Thursday, April 9, 2020


నిను తరుముతుంది ఎవరు?
నువు రౌడీవి కదా
నువు గుండావి కదా
నువ్వే హంతకుడివి కదా
నిను తరుముతుంది ఎవరు ?
ఏవి నీ టాటా సుమోలు
ఏవీ  నీ కడప కత్తులు
ఏవీ నీ భూకబ్జాలు
ఏవు నీ దందాలు
చైనా వాడి కరోనా కత్తి
దొరుకుతుందట కావాలా ?
నిను తరుముతుంది ఎవరు ?
నువు పెద్ద రేపిస్టువి
నువు పేద్ద స్మగర్ వి
నువు పెద్ద గేంబ్లర్ వీ
నువు పెద్ద రోబర్ వి
నిన్నే తరుముతుంది ఎవరు ?
నీ చుట్టూ బౌన్స్ ర్లు నీ మాస్కు
చూసి జడుసుకుంటున్నారట
ఏమయ్యింది ! ఏం జరిగింది !
నువు పేద్ద  హీరోలకే హీరోవట
గాల్లోకి వందమందిసి తన్నేత్తావట
రైలును ఒంటిచేతితో ఆపేత్తావట
నీ ప్యాన్స్ నీ షేక్ హేండ్ అంటే
లగెత్తుతున్నారట ఏంజరిగింది !
నీ హోర్డింగ్లు నీ రిబ్బన్ కటింగ్లు
నీ శంకుస్దాపనలు నీ సంబరాలు
ఏవీ? ఏంజరిగింది  ! ఏం తరుముతుంది !
నీకేదో పదవి ఉందంట  పెద్ద పోటుగాడివట
నీ వీధిలో నీ ఊళ్ళో నీజిల్లాలో
ఊడబోడిచేస్తావట తెల్లారీ తెల్లారకుండా
నీ ఇంటి ముందు జనం నిలబడాలట
 ఏమయ్యింది నీ ఇల్లు శ్మసానంలా వుందంట
ఎవరో తరుముతుంటే లోపలేవున్నావట
చైనా ఓడి కరోనాకత్తి గిర్రన తిరుగుతుందట
కొంపతీసి దానికి జడుసుకున్నావా ఏంటి ?
మా పరువు పోద్ది సుమా
వద్దు వద్దు నువు పెద్ద పుడింగ్ వని తెలుసు
ఇప్పుడు వెనక్కి వెడితే బాగుండదు
కరోనాకు నీ మగతనం చూపించు
రా ముందికిరా నువు నా నాయకుడివి
నువు నా హీరోవి నువు నా రౌడీవి
నేను నీ అభిమానిని ప్లీజ్ ప్లీజ్ రా 
ఒక్కసారి కరోనాని కౌగలించుకో
సిద్దాంథపు బెన్ జాన్ సన్ ( జనశ్రీ )
ఉప్పాడ కొత్తపల్లి 
తూర్పు గోదారవి జిల్లా
9908953246


Thursday, April 2, 2020

పరమత సహనాల మేడ ఉప్పాడ

పరమత సహనాల మేడ ఉప్పాడ
పరమత సహనాల నీడ ఉప్పాడ

కొత్తపల్లి కొంగు బంగారం ఉప్పాడ
కాకినాడకు ఉపవాడ ఉప్పాడ

బంగాళాఖాతాన్ని ఆనుకున్న గోడ ఉప్పాడ
స్వాతంత్ర్య సమరాన ఠీవితో
నిలిచిన ఉప్పు ఓడ ఉప్పాడ
మగ్గాలలో పగ్గాలు లేకుండా 
అటు ఇటూ తిరిగే బీడ ఉప్పాడ
చూడచక్కని చేనేత చీరలోని
 వెండి జరీజాడ ఉప్పాడ
జాంథానీ చీరలోని అల్లికలజిలిబిలి
 చిత్తరువు ఉప్పాడ
కొత్తపల్లి కొబ్బరి పులుపుల తలుపు ఉప్పాడ

సముద్రపు అలలు మత్యపు వలలు
నిరంతరం తిరిగే రాట్నాలు
సువార్తల సువాసనలు
పట్టు వస్త్రాల తళతళ
చారిత్రిక సంఘటనల నిఘంటువు
కవికోకిల సన్నిధిరాజు కురవంజి
నటగాయక వైతాళిక ఉప్పాడ
మా ఉప్పాడ
పరమత సహనాల నీడ ఉప్పాడ



కరోనా కవిత ( ప్రజాశక్తి )

Wednesday, January 15, 2020

మా ఊరి కథలు 2 ( జనశ్రీ ) మా ఊరి నవాబు నాగూర్

మా ఊరి కథలు 2 ( జనశ్రీ )

