Wednesday, July 14, 2021

ఆంధ్రజ్యోతి ఛానల్ లో అన్నగారి లైఈ రోడు

 



ఈరోజు సాయంత్రం 7:00 నుండి 7:30 వరకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీలో మందకృష్ణ మాదిగ ఏబీఎన్ వెంకటకృష్ణ గారు తో లైవ్ డిబేట్ దయచేసి అందరికి షేర్ చేయండి#14/07/2021

Sunday, June 27, 2021

శ్రీనివాస పిళ్ళై


 శ్రీనివాస పిళ్లై తండ్రి మునియపిళ్లై. ఆనాడు మదరాసులోని అత్యంత ధనవంతుల్లో ఒకడు. 1807లో కరువు వచ్చినపుడు వారిని ఆదుకునేందుకు ఈస్టిండియా కంపెనీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో తొమ్మిది మంది దేశీయు లున్నారు. అందులో మునియపిళ్లై ఒకరు. తండ్రి సంపాదించిన ఆస్తిలో చాలా వరకు శ్రీనివాస పిళ్లై విద్యావసరాలకు వెచ్చించిండు.

శ్రీనివాస పిళ్లై జూలై 5, 1849లో వీలునామా రాస్తూ చెంగల్పట్‌ జిల్లా మణిమంగంళం తాలూకాలో తమ 'మేట తొడుకాడు' ఎస్టేట్‌లో ఉన్న 1500ల కానీలు (ఒక కానీ 1.322 ఎకరాలకు సమానం) భూమిని పచ్చియప్ప చారిటీస్‌ ట్రస్ట్‌కు రాసిచ్చిండు. అంతేగాకుండా ఇందులో ఎనిమిదోవంతు ఫండ్స్‌ని పేద బ్రాహ్మణేతర విద్యార్థులకు స్కాలర్‌షిప్‌గా ఇవ్వాలని అందులో పేర్కొన్నాడు. ఆ మేరకు ఆయన కుటుంబంలోని వారు అర్హులైన వారిని ఎంపిక చేసేవారు. దేశంలో బ్రాహ్మణేతరుల విద్య కోసం పాటుపడిన మొదటి వ్యక్తి శ్రీనివాసపిళ్లై. వారి కోసం ఏకంగా ఒక ట్రస్టుని ఏర్పాటు చేసి దానితరపున కింది కులాల వారి విద్యకు కృషి చేసిండు. ఇది అప్పటికి విప్లవాత్మక చర్యగా గుర్తించాలి.

అవును పేద బ్రాహ్మణేతర విద్యార్థులకు అవార్డులివ్వాలని 1849లోనే శ్రీనివాస ప్ళి వీలునామా రాసిండు. పిళ్లై కూడాబ్రాహ్మణేతరుడే. బహుజనుడు. శ్రీనివాస ప్ళి 21 జనవరి 1804 నాడు మదరాసులో జన్మించిండు. దిగవల్లి శివరావు ఈయన 1852లో చనిపోయిండని కాశీయాత్ర చరిత్రలో పేర్కొన్నాడు. నిజానికి పిళ్లై 27 మార్చి 1853 నాడు చనిపోయిండు. ఈయన యాదవ కులంలో జన్మించిండు.

ఇట్లా ఒక సంపన్న యాదవ కులంలో పుట్టి చదువుకొని, 1830వ దశకంలోనే పేదవారి విద్యాభ్యాసం కోసం అహరహం కృషి చేసిండు. వితంతు వివాహాలను ప్రోత్సహించిండు. గాజుల లక్ష్మీనరసు శెట్టి, ఎం.వెంకట్రాజులు నాయుడు, తదితరులతో కలిసి మదరాసు కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలకు ఊత మిచ్చిండు. ఇంకా చెప్పాలంటే 1830-1853 మధ్య కాలంలో శ్రీనివాస పిళ్లై లేకుండా మదరాసులో ఎలాంటి ప్రజాహిత సామాజిక, రాజకీయ కార్యక్రమం జరగలేదంటే అతిశయోక్తి కాదు. బహుశా మొత్తం భారతదేశంలో కింది కులాల వారి విద్య కోసం పరితపించిన వారిలో శ్రీనివాస పిళ్లై మొదటి వాడు. ఆయనకు నివాళి.

