు అంటే ఉదాహరణకు 'రామరామసీత' అనే కావ్యంలోనే రోజంతా భజన చేస్తారు. 7 రోజులు పాటూ ఒక వాక్యంతో చేస్తే దానిని సప్తాహం అంటారన్న మాట. ఈ భజనల్లో రామదాసు కీర్తనలు. తాగ్యరాజుకీర్తనలు కూడా చోటు చేసుకుంటాయి. దానివలనే త్యాగరాజు, అన్నమయి, రామదాసు కీర్తనలు వాడవాడలా వ్యాపించాయి. గణపతి ప్రార్థనలో ప్రారంభమయ్యే భజనను విని ఊరిలోని ముత్తయివులందరూ అరటిపండ్లు, కొబ్బరికాయలు, శెనగపప్పు, బెల్లం పళ్ళాలలో పుచ్చుకుని భజనదగ్గర దేవుని ముందు పెడతారు. భజన పూర్తవగానే ఆ పండ్లను, సెనగపప్పు, బెల్లం లను కలిపి ప్రసాదంగా పెడతారు.
ఈ భజనల్లో సులవైన పాట 'రామరామరామసీత' అనేది ఒకటి. సీతారామ్ సీతారామ్ జయసీతారామ్ పట్టాభిరామ్ పట్టాభిరామ్ జయసీతారామ్ అని రాముని గూర్చి తెలిపిన విశేషకాలంలో చేంతాడులా సాగదీసుకుంటూ ఏకతాళంతో పాడుతూ భజన చేస్తారు. ఈ భజనలను కొందరు. యిండ్లలోనూ కూడా ఏర్పాటు చేస్తారు. "మేటి మైచను భక్త కూపములందు పాటలుగా గట్టి పాడిదివారు" అని పాల్కూరికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్ర నందు వ్రాయడం చూస్తే ఈ భజన కళ ఈనాటిది కాదని తెలుస్తున్నది. గొల్లలమామిడాడ రామచంద్రపురం, సామర్లకోట. పిఠాపురం, మండపేట, కొంకుదురు, కొవ్వూరు, ఏలేశ్వరంలో ఉన్న భజన మేళాలు బహు పేరుపొందినవి.
గారడీ నృత్యం
పెద్దదోళ్ళము కర్రలతో లయగా పెద్ద శబ్దంతో వాయిస్తుంటే కాళ్ళకు ఇనుప అండేలు నాలుగు, అయిదు వరుసలతో కట్టుకుని పాటకు అనుగుణంగా చేసే నృత్యకు గారడీ నృత్యం. ఈ నృత్యం చేయడు మాలకులస్థుం ప్రత్యేకతై యున్నది. ఈ గారడీలను ఉత్సవాలకూ ఉరేగింపులకూ పల్లెల్లో పెడుగుంచారు. గారడీ అంటే మోళీ ఆటకు సంభందంచివరి కాదు. ఇది ప్రత్యేకమైన నృత్య జానపదకళారూపం
'బేరీలు' అనిపి౦చే పర్వతాల వంటి డోళ్ళను మధ్యలో పెట్టుకుని, కాళ్ళకు గడ్డి పరకలు చుట్టుకుని ఆపై ఇనుప అందెలు తొడిగి 30 మంచి వరకు గళాకారులు విలయంగా విలబడి పాటలు, వెన్నెల సదాులు వగైరా జానపద గీతాలు పాడుతూ శబ్దాలకు అణుగుణంగా పైకి కిందకీ ఎగురుతుంటే ప్రదర్శన ఊరంతా ప్రతిధ్వనిస్తుంది. గ్రామదేవతల సంబరాలు, జాతరలలోను, ముఖ్యంగా గొంతెలమ్మ సంబరానికి చేసే ఈ నృత్యం చూసి తీరవలసిందే.
కళాకారులు ఎరుపురంగు చొక్కా నీలం పేంటు ధరించి, చేతిలోని కర్రకు రెండంచుల రంగురంగుల జెండా కట్టుకుంటారు. మొలకు గజ్జెలు కూడా కట్టుకుంటారు. రెండు 'తసా' వాయిద్యాలు కూడా మ్రోగుతూ ఉంటాయి. ఏలే ఏల ఏలేయాల పై లేస్సో ఓహో అని గాని, "శ్రీరామయ్య రామరామయ్య, సదండమానించి మయ్యగా కోడంద రామయ్య అంటూ పాడుతూ చిందేస్తూ ఈ గారడీ నృత్యం చేస్తూంటారు. వీరు సినిమా పాటలకు తగినట్లు నృత్యం చేయడం ఈ మధ్య వీరి కళా ప్రదర్శనలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రదర్శనకు పసలపూడి గ్రామస్థులు పెద్ద పేరు. వీరు గాలిండియా రేడియోలో కూడా ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శన మధ్యలో రంగురంగు దమ్మీ వ్యస్త్రాలలో వేషాలు చేసుకుని కొందరు డాన్సు చేయడం బలే సరదాగా వుంటుంది.
గరగ నృత్యం
''గంగ' అంటే నుండి కుండను తలపై పెట్టుకుని నృత్యం చేసేవారిని గదగలు అంటారు గంగాలమ్మ, మండమ్మ వంటి గ్రామదేవతల సంబరాలయ జాతర్లకు తప్పనిసరిగా నిర్వహించే సాంప్రదాయక నృత్యం ఇది. ఇత్తడి టెండపై శేష సల్వం ను ఏర్పాటు చేసి కింద లింగాన్ని పంచుగారు. తెలపై గరగ ఉండటానికి చుట్టకుదురు లాంటిది అమర్చుతారు పూర్వం ఇత్తడి బిందెకు బదులు గుండలను వాడేవారు ఈ గరగలను ఇంటింటికి తిప్పి పూజారిని 'గణాచార్యుడు' అంటారు. ఈ నృత్యాలను రజక వృత్తిగల వారు ప్రధానంగా నిర్వహిస్తూ ఉంటారు.
చరణను గరక కరగ, కరిగె, అని మనరాష్ట్రంలోను గరకం అని తమినాడులోను, కరిగె అని కర్ణాటక రాష్ట్రంలోను పిలుస్తారు మత సాంప్రదాయమైన ఈ నృత్యం అనేక మార్పులు చెంది నృత్య కళారూపంగా స్తిరపడింది. గరగలను కోకలు, కుచ్చిళ్ళతో చూడముచ్చటగా అలంకరిస్తారు. గణాచార్యులను ఆపాదులు అని కూడా అంటారు. గణాచార్యుడు వివాహ రడుకలకు, ఇంటి శుభకార్యాలకు వారి అభ్యర్ధన మరకు వారి ఇంటికి వెళ్ళి రాత్రంతా గంగలతో జాగారం చేస్తాడు. అనంతరం ఇంటివారు పరచిన కొత్త కోతపై గరగను దించుతాడు. ఇమ్యం, పండ్లు, దక్షిణాలు ఆ ఇంటి వారు సమర్పించుకున్న తరువాత దండకము, జోలపాట చదువుతాడు శ్రీ రాజరాజేశ్వరి శంతరీ, శాంభవీ, వైష్ణవి, శాలోని, ఛాతిని, శంబరాణీ, మహాబిల, జోగేశ్వరీ, కోటి సూర్య ప్రకాశంలో మారినీడు వృష్టాంతం పూరండ కాదండకం ఒక్కంటి తేసి అది ఎంతునమ్మ అంటూ, చదువుతాడు. అనంతరం కోరను, దక్షిణాలను తీసుకు ఇంటి వారిని దీవించి వెడతాడు.
