పగటి వేషం
నన్నెతకం నవలాదూపాలలో సగటి వేషం ఒకటి తెలుగులో వేషం వేయడమంటే పాత్రకు తగినట్లుగా అలంకరణ చేసుకోవడం నగటిపాటి నగటి పూటనే గ్రామాలలో తాము ప్రదర్శించనున్న వేషాన్ని ఎన్నుకుని అభినయించడం. ఇది ప్రాచీన కాలంలో ఎంతో ప్రజాధనం పొందిన కళ పగటి వేషాలు అనే దూటలోనే బహువచనం ఉంది. నలుగురు లేక ఐదుగురు ఒక పరాణకథను ఎన్నడ బభినయిస్తూ ఇంటి ఇంటి ముందు మూడు నాలుగు రోజుల దాకా ప్రదర్శిస్తారు ఇంటిలోని వారే వీరికి ప్రేక్షకులు.
తెలుగువాని అపూర్వ జానపద కళా సంపదలోని పగటి వేషం యొక్క అవిర్భావ కాలాన్ని నిర్ణయించే చాటి ఆధారం లభ్యం కాని పోయినా తెలుగు సాహిత్యంలో ఇది ప్రస్పుటంగా కనిపిస్తుంది. దీనికి వేముల వాడము కట్ సాక్ష్యం ఇతని కాలం క్రీ. శ 1121 ప్రాంతంగా నిర్ణయించబడింది. వేముల వాడ భీమకవి కళాంగ రాజావారి వెళ్ళాడు. కళింగ రాజు గంగుకు తను వచ్చిన సంగతి కబురంపాడు రాజు. వేముల వాడ మతని భాదను పట్టించుకోకపోవడంలో కోపోద్రేకుడైన భీమకవి కళింగ గంగును శపిస్తాడు. శాపం తగిలిన గంగుసు శత్రురాజులు దండిత్తి వచ్చి పోడిస్తారు కళింగ గంగు పారిపోయి బికారిగా తయారయ్యి వీడుల వెంట తిరుగుతూ ఓపాతర గోతిలో పడి ఏడుస్తుంటారు. ఇంతలో అలుప్రకగా పోతున్న వేముల వాడే భీమకవి కలింగ గంగు పరిస్థితి గమనించి జాలిపడి శాపతిమాచన కలిగిస్తాడు.
శాప విముకుడైన కళింగ గంగు దారినపోతున్న పగటి వేషగాళ్ల గుంపులో చేరతాడు. వారు తిన్నగా కళింగ దేశం చేరి అక్కడ పరిపాలిస్తున్న రాజు దగ్గత ప్రదర్శన ఇవ్వ గోరతారు. అక్కడి రాజు తన చేతిలో ఓడి పోయి పారిపోయిన కళింగ గంగు వేషం వేసుకుని పగటి పూట రమ్మంటాడు జగుంపులోని కళింగ గంగు తానే ఆ వేషం కట్టి పగటిపూట ప్రదర్శన యిస్తూ రాజు ముందుకు నెడతాడు. ప్రదర్వన చేస్తూ రాజును సమీపించి ఒక్క వేటున అతని శిరస్సును నరికి తిరిగి రాజవుతాడు. తెలుగు సాహిత్యంలో మొదటిగా పగటి వేషం ఇలా కనిపిస్తుంది.
ప్రాచీసతి గలిగిన జానపదకళ 20వ శతాబ్ది తొలి దశలో కూడా దేదీప్యమానంగా వెలిగింది. మైసూరు నుండి వచ్చిన తెలుగు బ్రాహ్మణుడు శ్రీ జిల్లా వరుఘుల వెంకటరామయ్య గారు తన పరివారంలో ఆంధ్రదేశం వచ్చి కృష్ణా జిల్లా వీరంకిలాకు దగ్గర హనుమంతాపురం రగ్రహారంలో అయ్యంగాళ్లు అనే పీఠాన్ని స్థాపించి పగటి వేషాలు నేర్పేవాడు. కష్టాతికష్ట మయిన విద్య ఆంధ్రదేశమందు కూచిపూడి వంశాలలో తొలుత అవతరించిందనికూడా చెప్పుకుంటారు. గోదావరి మండల యండలి కాకపుర్రు గ్రామం ఈ విద్యకు ప్రసిద్ధి చెందింది.