సంగిశెట్టి శ్రీనివాస్‌

Sunday, April 18, 2021

సర్దార్ గౌతు లచ్చన్న జీవిత చరిత్ర

 



🙏 *జోహార్ సర్ధార్ గౌతు లచ్చన్న*🙏                                             🔥 *ముల్కీ నిబంధనల రద్దు ముఖ్యమా? ముఖ్యమంత్రి పదవి ముఖ్యమా? అని అడిగితే ముల్కీ నిబంధనల రద్దే ముఖ్యమన్న!  తెలుజాతి ముద్దు బిడ్డ...💪                                                                                                 🔥 జై ఆంధ్ర ఉద్యమం చేపట్టిన యోధుడు💪                                                                              🔥 1938 లోనే రైతుల కష్టాల పై సిక్కోలు నుండి చెన్నపట్నం(చెన్నై) వరకు 2400 కిలోమీటర్ల సుదీర్ఘ రైతు రక్షణ మహా పాదయాత్ర  చేసిన రైతు బాంధవుడు💪*                                                   🔥 *భారత దేశంలో సర్దార్ బిరుదాంకితులలో ప్రముఖుడు💐*                                        🔥 *ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు స్వర్గీయ సర్ధార్ గౌతు లచ్చన్న గారి వర్దంతి..(19/04/2006)సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ...*.                                         👏👏👏👏👏👏👏👏👏👏👏         ---------------------------------------------                          ♦️ *సర్దార్ గౌతు లచ్చన్న గారి జీవితం పై ఒక విశ్లేషణాత్మక సమచారం*                ---------------------------------------------                 👉జననం: *ఆగస్ట్-16,1909*   ---------------------------------------           👉స్థలం: *నాటి గంజాం జిల్లా&నేటి శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం,బారువ అనే గ్రామంలో*  -----------------------------------------------                         👉తల్లిదండ్రులు: *చిట్టయ్య, రాజమ్మ*                                       👉భార్య: *యశోదా దేవి*                    👉  పిల్లలు: *శ్యాం సుందర్ శి  వాజీ,ఝాన్సీ లక్ష్మీ,సుశీలా దేవి*  ---------------------------------------                                         👉చదువు: *మెట్రిక్యలేషన్*    ---------------------------------------------                            ♦️ *స్వాతంత్రోద్యమంలో       సర్దార్  గౌతు లచ్చన్న గారి   ప్రస్థానం*  ---------------------------------------------          🔥 *1930- ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం* ------------------------------------------               *21 సంవత్సరాల వయసులో* గాంధీజీ గారి పిలుపును అందుకొని ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం నడిపారు.                    *ఫలితంగా అరెస్ట్ అయ్యి టెక్కలి,నరసన్నపేట, బరంపురం లలో 70 రోజులు పాటు జైలు జీవితం గడిపారు*  ----------------------------------------------                         🔥 *1932-శాసనోల్లంఘన ఉద్యమం*              ---------------------------------------------          *23 సంవత్సరాల వయసులో* ఈ ఉద్యమాన్ని ఉధృతస్థాయిలో నడుపుచున్న *సర్దార్  గౌతు లచ్చన్న ను  అరెస్ట్ చేసి 6 నెలలు పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో నిర్బంధించారు*                        -------------------------------------------         🔥 *1938-రైతు రక్షణ మాహా పాదయాత్ర*  -------- ----------------------------------   *జమీందారి, ఇనాం వ్యస్థల రద్దు కోరుతూ  ----------------------------------------------                                సర్దార్  గౌతు లచ్చన్న గారు 29 సంవత్సరాల వయసులో*        ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో             బారువ(ఇచ్ఛాపురం) నుండి మద్రాస్ వరకు  *2,400 కిలోమీటర్ల  సుధీర్ఘ పాదయాత్ర* నిర్వహించి పెను సంచలనం సృష్టించారు       *ఫలితం:జమీందారి,ఇనాం వ్యస్థల రద్దు*       ---------------------------------------------     🔥 *1940*-సర్దార్ గౌతు లచ్చన్న గారి ఆధ్వర్యంలో పలాస లో *ఆల్ ఇండియా కిసాన్ సభ ను నిర్వహించారు*                         -----------------------------------------------   🔥 *అంటరానితనం పై కత్తి ఝుళిపించిన  సర్దార్ గౌతు లచ్చన్న*                            --------------------------------------------- సర్దార్  గౌతు లచ్చన్న నడిపిన *హరిజన సేవా సంఘాలు,హరిజన రక్షణ యాత్రలు* ప్రజలను బాగా ప్రభావితం చేశాయి.                     *రాత్రి పాఠశాలలు* నిర్వహించి బహుజనులు విద్యాభివృద్ధికి కృషి చేసారు.           *హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించుటలో* విశేష పోరాటం చేశారు.  -----------------------------------------------  🔥 *1942-క్విట్ ఇండియా ఉద్యమం* ----------------------------------------------   ఈ ఉద్యమ సమయంలో నాటి మద్రాస్ ప్రభుత్వం *33 సంవత్సరాల వయసున్న సర్దార్ గౌతు లచ్చన్న గారిని అతి ప్రమాదకరమైన వ్యక్తి గా ప్రకటించింది*                  వారి ఆచూకీ తెలిపిన వారికి *10,000/- బహుమానం ప్రకటించింది*                                 అతనిని పట్టుకోవడం సాధ్యం కాకపోతే కనిపిస్తే కాల్చి వేయండి అని *SHOOT AT SIGHT ఆర్డర్స్ ఇచ్చినది*                చివరికి ప్రభుత్వమే 1942 లో లచ్చన్న గారిని బంధించి *1945 అక్టోబర్ వరకు జైలులో(దాదాపు 3 సంవత్సరాలు)* ఉంచి తదుపరి విడుదల చేసినది.  --------------------------------------------- 🔥 *1948 లో *BACKWARD CLASSES CONFERENCE*   -----------------------------------------                                👉మొట్టమొదటిసారిగా  *గుంటూరు లో సర్దార్ గౌతు లచ్చన్న గారి ఆధ్వర్యంలో *BACKWARD CLASSES CONFERENCE* ను నిర్వహించారు.                                      తదుపరి అన్ని జిల్లాలు పర్యటించి ఆయా *జిల్లాల్లో BACKWARD CLASSES ASSOCIATIONS ను నిర్మించారు*      ---------------------------------------------   🔥 *1948-1983- సర్దార్ గౌతు లచ్చన్న గారు 5 సార్లు M.L.A గా ఒకసారి M.L.C గా సుదీర్ఘ కాలం చట్టసభలలో ప్రజా గొంతుకై  ప్రాతినిధ్యం వహించారు*   ----------------------------------------------    ♦️ *1953* టంగుటూరి ప్రకాశం పంతులు&బెజవాడ గోపాలరెడ్డి  గారి *మంత్రివర్గాలలో సర్దార్ గౌతు లచ్చన్న గారు రాష్ట్ర వ్యవసాయ,కార్మిక శాఖా మంత్రి గా పనిచేశారు*        ---------------------------------------------   🔥 *సర్దార్ లచ్చన్న గారు 1967 లో ఒకేసారి శ్రీకాకుళం జిల్లా నుంచి M.P గా,M.L.A గెలిచారు* ------------------------------------------                                              👉 తన రాజకీయ గురువు గారైన *ఆచార్య N.G.రంగా గారు* ఆ ఎన్నికలలో చిత్తూర్ నుండి MP గా పోటీ చేసి ఒడిపోవడంతో , *సర్దార్ లచ్చన్న గారు తన M.P పదవికి రాజీనామా చేసి రంగా గారిని  శ్రీకాకుళం నుండి MP గా గెలిపించుకొన్నారు*                      -----------------------------------------------   🔥 *1972-జై ఆంధ్ర ఉద్యమం-ముల్కీ నిబంధనలను వ్యతిరేకిస్తూ సర్దార్ గౌతు లచ్చన్న గారు పోరాటం చేశారు.     -------------------------------------------                 🔥  *1975- ఇండిరాగాంధీ గారు విధించిన ఎమర్జెన్సీని లచ్చన్న గారి నాయకత్వంలోవ్యతిరేకిస్తూ ఆందోళనలు*                  ఫలితగా సర్దార్ గౌతు లచ్చన్న గారిని *1975 అరెస్ట్ చేసి 1977 లో ఎమర్జెన్సీ ఉపసంహరణ అనంతరం విడుదల చేశారు*        ----------------------------------------------   ♦️ *1978- సర్దార్ గౌతు లచ్చన్న గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ లో ప్రతిపక్ష నేత గా వ్యవహరించారు&పబ్లిక్ ఆకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు*     ---------------------------------------------   ♦️ *1997-ఆంధ్రా విశ్వవిద్యాలయం వారు సర్దార్ గౌతు లచ్చన్న గారికి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు*                           *1999-ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు సర్దార్ గౌతు లచ్చన్న గారికి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు*        --------------------------------------------  ♦️ *2001*- *సర్దార్ గౌతు లచ్చన్న గారి *ఆటోబయోగ్రఫీ*                    🙏 *నా జీవితం* పేరుతో ఆవిష్కరించారు.   ----------------------------------------------   ♦️ *2006,ఏప్రిల్-19  న సర్దార్ గౌతు లచ్చన్న గారు 97 సంవత్సరాల వయసులో మరణించారు*       -------------------------------------------  🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Wednesday, April 14, 2021