గదర నృత్యం శబ్దానుగుణంగా చేయబడుతుంది. జోరుగా డప్పులు వాయిస్తుంటే పూనకం వచ్చినట్లు గరగలు ఆడతాయి. జోరుగా డప్పులు వాయిస్తుంటే పూనకం వచ్చినట్లు గరగలు ఆడతాయి. దానిని గలెక్కుడం అంటారు. ఈ నృత్యంలో 15 నుండి 20 మంది కళాకారులు పాల్గొంటారు. గరగ నృత్యం చేసేవారు పంచకట్టుకుంటారు. కాళ్ళకు గజ్జెలు కట్టుకుని దప్పుకు లయ బద్ధంగా నృత్యం చేస్తారు. రాత్రంతా వారు గరగనృత్యం చేస్తుంటే జనాలు బక్తి పారవస్యంతో చూస్తూ ఉంటారు, గరగ అడీవారి చేతిలో వేప మంటలు ఉంటాయి వారు పసుపు నీటిలో వేప మంటలు మంచి ప్రతి ఇంటి పైన చల్లుతూ వెడుతుంటారు. ప్రతీ ఇంటివారు అలా చేయని వారిన కోరుతూ ఉంటారు. గరగలు నిప్పుల గుండా మీదగా పూనరంతో నడిచి వెళుతుంటూ ఆశ్చర్యపడని వారు ఉండరు గణాచాల్యులు తమ నోటితో కోడి తలను కొరికి పారవేయడం కూడా అంతే ఆసక్తిని కలిగిస్తుంది.
ఈ నృత్యం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో బహుప్రాచుర్యం పొందినది, సామర్లకోట, పెద్దాపురం, చింతలూరు, పసలపూడి, బండారులంకలకు చెందిన కళాకారులు ఈ నృత్యానికి పేరెన్నికగన్నారు. చింతలూరు గరగ నృత్యకళాకారులు రాష్ట్రమునందే కాకుండా ఇతర రాష్ట్రాలలోను తమ కళా నైపుణ్యం ద్వారా మన్ననలు పొందుతున్నారు.
చెక్కబజనలు చెట్టు బజనలు
సంబరాలలో సత్సాహవంతులైన యువకులు నడుముకు రుమాళ్ళ రిగించి కుండి తితో త అనుకరూ ఎదకుచేలతో కీర్తనలను అభినయిస్తూ గుండ్రంగా నిలబడి కాళ్లల్లంగా గ హట్యం చేసి దగ్గిర. ప్రధానమైన రజనే చెక్కకు జరులుగా ఇతడి త సతులు వెలిగించిన దీపాల చెట్టుడు పట్టుమని దాని చుట్టూ నాలయంగా నిలబడి కూడా చెట్టు
చాల టీ రాణులో ఒక గురువును పెట్టుకుని పేటలో మునేర్చకుంటూ అందము.. శలివస్తుంది రామాలయాం దగ్గర రాత్రి భోజనాలు ముగించుకుని యువరులు దేసే ఈ చిజంను పంట వద్దు తెలగొంచడం కాంక్షిసాల్లో ఒకటి కిట్టమ్మా గోపాల బాల కిట్టమ్మా భజనందగోపాల చాలా రిట్టమ్మ కాళ్ళ గజ్జలు కట్టి కళాలు సంగారెడ్డి గోడు పూలు దిద్ది, గోరింటాకు పెడతారారా అంటూ మధ్యలో గురువు పాడుతుంటే యువకులందరూ అదే చరణాన్ని పాడుతూ ఉంటే చూసి వారికి భక్తి భావం ఉప్పొంగక మానదు.
చెన్న భజనకారులు చిడతలనే కాకుండా మధ్యలో హార్మోనియం, మద్దెలను కూడా ఉపయోగించుకుంటారు వేరు భజన వెండరభజనలాగే ఉంటుంది గాని ఇందులో జెండాలు కాని ఆ వేషాలు కాని ఉండవు చెక్కభజనలోని పాటలు వేరే ప్రత్యేకించి నేషం ఉండదు కాని సాధారణంగానే. ఉంటుంది. ఈ చెక్క భజన చేసే వారు పెద్దగా విద్యావంతులు కాదు. అందుచేత వీరి పాటల్లో ఎక్కాలు లెక్కలు సులువుగా వేర్చుకునే విదంగా పాటలు ఉంటాయి
ఎనిమిది మూళ్ళరవై నాలుగు తొమ్మిది మూళ్ళు ఇరవై ఏడు పదకొండు మూళ్ళు ముప్పై మూడు పన్నెండు మూళ్ళు ముప్పై ఆరు. కిట్టమ్మ గోపాల చాలా కిట్టమ్మ భజ నందగోపాల చాలా కిట్టమ్మ
అంటూ సాగే పాటలోని గణిత భావనలను మనం సులువుగా గ్రహించగలం చెక్క భజన గణపతి ప్రార్థనలో ప్రారంభిస్తారు శివశమూర్తిని గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాధా మూడు కాలాలలోను చేసే ఈ భన ఆంధ్రనాట ఎంతో ప్రాచుర్యం పొందినది. కీర్తనల్లాంటి భక్తిగీతాలు, కృష్ణలీలలు వేండా తత్యాలు ఇందులో ఉంటాయి. ఈ చెకు భజన యువజనలో క్రమశిక్షణ, శృతి జ్ఞానం లయ జ్ఞానం కలిగిస్తుంది.
తాండవ నృత్య హరీ గజానన, ధిమికిట ధిమకిట బాజామృదంగ, హరిలో రంగ హరీ జగానన, కంటూ గణపతి గీతంతో మొదలయ్యే చెట్టు భజన తెలుగునాట వర్ధిల్లిన భజనల్లో ముఖ్యమైనదే. దీపావళి సమయిన ఎక్కువగా ఈ దీపపు చెట్టు భజన కనిపిస్తూ ఉంటుంది. రామ భజన చేయరే రజితగిరి రామభజన చేయరే. అంటూ భజన చేస్తూ ఇంటింటి దగ్గర ఆగుతూ సాగుతుంది ఈ భజన కళారూపం ఈ దీవపు చెట్టును పెద్ద వెదురు గడమే తగిలించి ఊరంతా త్రిప్పుతూ ఆగినచోటలా దీపపు చెట్టు చుట్టూ వలయంగా నిలబడి భజన చేస్తుంటారు.
చెక్కభజనను పోలినట్లే గురువు వలయంలో నిలబడి కీర్తన అందుకుంటే మిగతి వారంతా వంతకలుపుతారు ఇందులోనూ ప్రత్యేక వేషాలు ఉండవు. నడుముకు రుమాలు కట్టుకుని, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని భజనలో ఇదవైనుండి ముప్పై మంది వరకూ పాల్గొంటారు. ఈ భజన ఎక్కువగా నృత్యం, తాళం కలసి దేవుడి సంబరాలలోను అమ్మవారి జాతరలలోనూ కనిపిస్తూ జవాల చేత శబాష్ అనిపించుకుంటూ సాగుతుంది. ఈ నృత్య తాళభజనగా కనిపించే చెట్టు భజన..
Tuesday, January 13, 2026
NTR గారి ఈ ఫేమస్ డైలాగ్ చాలామందికి గుర్తు ఉండే ఉంటుంది. అప్పట్లో ప్రతీ స్టేజీ మీద ఈ డైలాగ్ వినిపించేది. మిమిక్రీ కళాకారుల నోటిలో దడదడలాడేది.
ఇది జననాల గురించే
ఎందుకనో అప్పుడు మనుభావాలు దెబ్బ తినలేదు.
నిజాలకు ఇప్పుడు భయమెందుకో? కల్పిత గాథల విదేశీ ఆర్యన్ మనువాదుల మనుభావాలు ఏమిటో?
NTR గారి డైలాగ్ మానవవాది కొండవీటి వెంకటకవి గారి విరచితం.
ఆచార్య దేవా!
ఏమంటివి ఏమంటివి
జాతి నెపమున సూతసుతునకిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఎంత మాట??? ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే? కాదు కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరధ్వాజుని జననమెట్టిది? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది? మట్టి కుండలో పుట్టితివి కదా నీది యే కులము? ఇంత యేల, అస్మత్ పితామహుడు కురుకుల వృధ్ధుడైన ఈ శాంతనుడు శివ సముద్రల భార్యయగు గంగా గర్భమున జనియించాలేదా. ఈయనది యే కులము? నాతో చెప్పింతువేమయ్య మా వంశమునకు మూల పురుషుడైన వశిష్టుడు దేవ వేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా? ఆతడు పంచమజాతి కన్యయైన అరుంధతి నందు శక్తినీ ఆ శక్తి చండాలంగన యందు పరాశరునీ, ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసునీ ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పిన పితామహి అయిన అంబాలికతో మా పిన తండ్రి పాండుడరాజునూ, మా ఇంటి దాసితో ధర్మనిర్మాణజనుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదుర దేవుని కన లేదా? సంధర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురు వంశము ఏనాడో కుల హీనమైనది. కాగా నేడు కులము కులము అని వ్యర్ధ వాదమెందులకు?