మా ఊరి నవాబు నాగూర్

                     1950 ప్రాంతంలో ఉప్పాడ  సముద్రం హోరు ఎలా వుండేదంటే  ఇంటిలోనే కెరటం విరిగి పడిందా అనేంతగా వుండేది. క్రొత్తగా పొరుగూరు నుండి వచ్చిన చుట్టాలు ఆ శబ్దానికి హడలిపోయేవారు. ఎందుకంటే ఆరోజుల్లో చాలా నిశ్శబ్దంగా  ఉండేది ఊరంతా. వాతావరణ కాలుష్యం కానీ      శబ్ద కాలుష్యం గానీ ఉండేది కాదు. అందువల్ల కెరటాల చప్పుడే కాదు పిఠాపురం పేసింజరు రైలు కూత కూడా వినబడేది ఉప్పాడ వరకూ. ఉప్పాడ ఊరు నిండా తాటాకులు ఇళ్ళు ఉండేవి. అక్కడక్కడ  మాత్రమే బంగ్లా ఇళ్లు ఉండేవి.  మత్స్యకారులు అందరూ  పెద్దగా  సంపాదన లేకుండా  పేదరికంలోనే ఉండేవారు ఆ రోజుల్లో.




గంపల అప్పయ్యమ్మ, భూలోక మ్మ ఉప్పు చేపల వ్యాపారం చేసేవారు ఉప్పాడలో.  ధవళేశ్వరం, నక్కపల్లి ప్రాంతాలలో ఉప్పు చేపలు , ఎండు చేపలు పట్టుకెళ్లి వ్యాపారం చేసేవారు. వీళ్ళ కొడుకు గంపల అప్పారావు  గంపల అప్పారావు కు ఒకే ఒక్క కొడుకు నాగూరు .  ఇతనే మన కథా నవాబు .