ARTOZ DRINK

 శతవసంతాల 'ఆర్టోస్‌'





ఎన్నేళ్లయినా ఈ శీతల పానీయానికి అదే క్రేజ్‌

ఉగాది పర్వదినాన ప్రారంభమైన రెండో యూనిట్‌

ఆర్టోస్‌.. ఇది పక్కా లోకల్‌.. ఈ సాఫ్ట్‌ డ్రింకు ఒక్కసారి తాగితే చాలు.. జిహ్వ 'వహ్వా' అనక మానదు. ఆ రుచి మళ్లీ మళ్లీ కావాలని కోరకా మానదు. 'రామచంద్రపురం రాజుగారి డ్రింకు'గా పేరొందిన ఈ శీతల పానీయం గురించి తెలియనివారే ఈ ప్రాంతంలో ఉండరంటే అతిశయోక్తి కానేకాదు. కార్పొరేట్‌ కూల్‌డ్రింక్‌ కంపెనీలు ఎన్ని వచ్చినా.. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం 'ఆర్టోస్‌' వందేళ్లకు పైగా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఈ ఉగాది సందర్భంగా విస్తరణ బాట పట్టిన ఈ సంస్థ..

మరిన్ని రుచులతో సరికొత్త డ్రింకులు తయారు చేసేందుకు శ్రీకారం చుట్టింది.మూడు తరాల కృషి