-- సురేందర్ ఉయ్యాల
Monday, January 12, 2026
వీరనాట్యం
సంప్రదాయకులు శివభక్తి పరులు ఆరాధన పర్వంగా చేసే భక్తి ప్రధానమైన నృత్య ప్రక్రియ ఈ వీరనాట్యం ఈ వాటా సమర్పించే కుకారులు వీరముష్టి వారు అంటారు. ఇది 13,14 శతాబ్దిలోని వీరశైన మతం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించినది. సంబరాలు, శివుడు వీరభద్రులు మహత్వాన్ని తెలిపే కళారూపం ఈ వీరనాట్యం. వీరశైవ కుటుంబాలలో వివాహాలు, ప్రత్యేకమైన
మొదలైన సందర్భాలలో వీరనాట్య ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి.
వీదవాట్య గళారూపం దక్షయజ్ఞానికి సంబంధించిన కథాంశంలో ముడిపడి ఉంటుంది. దక్షుడు యజ్ఞం చేస్తూ తన కూతురైన పార్వతిని ఎలపడు. పార్వతి పిలవక పోయినా నా తండ్రి ఇల్లే కదా అని వెడతానంటుంది. శివుడు వద్దని వారిస్తాడు. శివుని మాట కాదని పార్వతి తండ్రి చేసే యజ్ఞ దగ్గరకు వెడుతుంది. అక్కడ పిలవని పేరంటానికి వచ్చానని అవమానిస్తారు. పార్వతి యజ్ఞం చేసే అగ్నిగుండంలో పడి ఆహుతి అవుతుంది. ఈ విషయం తెలిసిన వెంటనే శివుడు ప్రళయ తాండవం చేస్తాడు. ఆ సందర్భంగా శివుని శరీరం నుండి చెమట విందువులు వాలతాయి. ఆ బిందువుల నుండి వీరయోధులు పుడతారు. వారికి వీరభద్రుడిని సేనాపతిగా నియమించి దక్షునిపై యుద్ధానికి సంపుతారు. దక్షుని యుద్ధాన్ని ధ్వంసం చేసి దక్షుని సంపాదిస్తారు. ఆ వీరభద్రుని వారసులే వీరముష్టి వారమని చెప్పుకుంటారు. ఈ వీరనాట్యాన్ని
జంగందేవరలు, దేవాంగులు కూడా ప్రదర్శిస్తారు.
స్తారు. వీర నాట్య కళాకారుడు కళాప్రదర్శన సమయంలో భయం గొలిపేట్లు వేషదారణ చేసుకుంటాడు. నుదిటపై విభూదిషులు ధరిస్తాన వంటిపై మెడలో రుద్రాక్షలు వేసుకుంటారు. పంచెకట్టుకొని మరో ఎర్రటి గుడ్డను డాలుగా అమర్చుకుంటారు. చేతిలో పాడవైన ఖడ్డాన్ని పట్టుకొని మోకాళ్ళకు గంటలు కట్టుకుంటారు. రెండు కాళ్ళకు గజ్జెలు కట్టుకొంటాడు. మరోప్రక్క త్రిశూలానికి నూనె గుడ్డలు చుట్టి మందుతుండగా శివమెత్తి వీరాకేశీరిలో తాండవం చేస్తున్న శివునిలా ఉగ్రరూపం తమ నాట్యరీతుల్ని ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శన ఇద్దరు ముగ్గురు కళాకారులు చేస్తుంటే అందుకు అనుగుణంగా తాసాల వాయిద్యం, తంబ్రాసల వాయిద్యం, లయబద్ధంగా వాయిస్తూ మధ్య మధ్యన అశ్శరభ...
అశ్వరభ, శరభ, శరభ అంటూ చెవులు ఖంగుమనేట్టు పలుకుతూ వర్తిస్తారు.
వీరనాట్యాన్ని చూసి భక్తులు ఆనందపడుతూ స్వయంగా శివుడే తమ ఇంటికి వచ్చి సర్తిస్తున్నట్లు భావిస్తారు వీరభద్రుడు సంబరాలలో కూడా ఈ నాట్య ప్రదర్శన సాగుతుంది. ఈ ప్రదర్శనలో వీరభద్ర పళ్ళెం. శివ వీరభద్రులకు అర్పించే దృశ్యం రోమాంచకంగా, గగుర్పాటు కలిగించే విధంగా ఉంటుంది పళ్ళెంలో మంటలు అరిపోయేదాకా లయ తాళాలు మారుస్తూ వీరనాట్య కళాకారులు పాడే పాటలు, ఈ సందర్భంగా పూజారులు చేతుల్లో కత్తి పట్టి వచన గేయి రూపంలో శివ వీరభద్రుల స్తోత్రాలలో పాడే ఖద్ధాలు చూపరులను ఆనందపరుస్తాయి.
వీరనాట్యంలో ధ్వజ స్తంభం అంశం మరొకటి పొడవైన శబ్దానికి విభూతి అద్దుతారు. దానిపైన చివర గంటలు కడతారు. ఆస్త్రంభానికి వట్టి కట్టి నిండుగా అలంకరిస్తారు. నాయిడ్యాలకి అనుగుణంగా కళాకారులు నృత్యం చేస్తారు. వీరనాట్యంలో మూడోఅంశం సరసం దీనిలో వీరశైవ భక్తులంతా మూకుమ్మడిగా వాద్యాల మోతల కనుగుణంగా నాట్యం చేస్తారు. కాంతి నరసం, కాంత నరసం, ఏకనరసం, శిరోవసం, శూల సరసం మొదలైనవి ఈ నరసంలో ఉన్నాయి. శివునికి మంగళ హారతి ఇవ్వడంలో ఇది ముగుస్తుంది. ఈ వీదనాటు కళాకారులు నోటిలో
చిన్న చిన్న శూలాలు నాలుకకు బుగ్గలలోనికి గుటుకుంటారు.
చారిత్రంకంగా కూడా ఈ వీరనాట్యానికి ఆనవాలులు ఉన్నాయి. కాకతీయ కాలంలో పశుపతి సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతీ ఇంటి నుండి తల్లిదండ్రుల తను మమగ బిడ్డలలో ఒకరిని వీరునిగా జాతి శ్రయస్తుకోరి దేశానికి ఆర్పించే సాంప్రదాయం ఉండేది. వారినే పశువతులు అని పిలిచేవారు వీరు వివాహం వారు కాదు. దేశ రక్షణకు తమ ప్రాణాలు అర్పించేందుకు అంకితమయ్యేవారు వీదు శివునిపుల
రుద్రాక్షలు వేరుకుంటారు. సంధికట్టుకొని మరో ఎర్రటి గుడ్డను 7 అమర్చుకుంటార మోడ్పాడు గంటలు గట్టుకుంటారు రెండు కాళ్ళకు గజ్జెలు కట్టుకొంటాడు. మరోప్రక్క త్రిశూలానికి నూనె గుడ్డలు చుట్టి అవి
నాట్యరీతుల్ని ప్రదర్శన ఇదరు ముగ్గురు ఉపవెత్తి వీరావేశిదిలో తాండవం చేస్తున్న శివునిలా ఉగ్రరూపం రేస్తుంటే అందుకు అనుగుణంగా తాసాల వాయిద్యం, తంబ్రాసల వాయిద్యం, లయబద్ధంగా వాయిస్తూ మధ్య మధ్యన తను సల్ని ప్రదర్శిస్తారు. ఈ ప్ర
అంటూ చెవులు బంగుమనేట్టు పలుకుతూ వర్తిస్తారు.