తెల్లటి మల్లె పువ్వు లాంటి బట్టలు వేసుకుని మెడలో బంగారం గొలుసు, రెండు చేతులకూ ఉంగరాలు , నోట్లో రెడ్ హిల్స్  సిగరెట్  , అల్లంత దూరం వినబడే జావా బండి హారన్ ఉప్పాడ రోడ్డు మీద 1960 ప్రాంతంలో నాగూర్ హవా  పరిగెత్తింది.  ఉప్పాడలోని వారందరూ  నాగూర్ ని సెలెబ్రేటిగా చూసిన రోజులవి. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ అడ్రస్ ఆ రోజుల్లో  గంపల నాగూర్ .
ఉప్పాడ చేపల వ్యాపారానికి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చింది నాగూర్ అంటే ఎవరూ కాదనలేని సత్యం.
చిన్న చిన్న  ఉప్పు చేపలు,ఎండు చేపల వ్యాపారం చేసుకునే మత్స్యకారులుకు రొయ్యల వ్యాపారం నేర్పి ఉప్పాడ మత్స్యకారుల జీవితదశాదిశలను మార్చిన గొప్ప వ్యాపారి  నాగూరు.  ఉప్పాడ నుండి సీతారామాంజనేయ బస్సు సర్వీస్ , అలాగే ఎల్లాజి బస్సు సర్వీస్  లు ఉప్పాడ రొడ్లమీద దుమ్ము రేపుకుంటా కాకినాడ పోయిన రొజులవి. వాటిమీద కాకినాడ వెళ్ళి ఉప్పు చేపలు ,ఎండు చేపలవ్యాపారం చేసిన నాగూర్ కి పూరిలోని సాంబాబు (య.స్ . ఆర్ .సి చౌదరి ) రొయ్యల వ్యాపారంలోని కిటుకులన్ని నేర్పాడు. నాగూరు పిఠాపురం రైల్వే స్టేషన్లో బొగ్గు ఇంజను పై నడిచే పేసింజరు రైలు ఎక్కి తెల్లారేక పూరిలో దిగేవాడు.  నాగూరు జట్టీలు ఇక్కడనుండి కొన్ని తెరచాపనావల్లో  సరుకులు నావల్లో నింపుకుని సముద్రం మీద 5 నుండి 10 రొజుల్లో పూరి చేరుకునేవారు. సాంబాబు(య.ఆర్ .సి చౌదరి ) బర్ఫ్ నుండి మద్రాసు,కలకత్తా నగరాలకు 40 కౌంటు రొయ్యలు ఎగుమతి అయ్యేవి. అవి నాగూరుకు చెందిన నావల్లో పడ్డావే ఎక్కువ ఉండేవి. నాగూరు ప్రక్కనే దాసరి బంగారయ్య, సూరాడరాజారావు, చొక్కా సత్తిబాబు వుండేవారు. మంచి మిత్రులు కూడా.నాగూరు సరదాలన్నీ వీళ్ళతోనే. పూరిలో వేటగాళ్ళు చేపలవేటకు పోయి వచ్చే వరకూ స్నేహితులలో పేకాటలో గడపడం, అప్పుడప్పుడూ మెడ్కాల్ బ్రాంది తో పార్టీ చేసుకొనేవాడు. పార్టీల్లో పావురం వేపుడు మందులో నంజుకు వుండవలసిందే. ఇలా అక్టోబరు నుండి జూలై వరకు పూరీలో వుండి వస్తువుండేవాడు. అలా 10 సంవత్సరాలు పూరీలో వ్యాపారం జరిగింది.
ఉప్పాడ వస్తే జావా లేదా బుల్లెట్ పై స్నేహితులను తీసుకుని కాకినాడ సినిమాలకు పోయేవాడు మన నాగూరు.
ఉప్పాడలో చిన జజారు చివరన బర్ప్ పెట్టి  మద్రాసుకి , కలకత్తాకు  40  కౌంటు రొయ్యలు ఊప్పాడ నుండే  ఎగుమతి వ్యాపారం ప్రారంబించాడు. ఆ తరువాత ఇంటిదగ్గరే బర్ప్ పెట్టాడు. వ్యాపారంలో బాగా కలిసొచ్చింది. పెద్దబ్బాయి కిళ్ళికొట్టు వీధి చివర భూలోకమ్మ భవనం అనే పేరు మీద మేడ కట్టాడు. దానినే ఆ తరువాత ఊరోళ్ళందరూ నాగూరూ మేడ అనేవారు. చీపూరు బుల్లబ్బాయి పొలం దగ్గర నాలుగెకరాలు  భూమి కొన్నాడు. డబ్బులు చేతిలో బాగా ఆడడంతో ఐసు ప్యాక్టరీ కట్టాలనుకున్నాడు. ఎందుకంటే అప్పటివరకూ ఐసు అనాకాపల్లి లేదా పూరీలనుండి లారీల్లో తెచ్చుకునేవారు. ఓ ప్రక్క చిన్న చిన్న వ్యాపారులు పుట్టుకురావడంతో ఐసుకు ఉప్పాడలో  డిమాండ్ ఏర్పడీంది.
 ఐసు ప్యాక్టరీ కడదామనుకునేలోగా సినిమా థియేటర్ అయితే బాగుంటుందని మిత్రుల దగ్గర నుండి ఉప్పు అందడంతో ఉప్పాడలో శ్రీనివాస థియేటర్ కు రాయి పడింది. మిత్రులమధ్య పొరపొచ్చాలతో ఆ ప్రక్కనే ధనరాజు థియేటర్ నిర్మాణానికి శరవేగంగా ఏర్పాట్లు జరిగాయి.
ఏదైతేనో నాగూరు సినిహాలు టూరింగు టాకీస్ గా
ప్రారంబమయ్యింది 1974 లో. మొదటి సినిమా కన్నడ కంఠీరవ  రాజ్ కుమార్ శ్రీ కాళహస్తి మహత్యం.
నాగూరు జీవితంలో విలాసాలు ఓప్రక్క దానధర్మాలు ఓ ప్రక్క ఎలా చెప్పుకునే వారికి అలాగ ఓ వెలుగు వెలిగింది. నాగూరు పేరు మోత మోగింది ఉప్పాడ చుట్టు ప్రక్కల.నాగూరుకు చిన్నాన్న కొడుకు  గంపల రమణ అయినా ఒకే తల్లిబిడ్డలుగా కనిపిస్తారు ఊళ్ళో వాళ్ళకు.

ఇలా పట్టిందల్లా బంగారం తరుణంలో నాగూరు  ఒక ఆపదొచ్చి పడింది.  నాగూరుకి ఇద్దరు అబ్బాయిలు ఉమ ఒక్కగాని ఒక అమ్మాయి. ఉమపుట్టిందే కాని టి.బి మహ్మమ్మారి పీక్కుతినేసింది.  జబ్బు నయంకావడానికీ తిప్పని చోటూ లేదూ వెళ్ళని నగరమూ లేదు. చివరకి 4 సంవత్సరాలప్పుడు చనిపొయింది ఉమ.  తన పొలంలోనే  ఉమ నిలువెత్తు బొమ్మ చేసి ఆలయంలా కట్టి మనోవేదన తగ్గించుకుంటానికి ప్రయత్నించాడు మన నవాబు నాగూరు. ఆ రోజుల్లొ అదో సంచలనం గుడి కట్టడం.