ఆర్టోస్‌ పరిశ్రమ ఈ స్థాయికి రావడం వెనుక మూడు తరాల కృషి ఉంది. రామచంద్రపురం పట్టణానికి చెందిన అడ్డూరి రామచంద్రరాజు కాకినాడ కలెక్టర్‌ కార్యాలయంలో వృథాగా పడి ఉన్న గోలిషోడా మెషీన్‌ను 1912లో కొనుగోలు చేశారు. దానిని ఇక్కడికి తెచ్చి, విశాఖపట్నం పోర్టు ద్వారా ఇంగ్లండ్‌ నుంచి స్పేర్‌ పార్టులు తెప్పించి, మరమ్మతులు చేయించారు. ఆ మెషీన్‌తో పట్టణంలో గోలీసోడా తయారీకి శ్రీకారం చుట్టారు. అప్పట్లో గోలీసోడా ద్వారా వస్తున్న గ్యాస్‌ను చూసి ప్రజలు దానిలో భూతం ఉందని, ఎవ్వరూ తాగకూడదని చెప్పుకొనేవారు. దీంతో అప్పట్లో అంతంత మాత్రంగానే సోడాలు అమ్ముడు పోయేవి. అప్పట్లో రాజుగారు ఒక్కరే వెల్ల ప్రాంతం నుంచి తాగునీరు తెచ్చుకుంటూ సోడాలు తయారు చేసేవారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పట్టణంలో సేద తీరేందుకు వచ్చిన బ్రిటిష్‌ మిలిటరీ సైనికులకు ఈ గోలీసోడాను అందించేవారు. దీంతో ఇది మరింత ప్రాచుర్యం పొందింది.

1919లో రామచంద్రరాజు తమ్ముడు జగన్నాథరాజు తన చదువు ముగించుకున్న అనంతరం అప్పట్లో మద్రాసులో ప్రాచుర్యం పొందిన స్పెన్సెన్స్‌ డ్రింక్‌ తాగి, అటువంటి సాఫ్ట్‌ డ్రింక్‌ తయారు చేయాలని భావించారు. ఈ నేపథ్యంలో దానిని తయారు చేసే విధానాన్ని, ముడి సరకును లండన్, జర్మనీ ప్రాంతాల నుంచి రప్పించారు. అదే ఏడాది ఏఆర్‌ రాజు డ్రింక్స్‌ పేరుతో సాఫ్ట్‌ డ్రింక్‌ తయారీ ప్రారంభమైంది. ఒక్క నీరు తప్ప మిగిలిన ముడి సరకులన్నీ విదేశాల నుంచే దిగుమతి చేసుకునే వారు. ఈ డ్రింకులను అప్పట్లో తోపుడు బండ్లు, ఎడ్ల బండ్ల ద్వారా రాజమహేంద్రవరం వరకూ అర్ధణా నుంచి మూడు పైసలకు అమ్మేవారు. 1930లో సెమీ ఆటోమెటిక్‌ మెషీన్‌ అమర్చి మరింతగా డ్రింకులను మార్కెట్‌లోకి తీసుకువచ్చారు.

1955లో ఇంగ్లండ్‌ నుంచి పూర్తి స్థాయి ఆటోమెటిక్‌ మెషీన్‌ రప్పించారు. డ్రింక్స్‌కు 'ఆర్టోస్‌'గా పేరు మార్చారు. అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే అదే ఏడాది పేటెంట్‌ హక్కులు కూడా పొందారు. తరువాత ఆయన కుమారులు పద్మనాభరాజు, సత్యనారాయణరాజులు ఆర్టోస్‌ డ్రింక్‌ను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువచ్చారు. 1912 నుంచి ఇప్పటి వరకూ సుమారు ఆరుసార్లు డ్రింక్‌ రూపాంతరం చెందుతూ వచ్చింది. 1955లో 30 మంది సిబ్బంది ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య సుమారు 150కి పెరిగింది. అప్పటి నుంచీ మన జిల్లాతో పాటు విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా ఆర్టోస్‌ డ్రింక్‌ను పంపిణీ చేస్తున్నారు. ఈ కంపెనీకి మూడు జిల్లాల్లోనూ 100 మందికి పైగా డీలర్లు ఉన్నారు. ఇప్పటికే రామచంద్రపురం పరిసర గ్రామాలకు ఆర్టోస్‌ వాటర్‌ బాటిళ్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.