నాట్యాన్ని చూసి భక్తులు ఆనందపడుతూ స్వయంగా శివుడే వీరభద్రు ద్రుడు సంబరాలలో సర్తిస్తున్నట్లు భావిస్తారు. శివుడే తమ ఇంటికి వచ్చి
దాని ప్రదర్శన సాగుతుంది ఈ ప్రదర్శనలో వీరభద్ర పళ్ళెం, శివ వీరభద్రులకు అర్పించే దృశ్యం రోమాంచకంగా గగుర్పాటు ద్రుల స్తోత్రాలలో పాడే ఖడ్గాలు చూపరులను నంగా ఉంటుంది. వెళ్ళింలో మంటలు అరిపోయేదాకా లయ తా జారులు చేతుల్లో కత్తి పట్టి వచన గేయి రూపంలో శివ వీరభద్రు వీరనాట్య కళాకారులు పాడే పాటలు, సందర్భంగా
ఆనందపరుస్తాయి. శబ్దానికి విభూతి అద్దుతారు. దానిపైన చివర గంటలు కడతారు. ఆస్థంభానికి వట్టి దనాట్యంలో ధ్వజ స్తంభం అంశం మరొకటి పొడవైన . "కారులు నృత్యం చేస్తారు. వీరనాట్యంలో మూడోఅంశం. సరసం దీనిలో కట్టి పిండుగా అలంకరిస్తారు వాయిద్యాలకి అనుగుణ కళాకా ఇచ్చిన వక్తులంతా మూకుమ్మడిగా వాద్యాల మోతల్ "తల కనుగుణంగా నాట్యం చేస్తారు. కాంతి నరసం, కాంత నరసం, ఎకనరసం, ఆదొరసం, శూ సరసం మొదలైనవి ఈ నరసంలో ఉన్నాయి. శివునికి మంగళ గళ హారతి ఇవ్వడంలో ఇది ముగుస్తుంది. ఈ వీరనాట్య కళాకారులు నోటిలో
వని చిన్న శూలాలు నాలుకకు బుగ్గలలోనికి గుబుక బుకుంటారు.
చారిత్రంకంగా కూడా ఈ వీరనాట్యానికి ఆనవాలు కాలులు ఉన్నాయి. కాకతీయ కాలంలో పశుపతి సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతీ ఇంటి నుండి తల్లిదండ్రుల తమ మమగ బిడ్డలలో ఒకరిని వీరునిగా 5ని పిలిచేవారు. వీరు వివాహం చేసుకొనేవారు. 'జాతి శ్రయస్తుకోరి దేశానికి అర్పించే సాంప్రదాయం ఉండేది. వారినే పశుపతులు కాదు. దేశ రక్షణకు తమ ప్రాణాలు అర్పించేందుకు అంకితమయ్యేవారు. వీరు శివునిపూజ తప్పనిసరిగా చేసేవారు ఈ పూజలో నృత్యం ఒక భాగంగా ఉండేది. అదే వీరనాట్యమయ్యిం ఈ వీరముష్టిలు ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తూ
గ్రామరక్షణను కూడా చూసేవారు.
ఈ కళారూపం ప్రదర్శించే వారు మామాసంలో 'చేతినిండా పని ఉంటుంది. శివరా శివరాత్రికి ప్ర ప్రభలు కడతారు ప్రభలలో రెండు రకాలు ప్రభలు ఉన్నాయి. ఒకేపట్టీ ప్రభ రెండు పట్టీల ప్రభ అనేవి. అనేవి ఉంటాయి నిమ్మకులలో ఈ వీరనాట్యం కళారూపం తీరతీరాలుగా వస్తుంది. పశ్చిమగోదావరి ఈ వీరనాట్య కళాకారులు ప్రదర్శనలు పూర్తైన తరువాత గుర్తింపు కార్డులు ఇస్తారు. ఈ గుర్తింపు జిల్లాలో పెనుగొండలో జరిగే ఉత్సవాలకూ ఇచ్చి పంపిస్తుంటారు. తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురానికి చెందిన కోటగిరి రాజు ఈ కుటుంబం ఈ వీరనాట్యం ప్రదర్శిస్తూ సంభావనాలు గుర్తింపు పొందారు. అలాగే ఇల్వలపల్లికి చెందిన కళాకారులు ఈ కళారూపాన్ని ప్రత్యున్నతి దశకు తీసుకుని వెళ్ళేందుకు విశేష కృషి చేసారు. సామాన్య జనానికి కూడా సైతం తెలిసిన మంచిత కళారూపం మన వీరనాట్యం
ఉప్పు నృత్యం
ధమతం చెప్పు మా విసురుస్తుండగా పల్లెల్లో రామాలయం దగ్గర శ్రీ సలాని భాస్కరదాను గారు హరికథ చెబుతున్నారంబోయ్" అంటూ జా నుండి ఉల్లిపాయలు వచ్చాయి కెజి 4 రూపాయలు 3 కేజీలు 10 రూపాయిందోయ్ అంటగానో చాటింపు వినపడుతుంది. ఆ చాటింపును వేసే వాయిద్యమే కన్నం డప్పు చప్పుడు వినని పల్లేలేదు. ఆంధ్రదేశ పురాతన సంస్కృతికి తొలి చిహ్నం మన శబ్దనిపిని పలికించింది. మొదటగా డప్పుపైనే అంటారు. ఆంధ్రదేశంలో సాధారణంగా ప్రదావసారలకు ఉపయోగించే వాయిద్యాలలో చెప్పుత ముఖ్యమైనది. దండోరా. లేదా బముకును ఈ డప్పును ఉపయోగించేస్తారు. గ్రామంలో ఏదైనా ప్రభుత్వ పరంగా విషయాన్ని అందరికీ. తెలియజేయటానికి ఈనాటికి డప్పునే ఉపయోగిస్తున్నారు. ఇది వేల సంవత్సరాల నాటి వాయిద్యం దీనిపై పసలపూడికి చెందిన డప్పు కళాకారులు అద్భుతమైన లయలు వలికిస్తూ డవం నృత్యం చేస్తుంటూ మనకాలు చించేయ్యక మానదు.
మత సంబంధమైన ఉత్సవాలలోనూ, జాతరలోను డప్పు వాయిద్యం లేనిదే అమ్మవారు ఆదరంటారు. పెళ్ళిళ్ళకు, చావులకూ కూడా డప్పును ఉపయోగిస్తున్నారు నపం మాదిగల పొత్తు మాదిగలే దండోరా వేస్తారు. అడప్పును తయారు చేసే కళ వారి సొంతం. డప్పు మా మాదిగల గుండె నప్పుడు అంటారు. విసలపూడికి చెందిన డవం నృత్య కళా బృందం నాయకుడు చుక్కా అబ్బులు, ధూష్' అనే శబ్దాన్ని అనుసరించి దానికి
డప్పు అని పేరు వచ్చింది. ఎన్నికల, మత సంప్రదాయక విషయాల ప్రచారానికి కూడా ఉపయోగించే ఈ దప్పును వేగిన, వేప పలకలతో గుండ్రంగా చక్రంలా మంచి దానిలోపల రేకు బిళ్లలలో ముడుచెట్లు అతికిస్తారు అనంతరం దున్నపోతు చర్మంతో దానిని మూస్తారు. డప్పును వాయించడానికి రెండు చిన్న పల్లలను ఉపయోగిస్తారు. కొద్దిగా లావుగా పొట్టిగా ఉన్న పుల్లను సిర్రె అంటారు. ఇది కుడి చేతిలో పట్టుకుంటారు. ఎడమచేతిలో సన్నని వెదురు బద్దను ఉపయోగిస్తారు. దీనిని సిటికిన పుల్ల అంటారు. ఈ రెండింటిలో లయలుగా వాయిస్తుంటే దేవతలందరూ నృత్యం చేయవలసిందే
అంటారు.