జల్సా జీవితం గడుపుతున్న నాగూరిని ఈ సంఘటన క్రుంగదీసింది. మెడ్కాల్ బ్రాంది , రెడ్ హిల్స్ సిగరెట్టు దగ్గరకు చేరడం ప్రారంబమయ్యింది. ఇంతలో దివిసీమ ఉప్పెన బంగాళాఖాతాన్ని అతలాకుతలం చేసేసింది. ఉప్పాడ ప్రాంతంలో రొయ్యల పడేవి కావు. వ్యాపారం సన్నగిల్లింది.
200 తెరచాప పడవులు ,వేటగాళ్ళను ఒక్కక్కరికీ 5000  జీతం ఇచ్చి పూరీలో రొయ్యల వేటకు బయలు దేరాడు.
పూరీ లోను సేమ్ సీన్ రొయ్యలు లేవూ  వ్యాపారమూ లేదు. అప్పులు చేసి వేటగాళ్ళ జీతాలు చెల్లించ వలసి వచ్చీంది. ఉన్నది ఊడ్చుకుపోయింది.



వేటగాళ్ళమీద 7 లక్షలు వదిలేయవలసి వచ్చింది. నాగూరు
మెల్లగ మెడ్కాల్ బ్రాందికీ, రెడ్ హిల్స్ సిగరెట్లకు బానిసయ్యూడు. రోగాలు మీదపడంతో అన్ని మాని
గతఙ్ఞాపకాలతో తన మేడలోనే నివసిస్తూ  ఉన్నాడు మన తొలి ఉప్పాడ సెలబ్రెటీ.

సిద్ధాంతపు బెన్ జాన్సన్ (జనశ్రీ)
ఉప్పాడ కొత్తపల్లి
9908953245

Tuesday, January 14, 2020

చిన్నప్పటి నా అల్లరి కథ

*చిన్నప్పుడు నేను చేసిన అల్లరి పని*

 క్షవరం చేసుకోవాలంటే ఇప్పటిలా క్షౌరశాలలు ఉండేవి కాదు మన చిన్నప్పుడు.  మంగలి ఇంటికి వచ్చి క్షవరం చేసేవాడు.
  ఒక రోజు ఇలాగే మా దగ్గర బంధువు మంగలిని పిలిచే క్షవరం చేసుకుంటూ ఉన్నాడు. చిన్నప్పుడు సెలవు వచ్చిందంటే ఎదురు బద్దకు పురుకూస కట్టి విల్లు తయారు చేసుకునే వాళ్ళం. జబ్బలకు విల్లు తగిలించుకుని  చేతిలో చీపురు పుల్లలు బాణలుగా పట్టుకుని  అటూ ఇటు ఇటూ వేస్తూ ఆడుకునేవాళ్ళం. అలా నేను బాణాలు వేస్తూ వేస్తూ క్షవరం చేయించుకుంటున్న వ్యక్తి వీపుకు గురిచూసి బాణం వదిలాను. అంతే చురుకున్న గుచ్చుకుందేమో ఆ వ్యక్తి కెవ్వున కేక పెట్టాడు.  అతని ఊపుకు పాపం మంగలి వెన్నక్కి పడ్డాడు. ఈ తతంగమంతా దూరం నుండి చూస్తున్న నేను నా ప్రక్కనున్న పిల్లలం వెన్నక్కి చూడకుండా పరుగెత్తి  పరిగెత్తి పారిపోయి సాయంత్రంవరకూ ఊరిబయట గడిపి చీకటి పడిన తరువాత  ఇంటికి చేరుకున్నాం. తెల్లవారేక అందరం కలసి మెల్గగా క్షవరం చేయుంచుకున్న వ్యక్తి ఇంటి పరిసరాలలో కొంత సేపు తచ్చాడాం. గొడవ ఏంలేదని నిర్దారించుకుని  దూరంగా పోయి పగలబడి నవ్వుకున్నాం. అప్పుడప్పుడూ అందరం కలసి నప్పుడు ఈ సరదా సంఘటన తలుచుకుని నవ్వుకుంటూఉంటాం

క్రైస్తవ మతాన్ని బిజెపి, ఆర్. ఎస్ .ఎస్

క్రైస్తవ మతాన్ని బిజెపి, ఆర్. ఎస్ .ఎస్ భారతదేశం నుండి పారద్రోలతాయనడం అనడం ఓ పెద్ద గ్లోబల్ ప్రచారం.
క్రైస్తవులలో ఉన్న ఈ నమ్మకం అతి పెద్ద అపోహ. దీనిని దైవ సేవకులు వాటేసుకోవడం ఇందులో అతి పెద్ద ట్విస్ట్.