వందేళ్ల తరువాత రెండో యూనిట్‌
ఆర్టోస్‌ ఫ్యాక్టరీ వందేళ్లు పూర్తి చేసుకున్న తరువాత మూడో తరం వారైన ఆర్టోస్‌ బ్రదర్స్‌ అడ్డూరి జగన్నాథవర్మ, వీరభద్రరాజు, రవీంద్రలు పరిశ్రమలో అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో రెండో యూనిట్‌ను మంగళవారం ప్రారంభించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ చెలికాని స్టాలిన్, మంత్రి వేణు తనయుడు నరేన్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాధంశెట్టి శ్రీదేవి చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఇక నుంచి 1.25, 250, 200 మిల్లీలీటర్ల ప్లాస్టిక్‌ బాటిళ్లతో ఇప్పటి వరకూ అందిస్తున్న ద్రాక్షతో పాటు మ్యాంగో, లెమన్, ఆరెంజ్‌ ఫ్లేవర్లలో కూడా డ్రింకులు తయారు చేయనున్నారు. అలాగే సోడాలు కూడా తయారు చేస్తున్నారు.

రామచంద్రపురం: 'ఏంటీ గోలీ సోడానా? అయ్యబాబోయ్‌! ఎవ్వరూ తాగకండి. అందులో భూతం ఉంది' అంటూ ఒకప్పుడు అందులో నుంచి వచ్చే గాలికి జనం హడలిపోయే స్థాయి నుంచి.. 'ఆర్టోసా! ఏదీ మరోటి ఇవ్వండి తాగుతాం' అనే స్థాయిలో ఆర్టోస్‌ సాఫ్ట్‌ డ్రింక్‌ ప్రాచుర్యం పొందింది. దేశంలో ఎక్కడ ఏ డ్రింకులు తాగినా.. గోదావరి సీమకు వచ్చేసరికి మాత్రం ఆర్టోస్‌ తాగి వెళ్లాల్సిందే. అచ్చం ద్రాక్ష పండ్ల మాదిరిగానే ఉండే దాని రుచి చూడాల్సిందే.


Monday, February 1, 2021

పెదమేస్టారు

 అది 1874  మార్చి 12 కెనడియన్ బాప్టిష్ట్ మిషన్ (సి బి యమ్ ) మిషన్ కార్యక్రమాలు కాకినాడలో ప్రారంబించాలని జాన్ మెక్లారన్   సి బి యమ్ చర్చిని కాకినాడలో ప్రారంబించాడు. మెక్లారన్ పర్యవేక్షణలో మిషనరీలు చర్చిలే కాకుండా దానికి అనుబందంగా పాఠశాలలు, ఆసుపత్రులు  శర వేగంగా తూర్పుగోదావరి జిల్లా అంతటా వివిధ ప్రాంతాలలో స్దాపించారు.పిఠాపురం,కాకినాడ మెక్లారన్ హైస్కుల్ , సామర్లకోట, రామచంద్రపురం పేరు పడ్డాయి. పిఠాపురంలో మిషనరీలు పరిచర్య ప్రారంబించిన తొలినాళ్ళలోనే 1876 ఆగస్టు 23 తారీఖున   అగ్రహారం  బండిరేవులో నాగులాపల్లికి చెందిన తాతపూడి సుబ్బయ్య పిఠాపురానికి చెందిన మేరి నరస్సయ్య  జాన్ మెక్లారన్ దొర గారి చేతుల మీదుగా బాప్తీస్మము పొందారు.తాతపూడి సుబ్బయ్య భార్యది చేబ్రోలు  దొండపాటి వారి అల్లుడు. ఇతనికి ముగ్గురు కొడుకులు. 