ఈ దవ్వు నృత్యంలో 30 మంది వరకూ కళాకారులు వలయంగా నిలబడి ఉంటారు. పూర్వం పంచెకట్టు తలపాగ దరిలాని ఉండేవారు. ఇవేశము ఈ దప్పుల బృందాల కొత్త కొత్త డ్రస్సులు కుట్టించుకుంటున్నారు. మధ్యలోన గఊచి లపు ఒకే దప్ప పట్ట దెబ్బను ఇస్తే అందరూ కళాకారులు తమ డప్పులపై అదే దిబ్బను కొనసాగిస్తు ఒక్కటి అడుగులు మారుస్తూ డప్పు నృత్యం చేస్తారు. కొందరు కళాకారులు నదుముకు రంగు రుమాలు కట్టుకుని తలకి నీలం రిబ్బను కట్టుకుని కాళ్ళకు గజ్జెలు కట్టుకొంటారు కూడాను. డప్పు నృత్యంలో అడుగు ప్రధానం. వాటిని ఆట డప్పు అని, ఒక్కసిరా డప్పు, సమిడిత డప్పు, మడేల్ ప్పు, గుండం దప్పు, ప్రార్ధన డప్పు వంటి శబ్ద భేదాలను బట్టి పిలుస్తుంటారు. ఈ డప్పు నృత్యంలో కోలాటం డప్ప నృత్యం కూడా బాగా చూడదగింది..
డప్పు కళ ఆంధ్రదేశంలో అనేక మార్పులకు లోనయింది కూడా రాజులు తమ పరిపాలనకు సంబంధించిన విశేషాలను ఈ దప్పు ద్వారానే తెలియజేసే వారు. వివాహాలకు, ఊరేగింపులకు ఈ డప్పు వాయిద్యాలకు ఉపయోగపడింది. ఈ డప్పును ఈనాడు సినీ సంగీతంలో విశేషంగా ఉపయోగించుకోవడం ఆనందించదగినది ఈడవు నృత్యం చేసేప్పుడు డప్పు కళాకారులు వెనక్ని దప్పును వాయిస్తూ వంగి సుదిటిలో కింద పడిన రూపాయి నాణాన్ని సుదిటికి అతికించుకుని అలాగే లేవడం సంద్రమాచ్ఛర్యాలకు గురిచేయికమిన్పడు. ఈ డప్పు చప్పుడు ఆంధ్రులను ఎప్పుడూ మేలుకొలుపుచూనే ఉంటుదనడం అతిశయోకాదు.
గిరిజన (కొమ్మునృత్యం)
భారతీయ సంస్కృతి ప్రపంచంలోని తొలి సంస్కృతులలో ఒకటి, ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు కలిగిన గిరిజన తెగలు కారణాల ద నివసింప పురాతన సంస్కృతిని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉండటం విశేషం చిరకాలంగా అజ్ఞాతవాసం చేసిన గిరిజనుల ఆకార, వ్యవహార, విహారాల్లో మరకు గొప్ప జానపదం కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఆటవీ ప్రాంతం ఈ గిరిజన తెగలకు భవాలు ఇక్కడ నివసించే గిరిజనులలో కొండరెడ్ల ప్రధానమైన తెగ. వీరి జీవనశైలిని గమనిస్తే వీరి పండుగలకు, వివాహాలకు చేసే బైసని నృత్యం అతి ప్రధానమైనదిగా కనిపిస్తుంది. దీనినే గొర్రె గేదె నృత్యం అని కొమ్మనృత్యం అని కూడా పిలుస్తూవుంటారు.
గిరిసులు అంటే కొండజాతి వారు వీరు నాగరిక ప్రపంచానికి దూరంగా కొండలలోను; అటవీ ప్రాంతాలలోను, సహజ జీవితాన్ని గడుపుతూవుంటారు. గిరిజనుల జీవవిధానం ఆసక్తికరమైనది మనం గమనించాలిగాని వీది అలవాట్లు, పండుగలు, సంబరాలు, పెళ్ళిళ్ళు, వ్యవహారాలు ఒకటేంటి అన్నీ ఆశ్చర్యకరంగానే ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఈ గిరిజనులు అత్యధికంగా నివసిస్తుఉన్నారు. వీరిలో కొండరెడ్డి కొయిదొర, కొండవార, కొండకమ్మర వాల్మీకి, కొండరావులు అనే తెగలు ప్రధానంగా కనిపిస్తాయి. వారిలో కొండరెడ్డికులస్థులు.
కొండరెడ్ల జీవితాలలో పండుగలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంటాయి ప్రతీ పనికి ముందు పండుగలు చోటుచేసుకుంటాయి. వీరిలో మూడనమ్మకాలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుచేతనే ప్రతీ పనికి ముందు దేవతను ఆరాధించడం పండుగలు చేయడం వీరికి ఆనవాయితీ. గిరిజనులు ముఖ్యంగా రక్షణ కోసం పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, కొండ దేవతలు తమ తండాలను కాపాడుతూ ఉంటాయని వీరి నమ్మకం వీరి ఆహార్యం నాగరిక సమాజానికి దూరంగానే ఉంటుంది. ఆదిమానవుని రూపురేఖలు కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటాయి. బలిష్టమైన శరీరం, సల్లని శరీరఛాయ. పాట్టిగా వుంటు ఈ గిరిజనులు మనకు కనిపిస్తారు. వీరు పండుగలకు పెద్ద పంచె, ధోవతీలను ధరిస్తారు. విల్లంబులు కలిగి ఉంటారు. వీరు అడవి నుంచే ఆహారాన్ని సేకరించుకుంటారు. పండుగలకు గ్రామాలు అన్న కలసి ఒక చోట పండుగ. జరుపుకుంటాయి. ఈ పండుగలో వీరు జీలుగు కల్లును త్రాగి, అడవి జంతులమాసం కడుపునిండా భుజించి చక్కటి గిరిజన నృత్యం అయిన బొమ్మునృత్యాన్ని నూడచక్కగా అభినయిస్తారు. ఈ గౌర్రగేదె నృత్యం చేసేప్పుడు వీరి వేషధారణ ఆసక్తికరంగా ఉంటుంది.
కొమ్మునృత్యంలో దాదాపు 30 నుండి 40 వరకు పాల్గొంటారు. మగవారు సుమారు 20 మంది వరకు ఉండి మెడలో పెద్దడోలును వేలాడదీసుకుంటారు. నెత్తిపై చనిపోయిన గొర్రుగెదె నుండి సేకరించిన కొమ్ములను శుభ్రపరచి తలపాగాలో అచ్చం గేదెకున్నట్లు అమర్చుకుంటారు. రెండు కొమ్ముల మధ్యలో నెమలి పించాలను గుత్తుగా ఉంచుకుంటారు. తలపాగా వెనుకవైపున వ్రేలాడేసుకుంటారు. నడుముకు రంగురంగుచారల లుంగీ వంటిది కట్టుకుంటారు మెడలో పెద్ద డోలును ఎడమ చేతిలో పెద్ద కర్ర ముక్కతో వాయిస్తూ కుడి చేతిలో దరువును వేస్తూ ఉంటే మధ్యలో 1 20 మంది గిరిజన స్త్రీలు చక్కటి గిరిజన జానపద గీతాలు అలపిస్తూ నృత్యం చేస్తారు. ఆడవారు వేషధారణ చూడముచ్చగా ఉంటుంది
నక్కటి ఎర్రని చీరలను గిరిజన శైలిలో కట్టుకుంటారు. వెట్టిన ఎర్రటి రిబ్బను కట్టుకుని పర్మగా పక్షి ఈకలను కట్టుకుంటారు. మగవారు వాయించే బోలు శబ్దాలకు అనుగుణంగా అడుగులువేస్తూ ఒకరి చేతులను ఒక్కదు పట్టుకుని, ఒకసారి నడుములు పట్టుకొని ఒకసారి. భుజాలపై చేతులు ఉంచి ఒడసారి అద్భుతంగా వర్తిస్తారు వీ పాటలలో శృంగారం పాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వీరి వృత్యలు మధ్యలో జంటలుగా విడిపోయి జతలు జతలుగా డాన్స్ చేస్తారు. బోటును వాయిస్తూ కొర్రగేదెలు యుద్ధం చేసినట్లు యేద పన్నివేసాలను 11 ఇద్దరు. అభినయిస్తుంటే మిగిలిన వారు కోలును తానా స్థాయిలో వాయిస్తూ వారిని ఉత్సాహపడుస్తూ ఉంటాలి. ఈ శాది నృత్యం లేదా
హరిదాసు
సంక్రాంతి తెలుగువారి పండుగలలో పెద్ద పండుగ సంక్రాంతి వేడుకలలోని అనుభూతిని పొందాలంటే పల్లెలో జరిగే సంక్రాంతి సంబరాలను చూడవలసిందే. సంక్రాంతి పండుగ రెండు నెలల ముందు నుండి జానపదుల పలకరింపులతో మొదలవుతుంది. సంక్రాంతి పండుగలో కనిపించే సాంప్రదాయాలు, సంబరాలు, వేడుకలు అన్ని ఇన్నీ కావు అందుకేనేమో దీనిని పెద్ద పండుగని కూడా అంటారు. నెలగంట పుట్టారంటే ఆడపడుచులు వేసే ముత్యాల ముగ్గులు, బంతిపూల దండలు, ముగ్గుల మధ్యన గొబ్బమ్మలలో వీధి వీధి సుందరంగా తయారవటం చూడముచ్చటగా ఉంటుంది. సులి వెచ్చని సూర్యకిరణాలు మనలను తాకకముందే తెల తెల వారు తుండగా వచ్చే బుడబుక్కల వాడి డక్కా నినాదాలు మేలుకొలుపుతాయి. గంగిరెద్దుల వారి వివ్యాసాలు, జంగం దేవర గంట శబ్దాలు, పగటి వేషగాళ్ళ మనోహర పద్యాలు జానపదులలోని మన తెలుగుదనాన్ని గుర్తు చేస్తూ మనజాతి ప్రాచీనతను మనకు కళ్ళకుకట్టిన్నట్లు చూపిస్తాయి. వీటన్నిటి కంటే ముందుగా మనం గుర్తు చేసుకుని హమయ్య సంక్రాంతి వచ్చేసిందిరోయ్ అనుకునే సందర్భం ఎదయా అంటే మన హరిదాసు చిడతల శబ్దాల మధ్య హరిలోరంగహరి పడుకుంటూ వేగంగా మన వీధిలోంచి నడిచిపోతున్నప్పుడే అంతటి ఘనమైన సంబంధం ఉంది సంక్రాంతికి మన హరిదాసుకు హరిదాసు మన తెలుగు వారి గొప్పదనాన్ని చాటే జానపదుడే.