ఈ భారతదేశం నుండి క్రైస్తవ మతాన్ని హిందూ సమాజం ఎన్నటికీ పారద్రోల లేదు. క్రైస్తవ మతం హిందూ సమాజానికి ఒక వరంవంటిది. ఇప్పుడున్న పెద్ద ఆర్థిక రంగాలు, పరిశ్రమలన్నీ హిందూ సమాజం ఆక్రమించుకుని ఉన్నాయి. ఆ రంగాలలోనికి వెళ్లడానికి క్రైస్తవమతం అనుమతించడం లేదు. అది అతిపెద్ద పాపంగా బోధిస్తూ ఉంటారు దేవాలయాల్లో. అది హిందూ సమాజానికి వరంగా మారింది. క్రైస్తవమతాన్ని ఆదరించేది భారతదేశంలో అత్యధిక శాతం షెడ్యూల్డ్ కులాలవారు. ఈ బహుజనులు అందరూ క్రైస్తవమతం స్వీకరించడం వల్ల అనేక రంగాలలోనికి వీరు ప్రవేశించలేకపోతున్నారు.  ఉదాహరణకు అత్యంత ఆకర్షణీయమైన మైనటువంటి ఆర్థికరంగాలు  సినిమా, టెలివిజన్, మీడియా, సంగీతం, నాట్యం, రచనరంగం, నాటకరంగం, వ్యాపారరంగం (మద్యపానం,),. ప్రస్తుతం ఈ రంగాలు భారతదేశంపై అత్యంత ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ రంగాలు రాజకీయాలపై కూడా అత్యంత ప్రభావాన్ని చూపుతున్నాయి. షెడ్యూల్డ్ కులాలకు ఈ రంగాలలో బలమైన వ్రేళ్ళు లేక రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం దుర్లభంగా మారింది. టెలివిజన్ చానళ్ళు వచ్చాయి అవేం చెపుతున్నాయి క్రైస్తవ భోదనలే. టెలివిజన్ ఉన్నా దళితులకు వనగూరేదేముంది.