అందరిలో పెద్దవాడు హానోకు . తమ్ముడు గుర్రయ్య ,మరో తమ్ముడు ( పేరు తెలియాలి). హానోకు భార్య శీలి మరియమ్మ . పండూరు స్వగ్రామం.మరియమ్మ సోదరుడు శీలి సామ్యేలు.  అంటురోగాలైన కలరా ,మసూచి  జనాలను పట్టి పీడిస్తున్న రోజులవి. మిషనరీలు ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి వైద్యసేవలు అందిస్తున్న గొప్పరోజులు. డేరాలలో వెైద్యసేవలుతో పాటు చర్చి నడిపేవారు. పిఠాపురంలో 1901 లో ఈటన్ దొర ఫీల్డ్ మిషనరీగా నియమించబడ్డాడు. స్మిత్ దొర 

ఆసుపత్రి సూపర్ డెంట్ గా నియమించబడ్డాడు. ఈ ఇద్దరి ఆధ్వర్యంలో పిఠాపురం పరిసర పరిసరప్రాంతాలలో విద్య ఆరోగ్యం, తో పాటు క్రైస్తవమత వ్యాప్తి ఊపందుకుంది. 1903 లో పిఠాపురం సి బి యమ్ ఆసు పత్రి  ఆ తరువాత కాలంలో ఇదే క్రీస్టియన్ మెడికల్ సెంటరు సి యమ్ సి ఆసుపత్రిగా పిలవబడుతుంది.1905 లో పిఠాపురంలోనే సి బి యమ్ చర్చిని నియమించారు. దీనికి మొదటి పాస్టరుగా 

రాచపల్లి అప్పలస్వామి నియమించబడ్డాడు.నాగులాపల్లిలో  సి బి యమ్ చర్చి నెలకొల్పాడు ఈటన్ దొర.

తాతపూడి హానోకు సామర్లకోట సి బియమ్ స్కూల్లో 8 వతరగతి వరకూ చదివి కాకినాడ సి బి యమ్ బోర్డింగ్ హాయ్యర్ గ్రేడు చదివి ఉపాధ్యాయవృత్తికి అర్హత సాధించాడు. పండూరు నుండి శీలి మరియమ్మ కూడా  8 వతరగతి పూర్తిచేసి

ఇదే చోట బోర్డింగ్ హర్యర్ గ్రేడ్ లో చేరింది. ఆ రోజుల్లో హయ్యర్ గ్రేడు ట్రైనింగ్ పొందాలంటే ఒక సంవత్సరం సెమినార్ లలో పనిచేయాలి. అలా పనాచేసేటప్పుడే హానోకు మరియ్యమ్మల మనస్సులు కలిసాయి. పెద్దల అంగీకారంతో పెళ్ళి కూడా జరిగిపోయింది. ఇద్దరి జంటనూ ఆశీర్వదించిన ఈటన్ దొర నాగులాపల్లి నుండి ఇద్దరినీ ఉప్పాడలో  పరిచర్య చేయమని చెపుతూ   పాఠశాల స్దాపించి 

తొలి ఉపాధ్యాయులుగా నియమించాడు. 

మొదటగా అమీనాబాదలో వీరు పాఠశాల స్దాపించారు. వీరిని పెదమేష్టారు. పెద పంతులమ్మగారని పిలుస్తూ ఊరంతా మురిసిపోయేది.




 అది 1874  మార్చి 12 కెనడియన్ బాప్టిష్ట్ మిషన్ (సి బి యమ్ ) మిషన్ కార్యక్రమాలు కాకినాడలో ప్రారంబించాలని జాన్ మెక్లారన్   సి బి యమ్ చర్చిని కాకినాడలో ప్రారంబించాడు. మెక్లారన్ పర్యవేక్షణలో మిషనరీలు చర్చిలే కాకుండా దానికి అనుబందంగా పాఠశాలలు, ఆసుపత్రులు  శర వేగంగా తూర్పుగోదావరి జిల్లా అంతటా వివిధ ప్రాంతాలలో స్దాపించారు.పిఠాపురం,కాకినాడ మెక్లారన్ హైస్కుల్ , సామర్లకోట, రామచంద్రపురం పేరు పడ్డాయి. పిఠాపురంలో మిషనరీలు పరిచర్య ప్రారంబించిన తొలినాళ్ళలోనే 1876 ఆగస్టు 23 తారీఖున   అగ్రహారం  బండిరేవులో నాగులాపల్లికి చెందిన తాతపూడి సుబ్బయ్య పిఠాపురానికి చెందిన మేరి నరస్సయ్య  జాన్ మెక్లారన్ దొర గారి చేతుల మీదుగా బాప్తీస్మము పొందారు.తాతపూడి సుబ్బయ్య భార్యది చేబ్రోలు  దొండపాటి వారి అల్లుడు. ఇతనికి ముగ్గురు కొడుకులు. 