సంక్రాంతికి శోభను తీసుకు వచ్చే హరిదాసును గూర్చి మన తెలుగు సాహిత్యంలో గుర్తుచేసుకోని కవివర్యులు లేరంటే అతిశయోక్తికాదు. తుమ్మల సీతారామమూర్తి పరిగపంటలోను, పల్లా దుర్గయ్య గంగిరెద్దు కార్యలలోను హరిదాసును గూర్చి సవివరంగా మనకి వర్ణించి చూపారు. హరిదాసు హరినామకీర్తనలు గానం చేస్తూ చక్కని ఆహార్యం కలిగి ఉంటాడు. హరిదాసు తన తలపై అక్షయ పాత్ర నుదుటిపై తీర్చిదిద్దిన తీరునామాలు, చేతిలో చిడతలు అందంగా నేలవరకూ జీరాడే పట్టులెల్లా పంచె, కాళ్ళకు గజ్జెలు, మెదలో పూలహారం, ఎరుపురంగు పల్లెవాటును కలిగి ఉంటాడు. హరిదాసు చేతిలో చెక్కలో చేసిన చిడతలను చక్కని లయగా వాయిస్తూ చక్కటి హరినామకీర్తనకు శృతిగా తంబూర వాయిస్తూ చక్కటి గాత్ర శబ్దాలతో పాడుతూ ఉంటాడు.
ఉదయాన్నే ఇంటింటికీ తిరుగుతూ వస్తున్న హరిదాసుకు పళ్ళెంలో బియ్యం ఫలమారాలు హరిదాసు అక్షయపాత్రలో వేయాలని ఆడపిల్లలు చక్కగా ముస్తాబై ఆ రోజుల్లో వీధులో బారులు తీరేవారని మన తెలుగు కావ్యాలలో స్పష్టంగా చెప్పబడింది కూడా. సంక్రాంతి లక్ష్మికి సాహిత్యం పాడే హరిదాసు రాక మంగళప్రదమని తెలుగు మహిళలు భావిస్తూ ఉంటారు. హరిదాసు ఇంటి దగ్గర ఆగి మోకాళ్ళపై కూర్చొని ఆడపడుచులు వేసే బియ్యాన్ని బిక్షగా స్వీకరించి పైకిలేస్తూ కృష్ణార్పణం, అంటూ మరలా మరో ఇంటికి కీర్తన పాడుకుంటూ పోతు ఉంటాడు. సంక్రాంతి పర్వదినాలలోనే మనకు కనిపించే హరిదాసులు సాధారణంగా వైష్ణవ మతానుమాయిలైన సాకములు, జియ్యరులు, దాసరులు ఈ హరిదాసులుగా కీర్తనలు పాడుతూ బిక్షాటన చేస్తూ ఉంటారు. మన తెలుగు వారి సంక్రాంతి పండగను నిండుగా చూపించే అపురూప జానపదుడు మన హరిదాసుడు.
పెద్దపులి వేషం
మాట పెద్దపులాట అని పిలువబడే ఈ ప్రాచీన జానపద కళారూపాన్ని గమనిస్తే మానవుడు తను మాటలను నేర్వకముందులను అనుకరిస్తూ వినోదించి ఆనందించిన అంశాలు ఈ పులి వేషంలో మనకు కనిపిస్తాయి. అంతే కాకుండా మానవుని అధిక వశము కూడా తెలుపుతుంరీ పెద్ద పులాట పెద్దపులి అడవికి చెందిన అత్యంత క్రూర జంతువు పెద్దపులి యొక్క ప్రతీ కదలికను, తన విధానాన్ని వేటాడే దాని నేర్పరితనాన్ని, నడకను, పరుగును, వేటాడే ముందు పొంచి వుండే విధానాన్ని దాడి చేయడంలోని ఒడుపును. మడుగు దగ్గర వీరు తాగే సన్నివేశం ఆకలి దప్పుల మధ్య దానికి కలిగే ఆక్రోశం ఇతర జంతువులలో కనబడడం, పంజా విసరడం వంటి అద్భుతంగా మన ముందు ఉంచుతుడి పెద్దపులి వేషం, పులిని వేటాడిన తరువాత ప్రజలు ఆనందోత్సాహాలలో ఈ నృత్యాన్ని
చుట్టూ కళాత్మకంగాను, వినోదాత్మకంగాను మలచబడిన కళారూపం పెద్దపులాటలో ఆనందమే కాకుండా సందేశమూ ఉంది. పులి యొక్క లు వేటాడే లక్షణాలు ఆ జంతువు నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనే అంశాలు మనకు ఎంతో దోహదపడతాయి. కూడాను. ఈ కళారూపం హిందూ, ముస్లిం ప్రజల ఆదరాభిమానాలను సంపాదించినది...
ఉద్దవులాలకు పెద్దాపురం రాజుల సంస్థానంలో పెద్ద పీట ఉండేది. ఈ పెద్దపులాటను క్రీస్తు శం 1714 నుండి 1734 వరకు పెద్దాపురం సంస్థానాన్ని ఏలిన శ్రీ వత్సవాయి తిమ్మంగజువలే మహారాజు ప్రోత్సహించి దీనికి గొప్ప ప్రాచుర్యాన్ని తీసుకువచ్చాడు. పెద్దపులాట ఈనాడు. మనకు మన ముధ్య జరిగే ఉత్సవాలలోను పీర్ల సంబరాలలోను జాతరలలోను కనిపిస్తూ ఉంటుంది, 6నుండి 10 దప్పులు విపరీతంగా మోగుతుంటే నాలుగు తాసాలు బరాయి, రామ్ దోబు వినిపిస్తుంటే మధ్యలో క్లారినేట్ ఒకటి చక్కటి స్వరాలు పలుకుతుంటే ఇ దరువుల మధ్య ఈ పులి వేషం లయబద్ధంగా కదులుతూ అభినయంతో పెద్ద పులాట మనలను కట్టిపడేస్తుంది.