క్రైస్తవ మతం బోధిస్తున్న లేదా నిరోధిస్తున్న కొన్ని బోధనలు

ఇహలోక సంబంధమైనవాటికి అంత ప్రాధాన్యత లేదు పరలోక రాజ్యానికి సంబంధించినది మాత్రమే ప్రధానమైనది .
సినిమా ,నాటకం ,టెలివిజన్, నృత్యం చేయడం ,పాటలు పాడటం, ఏదైనా క్రైస్తవుడి తలాంతులు అన్నీ దైవ సేవకే వాడబడాలి. పైవన్నీ సాతాను క్రియలుగా దైవజనులు భోధిస్తువుంటారు.
ఈ అంశాలతో షెడ్యూల్ కులాలవారిని క్రైస్తవ మతం  బాహ్య ప్రపంచంలోనికి వెళ్లనీయకుండా నిరోధిస్తూ  ఉన్నాయి.
కానీ ఏ క్రైస్తవుడు సినిమాలు చూడకుండా ఉండటం లేదు, , టెలివిజన్లో వచ్చే కార్యక్రమాన్ని చూడకుండా ఉండటం లేదు, మద్యపానం తాగకుండా ఉండటం లేదు,
సిని హీరో వెనకాల వీళ్లు ప్రచారసభలకు పరిగెత్తకుండా ఉండటం లేదు , రాజకీయ రంగాలగురించి మాట్లాడకుండా ఉండడం లేదు, సినిమా పాటలపై పేరడీలు వాడుకోకుండా ఉండడం లేదు, అన్ని క్రైస్తవ సమాజం పరోక్షంగా వీటిని  అనుసరిస్తుంది, వీక్షిస్తున్నది కూడా.
బయట రంగాలలో రాణించటానికి సరిపడిన విద్వత్తును స్వీకరించడానికి క్రైస్తవమతం షెడ్యూల్ కులాలవారికి అడ్డుగా నిలుస్తుంది. సంగీత రంగంలో ఇప్పుడున్న గాయకులకు తీసిపోని విధంగా క్రైస్తవ సంగీతంలో పాటలు పాడే మహాగాయకులు ఉన్ననూ వారు దేవుని స్తుతించుచూ పాటలు పాడడానికి పరిమితం కావడం వల్ల  సినిమా పరిశ్రమ హిందూ సమాజానికి మాత్రమే పరిమితమై వారు ఆర్థిక బలోపేతం కావడానికి తోడ్పడుతుంది. ఆర్దిక స్దొమతుకలిగిన కళాకారులు  ప్రజాప్రతినిధులుగా నెగ్గుతున్నారు.అదే క్రమంలో క్రైస్తవ మతం షెడ్యూల్డ్ కులాల దీన పరిస్థితికి అడ్డుగోడగా నిలుస్తోంది.ఇది కాదనలేని సత్యం. అయితే విదేశాలనుండి ఎంతో సహయాన్ని ఇస్తున్నాం అంటూ వాదిస్తారు. కాని గ్లామర్ ప్రపంచానికి తద్వారా రాజ్యాధికారానికి దూరం చేస్తున్న సంగతిని దాచెస్తారు.
అద్భుతమైనటువంటి నాట్యం చేసే కళాకారులు ఎందరో ఉన్నారు వారి నాట్యం క్రిస్మస్ సందర్భాలలో మాత్రమే ఉపయోగపడేలా క్రైస్తవ మతం వాడుకుంటుంది, ఎదగనీయకుండా  నిలువరిస్తుంది. అత్యధికంగా ఆర్థిక వెసులుబాటు కల్పించే రంగాలలోనికి వెళ్లడానికి తలాంతులు ఉన్ననూ వెళ్ళలేని పరిస్థితి షెడ్యూల్డ్ కులాలకు  ఈ క్రైస్తవ మతం అడ్డుగా ఉన్నది. అద్భుతమైనటువంటి రచయితలు ఉన్ననూ ఇవి దేవుని పాటలు ,దేవుని వాక్య వివరణ గ్రంధాలు రచించడానికి మాత్రమే పరిమితం అవుతున్నారు. ఒక్క సినిమా పాట రాసే సినిమా రచయితకు ఒక్కపాటకు 12  లైన్స్ రాస్తే పాట ఒక్కంటికీ  మూడులక్షల రూపాయలు రెవెన్యూ మా రేషన్ అందుకుంటున్నారు. అటువంటి ఆర్థిక వెసులుబాటును షెడ్యూలు కులాలు కోల్పోతున్నారు. సినీ నటుడిగా వెళ్లి   పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని ఆ పేరును ఉపయోగించి రాజకీయ రంగంలో స్థిరపడిన అగ్రకులాలను  మనం చూస్తూనే ఉన్నాం మరి క్రైస్తవులు అయినటువంటి షెడ్యూల్డ్ కులాలవారు అటువంటి సినిమా నటుడికి జేజేలు పలుకుతూ వారి వెంట పరిగెడుతున్న  సంఘటనలు చూస్తూనే ఉన్నాం. దళితులను వారిని  ఎదగనీయకుండా క్రైస్తవ మతం అడ్డుగోడగా నిలుస్తుంది. మద్యపానం వ్యాపారంలో కోటానుకోట్ల రూపాయల రాబడి ఉంటుంది అగ్రకులాలు హిందూ సమాజం ఈ వ్యాపార రంగంలోనికి చొరబడి కోటానుకోట్ల రూపాయలు సంపాదించి ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వాన్ని పొందుతువుంది. క్రైస్తవ మతం షెడ్యూల్డ్ కులాలవారిని ఈ రంగంలోనికి వెళ్లనీయకుండా అడ్డుగోడగా నిలుస్తున్నది. తద్వారా బలమైన సామాజికవర్గంగా దళిత క్రైస్తవులు ఎదగలేకపోతున్నారు.
దూరదర్శన్ వంటి ప్రభుత్వ టీవీ చానల్స్ లో ప్రవేశాలకు అర్హతలేని పరిస్దితి షెడ్యూల్డ్ కులాలకు ఉన్నది. కానీ అన్ని తలాంతులు కలిగినటువంటి ఈ యొక్క కులాలు క్రైస్తవ మతం స్వీకరించడం వల్ల ఆధునిక ప్రపంచంలో బహుజనులగానే మిగిలిపోతున్నారు. బలమైన సామాజిక వర్గంగా రూపొందలేకపోతూ ఉన్నారు.ఈ దేశాన్ని నడిపించేటటువంటి రాజకీయరంగంలో ఎదగాలంటే పై రంగాలలో షెడ్యూల్డ్  కులాల వారు విస్తృతంగా ప్రవేశించి వలసిన అవసరం ఉంది. కానీ క్రైస్తవ ఆలయాలు వీరికిఅడ్డుగోడగా ఉన్నాయి.
కానీ క్రైస్తవ సమాజం , క్రైస్తవ మత బోధకులు  ఇలా అంటూవుంటారు  హిందూ సమాజం, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు క్రైస్తవ మతాన్ని భారతదేశంలో లేకుండా చేయడానికి కుట్ర పన్నుతున్నాయని గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉంటారు. దానికి క్రైస్తవ మతం మరీ ఎదగనీయకుండా  చేయడానికి అప్పుడప్పుడు ఈ బిజెపిలాంటి పార్టీలు నిధులు రాకుండా నిరోధిస్తున్న మాట వాస్తవమే అయినా అవి పైకి కనపడకుండా నిరోధించడానికి చేస్తున్న  ప్రయత్నాలే  తప్పించి క్రైస్తవ మతాన్ని ఈ భారతదేశం నుండి వెళ్లగొట్టడానికి వాళ్ళకి ఎంత మాత్రము కూడా ఇష్టముండదు. ఎందుచేతనంటే ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి అనేక రంగాలలో షెడ్యూల్డ్ కులాలవారు లేని సంగతి వారికి నిక్కచ్చిగా తెలుసు. అందుచేత క్రైస్తవ మతాన్ని గాని ఒకవేళ భారతదేశం నుండి పంపినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి షెడ్యూల్ కులాలవారు హిందూ సమాజంలోని హిందువులుగా ప్రవేశించి పై రంగాలను కబ్జా చేసే శాసించే పరిస్థితి ఉన్న సంగతి అగ్రకులాలైన హిందూసమాజంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎప్పటికీ  హిందూ సమాజం క్రైస్తవ సమాజాన్ని లేకుండా చేయడానికి ప్రయత్నించదు, క్రైస్తవసమాజం ,క్రైస్తవ సమాజంలోని బోధనలు హిందూ సమాజానికి ఒక వరం వంటివి.