అందరిలో పెద్దవాడు హానోకు . తమ్ముడు గుర్రయ్య ,మరో తమ్ముడు ( పేరు తెలియాలి). హానోకు భార్య శీలి మరియమ్మ . పండూరు స్వగ్రామం.మరియమ్మ సోదరుడు శీలి సామ్యేలు.  అంటురోగాలైన కలరా ,మసూచి  జనాలను పట్టి పీడిస్తున్న రోజులవి. మిషనరీలు ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి వైద్యసేవలు అందిస్తున్న గొప్పరోజులు. డేరాలలో వెైద్యసేవలుతో పాటు చర్చి నడిపేవారు. పిఠాపురంలో 1901 లో ఈటన్ దొర ఫీల్డ్ మిషనరీగా నియమించబడ్డాడు. స్మిత్ దొర 

ఆసుపత్రి సూపర్ డెంట్ గా నియమించబడ్డాడు. ఈ ఇద్దరి ఆధ్వర్యంలో పిఠాపురం పరిసర పరిసరప్రాంతాలలో విద్య ఆరోగ్యం, తో పాటు క్రైస్తవమత వ్యాప్తి ఊపందుకుంది. 1903 లో పిఠాపురం సి బి యమ్ ఆసు పత్రి  ఆ తరువాత కాలంలో ఇదే క్రీస్టియన్ మెడికల్ సెంటరు సి యమ్ సి ఆసుపత్రిగా పిలవబడుతుంది.1905 లో పిఠాపురంలోనే సి బి యమ్ చర్చిని నియమించారు. దీనికి మొదటి పాస్టరుగా 

రాచపల్లి అప్పలస్వామి నియమించబడ్డాడు.నాగులాపల్లిలో  సి బి యమ్ చర్చి నెలకొల్పాడు ఈటన్ దొర.

తాతపూడి హానోకు సామర్లకోట సి బియమ్ స్కూల్లో 8 వతరగతి వరకూ చదివి కాకినాడ సి బి యమ్ బోర్డింగ్ హాయ్యర్ గ్రేడు చదివి ఉపాధ్యాయవృత్తికి అర్హత సాధించాడు. పండూరు నుండి శీలి మరియమ్మ కూడా  8 వతరగతి పూర్తిచేసి

ఇదే చోట బోర్డింగ్ హర్యర్ గ్రేడ్ లో చేరింది. ఆ రోజుల్లో హయ్యర్ గ్రేడు ట్రైనింగ్ పొందాలంటే ఒక సంవత్సరం సెమినార్ లలో పనిచేయాలి. అలా పనాచేసేటప్పుడే హానోకు మరియ్యమ్మల మనస్సులు కలిసాయి. పెద్దల అంగీకారంతో పెళ్ళి కూడా జరిగిపోయింది. ఇద్దరి జంటనూ ఆశీర్వదించిన ఈటన్ దొర నాగులాపల్లి నుండి ఇద్దరినీ ఉప్పాడలో  పరిచర్య చేయమని చెపుతూ   పాఠశాల స్దాపించి 

తొలి ఉపాధ్యాయులుగా నియమించాడు. 

మొదటగా అమీనాబాదలో వీరు పాఠశాల స్దాపించారు. వీరిని పెదమేష్టారు. పెద పంతులమ్మగారని పిలుస్తూ ఊరంతా మురిసిపోయేది.


ALIVI