పగటి వేషాలు రెండు రకాలుగా కనిపిస్తాయి. 1 రామసవేషం 2 సాత్వీకవేషం ఈ వేషాలను బ్రాహ్మణులే కాకుండా యాదవులు. బంగాలవారు, విశ్వబ్రాహ్మణులు, తదితర ఇతర కులాలకు చెందిన వారు కూడా అభ్యసించి ప్రదర్శనలిస్తున్నారు. ఈపగటి వేషాలలోని ప్రక్రియ ముఖ్యంగా వేషంలో భాషలో, నడకల్లో, చేష్టల్లో లోకంలోని కొందరిని అనుకరించడం. గొప్పగా ఆరూపంలోని అతుక్కుపోవడమే ప్రత్యేకత ఆయా వేషాల ద్వారా సామాన్యులకి సంఘంలోని దురాచాల్ని గెలిగింతలు పెట్టి హాస్యంతో వ్యంగ్యంగా ఎత్తి చూపించడం యిందులోని ఉన్న మౌలిక సూత్రం వినోదం, విజ్ఞానం కలిగిన ఈ వేషాలను మగవాలేళ్ళవేస్తారు.
పగటి వేషాలు 32 వరకు ఉన్నాయి. వీనిలో బుడబుక్కలు, లంబాడీలు, చోడెమ్మలు, సోమయాజులు, సోమి వేదుల వాళ్ళు, దేవమ్మ, భద్రోజులు, గొల్లపాలుడు, మందుల వాళ్లు, సాకాని వైష్ణువులు, పిట్టలదొర, కొమ్మ దాసుడు. బారీ బైరాగి, సిద్ది కంపెనీ, అర్థవారివ్వ శక్తి బేతాళ దేవరపిట్టి మొదలైనవి సుప్రస్తి వేషాలు. ఈ పగటి వేషాల ప్రదర్శనకు సంగీతం, నృత్యం, వాచికం, ధన్యనుకరణ (మిమిక్రీ), అభినయా వంటివి. వన్నె తెచ్చే అంశాలు హార్మోనిస్ట్, వాయిద్య కారులు వారి వెంట తిరుగుతూ వాయిద్య సహకారాన్ని అందిస్తారు. గ్రామాల్లో ప్రజలతోపాటు ఆయా పాత్రలకు సంబంధించిన వారు కూడా ఆనందించి పగటి వేషాగాత్మకి కానుకలు ఇస్తారు. వారమంతా ప్రతీరోజూ వేషం గట్టి తిరిగిన ప్రదర్శనకారులు ఆఖరిరోజు ప్రతీ ఇంటికీ తిరిగి కానుకలు అర్పిస్తారు.
రాజమండ్రికి చెందిన విభూది భూనీ లింగం ఈ ప్రదర్శనల జనరజలకంగా ప్రదర్శిస్తూ ఈకళ అంతరించి పోకుండా కాపాడుతూ ఉన్నారు. ఈ కళను నమ్ముకుని రాజమండ్రి పెద్దాపురం తదితర ప్రంతాలలో కళా కారులు జీవిస్తూ ఉన్నారు, వీరు సంక్రాంతి పండగలప్పుడు, ఈ వేషాలను కడుతూ కనిపిస్తారు. నిజానికి ఒకనాడు మన పల్లె జనాలకి విజ్ఞానాన్ని అందజేసినవి చాలా వరకూ ఈ జానపద కళారూపాటే. ఇప్పుదిని ఆదరణ లేక క్షీణదశకు చేరుకున్నాయి. వీనిని పునరుద్ధరించడం అంటేమన సంస్కృతిని పునరుద్ధరించుకోవడమే దీనికి ప్రజలు. ఆయా! రంగాలలోని కళాకారులు బాధ్యత తీసి పరిరక్షించాలి. మన సంస్కృతీ చరిత్ర కోసమన్నా వీటిని విడియోలలోని, కేసెట్లలోను భద్రపరచాలి. భావితరాల వారికి కనీసం మ్యూజియం వస్తువుగా నైనా అందజేయడం మనందరి ముందున్న కర్తవ్యం.
No comments:
Post a Comment