క్రైస్తవ సమాజం షెడ్యూల్డ్  కులాలు ఉద్ధరించిన మాట వాస్తవమే అయినా ఓప్రక్క మరలా కొన్ని నిబంధనలు పేరు చెప్పి ఆదే క్రైస్తవ సమాజంలోనే కొట్టుమిట్టాడేలా చేయడం ఇక్కడున్న ప్రధానమైనటువంటి లోపం. ఆధునిక సమాజంలో భారతదేశ రాజ్యాధికారాన్ని చేరుకోవడానికి షెడ్యూల్డ్ కులాలవారికి వారి ఓట్లను వారు వేసుకునే పరిస్థితి కూడా ఇక్కడ లేకపోవడానికి కారణం గ్లామర్ గ్లామర్ ప్రపంచం. అగ్రకులాల వారి ఓట్లను పొందలేక పోవడానికి కారణం  షెడ్యూల్డ్ కులాలలో అగ్ర కులాలను ఆకర్షించే గ్లామర్ వ్యక్తులు లేకపోవడం. గ్లామర్ ఎలా వస్తుంది గ్లామర్ ప్రపంచంలో వుంటే. కాని దళితులకు వారి మతం పాపం అని భోధిస్తుంది.నిజానికి గ్లామర్ అనేది  కులాలకు సంబంధం లేకుండా ప్రతిభను బట్టి విద్వత్తును బట్టి సంపాదించుకునే వ్యక్తిగతమైనది. ఇందులో ప్రస్తుతం క్రికెట్ , భారతదేశంలో సినీ , టెలివిజన్, మ్యూజిక్ , నాట్యం, నటన , దర్శకత్వం, రంగాలు రాజ్యమేలుతున్నాయి.  ఇటువంటి పరిస్దితిని షెడ్యూల్డ్ కులాలువారు అర్థం చేసుకున్నప్పుడు సాధ్యం అవుతుంది.
షెడ్యూల్డ్  కులాలవారు భారతదేశ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలంటే అగ్రకులాలవారు కూడా వీరి వెంట పరిగెత్తే పరిస్దితి తెచ్చుకోవాలి. ఆ పరిస్దితి గ్లామర్ రంగానికి వుంది. నూటికి 90 మంది క్రైస్తవులు అయినటువంటి షెడ్యూల్డ్ కులాల వారు క్రైస్తవ మతం స్వీకరించడం వలన
దానికున్న కట్టుబాట్లను బట్టి ఈ గ్లామర్ ప్రపంచంలోనికి రాలేక అధికారాన్ని రాజ్యాధికారాన్ని కోల్పోతున్న మాట ముమ్మాటికీ వాస్తవం. అక్కడక్కడ రిజర్వేషన్లు ఫలితంగానే వ్యక్తిగత మైనటువంటి వ్యక్తిగత పలుకుబడితో ఒకరిద్దరు  రాగలిగినప్పటికీ  రాజ్యాధికారాన్ని, అగ్రకులాలు లేదా హిందూ సమాజానికి సంబంధించిన ఓట్లను కొల్లగొట్టడానికి  క్రైస్తవమతం అడ్డుగోడగా నిలుస్తుంది.
కానీ వాస్తవాన్ని మరిచి దళితులైన మమ్మలన్నీ ఇతరులు చిన్నచూపు చూస్తున్నారని ,దళితులను ఓట్ల బ్యాంకుగా చూస్తున్నారని, దళితులు ఎప్పుడూ కూడా అగ్రకులాలు నిర్మించే సినిమాలు చూస్తూ వారికి జేబులు నింపే వారిగా ఉన్నారని నిందలు వేస్తూ ఉంటారు. కానీ వీరు నమ్ముకున్నటువంటి క్రైస్తవ మతమే హిందూసమాజానికి ఒక వరమైన ఉన్న సంగతిని వీరు గ్రహించకపోవడం దురదృష్టకరం.  అమెరికా, లండన్ వంటి దేశాలలో ఇటువంటి రంగాల్లో ఉన్న వారందరూ  క్రైస్తవులే అయినప్పటికీ కూడా గ్లామర్ ప్రపంచంలో వుంటారు. హాలీవుడ్ సినీపరిశ్రమ అంతా కూడా క్రైస్తవులే.ఇక్కడ  క్రైస్తవులు బిజెపి వచ్చేసింది, ఆర్. ఎస్.ఎస్  ఉందీ క్రైస్తవ మతాన్ని  భారతదేశంలో లేకుండా చేసేస్తారని అంటూవుంటారు అది వాస్తవమేనా? క్రైస్తవదేశాలలో వృత్తులు వృత్తులుగా చూస్తారు. మతాన్ని మతంగా  చూస్తారు. ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవమత బోధకులు , ,క్రైస్తవ దేవాలయాలు షెడ్యూల్డ్  కులాలవారిని  వాక్య నిబంధనలు పెట్టి షెడ్యూల్డ్ జాతిని ఎదగనీయకుండా చేస్తున్న సంగతి బాధాకరమైన విషయంగా తోస్తుంది.  మేధావి వర్గం  ఏమీ చేయలేని పరిస్దితి .
క్రైస్తవులైన షెడ్యూల్డ్ కులాలవారికి ఇది విచిత్రమైన పరిస్దితే. అంబేద్కర్ వంటి మహనీయుడు క్రైస్తవమతం స్వీకరించకపోవడానికి  మూడమైన క్రైస్తవ నిభందనలు కూడా ఒక కారణం కాదా? .  అంబేద్కర్ క్రైస్తవ మతం స్వీకరించి వుంటే ప్రతీ చర్చిలో అతను దేవుడుతో సమానంగా కొలువుతీరేవాడని వ్యాసకర్తతో అనేక మంది చెప్పడం తెలుసు.కాని క్రైస్తవమతం ఇహలోకమైన వాటికి ప్రాధాన్యతను ఇవ్వనప్పుడు దళితుల బాదలు ,రాజ్యాధికారం ఎలా సాధ్యమతుందనుకుని అంబేద్కర్ బౌద్దమతం స్వీకరించాడు.
క్రైస్తవమతస్తులైన షెడ్యాల్డ్ కులాలవారు ఓ అడుగుముందుకేసి  అగ్రవర్ణాలవారిగా భావించుకుని అనేకచోట్ల మసలుతూ వుండడం  బావదారిధ్యం. ఏదిఏమైనా దళితులకు రాజ్యాధికారం , ఆర్ధిక ప్రగతి రాకుండా చేయడానికి హిందూ సమాజం క్రైస్తవ మతాన్ని తప్పక ప్రోత్సహిస్తుంది.
అందుచేత క్రైస్తవులందరికీ క్రైస్తవమతాన్ని భారతదేశం నుండి రూపుమాపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పడం భోధకులు చేస్తున్న తప్పుడు ప్రచారమే.దళితులు అణగారినవర్గాలుగా ఉంటేనే అగ్రవర్ణాలు మనగలుగుతాయి అందుకు క్రైస్తవమతం తప్పనిసరి .లేదంటే అత్యంత ప్రతిభావంతులైన దళితులు గ్లామర్ రంగాలను శాసించి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోగలుగుతారు.