పెద్దపులి వేషం మగవారే వేస్తారు. ప్రదర్మంలో ఇద్దరు నుండి అరుగురు వరకు కూడా పాల్గొంటారు. పెద్దపులాట అదే కళాకారులకు మేకప్ వారు రంగులు వేస్తారు. ఈ రంగులు చేయడంలో సిద్ధాపురం మేకప్ మెన్ అంతర్వేది సూర్యనారాయణ 50 సంవత్సరాలనుండి అనుభవం గడించారు. పెద్దపులి వేషానికి రంగులలో మేకప్ చెయ్యడం ఒక ఎత్తు. పులాట కళాకారునికి మేకప్ చెయ్యాలంటే తన సర్పం ఆరుషనర్లు రాతి గరిథంలో పులి కళాకారునికి మేకప్ చేసేవారు. అతరువాత నాలుగు గంటల నుండి కాడు సంగు రాళ్లను నూరి వారి తలలు వేసి పసుపురంగు, నల్లటిరంగులను తయారు చేసేవారు ఈ రంగులు పూసేటప్పుడు కళా దేహం తొలగులు వేస్తారు మార్కెట్లో వేపానికి సంబందించిన రంగులు దొరుకుతున్నాయి.
సంస్థానాన్ని ఏలిన శ్రీ వత్సవాయి అమ్ముంగజ వలె మహారాజు ప్రోత్సహించి దీనికి గొప్ప ప్రాచుర్యాన్ని తీసుకువచ్చాడు పెద్దపులాట ఈనాడు. మనడు మన ముధ్య జరిగే ఉత్సవాలలోను, వీర్ల సంబరాలలోను, జాతరలలోను కనిపిస్తూ ఉంటుంది. శినుండి 10 కప్పులు వివరీతంగా మాగుతుంటే నాలుగు తాసాలు బకాయి, రామడోలు వినిపిస్తుంటే మధ్యలో క్లారినేట్ ఒకటి చక్కటి స్వరాలు పలుకుతుంటే దరువుల మధ్య ఈ పులి వేము లయబద్ధంగా కదులుతూ అభినయంతో కూడిన పెద్ద పులాట మనలను కట్టిపడేస్తుంది.
పెద్దపులి వేషం మగవారే వేస్తారు ప్రదర్శనలో ఇద్దరు నుండి తిరుగురు వరకు కూడా పాల్గొంటారు. పెద్దవులాట అడే కళాకారులకు మేతస్ వారు రంగులు వేస్తారు ఈ రంగులు వేయడంలో పెద్దాపురం మేకప్ మెన్ అంతర్వేది సూర్యనారాయణ 50 సంవత్సరాలనుండి అనుభవం గడించారు. పెద్దపులి ఇట ఒక ఎత్తయితే ఈ వేషానికి రంగులలో మేకప్ చెయ్యడం ఒక ఎత్తు. పులాట కళాకారునికి మేకప్ చెయ్యాలంటే నాలుగు గంటల నుండి ఆరు గంటలు పడుతుంది పూర్వం ఆకుపసర్లు, రాతి గంథంలో పులి కళాకారునికి మేకప్ చేసేవారు. ఆతరువాత రంగు రాళ్లను మారి వార్నెస్, వాడే అయిల్, కర్పూర తైలం వేసి పసుపురంగు, నల్లటిరంగులను తయారు చేసేవారు. ఈ రంగులు పూసేటప్పుడు. ళాకారులకు రోమాలను తొలగించి వేస్తారు. ప్రస్తుతం మార్కెట్లో వేషానికి సంబంధించిన రంగులు దొరుకుతున్నాయి.
పులి వేషానికి పెద్దపులి ముఖంలా తయారు చేసిన ముసుగును రంగులు వేసుకున్న కళాకారుడు తన ముఖానికి తగిలించుకుంటాడు. ఈ పులి ముసుగు లేదా పెద్దపులి తల తయారీ పూర్వం జంతు తోలుతో తయారు చేసేవారు. ప్రస్తుతం మేకప్ కళాకారులు అచ్చంగా పులిలా వుండే మునుగును తయారు చేస్తున్నారు. పెద్దపులి తల తయారీకి కళాకారుని శరీర ఆకారాన్ని బట్టి జిగురు మట్టితో తలలా తయారు చేస్తారు దానిపై భాగంలో కాగితాలు చట్టంగా మైదా పిండితో పొరలు పొరలుగా అతికిస్తారు. దానిని ఎండలో పెట్టినండు మూడు రోజులు ఆరనిస్తారు లోపల. మట్టిని తీసివేసి చింతపిక్కల పొడుం ఉడకబెట్టి, రంపం పొట్టు, కలిపి పులి తలకు ముక్కు, చెవులు, కళ్ళు, నోరు, నాలుక కనుబొమ్మలు, పళ్ళు వగైరా రూపాలను తీర్చి దిద్దుతారు. గుర్రం తోక వెంట్రుకలను పులి మూతి చుట్టూ అతికిస్తారు. స్ప్రింగు వైదుకు గుడ్డ చుట్టి రంపం పొట్టు. చింతపిక్కల గుజ్జుతో తోక తీర్చిదిద్దుతారు. చేతి వంజలు తోలుతో కుట్టించి ఎద్దు కొమ్ము చివర పుల్లిగోల్లుగా చెక్క ఈ తోలుకు ఆగిలిస్తారు. ఈ 'చేతులను పులి కళాకారులు రెండు చేతులకు మోచేతి వరకు తొడుగుకుంటారు. ఈ మొత్తం వేషధారణ నిజమైన పులిలా కనిపిస్తుంది..
పులికి, పులిని చంపిన వాడికి మధ్య జరిగే యుద్ధాన్ని ఈ పెద్దపులాట ద్వారా అందరూ ఆసక్తిగా చూస్తారు ఈ పెద్దపులాటలో సాహన, క్రీడలు కూడా ఉంటాయి పులి మేకను వేటాడి తని నోటితో ఎత్తి దూరంగా విసిరిపారేయడాన్ని కళాకారులు తమ నోటిలో లాఘరంగా చేసి చూపడం ఆశ్చర్యానుభూతులను కలిగిస్తుంది. ఇంకా నోటితో నిండుగా ఉన్న నీళ్ళ బిందెను పళ్ళతో కరిచిపెట్టి పైకి లేపడం, కొన్ని ప్రాంతాలలో సిట్టింగులా చెట్లకొమ్మలను చెట్లగా నాటి వాటి మధ్య పులి, మనిషిని వేటాడం వంటివి కూడా హృదయాన్ని ఆకట్టుకునే విధంగా ఈ ప్రదర్శనలుంటాయి.