    

Friday, January 10, 2020

జాన్ ..పద గీతం( జనశ్రీ)


జాన్ ..పద గీతం( జనశ్రీ)
తాంబరికాయ తమ్మయ్య
తుమ్మెదంటి తుంటరోడే
తమలపాకు చూడంటూ
దురదాకు పామాడే
తాంబరికాయ తమ్మయ్య
తుమ్మెదంటి తుంటరోడే
తమలపాకు చూడంటూ
దురదాకు పామాడే
తాంబర కాయ మీటుకుంటూ
తనువును పొడిచాడు తూట్లు తూట్లు
గుళ్లో గుంచం పాట అంటూ
గుండెకు పెట్టాడు గాట్లు గాట్లు
వాడి పాటంటే పసిపిల్లల పరికిణీ వేస్తది
వాడి జంగాలమ్మ పాటంటే
జనమంతా నవ్వలేక  పాట్లు పాట్లు
మంచాలమ్మ పాటంటే 
మనసుకైన వేస్తాడే మాట్లు మాట్లు
వాడి పాటవింటే
పావురాలు పాపిడిలే తీస్తాయి
సిద్ధాంతపు బెన్ జాన్సన్
ఉప్పాడ కొత్తపల్లి
9908953245
తూర్పు గోదావరి జిల్లా
వాడి జంగాలమ్మ పాటంటే
జనమంతా నవ్వలేక  పాట్లు పాట్లు
మంచాలమ్మ పాటంటే 
మనసుకైన వేస్తాడే మాట్లు మాట్లు
వాడి పాటవింటే
పావురాలు పాపిడిలే తీస్తాయి
సిద్ధాంతపు బెన్ జాన్సన్
ఉప్పాడ కొత్తపల్లి
9908953245
తూర్పు గోదావరి జిల్లా


ALIVI