ఈ పులాటకు మేకప్ కళాకారులు అంతర్వేది వంటి గుర్తులసుబ్బారావు పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నారు. సంచారు వెంకన్న పులాట కళాకారునిగా మన ఆంధ్రదేశంలో ప్రఖ్యాతి చెందారు మీరు కళాకేందు ఈగల బంగార్రాజు కూడా ప్రజలు మన్ననలు పొందుతున్నారు. పగటిపూటి పిల్లలకి మంచి సం కళారఈవేశం
శక్తి వేషం
భయానక రసాన్ని అద్భుతంగా మనకళ్లముందు ప్రదర్శించే కళారూపాలలో శక్తి వేషం ఒకటి కాళికా మాత శక్తి రూపాన్ని ధరించి రాక్షసుణ్ణి లేదా మాంత్రికుడిని మనమధ్యన కకలావికలంగా పరిగెత్తించి కింద పడేసి తనచేతిలోని త్రిసూలంతో పొడవడం అనే కథాంశంగా ఈ ప్రదర్శన సాగుతుంది. జాతరలు, సంబరాలలో ఈ శక్తి వేషం మనకి కనబడుతుంది. సత్తెమ్మ, మరిడమ్మ, నూకాలమ్మ, సంబరాలు జరిగే పెద్దాపురం, కాకినాడ, కాండ్రకోట, చింతలూరు వంటి దేవతల సంబరాలు జరిగే చోట ఈ ప్రదర్శనను మనం తిలకించవచ్చు. శక్తి వేషం కట్టే కళాకారుడు అజానుబాహుడై ఉంటాడు. ఇందు ముందు ఆరడుగులపైగా వుండి బలిష్టంగా వున్న వ్యక్తి తనముఖాన్ని
కాళికామాతలా మేకప్ చేసుకుంటాడు. నోటిలో నుండి ఎర్రని నాలుక బయటకు వచ్చినట్లు రేకుతో చేసిన నాలుకను పళ్ళ కింద బిగించుకుంటాడు. కోరపళ్ళను రంగులతో అటూ ఇటూ దిద్దుకుంటాడు. పొడవైన వెంట్రుకలు కలిగిన జత్తును విరగబూసుకున్నట్లు విగ్గు పెట్టుకుంటాడు. దానిపై రేకుతో చేసిన కిరీటం పెట్టుకుంటాడు. నుదిటిపై ఎర్రని పొడవైన బొట్టు ఉంటుంది. నల్లని కాటుకను కనుబొమ్మలకు కళ్ళ కింద పెట్టుకుంటాడు. ముఖానికి రామనీలా రంగును పులుముకుని అదేరంగుగల సాగే బనేమను చేతుల పొడవునా మొత్తం శరీరమంతా వేసుకుంటాడు. మెడలో నిమ్మకాలదండలు వేసుకుంటాడు చేతిలో త్రిశూలం రేకుతో చేసినది పట్టుకుంటాడు. సడుముకు జనపనార లేదా, వేపరొట్టలు చుట్టూ కుట్టుకుంటాడు. కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటాడు. మెడలో రేకు డబ్బాలను లేదా ప్లాస్టిక్ డబ్బాలను వంగ కొట్టి వాటికి తెల్లటిరంగు పులిమి పుర్రెల్లాగా వ్రేలాడేసుకుంటాడు. దీనికి ఆరు చేతులు కలిగిన కళ్ళను గిర గిరా తిప్పుతూ నాలికను వేగంగా కట్టుకుంటాడు. ఆడిస్తూ డప్పుల మోతకు తగినట్లు ఊగుతూ ఒక్కసారిగా జనాలను జడిపిస్తూ ప్రదర్శన చూసేవారు భయంతో పరుగులు తీయవలసిందే.
ఈ శక్తి వేషంతో పాటు సహకవేషాలుగా మాంత్రికుడు నాట్యకత్తిలుకుగా ఉంటారు. మొత్తం కళారూపాన్నీ పరుషులే వేస్తారు. మాంత్రికుడు ఒత్తుగా ఉన్న చిలిపిరి జత్తును పెట్టుకుంటాడు. ముఖానికి ఎర్రని తెల్లని రంగు రంగు చీరలు పూసుకుంటాడు నల్లటి నిలువు అంగీవేసుకుని చేతిలో వేపరొట్టలు మెడలో శక్తి చేషంలోలాగా పుర్రెల దండ వేసుకుంటాడు. నాట్య కత్తిలుగా నలుగురు మగవాళ్ళు సింగారించుకుని ఆడవారివలె చక్కగా డప్పులు, తానా వాయిద్యాలకు అనుగుణంగా నాట్యం చేస్తు ఉంటారు. ఆశ్చర్య పోవలసిందే వారి మధ్య మాంత్రికుడు శక్తి ముందుకు. వేపరొట్టలు ఝుళిపిస్తూ వెడుతూ మరలా వెనక్కి వస్తూ ఉంటే శక్తి వేషం ఊగుతూ, ఉంటుంది. మాంత్రికుడు దగ్గరకు రాగానే శక్తి వేషం శూలం ఎత్తి కనులు ఎర్రగా చేసి నాలిక ఆడిస్తూ మాంత్రికుడుని తరుముతూ భీకరంగా చుట్టూ పరిగెత్తుస్తుంది. అంతలోనే మరలా శాంతించి దప్పుల మోతలకు అనుగుణంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంది. ఈ శక్తి వేషానికి అనుబంధంగా ఎలుగుబంట్లు వేషం కూడా కడతారు. గొల్లప్రోలుకు చెందిన నేరూరి అప్పారావు, గుర్రల అప్పారావు ఈ శక్తి వేషాన్ని గత పది సంవత్సరాల నుండీ కడుతూ పిఠాపురం పరిసరప్రాంతాలలో మంచి పేరు సంపాదించుకుంటూ ఇతని బృందంలో మాంత్రికుడిగా పొట్లకాయల చిట్టిబాబు, నాట్యకరైలుగా సప్పారపు యాకోబు, పొట్లకాయల సుబ్రహ్మణ్యం, పొట్ల కాయల రత్నకుమార్, దాకీ సింహాచలం ఉంటూ ఈ శక్తి వేషాన్ని రక్తి కట్టిస్తున్నారు.
Thursday, January 8, 2026
సంసోను ఆధ్యాత్మిక అంధకారం(ఏకపాత్ర)
రచన : శ్రీ ఎస్.బెస్. జాన్స్ న్
స్వయంకృతం... స్వయంకృతం... నజీరు సంసోనుకు ఈ దుస్థితి స్వయంకృతం.. స్వయంకృతం/ ఆహ్....... సంకెళ్ళు, సంకెళ్ళు.. ఇశ్రాయేలీ జనాంగములోని మహాబలిశాలి సంసోనుకు సంకెళ్ళు, సంకెళ్ళు.... సంకెళ్ళు/ కబోధి, కబోధి..... దాను వంశీయుడు, న్యాయాధిపతి సంసోను ఈరోజుకబోధి కబోధి, సంసోను కబోధి/ ఆహ్..... ఆహ్..... అపహాస్యం, అపహా స్యం... ఓరి పిరికి ఫిలిస్తీయులారా అపహాస్యం చేస్తున్నారా..... మీ దేవాలయంలో సంబరాలు చేసుకుంటున్నారా? ఎందుకురా మీ నవ్వులు ఏమి సాధించారని సంబరాలు చేసుకుంటున్నార్రా? దొంగదెబ్బ తీసి, బంధిం చినందుకురా మీ సంబరాలు?/ సిగ్గులేని జనాంగమా నాదేవదేవుని పట్ల నేను చేసిన మహాపరాధ ఫలితమే ఈ దుస్థితే గాని, మీ దేవత గొప్పదనంరా, మీదేవత గొప్పతనము రాఇది?/
మీ దేవత గొప్పతనం. అనా మీ ప్రగల్భాలు? నా దేవదేవుని శక్తి ముందర... నా దేవదేవుని శక్తి ముందర, మీ దేవతలు ఏ పాటివిరా? మూర్ఖులారా! వాటి శక్తి ఏ పాటిదిరా? నా దేవుని శక్తి ముందు./
అయ్యో.... అయ్యో... ఈదుస్థితి, ఈ దుస్థితి. పాపానికి అమ్ముడుపోయి న పాపినైన నాకు ఆ దేవదేవుడు వేసిన శిక్షరా ఇది? ఆ దేవదేవుడు వేసిన శిక్ష. / ఆజ్ఞాతిక్రమం మహాపాపమని తెలిసి మధాందుడనై నా ప్రభువు పట్ల చేసి మహాపరాధ ఫలితమేరా ఇది ఆ ప్రభువు పట్ల చేసిన మహాపరాధ ఫలితమే./ ఓరి న్నతి లేని జనాంగమా అపుడే మరిచిపోయి నవ్వుతున్నారా? అప్పుడే
-
క్రైస్తవ మతాన్ని బిజెపి, ఆర్. ఎస్ .ఎస్ భారతదేశం నుండి పారద్రోలతాయనడం అనడం ఓ పెద్ద గ్లోబల్ ప్రచారం. క్రైస్తవులలో ఉన్న ఈ నమ్మకం అతి పెద్ద అప...
-
చరవాణి, ముఖపుస్తకం లో మునిగిపోయిన కుటుంబాలు అనుబందాలు ఆప్యాయతలుశూన్యం తనదికాని లోకాన నోరుజారి నాలిక కరుచుకున్న జీవితం ...
-
నీలి మేఘం (జనశ్రీ) తుషార బిందువులు కవితా సంపుటి నుండి పువ్వల్లే వికసించావు నవ్వల్లే నవ్వించావు కలలల్లే కవ్వించావు పలుకరించుమా ప...


